సైరా : గ్రాఫిక్స్‌కే భారీగా..! | Chiranjeevi Sye Raa Narasimha Reddy Special Effects Budget Revealed | Sakshi

సైరా : గ్రాఫిక్స్‌కే భారీగా..!

Sep 14 2019 12:48 PM | Updated on Sep 14 2019 2:08 PM

Chiranjeevi Sye Raa Narasimha Reddy Special Effects Budget Revealed - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ నిర్మిస్తున్నారు. తండ్రి డ్రీమ్‌ ప్రాజెక్ట్ కావటంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

చారిత్రక కథ కావటం, భారీ యుద్ధ సన్నివేశాలు ఉండటంతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసమే పెద్ద మొత్తం ఖర్చవుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం గ్రాఫిక్స్‌ కోసమే 45 కోట్లు ఖర్చు చేస్తున్నారట సైరా టీం. 17 దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ జరుగుతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు థియెట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement