అరకు లోయలో ‘దృశ్యం’ | drishyam movie shooting in Araku Valley | Sakshi
Sakshi News home page

అరకు లోయలో ‘దృశ్యం’

Apr 14 2014 11:01 PM | Updated on Sep 29 2018 5:17 PM

అరకు లోయలో ‘దృశ్యం’ - Sakshi

అరకు లోయలో ‘దృశ్యం’

కుటుంబ కథానాయకుడిగా వెంకటేశ్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లే. సుందరకాండ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సూర్యవంశం,

కుటుంబ కథానాయకుడిగా వెంకటేశ్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లే. సుందరకాండ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సూర్యవంశం, సంక్రాంతి... ఇవన్నీ ఆ కోవకు చెందిన సినిమాలే. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘దృశ్యం’, చేయబోతున్న ‘ఓ మైగాడ్’ సినిమాల్లో కూడా వెంకీ ఫ్యామిలీ మేన్‌గానే కనిపించబోతున్నారు. ఈ రెండూ విభిన్న కథాంశాలే కావడం విశేషం. ‘దృశ్యం’ షూటింగ్ ప్రస్తుతం అరకు లోయలో జరుగుతోంది. నిరవధికంగా సాగే ఈ షెడ్యూల్‌లోనే వైజాగ్, విజయనగరం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా చిత్రీకరణ జరుపుతారు. 
 
 దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత డి.సురేశ్‌బాబు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న భార్యాబిడ్డల్ని కాపాడుకోవడం కోసం  ఓ మధ్యతరగతి వ్యక్తి చేసిన సాహసమే ‘దృశ్యం’. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ఈ పాత్రను తెలుగులో వెంకటేశ్ చేస్తుండటం నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. నాటి తరం కథానాయిక శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.గోపాల్‌రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నదియా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: వివేక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement