Drishyam movie
-
కంక్లూజన్ తో వచ్చేస్తున్న దృశ్యం 3
-
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
దృశ్యం నటి సీమంతం వేడుక.. మదర్స్ డే సందర్బంగా ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ నటి ఇషితా దత్తా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో చాణక్యుడు సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో దృశ్యం సినిమాతో అరంగేట్రం చేసింది. అయితే 2017లో వాత్సల్ షేత్ను వివాహం చేసుకున్న ముద్దుగుమ్మ గర్భం ధరించినట్లు ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయమైంది. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఇషితా దత్తా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ మదర్స్ డే తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపింది. ఎందుకంటే ఈరోజే తన సీమంతం వేడుకలు జరుపుకోవడం తన జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేసింది. ఇషితా మాట్లాడుతూ..'ఈ ఏడాది మదర్స్ డే నాకు చాలా ప్రత్యేకం. నా బేబీ షవర్ ఈ రోజున జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా అమ్మ, అత్తతో కలిసి మదర్స్ డేని జరుపుకుంటున్నా. నా చిన్నప్పుడు మా అమ్మను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేసేదాన్ని. ఏది ఏమైనా ఆమె నా కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని' వివరించింది. కాగా.. మార్చి 2023లో గర్భం దాల్చినట్లు ప్రకటించింది ఇషితా. (ఇది చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే) -
తల్లి కాబోతున్న దృశ్యం నటి.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటి ఇషితా దత్తా పెద్దగా పరిచయం లేని పేరు. ఇటీవలే స్పస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దృశ్యంలో నటించింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఇషితా దత్తా త్వరలోనే తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సినిమా నటి తనూశ్రీ దత్తా సోదరి. దృశ్యం ఫేమ్ ఇషితా దత్తా 2017లో వత్సల్ షేత్ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఇషితా దత్తా ముంబై విమానాశ్రయంలో వెళ్తుండగా కెమెరాకు చిక్కింది. ఎయిర్పోర్ట్లోకి వెళ్తూ తన బేబీ బంప్ను ప్రదర్శించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. గతంలో ఆమెపై ఊహాగానాలు వచ్చనా.. గర్భం ధరించినట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. ఈ వీడియోతో ఇషితా తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇది చూసిన అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇషితా దత్తా లవ్ స్టోరీ ఇషితా, వత్సల్ 2016లో వారి మొదటిసారి 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' షో షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. అనంతరం నవంబర్ 2017లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ముంబైలో కూడా విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇది కదా అసలు సిసలైన పాన్ ఇండియా కథ!
ఒక ‘దృశ్యం’... మలయాళంలో బంపర్ హిట్. అదే ‘దృశ్యం’... తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలోనూ సూపర్ హిట్. అందుకే ఈ ‘దృశ్యం’ దేశం దాటింది. అటు చైనా.. ఇండోనేషియాలోనూ ‘దృశ్యం’ బాక్సాఫీస్ రికార్డులు సాధించింది. ఇలా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఏ భాషలో రీమేక్ అయితే ఆ భాషలో హిట్. ఇప్పుడు ఇంగ్లీష్ ‘దృశ్యం’ రానుంది. ఇంకా పలు విదేశీ భాషల్లో రీమేక్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే సినిమాలను ‘పాన్ ఇండియా’ అంటున్నాం. ‘పాన్ ఇండియా మూవీ’ అంటే కథ కూడా ‘పాన్ ఇండియా’ది అయ్యుండాలి.‘దృశ్యం’ అలాంటి కథే. ఇది కదా... పాన్ ఇండియా కథ! ఇక ఈ ‘దృశ్యం’ గురించి తెలుసుకుందాం. తొమ్మిదేళ్ల క్రితం హీరో మోహన్లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. 2013 డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిందీ చిత్రం. ఫ్యామిలీ ఎమోషన్స్కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఎంతగా నచ్చిందంటే.. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో యాభై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ‘దృశ్యం’ చరిత్ర సృష్టించింది. మొత్తంగా 75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా షూటింగ్ని కేవలం 44 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ‘దృశ్యం’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో 2020 సెప్టెంబర్లో ‘దృశ్యం 2’ షూటింగ్కు శ్రీకారం చూట్టారు మోహన్లాల్, జీతూ జోసెఫ్ అండ్ ఆంటోనీ పెరుంబవూర్. తొలి భాగంలానే పర్ఫెక్ట్ ప్లానింగ్తో 46 రోజుల్లో షూటింగ్ను పూర్తి చేసి 2021 ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ‘దృశ్యం 2’ కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ఓ వెలితి. అదేంటంటే.. ‘దృశ్యం 2’ థియేటర్స్లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దీనికి కారణం కరోనా. ఒకవేళ థియేటర్స్లో విడుదలై ఉంటే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదై ఉండేవేమో! 2016లో విడుదలై దాదాపు రూ. 150 కోట్ల వసూళ్లను సాధించిన ‘పులిమురుగన్’(ఇందులో మోహన్లాల్ హీరో) రికార్డును ‘దృశ్యం 2’ బ్రేక్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయయపడ్డాయి. తొలి ఇండియన్ మూవీ! ‘దృశ్యం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమై వీక్షకుల, విమర్శకుల ప్రసంశలను పొందింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మలయాళ ‘దృశ్యం’ సినిమాను 2014లో తెలుగులో ‘దృశ్యం’గా (ఇందులో వెంకటేశ్ హీరోగా నటించారు), కన్నడంలో ‘దృశ్య’ (ఇందులో రవిచంద్రన్)గా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2015లో తమిళంలో ‘పాపనాశం’గా (కమల్హాసన్ హీరో), హిందీలో ‘దృశ్యం’ (అజయ్ దేవగన్)గా రీమేక్ చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత శ్రీలంక భాషలో ‘ధర్మయుద్దాయ’ (2017)గా, చైనాలో ‘షీప్ వితవుట్ షెపర్డ్’(2019)గా ఆ తర్వాత ఇండోనేషియాలో ‘దృశ్యం’గా రీమేక్ అయ్యింది. ఇలా చైనా, ఇండోనేషియా భాషల్లో రీమేక్ అయిన తొలి ఇండియన్ మూవీ కూడా ‘దృశ్యం’ కావడం విశేషం. రీమేక్ కావడమే కాదు.. అక్కడ బాక్సాఫీస్ పరంగా హిట్ సాధించింది. కాగా, ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్గా 2021లో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’కి కూడా డిజిటల్ వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘దృశ్యం 2’ను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ‘దృశ్యం’ రీమేక్లో నటించిన వెంకటేశ్నే ‘దృశ్యం 2’లోనూ నటించారు. కోవిడ్ వల్ల ఈ చిత్రం 2021 నవంబరు 25న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ గత ఏడాది నవంబరు 18న థియేటర్స్లో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2022లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ హిందీ మూవీస్లో ఒకటిగా నిలిచింది. హిందీ ‘దృశ్యం’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లోనూ నటించారు. అలాగే హిందీ చిత్రం ‘దేవదాస్’ (1955) తర్వాత ఇతర భాషల్లో ఎక్కువగా రీమేక్ అవుతున్న చిత్రం ‘దృశ్యం’ అని టాక్. మాలీవుడ్ నుంచి హాలీవుడ్కి... ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు సంబంధించిన ఇంగ్లిష్, నాన్ ఇండియన్ లాంగ్వేజెస్ రీమేక్ హక్కులను పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకుంది (ఫిలిప్పినో, ఇండోనేషియా, సింహళ భాషల హక్కులు మాత్రం కాదు.. ఎందుకంటే ఈ భాషల్లో ఆల్రెడీ ‘దృశ్యం’ రీమేక్ అయ్యింది). ‘‘దృశ్యం’, ‘దృశ్యం 2’ల ఫారిన్ లాంగ్వేజెస్ హక్కులను దక్కించుకున్నాం. జపాన్, కొరియా, హాలీవుడ్లో ‘దృశ్యం’ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. ‘దృశ్యం 2’కు చెందిన చైనీస్ రీమేక్ హక్కులు కూడా మా వద్దే ఉన్నాయి’’ అని పనోరమ స్టూడియోస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కథ ఏంటంటే... సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన పెద్ద కుమార్తెను ఊహించని ఆపాయం నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? ఈ ప్రయత్నంలో ఓ పోలీసాఫీసర్ కుమారుడి హాత్య కేసును చేధించాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యూహాలకు ఎటుంవంటి ప్రతివ్యూహాలు రచించి, ఆ తండ్రి సక్సెస్ అయ్యాడు అన్నదే ఈ చిత్రకథ. మోహన్లాల్, జీతూ జోసెఫ్, ఆంటోనీల కాంబినేషన్లో ‘దృశ్యం 3’ కూడా రానుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో ‘దృశ్యం 3’ ఉంటుందన్నారు ఆంటోనీ. చదవండి: నాకు బుద్ధి తక్కువై అలా చేశాను.. చీటింగ్పై స్పందించిన సింగర్ -
'దృశ్యం' సినిమా పాప ఇప్పుడు ఎలా ఉందో చూడండి (ఫోటోలు)
-
దృశ్యం ఫేమ్ ‘ఎస్తర్ అనిల్’ ఫొటోలు
-
ఓ సౌత్ ఇండియా సినిమా మూడు విదేశీ భాషల్లోకి..
ఓ భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం సినీ పరిశ్రమల్లో మాములుగా జరిగేదే. కానీ ఓ భారతీయ సినిమా విదేశీ భాషల్లో రీమేక్ అవడం మాత్రం అరుదనే చెప్పాలి. అది ఓ సౌత్ ఇండియన్ మూవీ అవడం చాలా తక్కువ. ఇప్పుడు మాలయాళం సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’ త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మోహన్లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’ ఇప్పటి వరకు 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో రీమేకైంది. ఇండియన్ లాంగ్వేజేస్తోపాటు చైనీస్, శ్రీలంకన్ భాషల్లో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో నిర్మితం కానుంది. ఇలా మా సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని ఆంటోని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలోని పీటీ ఫాల్కన్ అనే సంస్థ నిర్మించనుంది. చైనీస్లో రీమేక్ అయిన మొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. చదవండి: ‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లో అత్యధిక రేటింగ్ కాగా, ఈ సినిమాకి సీక్వెల్గా వచ్చిన ‘దృశ్యం 2’ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్లో ఈ ఫిబ్రవరి విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రం కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్లు అవుతోంది. View this post on Instagram A post shared by Antony Perumbavoor (@antonyperumbavoor) -
స్నేహితులకు ‘దృశ్యం’ చూపించాడు.. మరోసారి జైలు పాలయ్యాడు
ఢిల్లీ: వెంకటేశ్ హీరోగా దృశ్యం సినిమా వచ్చిన మీకందరికి తెలిసిందే. అందులో హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సినిమాల్లోని సన్నివేశాలను ప్రేరణగా తీసుకొని పోలీసులను ముప్పతిప్పలు పెడుతుంటాడు. అచ్చం అదే తరహాలో హత్యకేసులో బెయిల్పై బయటకొచ్చిన ఒక వ్యక్తి తన స్నేహితుల సాయంతో దృశ్యం సినిమా ప్రేరణతో పోలీసులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. నార్త్ ఢిల్లీకి చెందిన అమర్పాల్ తన ఇంటిపక్కన ఉండే ఒంబిర్ కుటుంబంతో తరచుగా గొడవపడుతుండేవాడు. కాగా జూన్ 29న మరోసారి ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒంబిర్ తల్లిని అమర్పాల్ చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అమర్పాల్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఆ తర్వాత 60 రోజుల మధ్యంతర బెయిల్పై ఇటీవలే బయటికి వచ్చాడు. పెరోల్పై బయటికి వచ్చిన అతను తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఒంబిర్ కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడు. కానీ వారు మాట వినకపోవడంతో ఒక మాస్టర్ప్లాన్ వేశాడు. తన సోదరుడు గుడ్డు, కజిన్ అనిల్ను ఇంటికి పిలిపించి వారికి దృశ్యం సినిమాను చూపించాడు. ఆ సినిమాలోలాగా ఇక్కడ జరిగిన సన్నివేశాలను, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే తనకు ఒంబిర్ కుటుంబసభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. అయినా ఒంబిర్ తల్లిని తాను చంపలేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఒక దేశీ పిస్టల్, బుల్లెట్ ప్యాలెట్ను కొనుగోలు చేశాడు. తనను కాల్చాలని.. కానీ తను చనిపోకూడదని.. ఈ కాల్పుల వెనుక ఒంబిర్ కుటుంబం హస్తం ఉందని పోలీసులను నమ్మించాలని అనిల్, గుడ్డులకు తెలిపాడు. ఆ తర్వాత అనిల్ తన స్నేహితుడు మనీష్ను కలిసి ప్లాన్ను వివవరించాడు. వారి ప్లాన్ ప్రకారం ముందుగా కైబర్పాస్కు వెళ్లిన అమర్పాల్ అనిల్ కోసం వేచి చూశాడు. ఒక గంట తర్వాత తమ ప్లాన్లో భాగంగా అమర్పాల్ ఉన్న చోటికి వచ్చిన అనిల్ అతనిపై కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయాడు. ఆ తర్వాత గాయాలతోనే అమర్పాల్ తన స్నేహితుని ఇంటికి వెళ్లి ఒంబిర్ కుటుంబం తనను చంపడానికి చూస్తుందని వారికి వివరించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. అనిల్ను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పేశాడు. దీంతో అమర్పాల్ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న గుడ్డు, మనీష్లను పోలీసులు గాలిస్తున్నారు. -
దృశ్యం-2 షూటింగ్ ప్రారంభోత్సవ ఫోటోలు
-
హిట్ రిపీట్ అవుతుందా?
ఓ భాషలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే, రీమేక్ ద్వారా తమ భాషలోకి తీసుకురావాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. ఈజీ హిట్ ఫార్ములా అనేది ఒక కారణం. మంచి కథను మరో ప్రాంతం ఆడియన్స్కు చూపించాలనేది ఇంకో కారణం. హిట్ సినిమా రీమేక్ కూడా హిట్టే అవుతుందా? అంటే చెప్పలేం. చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ సరిగ్గా లెక్క కట్టాలి. ఆ మంత్రం మళ్లీ సరిగ్గా జపించాలి. అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది. ప్రస్తుతం ఓ భాషలో తయారైన అయిదు సూపర్ హిట్ సినిమాలు ఏకకాలంలో మూడు భాషల్లో రీమేక్ అవుతున్నాయి. ఆ సినిమాలు – ఆ రీమేక్ల విశేషాలు. అయ్యప్పనుమ్ కోషియుమ్ పృథ్వీరాజ్, బిజూ మీనన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. ఇద్దరు వ్యక్తుల ఈగోకి సంబంధించిన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. సచీ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘనవిజయం సాధించింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. ► తెలుగు రీమేక్లో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు–స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నాగవంశీ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ► హిందీ రీమేక్లో ‘దోస్తానా’ కాంబినేషన్ జాన్ అబ్రహామ్, అభిషేక్ బచ్చన్ నటించనున్నారు. నటించడంతో పాటు జాన్ అబ్రహామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు కూడా. జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ► ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తమిళ రీమేక్లో కార్తీ, పార్తిబన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. హెలెన్ రెస్టారెంట్లోని ఫ్రీజర్లో చిక్కుకుపోయిన అమ్మాయి అందులో నుంచి ఎలా బయటపడింది? అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘హెలెన్ ’. అన్నా బెన్ ముఖ్య పాత్ర చేసిన ఈ సినిమాని మతుకుట్టి జేవియర్ డైరెక్ట్ చేశారు. 2019లో ఈ సినిమా విడుదలైంది. తాజాగా ‘హెలెన్ ’ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► అన్నా బెన్ చేసిన పాత్రను తెలుగు రీమేక్లో అనుపమా పరమేశ్వరన్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ► ‘హెలెన్ ’ తమిళ రీమేక్ను ‘అన్బిర్కినియాళ్’ టైటిల్తో తెరకెక్కించారు. కీర్తీ పాండియన్ లీడ్ రోల్ చేస్తున్నారు. గోకుల్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ► ‘హెలెన్ ’ హిందీ రీమేక్లో జాన్వీ కపూర్ నటించనున్నారు. దర్శకుడు, మిగతా వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దృశ్యం 2 మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ (దృశ్యం 2) విడుదలయింది. మొదటి భాగంలో పని చేసిన టీమే ఈ సీక్వెల్ తెరకెక్కించారు. ‘దృశ్యం 2’ చిత్రం ప్రస్తుతం తెలుగులో, తమిళంలో రీమేక్ కాబోతోంది. హిందీలోనూ రీమేక్ కానుందని టాక్. ► ‘దృశ్యం’ మొదటి భాగంలో వెంకటేశ్, మీనా జంటగా నటించారు. సీక్వెల్లోనూ వీరే నటించనున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఈ రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తారు. ► ‘దృశ్యం’ తమిళ రీమేక్ జీతూ జోసెఫ్, కమల్హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కింది. తాజాగా ఈ సీక్వెల్ను కేయస్ రవికుమార్ డైరెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కమల్హాసన్ ప్రస్తుతం పొలిటికల్గా బిజీగా ఉన్నారు. మరి ఈ సీక్వెల్లో ఆయనే నటిస్తారా? వేరెవరైనా సీన్ లోకి వస్తారేమో చూడాలి. ► ‘దృశ్యం’ హిందీ రీమేక్లో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. తాజా సీక్వెల్ హిందీలోనూ రీమేక్ అవుతుందని బాలీవుడ్ టాక్. ఓ మై కడవుళే అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా అశ్విన్ మారిముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఓ మై కడవుళే’. జీవితంలో రెండో అవకాశం లభించినప్పుడు ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటించారు. 2020లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్విన్ తెలుగు రీమేక్ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. పీవీపీ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ► హిందీ రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అశ్విన్ మారిముత్తునే ఈ హిందీ వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తారు. ► ‘ఓ మై కడవుళే’ కన్నడ వెర్షన్ లో డార్లింగ్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు. అతిథి పాత్రలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ కనిపిస్తారు. అంధా ధున్ ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధా ధున్ ’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్. జాతీయ అవార్డు కూడా సాధించింది. ఇప్పుడు ‘అంధా ధున్ ’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ కానుంది. ► తెలుగు రీమేక్లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్, టబు పాత్రలో తమన్నా కనిపించనున్నారు. జూన్ 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ► తమిళ రీమేక్లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తున్నారు. జేజే ఫ్రెడ్రిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టబు చేసిన పాత్రను సిమ్రాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అంధగన్ ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ► ‘అంధా ధున్ ’ మలయాళ రీమేక్ని ‘భ్రమం’ అనే టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. ఆయా భాషల్లో విజయం సాధించినట్టు ఈ రీమేక్స్ కూడా విజయం సాధిస్తాయా? ఒరిజినల్లో జరిగిన మ్యాజిక్ను రీమేక్లోనూ ఆయా చిత్రబృందాలు క్రియేట్ చేయగలుగుతాయా? వెయిట్ అండ్ సీ! -
దృశ్యం 2: అజయ్ కూడా తప్పించుకుంటాడు
‘దృశ్యం2’ హవా మొదలైంది. తెలుగులో వెంకటేశ్తో ఈ సినిమా రీమేక్ అధికారికంగా అనౌన్స్ అయ్యింది. మలయాళ ఒరిజినల్ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే హిందీలో కూడా దీనివార్తలు మొదలయ్యాయి. ‘దృశ్యం’ హిందీ వెర్షన్లో అజయ్ దేవ్గణ్, టబూ, శ్రేయ నటించారు. దృశ్యం2 హిట్ అవడంతోటే హిందీలో కూడా రీమేక్ పనులు మొదలయ్యాయి. అజయ్ దీనికి ఒక నిర్మాతగా వ్యవహరిస్తారు. దృశ్యంలో నటించినవారే ఇందులో కూడా నటించే అవకాశాలున్నాయి. అయితే ‘దృశ్యం’కు దర్శకత్వం వహించిన నిషికాంత్ కామంత్ గత సంవత్సరం సిరోసిస్తో మరణించడంతో ఈసారి హిందీ వెర్షన్కు జీతూ జోసఫ్నే అజయ్ తీసుకోనున్నాడని వినికిడి. తెలుగు రీమేక్ను పూర్తి చేసుకుని జీతూ హిందీ రీమేక్కు వెళ్లొచ్చు. కనుక మలయాళంలో మోహన్లాల్ శిక్ష తప్పించుకున్నట్టే తెలుగులో వెంకటేశ్ తప్పించుకోనున్నాడు. అజయ్ కూడా తప్పించుకోనున్నాడు. చూడాలి... ఈ రీమేక్స్ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. చదవండి: దృశ్యం 2: కుటుంబం గెలిచింది చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సురేఖ వాణి -
దృశ్యం 2: కుటుంబం గెలిచింది
శిక్ష అంటే ఏమిటి? నేరం చేసిన వారిని జైలులో బంధించి వారిని జీవితానికి దూరం చేసి బాధించడమేనా? న్యాయం అంటే ఏమిటి? తమకు జరిగిన అన్యాయానికి కొంతమందికి శిక్ష పడే వరకు వేటాడటమేనా? ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ గురించి వందల సంవత్సరాలుగా మనిషి తాత్త్వికత రకరకాలుగా ఉంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఆ శిక్ష మానసికమైనదా? భౌతికమైనదా? పశ్చాత్తాపంతో నిండినదా? ప్రాయశ్చిత్తం చేసుకునేదా? శిక్షను కోరుకునే చోట క్షమకు వీలు లేదా? శిక్ష–క్షమ సమానం కాదా? అయితే మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. చట్టానికి ఉండవు. ∙∙ ‘నిజానికి ఆ ఇద్దరూ న్యాయం కోరుకుంటున్నారు. కాని ఇద్దరికీ న్యాయం చేయలేం’ అంటాడు ‘దృశ్యం2’లో ఒక పోలీసు ఉన్నతాధికారి. ‘మళ్లీ పోలీసులు ఎప్పుడొస్తారో అని ఆ కుటుంబం భయపడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అది శిక్ష కదా?’ అంటాడు మరో పోలీసు అధికారి. ఇది ఒక చిక్కుముడి కేసు. ప్రేక్షకులు కూడా న్యాయం చెప్పలేని కేసు. నిజానికి న్యాయం సాపేక్షమైనది. ఇటు నుంచి చూస్తే ఇటు న్యాయం అనిపిస్తుంది. అటు నుంచి చూస్తే అటు న్యాయమనిపిస్తుంది. ‘దృశ్యం’ సినిమాలో ఒక కుర్రాడి హత్య జరుగుతుంది. ఆ హత్యను చేసింది తల్లీకూతుళ్ల జంట. అతను తప్పు చేశాడు. ఆ తల్లీకూతుళ్లు బతిమిలాడారు. అతను వినలేదు. తకరారు జరిగింది. అనుకోకుండా అతడు చనిపోయాడు. అమాయకులైన తల్లీకూతుళ్లు అతని వల్ల పెద్ద విపత్తులో పడ్డారు. ఆ విపత్తు నుంచి కాపాడుకోవడంలో భాగంగా అతను చనిపోయాడు. క్రైమ్ అండ్ పనిష్మెంట్ జరిగిపోయింది. కాని చట్టం దానిని క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనుకోదు. పనిష్ చేయాల్సింది తల్లికూతుళ్లను అని భావిస్తుంది తన నియమాల ప్రకారం. ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా అదే ఆశిస్తారు చట్టం నుంచి. అయితే ఆ చట్టానికి ఆ తల్లికూతుళ్లకు మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఆ ఇంటి యజమాని. కుటుంబ పెద్ద. అతనికి కుటుంబం ముఖ్యం. తన ఇంటి ఆడవాళ్లు జైలుకు వెళ్లకుండా చూసుకోవడం అతడి విధి. అంటే అతడు శిక్షను నిరాకరిస్తున్నాడు. తన కుటుంబానికి శిక్ష పడటం న్యాయ సమ్మతం కాదనుకుంటున్నాడు. అక్కడి నుంచే గేమ్ మొదలవుతుంది. ‘దృశ్యం’ రిలీజ్ అయ్యింది. అనేక భాషల్లో రీమేక్ అయ్యింది. ‘దృశ్యం’ ఒరిజినల్లో చేసిన మోహన్లాల్ తన కుటుంబాన్ని తెలివితో కాపాడుకున్నాడు. ఆ సినిమాలో హత్యకు గురైన కుర్రాడి డెడ్బాడీ దొరకదు. శవం లేకపోతే నేరం నిరూపణ కాదు. కనుక శిక్ష లేదు. కనుక వారు శిక్ష నుంచి బయటపడతారు. కథ ముగిసింది అనుకుంటాం. కాని నిజంగా ముగిసిందా? పోలీసులు నిజంగానే కేసు మూసేస్తారా? ఏం మూసేయరు. వాళ్లు ఆ కేసును పట్టుకునే ఉంటారు. ఆ కేసును ఛేదించాలనే చూస్తుంటారు. మోహన్లాల్ కుటుంబానికి శిక్ష పడేలా చేయడం వారి విధి. కాని నిజంగానే మోహన్లాల్ కుటుంబం శిక్ష పొందడం లేదా? వారు శిక్షను అనుభవిస్తున్నారు. కాకపోతే శిక్షగా అందరూ భావించే జైలులో కాదు. తమ జీవనంలో. పోలీసులు ఎప్పుడొస్తారో అని భయం. పెద్ద కూతురికి పీడకలలు. చిన్నకూతురికి ఆందోళన. ఇంటి యజమానికి ఎప్పుడూ పోలీసుల మీద నిఘా. ఆ డెడ్బాడీని ఎక్కడ దాచాడో అతడికి మాత్రమే తెలుసు. కాని ఆ బాడీ బయటపడితే? కేసు మొదటికొస్తే? అందరం జైలుకెళ్లాల్సిందే. ఆ మనోవేదనను ఆ కుటుంబం అనుభవిస్తూనే ఉంది. మరోవైపు ఆ చనిపోయిన కుర్రాడి తల్లిదండ్రులు ‘మా అబ్బాయి అస్తికలైనా ఇవ్వు. కర్మకాండలు జరుపుకుంటాం’ అని సెంటిమెంటల్గా అడుగుతూ ఉంటే అదొక వేదన. ఇదంతా శిక్ష కాదా? కాదు అంటుంది చట్టం. వారిని జైలులో వేసి బంధిస్తేనే అది శిక్ష అంటుంది. అలాంటి శిక్షకు ఆ ఇంటి పెద్ద సమ్మతంగా లేడు. ‘దృశ్యం 2’ తాజాగా మలయాళ భాషలో అమేజాన్లో రిలీజ్ అయ్యింది. ‘దృశ్యం’కు సీక్వెల్ ఇది. అదే తారాగణం. అదే నేపథ్యం. అదే కొనసాగింది. తల్లీకూతుళ్లు కుర్రాణ్ణి హత్య చేసిన ఆరేళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. ఆరేళ్ల తర్వాత ఆ కేసు గురించి మళ్లీ విచారణ మొదలవుతుంది. ఆ సమయానికి ఆ ఇంటి వాళ్లు కొంచెం ఆర్థికంగా బాగుపడి ఉన్నారు. పెద్దమ్మాయి పెళ్లికి రెడీ అయి ఉంది. రెండో అమ్మాయి కాలేజీకి వచ్చింది. కాని వారు మనశ్శాంతితో మాత్రం లేరు. ఊరు జరిగిన హత్యను మరిచిపోలేదు. పుకార్లను మానలేదు. ఆ కుర్రాడు కూతురి కోసం వచ్చాడని ఒకరంటే తల్లి కోసం వచ్చాడని ఒకరంటుంటారు. జనానికి కూడా వీళ్లిలా హాయిగా తిరిగడం నచ్చదు. బాధల్లో ఉండాలి. మరోవైపు పోలీసుల డేగ కళ్లు. ఏదో ఒక రోజు ఆ పోలీసులు శవాన్ని కనిపెడితే ఆ కుటుంబం పని సఫా అయిపోతుంది. కాని అలా సఫా కాకుండా ఉండటానికి ఆ కుటుంబ యజమాని అయిన మోహన్లాల్ సకల సరంజామాతో సిద్ధంగా ఉన్నాడని సినిమా చూశాక తెలుస్తుంది. దృశ్యంలో కుటుంబం గెలిచింది. దృశ్యం 2లో కూడా కుటుంబమే గెలిచింది. చట్టం వారికి శిక్ష వేయలేకపోయింది. కానీ వారు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. క్రూరమృగం అనుకుని పొదల్లో ఉన్న రుషిని చంపి శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. జంట పక్షులలో ఒకదానిని చంపి ప్రాయశ్చిత్తం గా రుషిగా మారినవారూ ఉన్నారు. నేరం జరగడం, చేయడం మనిషి జీవనంలో అనూహ్యం గా ఉంది. పథకం ప్రకారమూ ఉంది. కాని ఒక్కసారి నేరం జరిగిపోయాక ఇరు పక్షాలు వల్లె వేసే ‘క్షమ’–‘శిక్ష’ అనే మాటలు విస్తారమైన చర్చకు పాత్రమవుతుంటాయి. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న భార్య, అందుకు కారకుడేమోనని భర్తకు శిక్ష వేయించాలని చూసే పెద్దలు, పిల్లల కోసం తనకు శిక్ష పడకూడదని భావించే తండ్రి... ఎవరివైపు నుంచి చూస్తే వారిది ‘సరైన వాదనే’ అనిపిస్తూ ఉంటుంది. ఇటీవల రాహుల్ గాంధీ ‘నా తండ్రిని చంపిన వారిపై నాకు కోపం లేదు’ అన్నాడు. అది భావోద్వేగం. కాని చట్టానికి విధి ఉంటుంది. ఈ భావోద్వేగాలు, చట్టం కర్తవ్యాలు ఎప్పటికీ ఉంటాయి. నడుమ వాటిని చర్చకు పెట్టే ‘దృశ్యం’ వంటి సినిమాలు నాలుగు డబ్బులు చేసుకుంటూ ఉంటాయి. దర్శకుడు జీతూ జోసెఫ్కు తిండికి ఢోకా లేదు. డైరెక్టర్ రేపెప్పుడైనా ఫెయిల్ అయినా డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకొని బతికేయవచ్చు. అంత పకడ్బందీగా ఉందీ సినిమా. తెలుగు రీమేక్ కోసం ఎదురు చూడండి. దర్శకుడు జీతూ జోసెఫ్ – సాక్షి ఫ్యామిలీ -
దృశ్యం 2: మోహన్ లాల్ కథకు ప్రాణం పోశారు
మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘దృశ్యం-2’ ఈ రోజు అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరేళ్ల క్రితం సెన్సెషనల్ హిట్ సాధించిన ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా మలయాళంలో విడుదలైన ఈ మూవీ సిక్వెల్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సీని రచయిత శీధర్ పిల్లై ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన ఆరంభం. దృశ్యం లాగే ఈ సీక్వెల్ కూడా ప్రేక్షక ఆదరణతో ముందుకు వెళుతోంది. జీతూ జోసెఫ్ స్మార్ట్ రైటింగ్, థ్రిల్లింగ్ థాట్కు జార్టీ కుట్టిగా మోహన్ లాల్ కథకు ప్రాణం పోశారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా దృశ్యంలో తన కుటుంబం జోలికి వచ్చిన వరుణ్ను కూతురు హత్య చేయడం.. ఆ మృతదేహాన్ని ఎవరూ ఉహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెడతాడు జార్జి కుట్టి (మోహన్ లాల్). ఇక ఆ తర్వాత జార్జి తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. కానీ ఆ కేసును మాత్రం పోలీసులు వదిలి పెట్టరు. జార్జికి తెలియకుండా ఆ కేసును ఇంకా దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని కీలక సాక్ష్యాలు దొరుకుతాయి. ఆ సాక్ష్యాలెంటీ.. మళ్లీ వాటి వలన జార్జి కుటుంబానికి ఎదురైన సమస్యలను దర్శకుడు దృశ్యం 2లో చూపించాడు. #Drishyam2 @PrimeVideoIN -Fantastic!A sequel as good as #Drishyam. #JeethuJoseph nailed it smart writing & taut thrilling moments. @Mohanlal as #Georgekutty is extraordinary along with #Meena & #MuraliGopy.Story opens 6 years after events of #D1 & police hasn’t closed the case... pic.twitter.com/ciAYV0J4LU — Sreedhar Pillai (@sri50) February 18, 2021 -
దృశ్యం సీక్వెల్లో వెంకటేశ్: ఛాన్స్ ఉందా?
మలయాళంలో 2013లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం దృశ్యం. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక భాషల్లో రీమేక్ అయింది. గత దశాబద్ధంలో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో దృశ్యం ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలోనూ రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఏడేళ్ల తర్వాత దృశ్యానికి సీక్వెల్ తెరకెక్కించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. మొదటి భాగంలో నటించిన మోహన్లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటించారు. ఈ మధ్యే సినిమా ట్రైలర్ రిలీజవగా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్ అయినా కూడా ముందస్తు ఒప్పందం ప్రకారం ఓటీటీలో విడుదల చేయక తప్పట్లేదు. దృశ్యం తెలుగు రీమేక్లో నటించిన వెంకటేశ్ ఇప్పుడు దాని సీక్వెల్పైనా దృష్టి సారించాడు. కానీ డైరెక్టర్ జీతూ దృశ్యం 2ను తెలుగులో డబ్ చేస్తుండటంతో వెంకటేశ్కు దాదాపు రీమేక్ ఛాన్స్ లేకుండా పోయింది. పైగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో అందరికీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వెంకీ దీన్ని వదిలేసుకునే అవకాశమే అధికంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ సీక్వెల్ తెలుగు రీమేక్ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం వెంకీ 'నారప్ప' సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. 'అసురన్' రీమేక్గా వస్తోన్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది. వరుణ్ తేజ్తో కలిసి చేస్తున్న 'ఎఫ్ 3' ఆగస్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించేందుకు వస్తోంది. చదవండి: వేసవిలో నారప్ప రిలీజ్.. కేజీఎఫ్ 2 బిజినెస్ మాములుగా లేదుగా.. అన్ని కోట్లా? -
యుద్ధానికి వెళ్తున్నట్లనిపించింది
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం అంటే యుద్ధానికి వెళ్తున్న భావన కలుగుతోంది’’ అంటున్నారు మీనా. మలయాళ చిత్రం ‘దృశ్యం’కి సీక్వెల్గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోంది. మోహన్ లాల్, మీనా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఏడు నెలల తర్వాత విమానయానం చేశారు మీనా. పీపీఈ కిట్ ధరించి ప్రయాణం చేశారామె. దీని గురించి మీనా మాట్లాడుతూ –‘‘ఈ దుస్తులన్నీ చూస్తుంటే అంతరిక్షానికి వెళ్తున్నట్టు అనిపించింది. అలాగే ఏదో యుద్ధానికి వెళుతున్న ఫీల్ కలిగింది. విమానాశ్రయం చాలా ఖాళీగా ఉంది. నాలా ఎవ్వరూ డ్రెస్ (పీపీఈ కిట్స్) చేసుకోకపోవడం భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఈ డ్రెస్లో ప్రయాణం చాలా కష్టం. బయట చల్లగా ఉన్నప్పటికీ లోపల ఒకటే ఉక్కపోత. వీటితో రోజూ మన కోసం కష్టపడుతున్న అందరికీ నా సెల్యూట్’’ అన్నారు. -
ఆస్పత్రిలో 'దృశ్యం' దర్శకుడు
సాక్షి, హైదరాబాద్: సక్సెస్ఫుల్ చిత్రం 'దృశ్యం' దర్శకుడు నిశికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో పోరాడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా నిశికాంత్ 'డోంబివాలీ ఫాస్ట్' అనే మరాఠీ చిత్రంతో 2005లో వెండితెరపై దర్శకుడిగా ప్రవేశించారు. ఈ చిత్రానికి ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. (ఇలా చేయడంతో వారంలో కోలుకున్నా: విశాల్) దీనికన్నా ముందు 'హవా ఆనే దే' అనే హిందీ సినిమాలోనూ నటించారు. 'సాచ్య ఆట ఘరాట్' అనే మరాఠీ సినిమాలోను నటనతో ఆకట్టుకున్నారు. "ముంబై మేరీ జాన్" అనే చిత్రంతో డైరెక్టర్గా బాలీవుడ్కు మకాం మార్చారు. ఈ చిత్రం హిట్ కొట్టడంతో 'ఫోర్స్', 'లై భారీ' సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే దక్షిణాదిన ఘన విజయాన్ని నమోదు చేసుకున్న "దృశ్యం" సినిమాను అజయ్ దేవ్గణ్, టబుతో కలిసి హిందీలో తెరకెక్కించారు. ఆయన పలు హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో పని చేశారు. "రాకీ హ్యాండ్ సమ్" చిత్రంలో విలన్గానూ కనిపించారు. (ఉత్తమ థ్రిల్లర్ సీక్వెల్కు రెడీ!) -
పెళ్లికి రెడీ అవుతోన్న 'దృశ్యం' నటుడు
తిరువనంతపురం: 'దృశ్యం' నటుడు రోషన్ బషీర్కు పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి. కేరళలో తన ప్రేయసి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి దగ్గరి బంధువైన ఫర్జానాను ఆగస్టు 5న వివాహం చేసుకోనున్నారు. కేరళ ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు కేవలం ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ వివాహం జరగనుంది. కాగా ఎప్పటినుంచో ప్రేమ ఊసులు చెప్పుకుంటున్న వీరిద్దరినీ పెళ్లి బంధంతో ఒక్కటి చేసేందుకు పెద్దలు నిర్ణయించుకోవడంతో జూలై 5న వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను రోషన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫర్జానా న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. (సెలబ్రిటీల పెళ్లిపై మాధవీలత విసుర్లు) రోషన్ బషీర్ "ప్లస్ టూ" చిత్రంతో మలయాళీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 'ఇన్నను ఆ కల్యాణం', 'బ్యాంకింగ్ అవర్స్', 'రెడ్ వైన్' వంటి పలు సినిమాల్లో కనిపించారు. కానీ అతనికి మంచి బ్రేక్నిచ్చింది మాత్రం 'దృశ్యం' సినిమానే. మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రోషన్ నెగెటివ్ పాత్రలో మెరుగైన నటన కనబరిచారు. ఈ సినిమా బంపర్ హిట్ సాధించడంతో ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో వెంకటేశ్ (దృశ్యం), తమిళంలో కమల్ హాసన్ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్ (దృశ్య), హిందీలో అజయ్ దేవగన్ (దృశ్యం) హీరోలుగా రీమేక్ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్ అయింది. చైనీస్లోనూ ‘షీప్ వితౌట్ ఏ షెపర్డ్’ టైటిల్తో రీమేక్ అయింది. (భారీ వ్యూస్ సాధించిన ‘గడ్డి తింటావా’ సాంగ్) -
చైనీస్కు దృశ్యం
ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణం. ఈ మధ్య కాలంలో మలయాళ హిట్ సినిమా ‘దృశ్యం’ ఎక్కువ భాషల్లో రీమేక్ అయింది. తాజాగా చైనీస్ భాషకి వెళ్లడం విశేషం. మోహన్లాల్ హీరోగా జీతూ జోసెఫ్ రూపొందించిన థ్రిల్లర్ ‘దృశ్యం’. తెలుగులో వెంకటేశ్ (దృశ్యం), తమిళంలో కమల్ హాసన్ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్ (దృశ్య), హిందీలో అజయ్ దేవగన్ (దృశ్యం) హీరోలుగా రీమేక్ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్ అయింది. ఇప్పుడు చైనీస్లో ‘షీప్ వితౌట్ ఏ షెపర్డ్’ ౖటñ టిల్తో రీమేక్ అయింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదలవుతోంది. -
‘దృశ్యం’ సినిమా చూపించారు!
ఇండోర్: సినిమాల ప్రభావం జనంపై ఉంటుందా అన్న ప్రశ్నకు ఇదొక ఉదాహరణ. దృశ్యం సినిమాను రియల్ లైఫ్లో దించేశారు. ట్వింకిల్ దగ్రే (22) అనే మహిళ రెండేళ్ల కింద కనిపించడం లేదని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కేసు నమోదైంది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు ఇటీవల గుర్తించారు. ఈ కేసులో నిందితులు బీజేపీ మాజీ కార్పొరేటర్ జగదీశ్ కరొటియా (65), అతని ముగ్గురు కుమారులు అజయ్(38), విజయ్ (36), వినయ్ (31)తో పాటు వీరి సహాయకుడు నీలేశ్ కశ్యప్(28)ని అరెస్టు చేసినట్లు ఇండోర్ డీఐజీ హరినారాయణచారి మిశ్రా వెల్లడించారు. దృశ్యం సినిమా ప్రేరణతో వారు ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. వివాహేతర సంబంధమే: కరొటియాకు ట్వింకిల్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె అతనితోనే ఉంటానని పట్టుబట్టడంతో కరొటియా ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆమె అడ్డు తప్పించాలని భావించిన కరొటియా..తన ముగ్గురు కొడుకులతో కలసి హత్యకు పథకం వేశాడు. దారి మళ్లించారిలా.. ► ఐదుగురు కలసి 2016 అక్టోబర్ 16న ట్వింకిల్ గొంతు నులిమి చంపి..కరొటియా స్థలంలోనే మృతదేహాన్ని కాల్చేశారు. ► ట్వింకిల్ను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని నమ్మించడానికి హత్యకు ముందురోజు నిందితుడు అజయ్ ట్వింకిల్ మొబైల్ తీసుకుని ‘నా తల్లిదండ్రుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను కాపాడు’అంటూ వాట్సప్ నుంచి తన తండ్రికి సందేశాలు పంపించుకున్నాడు. ► హత్య చేసిన రోజే ఓ కుక్కను చంపి ఆమెను కాల్చిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో పూడ్చిపెట్టారు. ► అదే రోజు ట్వింకిల్ మొబైల్ లొకేషన్ మార్చి బాదన్వర్ సమీపంలో పూడ్చిపెట్టారు. ► అనంతరం 4 నెలలకు తన భూమిలో ఎవర్నో చంపి పూడ్చి పెట్టారని, కొలతలను బట్టి చూస్తుంటే అది ట్వింకిల్ మృతదేహం లాగే ఉందని స్థానికంగా వదంతులు సృష్టించి చర్చనీయంశం చేశాడు. అనంతరం 2 నెలలకు ఈ విషయాన్ని తన సహాయకుడి ద్వారా పోలీసులకు చేరవేశాడు. ► అక్కడ తవ్వి చూసిన పోలీసులకు దృశ్యం సినిమా మాదిరి కుక్క కళేబరం బయటపడింది. ఇది దర్యాప్తును పక్కదారి పట్టించింది. ► కరొటియా సూచనల మేరకు అంతకు ముందే ట్వింకిల్ తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. ఇది ఆమె తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసుల్ని దారి మళ్లించింది. సాక్షులూ..ఆధారాలతో.. కొన్నాళ్లకు మృతదేహాన్ని కాల్చిన ప్రదేశంలో ట్వింకిల్కు సంబంధించిన ఒక జత మెట్టెలు, ఓ బ్రాస్లెట్, అస్థికలు, ఆమెను చంపడానికి ఉపయోగించిన తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరొటియాపై అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 16న కార్లో ఓ మృతదేహం తెచ్చారని, దాని గురించి అడిగితే కార్పొరేటర్ కుక్క చనిపోయిందని, దాన్ని పూడ్చిపెట్డడానికి తీసుకెళ్తున్నట్లు కరొటియా సహాయకుడు సూర్యవంశీ ద్వారా పోలీసులు రాబట్టారు. అంతకు ముందు రోజు ట్వింకిల్ ఆ ఇంటికి వచ్చినట్లు కూడా అతను చెప్పాడు. చనిపోయిన కుక్కకోసం తమను 5 అడుగుల గొయ్యి తవ్వమన్నారని ఐఎంసీ కార్మికులు పోలీసులకు చెప్పడంతో వారి అనుమానం నిజమైంది. బయటపడింది ఇలా.. ఈ కేసుకోసం ఇండోర్లోనే తొలిసారి నిందితునికి బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్ సిగ్నేచర్ (బీఈఓఎస్) పద్ధతిలో దర్యాప్తు చేశారు. గుజరాత్ లాబొరేటరీలో కరొటియా, అతని ఇద్దరి కుమారులకు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించారు. న్యూరో సైకలాజికల్ టెక్నిక్ వల్ల దోషులు దొరికిపోవడంతో కథ పూర్తయింది. -
‘దృశ్యం’తరహాలో యువతిని చంపి, కుక్కను పాతిపెట్టి..
ఇండోర్ : దృశ్యం సినిమా తరహాలో ఓ కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేసిన తండ్రీ కొడుకులు.. పోలీసుల కళ్లుకప్పి రెండేళ్లపాటు నిజాన్ని దాచగలిగారు. చివరకు పోలీసుల విచారణలో నిజం బయటపడి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇండోర్ కు చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీశ్ కరోటియా (65) అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మహిళా కార్యకర్త ట్వింకిల్ దాగ్రే (22) ల మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. వీరి మధ్య ఉన్న అక్రమ సంబంధం కరోటియా ముగ్గురు కుమారులు అజయ్(38), విజయ్(36), వినయ్(31)లకు తెలిసింది. దీంతో తండ్రితో గొడవకు దిగారు. ట్వింకిల్ తో గడిపితే సహించేది లేదని తేల్చి చెప్పారు. కుమారుల ఒత్తిడితో ట్వింకిల్ ను హతమార్చేందుకు జగదీశ్ ప్లాన్ చేశారు. ఆపై 'దృశ్యం' సినిమా చూసిన వీరంతా, అలాగే ప్లాన్ చేశారు. తమ సన్నిహితుడు నిలేశ్(28)తో కలిసి ట్వింకిల్ ను హత్య చేశారు. హత్య అనంతరం ఆమెను తమ కారులో తీసుకెళ్లి కాల్చేశారు. ఈ హత్యపై కచ్చితంగా పోలీసులు తమనే అనుమానిస్తారని ఊహించిన నిందితులు.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఓ చోట చనిపోయిన కుక్క మృత దేహాన్ని పాతిపెట్టారు. కొంతకాలం తరువాత ఎవరినో హత్య చేసి, పూడ్చి పెట్టారన్న పుకారును లేవనెత్తారు. అప్పటికే ట్వింకిల్ అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్ తో రాగా, పూడ్చి పెట్టిన ప్రాంతంలో కుక్క కళేబరం మాత్రమే వారికి కనిపించింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. పోలీసులకు జగదీశ్ తో ట్వింకిల్ కు ఉన్న వివాహేతర బంధం గురించి తెలిసి ఆ దిశగా విచారించగా, అసలైన నిందితులని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశామని, మరిన్ని వివరాల కోసం వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
దృశ్యం సినిమా స్ఫూర్తితో హత్య చేశారు
పుణె: పలు భాషల్లో నిర్మించిన దృశ్యం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో తీసిన ఈ సినిమాలో మీనా.. తన కుమార్తెను బ్లాక్మెయిల్ చేస్తున్న యువకుడి నుంచి కాపాడుకోవడం కోసం అనుకోకుండా అతన్ని చంపేస్తుంది. హీరో వెంకటేష్ తన భార్య, కుమార్తెలను హత్య కేసు నుంచి రక్షించడం కోసం ఎవరికీ తెలియని చోట శవాన్ని పూడ్చిపెట్టి, సాక్ష్యం దొరకకుండా చేస్తాడు. బాలీవుడ్లో రీమేక్ చేసిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్ నటించాడు. ఈ సినిమా స్ఫూర్తితో మహారాష్ట్రకు చెందిన తండ్రీకొడుకు ఓ వడ్డీ వ్యాపారిని చంపేశారు. కాగా సినిమాలో మాదిరిగా చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. చిక్లికి చెందిన వడ్డీ వ్యాపారి శ్రీరామ్ శివాజీ వాలేకర్ నుంచి సమిదుల్లా మనియార్ (54), ఆయన కొడుకు మెహబూబ్ మనియార్ (26) 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. కాగా వీళ్లు సకాలంలో అప్పు తీర్చకపోవడంతో శ్రీరామ్ డిమాండ్ చేశాడు. అప్పు, వడ్డీ కలపి 8.40 లక్షల రూపాయలు బాకీ పడ్డారు. అప్పు ఎగ్గొట్టేందుకు మనియార్లు దృశ్యం సినిమా తరహాలో శ్రీరామ్ను చంపి సాక్ష్యాలు లేకుండా చేయాలని పథకం వేశారు. గతేడాది సెప్టెంబరులో చిక్లీ ప్రాంతంలో వాళ్లు ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు. అదే నెల 27న మాట్లాడేందుకని శ్రీరామ్ను ఈ ప్లాట్కు పిలిచి గొంతు కోసి చంపేశారు. తర్వాత అతని శవాన్ని ఓ ప్లాస్టిక్ షీట్లో చుట్టి ఇంట్లోనే పాతిపెట్టారు. మనియార్లు ఈ విషయం ఇక ఎవరికి తెలియదనుకుని ఏమీ తెలియనట్టు ఉండిపోయారు. కాగా ఆ మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 28న శ్రీరామ్ కనిపించడం లేదంటూ ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీరామ్ ఫోన్ కాల్స్ డేటాను ఆధారంగా అతను మనియార్లతో అప్పు విషయంపై గొడవపడ్డాడని, పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. మనియార్ ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించారు. మనియార్ల గురించి పోలీసులు విచారించగా, వాళ్లు సొంతూరుకు వెళ్లినట్టు తెలిసింది. గురువారం మెహబూబ్ చిక్లీ తిరిగి రాగా పోలీసులు వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. శుక్రవారం హత్య జరిగిన ప్రాంతం నుంచి శ్రీరామ్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు సమిదుల్లాను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
క్రికెట్ మ్యాచ్ రోజునా...‘దృశ్యకావ్యం’ కలెక్షన్లు తగ్గలేదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ చాలా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్లో నవ్వులు పూయించాను. కానీ హారర్ నే పథ్యంలో తెరకెక్కిన ‘దృశ్యకావ్యం’ చిత్రంలో నటించడం సరికొత్త అనుభూతిని ఇచ్చింది. నాకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రమిది’’ అని హాస్యనటుడు ‘థర్టీ ఇయర్స’ పృథ్వి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా స్వీయ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇందులో డాక్టర్ పృథ్విగా నటించిన పృథ్వి ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలు... ♦ నేను ఇప్పటివరకూ చాలా అనుభవమున్న దర్శకులతో పనిచేశాను. చేస్తున్నాను. కానీ బెల్లం రామకృష్ణారెడ్డి ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎవరి దగ్గరా సహాయకునిగా పనిచేయకపోయినా ఆయన క్లారిటీ అద్భుతం. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చాను. కొత్త దర్శకులతో అయినా నేను పనిచేయడానికి రెడీ. ♦ షూటింగ్ టైమ్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. రామకృష్ణారెడ్డి చాలా చక్కగా ఈ సీన్స్ను తీర్చిదిద్దారు. ఈ సినిమా విడుదలయ్యాక మా కష్టానికి తగ్గ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల వరల్డ్కప్ టీ 20లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన రోజు కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గలేదు. ఈ సినిమా బాగా ఆగుతోందని చెప్పడానికి ఇదొక్కటి చాలు. ♦ ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు నచ్చే సినిమా ఇది. వేసవి సెలవుల్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ♦ సినిమా ద్వితీయార్ధంలో భూతవైద్యుడిగా హీరో ఇంట్లోకి ప్రవేశించిన నాకు హఠాత్తుగా ఎదురయ్యే పిల్లదెయ్యాలు, అవి నన్ను భయపెట్టే సన్నివేశాలకు ముఖ్యంగా పిల్లలు బాగా కనె క్ట్ అవుతున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం ఈ సినిమాకే హైలైట్గా నిలిచింది. ♦ ఇక, ఈ సన్నివేశాలకు గ్రాఫిక్ వర్క్ కూడా బాగా కుదిరాయి. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో ‘ప్రాణం’ కమలాకర్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. సినిమా నిడివి ఎక్కువ కావడంతో నా మీద చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను తొలగించారు. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందనున్న ‘దృశ్యకావ్యం-2’లో నటించనున్నా. అందులో కూడా నవ్విస్తాను. ♦ ఆ మధ్య చేసిన ‘లౌక్యం’ తర్వాత నుంచి నాకు వరుసగా మంచి పాత్రలు వస్తున్నాయి. ‘సరైనోడు’, మారుతి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో చాలా మంచి రోల్స్ చేస్తున్నా. -
'దృశ్యకావ్యం' రివ్యూ..
జానర్ : హారర్ నటీనటులు : కార్తీక్, కశ్మీరా కులకర్ణి, పృథ్వీ తదితరులు నిర్మాత, దర్శకత్వం : బెల్లం రామకృష్ణా రెడ్డి సంగీతం : కమలాకర్ ఈ మధ్యకాలంలో దర్శకులు కళ్లు మూసుకుని నమ్ముకుంటున్న సబ్జెక్ట్ 'సస్పెన్స్'. భయానికి మరికొన్ని భావోద్వేగాలను మిళితం చేసి సినిమాలను ప్రేక్షకుల మీదకు వదులుతున్నారు. అలాంటి హారర్ ఎలిమెంట్స్ తో ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చిన చిన్న సినిమానే 'దృశ్యకావ్యం'. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో.. తల నొప్పించిందో.. ఓ సారి చూద్దాం. హనీ అనే పాప తన తండ్రి డైరీ చదువుతుండగా సినిమా మొదలవుతుంది. హీరో అఖిల్(రామ్ కార్తీక్), హీరోయిన్ అభి(కశ్మీరా కులకర్ణి)లు బి.టెక్ చదువుతుండగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. వీరికి హనీ అనే ఓ పాప. భార్య, పాపే అఖిల్ ప్రపంచం. పాపకు తండ్రి తోడిదే లోకం. ఇంతలో అఖిల్కు ఆఫీసులో యూరప్ ట్రిప్ వెళ్లే అవకాశం వస్తుంది. పాప వద్దంటున్నా వినకుండా అఖిల్ యూరప్ కు బయలుదేరుతాడు. ఇక్కడి వరకు సంతోషంగా, సాఫీగా జరిగిన వారి జీవితంలో మొదలయ్యే అనూహ్య పరిణామాలే మిగిలిన కథాంశం. యూరప్కు బయలుదేరిన అఖిల్ ఎయిర్ పోర్టుకు చేరుకోకుండానే రోడ్డుప్రమాదానికి గురై మరణిస్తాడు. ఇదే విషయాన్ని అతని భార్యకు చెప్పడానికి అఖిల్ ఇంటికి చేరుకున్న అతని ఫ్రెండ్(మధునందన్).. ఫోనులో భర్తతో మాట్లాడుతున్న అభిని చూసి అవాక్కవుతాడు. మార్చురీ దగ్గర స్నేహితుడి మృతదేహాన్ని చూసి వచ్చిన అతడికి అఖిల్ ఇంటి పరిస్థితులు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. ఇక ఆ తర్వాత చనిపోయిన తండ్రికి, పాపకు మధ్య చోటుచేసుకునే కొన్ని సంఘటనలతో కథను ముందుకి నడిపించారు. దర్శకుడు మంచి సస్పెన్స్ పాయింట్నే తీసుకున్నాడు గానీ ఆ ఒక్క పాయింట్ తోనే కథను నడిపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ పాటలతో గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో కథ మలుపు తీసుకున్నా పెద్దగా ఆకట్టుకున్నదేమీ లేదు. ఇంతా చేసి ఏం జరుగుతుందో స్పష్టత ఇచ్చారా అంటే అదీ లేదు, ఏం జరిగిందో తెలియాలంటే సినిమా రెండవ భాగం చూడండంటూ అకస్మాత్తుగా కథకు తెర దించాడు దర్శకుడు. హీరో కొత్తవాడే అయినా పరిధి మేరకు బాగానే నటించాడు. హీరోయిన్ అందంగా కనిపించిందిగానీ మాటి మాటికీ నవ్వి కాస్త చిరాకు తెప్పించింది. మధ్యలో మన సహనానికి పరీక్ష పెట్టే కమెడియన్ల కష్టాలు. అన్నీ వెరసి అటు భయంగానీ, ఇటు థ్రిల్ గానీ, సస్పెన్స్ గానీ.. ఏదీ కలిగించలేకపోయింది ఈ సినిమా. అసలు సినిమాకి 'దృశ్యకావ్యం' అనే పేరు ఎందుకు పెట్టారో అనే ఆలోచన సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కలగక మానదు. బలాలు సంగీతం పాటలు కెమెరా బలహీనతలు కథనం క్లైమాక్స్ హారర్ ఎలిమెంట్స్ లేకపోవడం -
మలయాళ దర్శకుడికి ఓకే చెప్పాడు
ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వెంకటేష్ మళ్లీ సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలోరిజెక్ట్ చేసిన మారుతి దర్శకత్వంలో బాబు బంగారం పేరుతో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 16న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు వెంకీ. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు వెంకటేష్. గతంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సినిమా రీమేక్ లో హీరోగా నటించిన వెంకీ, ఈ సారి నేరుగా జీతూ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ వర్షన్ లో హీరోను ఫైనల్ చేయాల్సి ఉంది. -
అభిమానులకు బర్త్డే గిఫ్ట్
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. కుర్ర హీరోల పోటి పెరగటంతో తన ఏజ్కు, ఇమేజ్కు తగ్గ కథల కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న విక్టరీ హీరో మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ రోజు (ఆదివారం) వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ వివరాలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. చాలా రోజుల తరువాత వెంకీ సినిమా వస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న వెంకటేష్ తొలిసారిగా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ముఖ్యంగా కథల ఎంపికలో పక్కాగా ఉండాలన్న ఆలోచనతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గోపాల గోపాలా, దృశ్యం లాంటి డిఫరెంట్ మూవీస్ తరువాత మారుతి దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు వెంకటేష్. -
శ్రియ కరెక్ట్ కాదు!
చెన్నై: దృశ్యం చిత్రంలో కథానాయకి పాత్రకు శ్రియ కరెక్ట్ కాదా..? అదే అంటున్నారు ఆ చిత్ర సృష్టికర్త మలయాళ సినీ దర్శకుడు జీతూ జోసఫ్. ఆయన మలయాళంలో దర్శకత్వం వహించిన చిత్రం దృశ్యం. మోహన్లాల్ హీరోగా నటించారు. ఆయనకు జంటగా నటి మీనా నటించారు. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకం. ముగ్గురు పిల్లల తల్లిగా పరిణితి చెందిన నటనను ప్రదర్శించి మెప్పించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. వెంకటేశ్ కథానాయకుడు. నాయిక మీనానే. అక్కడా దృశ్యం హిట్. కన్నడ,తమిళ భాషల్లోనూ పునర్నిర్మాణమై విజయతీరాలను చేరింది. పాపనాశం పేరుతో తమిళంలో విశ్వనాయకుడు కమలహాసన్ నటించారు. ఆయనకు జంటగా నటి గౌతమి నటించారు. సుదీర్ఘ విరామం తరువాత ఆమె రీఎంట్రీ అయిన చిత్రం పాపనాశం. మలయాళం చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్నే తమిళ చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఇలా దక్షిణాది భాషలన్నిటిలోనూ విజయం సాధించిన దృశ్యం చిత్రాన్ని అదే పేరుతో హిందిలో రీమేక్ చేశారు.అక్కడ కమలహాసన్ పాత్రలో అజయ్ దేవ్గన్ నటించారు. ఆయన సరసన నటి శ్రియ నటించారు. హిందీలో నిషీకాంత్ కామత్ దర్శకత్వం వహించారు. అయితే దక్షిణాది నాలుగు భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దృశ్యం చిత్రం బాలీవుడ్లో బోర్లా పడింది. కారణమేమిటన్న విషయాన్ని ఒరిజినల్ దృశ్యం చిత్ర దర్శకుడు జీతు జోసఫ్ వివరిస్తూ కథకు నప్పే నటీనటుల్ని ఎంపిక చేయడం చాలా ముఖ్యం అన్నారు. దృశ్యం చిత్రానికి మలయాళం, కన్నడం, తెలుగు, తమిళం భాషలో రూపొందించినప్పుడు సరైన తారాగణాన్నిఎంపిక చేసినట్లు అన్నారు. అయితే హిందీలో అలా జరగలేదని వ్యాఖ్యానించారు. నటి శ్రియ గురించే అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
వెంకి కోసం దర్శకుల క్యూ
దృశ్యం లాంటి బిగ్ హిట్ సాదించిన తరువాత కూడా విక్టరీ వెంకటేష్ ఇంత వరకు సినిమా ఎనౌన్స్ చేయలేదు. వరుసగా మూడు హిట్స్ సాదించిన ఈ సీనియర్ హీరో నెక్ట్స్ సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. వెంకీ ఒకే అనాలే గాని వెంటనే సినిమా స్టార్ట్ చేయడానికి చాలా మంది దర్శకులు క్యూలో ఉన్నారు. భలే భలే మొగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ సాదించిన మారుతి, ఈ మధ్యే వెంకటేష్కు ఓ కథ వినిపించాడు. డైనమైట్ సినిమాతో నిరాశపరిచిన దేవాకట్ట కూడా వెంకటేష్ లీడ్ రోల్లో ఎమోషనల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రాంతి మాధవ్ కథను ఓకె చేసిన వెంకీ మరింత డెవలప్ చేయమని చెప్పాడు. వీరితో పాటు రచయితలుగా సక్సెస్ అయిన ఆకుల శివ, వీరుపోట్ల కూడా వెంకీ హీరోగా ఓ మూవీని డైరెక్ట్ చేయటం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. యువ హీరోలు కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే వెంకీ డేట్స్ కోసం మాత్రం దర్శకులు క్యూ కడుతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, గోపాల గోపాల, దృశ్యం సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్లు సాదించిన వెంకటేష్తో సినిమా చేస్తే మినిమమ్ కలెక్షన్లు గ్యారెంటీ అని నమ్ముతున్నారు మేకర్స్. అంతేకాదు వెంకీ తో సినిమా అంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఉంది కనుక నిర్మాత సమస్య కూడా ఉండదన్న ఆలోచనలో ఉన్నారు దర్శకులు. -
యూపీ సీఎంకు బాలీవుడ్ హీరో థ్యాంక్స్
ముంబై: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ధన్యవాదాలు తెలిపారు. తన తాజా చిత్రం 'దృశ్యం'కు యూపీలో వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. 'యూపీ ప్రభుత్వానికి, సీఎం అఖిలేశ్ కు థ్యాంక్స్. అందరూ మా సినిమా చూసేందుకు మీ నిర్ణయం ఎంతోగానో దోహదపడుతోంది' అని అజయ్ దేవగణ్ ట్వీట్ చేశాడు. 'బజరంగీ భాయిజాన్' తో పాటు పలు చిత్రాలకు యూపీ ప్రభుత్వం వినోద పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. తేవార్, హమారీ ఆధురీ కహానీ, మసాన్, మిస్ తనక్ పూర్ హాజిర్ హో' సినిమాలకు వినోద పన్ను రద్దు చేసింది. -
'దృశ్యం అరుదైన సినిమా'
ముంబై: 'దృశ్యం' సినిమాకు వస్తున్న స్పందన పట్ల హీరో అజయ్ దేవగణ్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది అరుదైన చిత్రమని పేర్కొన్నాడు. 'దృశ్యం సినిమాకు వస్తున్న స్పందన పట్ల సంతృప్తిగా ఉన్నా. మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ అరుదైన సినిమాను నటుడిగా గౌరవిస్తా' అజయ్ దేవగణ్ ట్వీట్ చేశాడు. అన్ని భాషల్లోనూ విజయవంతం అయిన 'దృశ్యం' హిందీలోనూ విజయవంతంగా నడుస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రూ. 30.33 కోట్లు వారాంతపు వసూళ్లు సాధించింది. శ్రియా శరణ్, టబు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్ సాలగోంకర్ దర్శకత్వం వహించారు. వియకొమ్ 18, కుమార్ మాగ్నత్ నిర్మించారు. -
'దృశ్యం' చూడండి
న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటించిన 'దృశ్యం' చిత్రంపై న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల జల్లు కురిపించారు. 'దృశ్యం' తప్పక చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. ఆ చిత్రాన్ని ఆయన సోమవారం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు. 'నేను దృశ్యం చూశాను... తప్పక చూడాల్సిన చిత్రం అని' తన అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే హిందీ 'దృశ్యం' ఘన విజయం సాధించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆకాంక్షించారు. ఆ క్రమంలో హీరో అజయ్ దేవగన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్లో అమిత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దృశ్యం చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం విదితమే. నిశికాంత్ కామత్ దర్శకత్వంలో దృశ్యం చిత్రం హిందీలో రీమేక్ అయింది. దృశ్యం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన శ్రియ శరన్ నటించగా... టబూ పోలీసు అధికారిగా నటించారు. -
దేశాన్ని చుట్టేసిన దృశ్యం కధ
-
ఆల్మోస్ట్ అందరితో... ఆకర్షణలో పడ్డా!
దక్షిణాదిన సూపర్హిట్ సినిమాలతో తన సత్తా చాటుకున్న హీరోయిన్ శ్రీయ. ఇప్పుడు ఆమె బాలీవుడ్లోనూ తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్నారు. హిందీలో అజయ్ దేవ్గణ్, తబులతో కలసి ఆమె నటించిన ‘దృశ్యం’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సూపర్హిట్ కథతో కెరీర్కు కొత్త ఊపు వస్తుందని ఆశిస్తున్న ఈ కథక్ నర్తకిలో ఎన్నో భిన్నమైన కోణాలున్నాయి. తల్లిదండ్రులతో గాఢమైన అనుబంధమున్న ఈ యు.పి. అమ్మాయి అంధులతో ఏకంగా ఒక స్పా నిర్వహిస్తున్నారు. తల్లితండ్రుల గురించి, సినీరంగంలో సన్నిహితుల గురించి, మొత్తం అంధులతోనే తాను నడుపుతున్న స్పా గురించి ఈ అందగత్తె పంచుకున్న కబుర్లు... ఆమె మాటల్లోనే... నా కోసం మకాం మార్చారు! ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా మా అమ్మనే ప్రేమిస్తాను. నా కోసం ఆమె అన్నీ వదులుకుంది. భోరున వర్షం కురిసే వేళల్లో సైతం నేను డ్యాన్స్ క్లాస్కు వెళితే, ఆమె నాకు తోడుగా వచ్చేది. గజ్జెల రాపిడికి నా పాదాలు నెత్తురు చిమ్మితే, దగ్గరే ఉండి సేవ చేసేది. ఆమె తోడు లేకుండా నా ఎన్జీవోను గానీ, స్పాను గానీ నడపలేను. ఇంట్లో నేను తీరికగా గడిపే వేళల్లో కూడా మా అమ్మ ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే ఉంటుంది. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే అదంతా మా అమ్మ చలవే. మేము ఉత్తరప్రదేశ్కు చెందిన కాయస్థులం. నా పూర్తి పేరు శ్రీయా శరణ్ భట్నాగర్. మా నాన్న పుష్పీందర్ శరణ్ బీహెచ్ఈఎల్లో ఇంజనీర్గా పనిచేసేవారు. నేను పుట్టింది, పెరిగింది హరిద్వార్లోని బీహెచ్ఈఎల్లో. మా అమ్మ కూడా ఉద్యోగి. కెమిస్ట్రీ టీచర్. బీహెచ్ఈఎల్లోని ఆరుబయలు రంగస్థలం ‘ఝంకార్’లో ఇచ్చిన ప్రదర్శన ఫలితంగా నేను సినీ రంగంలోకి అడుగుపెట్టగలిగాను. నాకు కథక్ అంటే మహా పిచ్చ. ఢిల్లీలోని శోభనా నారాయణ్ వద్ద కథక్ నృత్యం నేర్చుకున్నాను. నేను డ్యాన్స నేర్చుకోవడం కోసం మా అమ్మ నాతో పాటే ఢిల్లీకి మకాం మార్చింది. మథుర రోడ్లోని ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. అక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరాను. పండారా రోడ్లోని డ్యాన్స్ క్లాస్ వద్దకు మా అమ్మ రోజూ నన్ను బండిలో దిగబెట్టేది. ఆ తరువాత కొన్నాళ్ళకు మా నాన్న గారు ఢిల్లీకి ట్రాన్సఫర్ చేయించుకొని వచ్చారు. డ్యాన్స్ నేర్చుకుంటున్నప్పుడు శోభనా దీదీతో కలసి దేశమంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. అలా సినిమాల్లోకి వచ్చా! ఒకసారి వారణాసికి చెందిన కొందరు మ్యూజిక్ వీడియో ఆల్బవ్ు రూపొందిస్తామంటూ శోభనా దీదీని కలుసుకున్నారు. అప్పుడామె వారికి నా పేరు సిఫారసు చేశారు. ఆ వీడియో చూసిన ఒక తెలుగు దర్శకుడు నాకు ఆఫర్ ఇవ్వడంతో మొదటిసారిగా తెలుగు సినిమాలో నటించాను. అయితే, నాగార్జునతో నటించిన ‘సంతోషం’ హిట్ కావడంతో నాకు బ్రేక్ వచ్చింది. అదే నా రెండో చిత్రం. తర్వాత ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాల్లో నటిస్తూ వచ్చాను. రజనీకాంత్తో తమిళంలో నటించిన ‘శివాజీ’ నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా భారీ హిట్. అలా వరుసగా నాకు నాలుగు దక్షిణాది భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నేను నాలుగు దక్షిణాది భాషలూ బాగా మాట్లాడగలను. హిందీ చిత్రాల్లోనూ అడపాదడపా నటిస్తున్నా. నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ నా కెరీర్లో బిగ్గెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ అంటే ‘దృశ్యవ్ు’ సినిమానే. అజయ్ దేవ్గణ్, తబులతో కలసి నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అన్ని భాషల్లో హిట్టయిన ఆ చిత్రకథ బాలీవుడ్లోనూ మంచి సక్సెస్ అవుతుందని భావిస్తున్నా. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు అజయ్ ఎంతో సహకరించారు. అలాగే, నేను అభిమానించే నటి తబు. ఆమెతో కలసి నటించడం నాకు మరపురాని అనుభవం. అంధులతో అనుబంధం.. అంధులే నిర్వహించే ఒక ప్రత్యేక స్పా నడుపుతున్నా. దీని వెనుక ఒక కారణం ఉంది. మథుర రోడ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒకసారి నేను బస్సు మిస్సయ్యా. స్కూల్ బస్సు ఆగే చోటుకు ఎదురుగానే అంధుల స్కూల్ ఉండేది. ఎప్పుడైనా అక్కడికి ఓసారి వెళ్లాలని మా అమ్మ నాతో చాలాసార్లు చెబుతూ ఉండేది. బస్సు మిస్సవడంతో ఆ రోజు రోడ్డు దాటి ఆ స్కూల్లో అడుగు పెట్టాను. స్కూలు ఆవరణలోని చెట్టు కింద కూర్చుని, అక్కడే ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ ఉంటే, వాళ్లలో ఒక పిల్లాడు నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. చేతులతో నా ముఖం తడిమి నేనెవరినో, ఎందుకు అక్కడకు వచ్చానో అడిగాడు. నేను బస్సు మిస్సయ్యానని చెబితే, ఒకటే నవ్వు మొదలుపెట్టాడు. ‘నేను అంధుణ్ణి.. నేనెప్పుడూ బస్సు మిస్సవలేదు. మరి నువ్వెలా బస్సు మిస్సయ్యావు?’ అని అడిగాడు. ఆ పిల్లాడి అమాయకత్వం నాకు నచ్చింది. అప్పటి నుంచి ఆ అంధుల స్కూల్తో అనుబంధం మొదలైంది. ఆ స్కూల్లో జరిగే దీపావళి వేడుకలకు హాజరయ్యేదాన్ని. సినిమాల్లో అవకాశాల కోసం ఢిల్లీ వదిలి, ముంబయ్ బయలుదేరినప్పుడే అనుకున్నాను... అంధుల కోసం ఏదైనా చేయాలని. ఒకసారి బ్యాంకాక్ షూటింగ్ వెళ్లి అక్కడే నెల్లాళ్లు ఉన్నప్పుడు నాతోనే వచ్చిన మా అమ్మ అక్కడ స్పా థెరపిస్టుగా బేసిక్ కోర్సు పూర్తి చేసింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ముంబయ్లో అంధుల కోసం స్పా థెరపిస్టు కోర్సు ఉన్నట్లు తెలుసుకున్నాం. దాంతో పూర్తిగా అంధులతోనే స్పా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. రెండు గదులలో ‘స్పందన’ పేరిట స్పా ఏర్పాటు చేశాం. మా స్పాలోని థెరపిస్టులందరూ చూపు లేనివారే. అయినా, వాళ్లు తమంతట తామే రోజూ స్పాకు వస్తారు. క్రమం తప్పకుండా విధులు నిర్వర్తించుకుని, తిరిగి తమ తమ ఇళ్లకు వెళతారు. క్యాష్ కౌంటర్ దగ్గర పనిచేసే అమ్మాయికి డెబ్భై శాతం చూపు లేదు. అయినా, చేతులతో తడిమి కరెన్సీ నోట్లను గుర్తించడం, లెక్కపెట్టడం బ్రహ్మాండంగా చేయగలదు. ఈ స్పా నడపడం చాలా కష్టమే. అయినా సరే, దీన్ని ఎప్పటికీ ఆపకూడదనుకుంటున్నా. నన్నడిగితే, పక్కవాళ్ళను చూసి జాలిపడడం కన్నా, ప్రేమ చూపాలి. అందుకే నన్నడిగితే పక్కవాళ్ళతో పోటీపడి మార్కులు తెచ్చుకోవడమే నేర్పే మన స్కూళ్ళలో ‘కమ్యూనిటీ సర్వీస్’ గురించి పిల్లలకు చెప్పాలి. నాగ్... నాకు చాలా స్పెషల్! సినీరంగంలో నాగార్జున నాకు చాలా స్పెషల్. హి ఈజ్ స్వీట్హార్ట. కొత్తగా అడుగుపెట్టిన నాకు ‘సంతోషం’లో ఛాన్సిచ్చారు. ఆయన ఇంటి తలుపులెప్పుడూ నాకు తెరిచే ఉంటాయి. ఆయన భార్య అమల నాకు మంచి స్నేహితురాలు. ఆమె వల్లే ‘విపాసన’ ధ్యానం నేర్చుకున్నా. ఖాళీ దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తా. నాగార్జున అబ్బాయిలిద్దరూ కూడా నాకు బాగా తెలుసు. ఒంటరిగా వెళితే... పుకార్లు పుట్టించారు డేటింగ్ లాంటి విషయాల్లో నేను చాలా పాతకాలపుదాన్ని. సినిమాకు తీసుకెళ్ళి, డిన్నర్కు తీసుకెళ్ళాలని కోరుకొనే రకాన్ని. నాకు ఎలాంటి డేటింగ్ వ్యవహారాలూ లేవు. ఆ మధ్య నేను ‘విపాసన’ ధ్యానం చేయడానికీ, స్క్యూబా డైవింగ్ నేర్చుకోవడానికీ అండమాన్ దీవులకు ఒంటరిగా వెళ్ళా. మా అమ్మానాన్నకు చెప్పి మరీ వెళ్ళా. కానీ, నా మీద ఏవేవో పుకార్లు పుట్టించారు. ప్రత్యేకించి ఎవరితోనూ డేటింగ్ చేయలేదు కానీ, నిజం చెప్పాలంటే దాదాపు నాతో నటించిన నటులందరితోనూ ఆకర్షణలో పడ్డా. అయితే, ఆకర్షణ వేరు... ప్రేమ వేరు. ప్రేమలో పడడం అంత తేలికైన విషయం కాదని నమ్ముతా. ఇక పెళ్ళి అంటారా? చేసుకోవాలనే అనుకుంటున్నా. తగిన సమయం వస్తే అదే అవుతుంది. నేను పెళ్ళి చేసుకొనేవాడు స్నేహశీలి అయ్యుండాలి. మానసికంగా, ఆధ్యాత్మికంగా, భావోద్వేగ పరంగా నా ఎదుగుదలకు దోహదపడేవాడై ఉండాలి. -
సినిమా బంపర్...మా నాన్న సూపర్!
‘‘ఎవరి సినిమా వాళ్లకు ముద్దు. ఒకవేళ నా సినిమా విడుదలైన రోజున నాన్న నటించిన సినిమా విడుదలైతే, ముందు నా సినిమా చూస్తా.. ఆ తర్వాత నాన్న సినిమా చూస్తా’’ అని ఆ మధ్య ఓ సందర్భంలో శ్రుతీహాసన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కమల్ కూడా అలానే అంటారు. ఈ తండ్రీ కూతుళ్లు అంత ప్రొఫెషనల్గా ఉంటారు. కానీ, ఒకరి సినిమాను ఇంకొకరు చూసి, బాగుంటే అభినందించుకుంటారు. ఇప్పుడు శ్రుతి అదే చేశారు. మలయాళ ‘దృశ్యమ్’ తమిళ రీమేక్ ‘పాపనాశమ్’లో కమలహాసన్, గౌతమి భార్యాభర్తలుగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలతో విజయ విహారం చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రుతి చూశారు. ‘‘అద్భుతమైన సినిమా. మొత్తం టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. మా నాన్నని చూస్తే గర్వంగా ఉంది’’ అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అంతే కాదు.. ముంబయ్లో తన స్నేహితులకి ప్రత్యేకంగా ఓ షో ఏర్పాటు చేసి, ఈ చిత్రాన్ని చూపించాలనుకుంటున్నారామె. ఎంతైనా నాన్నంటే అమ్మడికి ఎంత ప్రేమో! -
దృశ్యంపైనే ఆశలు
శ్రీయ మంచి నటి. నోడౌట్ ఎబౌట్ ఇట్. కథానాయికగా దశాబ్దం దాటి ఏలారు. స్టిల్ షీఈజ్ హీరోయిన్. అయితే అంత డిమాండ్ లేకపోవచ్చు. అలాగని అవకాశాలే లేవనడం సరి కాదు. దక్షిణాదిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్స్టార్ రజినీకాంత్ నుంచి యువహీరోలందరితోనూ నటించిన ఘనత శ్రీయది. ‘జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. నా కేరీర్లో సూపర్ డూపర్ హిట్స్, డిజాస్టర్స్ చూశాను. అయినా నాకు దేవుని దయ ఉంది. అందుకే ఇంకా అవకాశాలు వస్తున్నాయి’ అంటున్న శ్రీయకు తమిళం, తెలుగు భాషల్లో చిత్రాలు లేకపోయినా, ప్రస్తుతం దృశ్యం హిందీ రీమేక్లో నటిస్తున్నారు. ఈమె హిందీలో ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే అవేవీ తన కేరీర్కు అంతగా హెల్ప్ అవ్వలేదు. అయితే దృశ్యం చిత్రం విజయంపై చాలా నమ్మకం ఉందంటున్నారు. ఆమె నమ్మకానికి కారణం లేక పోలేదు. మలయాళంలో తెరకెక్కిన దృశ్యం చిత్రం విశేష విజయాన్ని సాధించింది. అది అక్కడితో ఆగలేదు. తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో పునర్నిర్మాణం అయ్యి మంచి విజయం పొందింది. అలా మలయాళం, తెలుగు భాష ల్లో మీనా, తమిళంలో గౌతమి నటించి మెప్పించి పాత్రను హిందీలో శ్రీయ పోషిస్తున్నారు. అజయ్దేవగన్ కథనాయకుడు. ఇందులో పిల్లల తల్లిగా నటించడం గురించి శ్రీయ స్పందిస్తూ అమ్మగా నటించడం నాకిష్టం. పైగా సులభం కూడా. అజయ్దేవగన్ చాలా స్పీట్ పర్సన్. ఇందు లో ముఖ్య పాత్ర పోషిస్తున్న నటి టబుతో నేనింతకుముందు కూడా కలిసి నటించాను. దృశ్యం హిందీలో నూ మంచి సక్సెస్ కావడం తధ్యం అని శ్రీయ దృఢ నమ్మ కం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక వెరైటీ కావాలి!
సీరియస్ పాత్రలంటే టబు చేయాల్సిందే అన్నట్లుగా ఉంది హిందీ రంగంలో. డేవిడ్, జయహో, హైదర్... వంటి చిత్రాల్లో సీరియస్ రోల్స్ చేసిన టబు త్వరలో విడుదల కానున్న ‘దృశ్యం’లో పోలీసాఫీసర్గా చేశారు. ఇది కూడా సీరియస్ క్యారెక్టరే. ఇవి నటనకు అవకాశం ఉన్న పాత్ర లైనప్పటికీ ఇలా వరుసగా ఒకే తరహా పాత్రలు చేయడం టబూకి విసుగ్గా ఉందట. ఈ విషయం గురించి ఆమె చెబుతూ -‘‘కొన్నేళ్లుగా నేను సీరియస్ పాత్రలకే పరిమితమైపోయాను. ఇలాంటి పాత్రలంటే చాలు దర్శక, నిర్మాతలు నన్ను సంప్రతిస్తున్నారు. అలా కాకుండా, వేరే వైవిధ్యమైన పాత్రలు కూడా ఇస్తే బాగుంటుంది. నాలో ఉన్న నటిని ఇంకెంత వైవిధ్యంగా చూపించవచ్చు అనే అంశం మీద దృష్టి పెడితే రొటీన్ పాత్రల నుంచి నాకు రిలీఫ్ దక్కుతుంది’’ అన్నారు. -
ఒక్కసారి డిసైడ్ అయితే రెండోసారి ఆలోచించను!
‘‘జయాపజయాలు సహజం. వాటిని ఎంత తేలికగా తీసుకోగలిగితే అంత మంచిది. లేకపోతే టెన్షన్ తప్పదు’’ అని శ్రీయ అంటున్నారు. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ స్థానం సంపాదించుకోగలిగిన శ్రీయ తన మాతృభాష హిందీలో మాత్రం ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయారు. ఇప్పటివరకూ హిందీలో ఆమె పది సినిమాల వరకూ చేశారు. అవేవీ బాలీవుడ్లో శ్రీయకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. తాజాగా మలయాళ ‘దృశ్యం’ హిందీ రీమేక్లో నటించారామె. ‘దృశ్యం’ పేరుతోనే రూపొందిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్రం మీకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉందా? అనే ప్రశ్న శ్రీయ ముందుంచితే - ‘‘నేనెప్పుడూ ఈ సినిమా మనకు బ్రేక్ అవుతుందని లెక్కలేసుకుని చేయలేదు. కథ, నా పాత్ర బాగున్న సినిమాలు చేశాను. హిందీలో ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలేవీ నాకు వర్కవుట్ కాలేదు. ఆ విషయం ఒప్పుకుంటాను. అలాగని, సౌత్లో నేను చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ కాలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా నాకు ఇప్పటికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాక రెండోసారి ఆలోచించకుండా ఒప్పేసుకుంటా. ‘దృశ్యం’ నాకు మంచి అనుభూతినిచ్చింది. ఇందులో సాదాసీదా గృహిణిగా నటించాను. డిజైనర్ శారీస్ కాకుండా.. మామూలు చీరలు కట్టుకున్నాను. నా రియల్ లైఫ్కి, ఇప్పటివరకు రీల్ లైఫ్లో చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉన్న పాత్ర ఇది. ఆత్మసంతృప్తినిచ్చిన పాత్ర కూడా’’ అని చెప్పారు. -
ఆయన అడిగితే అతిథి పాత్రకైనా రెడీ!
‘‘నా జీవితంలో అజయ్ దేవగన్ చాలా స్పెషల్. ఎందుకంటే నేను, అజయ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అతనితో నాకెంతో సాన్నిహిత్యం ఉంది’’ అని కథానాయిక టబు అంటున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘విజయ్పథ్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందని టబు అన్నారు. కానీ, ఆ తర్వాత అజయ్, టబు కలిసి సినిమా చేయలేదు. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు అజయ్ దేవగన్తో కలిసి మలయాళ ‘దృశ్యం’ రీమేక్లో నటించారు టబు. దీని గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘మా కజిన్, అజయ్, నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. నేను అజయ్ను ‘వీడీ’ అని పిలుస్తా. అజయ్ అడిగితే అతిథి పాత్ర చేయడానికి కూడా నేను రెడీ’’ అన్నారు. ఈ పద్ధెనిమిదేళ్లల్లో తామిద్దరం కలిసి నటించకపోవడం ఆశ్యర్యంగా ఉందని టబు చెబుతూ - ‘‘సినిమాలు మేమిద్దరం కలిసి నటించకపోయినా అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం. పార్టీల్లో అయితే మా ఇద్దరి అల్లరికి అంతే ఉండదు. సరదాగా ఆటపట్టించుకుంటూ ఉంటాం’’ అన్నారు. -
ఆ రెండు సీన్ల గురించే రజనీ వద్దన్నారట
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దృశ్యం సినిమాలో నటించడానికి రెండు సీన్ల కారణంగానే వద్దన్నారట. మలయాళంలో ఘనవిజయం సాధించిన దృశ్యం సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనుకున్న దర్శకుడు జీతూజోసెఫ్ రజనీకాంత్ను సంప్రదించారు. అయితే సినిమాలో హీరోను, హీరో కుటుంబాన్ని పోలీసులు బాగా హింసించే దృశ్యాలు, క్లైమాక్స్ సీన్ గురించి రజనీకాంత్ జోసెఫ్ ఆఫర్ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ముందు కథ విన్నపుడు ఆయనకు బాగా నచ్చిందనీ, చాలా సంతోషించారనీ జోసెఫ్ తెలిపారు. కానీ తనను బాగా కొట్టడం చూస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరని, ఫ్యాన్స్ దీన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోరని రజనీ అభిప్రాయాపడినట్టు దర్శకుడు చెప్పుకొచ్చారు. రజనీ సార్ చెప్పినదానికి తాను కన్విన్స్ అయ్యానన్నారు. మరో స్రిప్ట్తో మళ్లీ కలుస్తానని చెప్పి వచ్చేశానని జోసెఫ్ తెలిపారు. కాగా ఈ సినిమాను తమిళంలో కమల్ హాసన్, గౌతమి జంటగా పాపనాశం పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. -
హిందీ 'దృశ్యం'లో టబు
న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం 'హైదర్'లో తల్లి పాత్ర పోషించి ప్రశంసలందుకున్న ప్రముఖ నటి టబు ఈ సారి విభిన్నపాత్ర పోషిస్తున్నారు. టబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపించనున్నారు. తెలుగులో వచ్చిన దృశ్యం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు దృశ్యంలో నదియా పోషించిన పాత్రను హిందీలో ఐజీ మీరా దేశ్ముఖ్గా టబు నటిస్తున్నారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. -
మరో అమ్మ పాత్ర?
‘మనం’, ‘గోపాల గోపాల’ చిత్రాల్లో గృహిణి పాత్రల్లో మెప్పించిన శ్రీయ తాజాగా మరో గృహిణి పాత్రను అంగీకరించారని సమాచారం. అయితే, ఈసారి హిందీలో రీమేక్ కానున్న ‘దృశ్యం’లో. మలయాళ హిట్ ‘దృశ్యం’ తెలుగు, కన్నడ భాషల్లో ఇప్పటికే పునర్నిర్మితమైంది. తమిళంలో కమలహాసన్, గౌతమి జంటగా రూపొందుతోంది. ఇప్పుడు ఇదే కథ హిందీలో అజయ్ దేవగణ్ కథానాయకునిగా రీమేకవుతోంది. ఇందులోనే శ్రీయను అడిగారట. -
దృశ్యం రిమేక్లో అజయ్దేవగన్
-
‘పాపనాశమ్’లో కమల్ హాసన్
తొండుపుజ్హా(కేరళ): విలక్షణ నటుడు కమల్ హాసన్ మళ్లీ ‘పాపనాశమ్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కేరళలో జరుగుతున్న షూటింగ్ లో కమల్ హాసన్ శుక్రవారం నుంచి పాల్గొంటారని ఆయన మేనేజర్ ట్వీట్ చేశారు. కొద్దిగా విరామం తర్వాత ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలిపారు. అనారోగ్యం కారణంగా కమల్ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. మలయాళ 'దృశ్యం' తెరకెక్కించిన ఇంట్లోనే షూటింగ్ జరుపుతున్నారు. ఈ ఇల్లును తమిళ నేపథ్యానికి అనుగుణంగా మార్చారు. అయితే సీన్లు వేరేగా ఉంటాయంటున్నారు. మలయాళంలో మోహన్లాల్ నటించిన 'దృశ్యం' ఈ చిత్రానికి మాతృక. పాపనాశమ్ లో కమల్ సరసన గౌతమి నటిస్తోంది. మాతృక దర్శకుడైన జీతూ జోసఫ్ ఈ తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
‘పాపనాశం’ మూవీ న్యూ స్టిల్స్
-
'దృశ్యం' కోసం.. భాష నేర్చుకుంటున్న కమల్
నటన విషయంలో తాను నిత్య విద్యార్థినని చెప్పుకొంటుంటారు సకల కళా వల్లభుడు కమల్ హాసన్. ఆ విషయం ఏదో చెప్పి ఊరుకోవడం వేరు.. నిజంగా ఆచరించడం వేరు. అలా ఆచరించేవాళ్లలో ముందుంటారు కమల్. ఇప్పుడు తాను తాజాగా నటిస్తున్న 'దృశ్యం' తమిళ రీమేక్ 'పాపనాశం' కోసం ఇప్పుడు కొత్తగా తిరునల్వేలి యాసను ఆయన నేర్చుకుంటున్నారు. మళయాళం, కన్నడ, తెలుగు భాషల్లో హిట్టయిన దృశ్యం సినిమాను తమిళంలో కమల్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొంత భాగంలో కమల్ హాసన్ తిరునల్వేలి యాస మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆయన తన సినిమాల్లో ఎప్పుడూ ఈ యాస మాట్లాడలేదు. దాంతో.. ఇప్పుడు కొత్తగా రచయిత సుగ దగ్గర ఆ యాసలో శిక్షణ పొందుతున్నాడని మరో రచయిత జయమోహన్ తెలిపారు. ఈ సినిమాకు డైలాగులు రాసింది జయమోహనే. ఈ సినిమాలో.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ గౌతమి నటిస్తోంది. -
పాపనాశం
ముచ్చటగా ఉండే ఇద్దరు కూతుళ్లు, మనసెరిగి నడుచుకునే భార్యతో అతగాడి జీవితం సాఫీగా సాగుతుంటుంది. కానీ, పెద్ద కూతురి జీవితంలో రేగిన కలకలంతో ఆ కుటుంబం ఎలా తల్లడిల్లిందనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. ఏ భాషకైనా నప్పే కథతో రూపొందిన ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా పునర్నిర్మితమై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళంలో ఈ చిత్రం కమల్హాసన్ కథానాయకునిగా పునర్నిర్మితం కానుంది. మరో వారంలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మలయాళ, తెలుగు భాషల్లో మీనా చేసిన పాత్రను నటి, కమల్హాసన్ ఆప్తమిత్రురాలు గౌతమి చేస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్ తమిళ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తారు. మలయాళ టైటిల్ని తెలుగులో యథాతథంగా ఉంచేశారు. కానీ, తమిళంలో ‘దృశ్యం’ కాదట.. ‘పాపనాశం’ అనే టైటిల్ ఖరారు చేశారని కోలీవుడ్ టాక్. -
తమిళ దృశ్యానికి చిక్కులు
-
తమిళ దృశ్యానికి సినిమా కష్టాలు
-
తమిళ దృశ్యానికి సినిమా కష్టాలు
మళయాళం, కన్నడం, తెలుగు భాషల్లో భారీగా హిట్టయిన చిన్న సినిమా 'దృశ్యం' ఇప్పుడు సరికొత్త చిక్కులు ఎదుర్కొంటోంది. ఈ సినిమాను తమిళంలో తీయాలని సుప్రసిద్ధ నటుడు కమల్హాసన్ భావించారు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని, ఆగస్టు మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని భావించారు. 'ఎర్ర గులాబీలు', 'వసంత కోకిల' లాంటి చిత్రాల్లో హిట్ పెయిర్గా నటించిన కమల్హాసన్, శ్రీదేవి ఈ సినిమాలో కూడా ఉంటున్నారు. కానీ శ్రీదేవి మాత్రం ఈ చిత్రంలో కమల్ సరసన హీరోయిన్గా కాకుండా.. తెలుగులో నదియా పోషించిన పోలీసు ఆఫీసర్ పాత్ర పోషించబోతోందని సమాచారం. మలయాళం సినిమాకి దర్శకత్వం వహించన జీతూ జోసెఫ్ ఈ తమిళ వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. తెలుగులో ఈ సినిమాకు శ్రీ ప్రియ దర్శకత్వం వహించారు.అయితే ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇతర టెక్నీషియన్లు, తారాగణం ఎంపిక జరగవలసి ఉంది. ఈ సినిమాను రాజ్ కుమార్ థియటర్స్ మరియు వైడ్ యాంగిల్ క్రియేషన్స్ వారు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం ఘిబ్రన్ అందిస్తున్నారు. అయితే, మళయాళంలో తీసిన మాతృక గురించి బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కోర్టుకెక్కింది. తాను కొన్న జపాన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇందులో కాపీ చేశారంటూ మళయాళ చిత్ర రచయిత, నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపింది. ఈ వివాదం సమసిపోకుండానే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ కథ తనదని, తాను రాసిన 'ఒరు మజకళాటు' నవలను కాపీ చేశారని ఆరోపిస్తూ.. మలయాళ రచయిత సతీష్ పాల్ కోర్టుకి ఎక్కాడు. దీంతో ఈ సినిమా తమిళ వెర్షన్ షూటింగ్ నిలుపుదల చేయాలంటూ ఎర్నాకుళం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దృశ్యం చిత్రం సక్సెస్ మీట్
-
మాకూ కథలు రాయండి
సీనియర్ హీరోలకు దర్శకుల కథలు తయారు చేయూలని పద్మభూషణ్ కమల్ హాసన్ కోరారు. దీనిపై ఆయన ప్రస్తావిస్తూ ఇప్పుడొస్తున్న దర్శకులు యువ హీరోలను దృష్టిలో పెట్టుకునే కథలు సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. అలాంటి విధానం సరైనది కాదన్నారు. తన లాంటి సీనియర్ హీరోలకు కథలు సిద్ధం చేయూలని పేర్కొన్నారు. అప్పుడే వైవిధ్యభరిత చిత్రాల్లో వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అర్థవంతమయిన చిత్రాలు, అవార్డు చిత్రాలు తెరకెక్కుతాయన్నారు. ఈ విషయంలో భాగంగా అమితాబ్ బచ్చన్ చాలా లక్కీ అన్నారు. బాలీవుడ్లో ఇప్పటికే ఆయన కోసమనే కథలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన కోసమే చిత్రాలు ఆడుతున్నాయని పేర్కొన్నారు. తానీ వయసులో చెట్లు, పుట్ల చుట్టు తిరుగుతూ డ్యూయెట్లు పాడటం బాగుండదన్నారు. వయసుకు తగ్గ పాత్రలే చేయూలని చెప్పారు. ప్రస్తుతం విశ్వరూపం-2, ఉత్తమ విలన్, దృశ్యం రీమేక్ లాంటి చిత్రాల్లో తన వయసుకు తగ్గ పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. కమల్ పెద్ద కూతురు శ్రుతిహాసన్ ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. తండ్రి బాటలోనే పయనిస్తూ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మొదలగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా, పేరు తెచ్చుకుంటున్నారు. ఇక రెండో కూతురు అక్షర కూడా హీరోయిన్గా తెరంగేట్రం చేశారు. ఆమె తొలి చిత్రం గురించి కమల్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అక్షర గురించి తన భావాలను వ్యక్తం చేస్తూ నటన గురించి తనకు ఎలాంటి సూచనలు, సలహాలు అవసరం లేదన్నారు. ఎందుకంటే అక్షర బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బాల్కీ లాంటి సేఫ్ హ్యాండ్లో ఉందని చెప్పారు. నిజం చెప్పాలంటే పాత తరం వారి అడ్వైజ్ ఆమెకు అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో తన కుమార్తెకు తెలుసని, తన సహాయం కోరి ఎప్పుడు రాదని కూడా పేర్కొన్నారు. అక్షరలోను ఆత్మవిశ్వాసం మెండుగా ఉందని చెప్పారు. అక్షర రంగ ప్రవేశం చేస్తున్న హిందీ చిత్రం షమితాబ్లో ధనుష్ హీరోగా, అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమికను పోషిస్తున్నారు. -
కమల్ దృశ్యం ఆవిష్కరణకు వేళాయే!
చూసే దృశ్యం ఏదైనా కనువిందు చేస్తే ఆహా ఎంత బాగుంది అని అనకుండా ఉండలేం. ప్రస్తుతం దృశ్యం చిత్రం కూడా. సినీ ప్రియులకు అలాంటి అనుభూతినే కలిగిస్తోంది. దక్షిణాదిలోని మలయాళం, కన్నడం, తెలుగు భాషల సినీ అభిమానులను విపరీతంగా అలరించిన ఁదృశ్యం* చిత్రం నాలుగో భాష అయిన తమిళ సినీ ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అవుతోంది. దీనికు ప్రఖ్యాత నటుడు పద్మభూషణ్ కమలహాసన్ ప్రధాన రూపం కానున్నారు. ఉత్తమ విలన్ చిత్రానికి తుది రూపం ఇస్తున్న కమలహాసన్ తదుపరి ఁదృశ్యం* ఆవిష్కరణకు సిద్ధం అవుతున్నారు. వైట్ ఆంగిల్ క్రియేషన్స్, రాజ్కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల చెన్నైలో జరిగాయి. చిత్ర షూటింగ్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించారుు. ఒరిజినల్ చిత్రం మలయాళంలో ఁదృశ్యం*ను తెరకెక్కించిన జీతు జోసఫ్కే తమిళంలోను దర్శకత్వం వహించనున్నారు. రచయిత జయమోహన్ సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర పాటల రికార్డింగ్ మొదలైంది. ఈ చిత్రంలో కమల్ ఇద్దరు పిల్లల తండ్రిగా నటించనున్నారు. తల్లిగా నటి గౌతమి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర ఇతర తారాగణం ఎంపిక జరుగుతోందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. -
ఆగస్టు నుంచి 'దృశ్యం' సినిమా షూటింగ్
మళయాళం, కన్నడంతో పాటు తెలుగులో కూడా హిట్టయిన 'దృశ్యం' చిత్రం మరోసారి షూటింగ్ జరుపుకోబోతోంది. విభిన్న చిత్రాలకు ఎప్పుడూ పెద్దపీట వేసే కమల్ హాసన్ ఈ సినిమాను తమిళంలో తీస్తున్నారు. ఈ షూటింగ్ ఆగస్టు తొలి వారం నుంచి ప్రారంభం అవుతోంది. తెలుగు, మళయాళం రెండు భాషల్లోనూ హీరోయిన్గా చేసిన మీనానే తమిళంలోకి కూడా తీసుకున్నారు. కమల్తో పాటు చిత్రానికి సంబంధించిన మరికొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఈ షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆగస్టు తొలివారం నుంచి మొదలవుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. మళయాళం సినిమాలో ప్రధానపాత్ర పోషించిన జీతు జోసెఫ్ తమిళ సినిమాలోనూ చేస్తున్నారు. సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. విశ్వరూపం2, ఉత్తమవిలన్ చిత్రాల తర్వాత కమల్తో ఆయన చేస్తున్న మూడో సినిమా దృశ్యం అవుతుంది. -
‘దృశ్యం’ ప్రీమియర్ షో
-
పరిస్థితుల్ని బట్టి పరిశ్రమ ఎక్కడికైనా వెళ్లొచ్చు!
‘‘సినీ పరిశ్రమ హైదరాబాద్లోనే స్థిరంగా, శాశ్వతంగా ఉంటుందని భావించడానికి వీల్లేదు. పరిస్థితుల్ని బట్టి ఎక్కడికైనా తరలివెళ్లొచ్చు’’ అని నిర్మాత డి.సురేశ్బాబు సంచలన వాఖ్యలు చేశారు. వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘దృశ్యం’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం సురేశ్ విలేకరులతో ముచ్చటించారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో సినీపరిశ్రమ స్థితిగతుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సురేశ్. వాటిపైనే చిత్రసీమ పయనం ఆధారపడి ఉంది: ప్రతిభావంతులైన యువతరం సినీ పరిశ్రమలోకి వస్తున్న నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో సినీ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. తెలుగు సినిమా ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి కానుంది. హైదరాబాద్తో పాటు విజయవాడ, వైజాగ్, తడ ప్రాంతాలు సినిమా పరిశ్రమకు నివాసం కానున్నాయి. అయితే... రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు తెలుగు సినిమాకు ప్రకటించే రాయితీలు, సౌకర్యాల కల్పన, చిత్రీకరణ సౌలభ్యాలపైనే... చిత్రసీమ పయనం ఆధారపడి ఉంటుందిఆ మూడు ప్రాంతాల నుంచే ప్రధాన కార్యకలాపాలు: ప్రస్తుతం సినిమాలకు ల్యాబ్లతో పని లేదు. డిజిటల్ యుగం వచ్చేసింది. ల్యాప్ట్యాప్లోనే ఎడిటింగ్ చేసేసుకోవచ్చు. కాస్తంత సదుపాయాలు ఏర్పరచుకుంటే... ఇంట్లోనే డబ్బింగ్, రీ-రికార్డింగ్, రికార్డింగ్ చేసుకోవచ్చు. అంతగా అభివృద్ధి చెందింది టెక్నాలజీ. ఈ కారణంగా ఎక్కడ నుంచైనా సినిమాలను నిర్మించవచ్చు. అయితే... సినీ పరిశ్రమ ఎంతగా విస్తరించినా... ప్రధానంగా మద్రాస్, వైజాగ్, హైదరాబాద్ల నుంచే కార్యకలాపాల నిర్వహణ జరుగుతుంది. అక్కడ ఈ ఇబ్బందులు లేవు: సినీ నిర్మాణ పరంగా హైదరాబాద్లో అంతర్జాతీయ సౌకర్యాలున్నాయి కానీ... ఐడియాలే లేవు. తెలుగు సినిమా పరిధిలోనే ఆలోచనలు ఉంటున్నాయి. దాన్ని విస్తృతపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అవుడ్డోర్ సీన్స్ తీయడం తలకు మించిన పని. పోలీసులకు డబ్బులు కట్టుకోవాలి. పైగా జనాల తాకిడి. అమలాపురం, పాలకొల్లు, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో అయితే ఈ బాధలే లేవు. చక్కగా షూటింగ్ చేసుకోవచ్చు. గోదావరి జిల్లాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ‘ఉయ్యాలా జంపాల’ సినిమా తీసేశాం. అలా విమర్శించడం తగదు: మంచి సినిమాలు తీస్తే డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ తీసుకోవడానికి ముందుకొస్తారు. అంతేకానీ ఏది పడితే అది తీసి, మాకు థియేటర్లు దొరకడం లేదంటే ఎలా? ముందు పంపిణీదారుల నుంచి, థియేటర్ యాజమాన్యం నుంచీ సినిమాపై డిమాండ్ను సృష్టించుకోవాలి. ఆ దిశగా ఆలోచించకుండా ‘పరిశ్రమ ఆ నలుగురి చేతుల్లోనే ఉంద’ని విమర్శించడం తగదు. ఇక్కడ మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా థియేటర్లు కొందరి చేతుల్లోనే ఉన్నాయి. బాలీవుడ్లో సైతం కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలే థియేటర్లను నడిపిస్తున్నాయి. చట్టానికి కట్టుబడి ఎలాంటి వ్యాపారం చేసినా తప్పు కాదు. అది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. ఓ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడం తేలికైన విషయం కాదు. ఒక్క సురేశ్ ప్రొడక్షన్స్కే సినీరంగంలో 50ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి బిజినెస్ చేస్తే తప్పు ఎలా అవుతుంది? ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. -
దృశ్యం మూవీ పోస్టర్స్, స్టిల్స్
-
నేనా... విలన్గానా : వెంకటేశ్
వెంకటేశ్ లవ్, యాక్షన్, మాస్ తరహా సినిమాలు ఎన్ని చేసినా, ‘కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్’ అనే ఇమేజ్ ఆయనకు స్థిరపడిపోయింది. తాజాగా ఆయన చేసిన ‘దృశ్యం’ థ్రిల్లర్ మిళితమైన పక్కా కుటుంబ కథ. ఈ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఇలాంటి కొత్త తరహా కథలు ఎప్పుడో కానీ దొరకవు. అందుకే ఈ అవకాశాన్ని వదిలిపెట్టలేదు’’ అంటోన్న వెంకటేశ్తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. టాప్ టూ బాటమ్ బ్రాండెడ్ దుస్తులు, చెప్పులూ వేసుకునే మీరు రాంబాబు (‘దృశ్యం’లో వెంకటేశ్ పాత్ర పేరు) కోసం కాటన్ ప్యాంట్లు, షర్టులు వేసుకోవడం ఎలా అనిపించింది? నేనెక్కువగా జీన్స్ ప్యాంట్లు వేసుకుంటాను. ఈ మధ్య కాలంలో అయితే దాదాపు అవే వాడుతున్నాను. కాటన్ ప్యాంట్లేసుకుని చాలా రోజులైపోయింది. చివరిసారిగా కాటన్ ప్యాంట్స్ ఎప్పుడు వేసుకున్నానో గుర్తు లేదు. కాబట్టి, నాకు నేనే కొత్తగా అనిపించాను. ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుందనే నమ్మకంతోనే ఈ పాత్ర చేశాను. మలయాళ ‘దృశ్యం’లో మీకు ఏయే సన్నివేశాలు నచ్చి, ఈ రీమేక్ అంగీకరించారు? రాంబాబుది ఆనందమైన కుటుంబం. ఆ ఆనందాన్ని ఓ పది, పదిహేను నిమిషాలు ఆస్వాదిస్తాం. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలకు కనురెప్ప వాల్చడం మర్చిపోతాం. ఇది కథ కాదు.. నిజంగా జరుగుతుందేమో అనుకుంటాం. మొత్తం కథ నచ్చి, ఈ సినిమా ఒప్పుకున్నాను. టీనేజ్ అమ్మాయికి తండ్రిగా చేయాలంటే వెంటనే ‘ఓకే’ చెప్పేశారా? ఈ కథ కాకుండా వేరే కథల్లో టీనేజ్ గాళ్కి ఫాదర్ అంటే అంత బాగుండదు. రెగ్యులర్ సినిమాల్లో నేనీ పాత్ర చేస్తే ‘అవసరమా నీకు’ అనడానికి చాలామంది ఉన్నారు. కానీ, ఈ సినిమా వరకూ ఈ పాత్ర వంద శాతం బాగుంటుంది. ఒకవేళ రొటీన్ సినిమాలైతే, ఇలా టీనేజ్ గాళ్ ఫాదర్ పాత్రలను చాలా వరకు తప్పించడానికే ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో నేను ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. ‘గోపాల.. గోపాల’లో కూడా నాకో కొడుకు ఉంటాడు. తండ్రి పాత్రలు చేయడం నాకేం అభ్యంతరం కాదు. కానీ, అన్ని సినిమాల్లోనూ నాకు పిల్లలుండాలని అనుకోవడం లేదు (నవ్వుతూ). మీరిప్పటివరకు ఎన్నో రీమేక్ చిత్రాల్లో నటించినా, ఓ మలయాళ రీమేక్లో నటించడం మాత్రం ఇదే తొలిసారి కదా? అవును. అది కూడా మోహన్లాల్ వంటి మంచి నటుడు చేసిన పాత్ర చేయడం అంటే అంత సులువు కాదు. మోహన్లాల్ అద్భుతమైన నటుడు. ఆయన బాడీ లాంగ్వేజ్, వాయిస్ అన్నీ బాగుంటాయి. ఆయన చేసిన ఇతర సినిమాలైతే నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. కానీ, ఈ సినిమాలో మోహన్లాల్ చేసిన పాత్రలో నేను బ్రహ్మాండంగా ఒదిగిపోగలుగుతాననే నమ్మకం కలిగింది. అందుకే చేశాను. ఈ చిత్రం చేయాలనుకున్న తర్వాత మోహన్లాల్తో మాట్లాడాను. ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ‘దృశ్యం’లో మీరైతే బాగుంటుందని కమల్హాసన్ అన్నారట..? కమల్హసన్ చేసినన్ని పాత్రలు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదు. ఆయన నా పేరు సూచించడం ఆనందమే. ఆ మధ్య గోవా ఫిలిం ఫెస్టివల్లో ఆయన్ను కలిశాను. కమల్ ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. అవన్నీ తీసుకోదగ్గవే. మీరు కూడా ఆడపిల్లల తండ్రి కాబట్టే, ఈ సినిమాలో బాగా లీనం కాగలిగారా? అలా ఏం కాదు. ఈ కథను ఎవరైనా సరే ఓన్ చేసుకుంటారు. మన కుటుంబాల్లో ఎవరికైనా ఇలాంటి సంఘటనలు జరగొచ్చు. ఏ మగాడైనా తన భార్యా, పిల్లల రక్షణ గురించి ఆలోచిస్తాడు. ఈ సినిమాలో తన కుటుంబానికి వచ్చిన సమస్యను రాంబాబు ఎలా పరిష్కరించుకున్నాడు? అనేది చాలా టచింగ్గా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత రాంబాబులా మంచి మొగుడిలా, మంచి మగాడిలా ఉండాలని మగాళ్లందరూ అనుకుంటారని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మరి.. నిజజీవితంలో మీ గురించి? సందేహం లేదు. రాంబాబు మంచి భర్త, తండ్రి. నిజజీవితంలో ఓ భర్తగా, తండ్రిగా నేనెలా? అనే విషయాన్ని నా కన్నా, నా భార్యాపిల్లలు చెబితే బాగుంటుంది. కానీ, ఒకటి చెప్పగలను. నేను ఆడవాళ్లను గౌరవిస్తాను. పిల్లలంటే ఇష్టం. కాలేజ్ డేస్ అప్పుడు అమ్మాయిలను ఎవరైనా ఏడిపిస్తే, ఎదిరించేవాణ్ణి. సినిమాలో మీ భార్య మీనా, పిల్లలు రెచ్చిపోయి షాపింగ్ చేస్తుంటే మీరు డబ్బులు ఖర్చయిపోతున్నాయని ఫీల్ కావడం ట్రైలర్లో కనిపించింది.. రియల్గా కూడా అలా జాగ్రత్తపడిన సందర్భాలున్నాయా? చాలా ఉన్నాయి. చదువుకునే రోజుల్లో నాక్కొంత పాకెట్ మనీ ఇచ్చేవారు. అప్పుడు ఐస్క్రీమ్కి ఇంత, చాక్లెట్స్కి ఇంత, సినిమా చూడ్డానికి ఇంత, బస్ టిక్కెట్కి ఇంత కావాలి.. అని లెక్కలేసుకుని ఖర్చుపెట్టుకునేవాణ్ణి. మంచి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న మీకు, ఒకవేళ విలన్గా చేసే అవకాశం వస్తే అంగీకరిస్తారా? నేనా విలన్గానా? అసలు డెరైక్టర్స్ అలాంటి పాత్రతో నా దగ్గరకు వస్తారా? ఒకవేళ వచ్చినా ప్రేక్షకులు చూస్తారా? హిందీ ‘ఓ మై గాడ్’ ఆధారంగా చేస్తున్న ‘గోపాల.. గోపాల’ ఏ దశలో ఉంది? ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్లో పవన్ కల్యాణ్ జాయిన్ అవుతాడు. దేవుడంటే నమ్మకం ఉన్న మీరు.. ఈ సినిమాలో దేవుడిపై కేసు పెట్టడం గురించి...? అందుకే ఈ సినిమా నాకు సవాల్ లాంటిది. ఇది చాలా మంచి చిత్రం. సంభాషణలు అద్భుతంగా కుదిరాయి. ఈ కథాంశం ఏ భాషలో అయినా బాగుంటుంది. మారుతితో ‘రాధ’ సినిమా ఏమైంది? అది లేనట్లే. అంటే.. భవిష్యత్తులో మారుతితో ఉంటుందా? ఈ కథ కుదరలేదు. ఒకవేళ మంచి కథతో వస్తే అప్పుడే చేస్తా. ఏయన్నార్ కుటుంబంలో మూడు తరాల నటులు నటించినట్లుగా, మీ దగ్గుబాటి కుటుంబం సినిమా చేసే అవకాశం ఉందా? మాకు చేయాలనే ఉంది. కానీ, ఇప్పటివరకు వచ్చిన కథలన్నీ మామూలుగా ఉన్నాయి. ‘మనం’ కథ అంతకు ముందు చాలామందికి వినిపించారట. చివరికి అక్కినేని గారి కుటుంబానికి సెట్ అయ్యింది. అది అద్భుతమైన సినిమా. -
దృశ్యం మూవీ న్యూ స్టిల్స్
-
రాంబాబు కుటుంబానికి దిష్టి తగిలింది : వెంకటేశ్
‘‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చేసిన పాత్రలే చేసినట్లు అనిపించింది. ఏదైనా విభిన్న కోణంలో ఉన్న పాత్ర వస్తే బాగుంటుందనుకుంటున్న సమయంలో ‘దృశ్యం’ చూశాం. చాలా నచ్చింది. నేను కొత్త రకం నటన కనబర్చడానికి ఆస్కారం ఉంటుందని ఈ చిత్రం చేశాను. తన కుటుంబంతో హాయిగా ఉంటాడు రాంబాబు. అతని కుటుంబానికి దిష్టి తగులుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమాలో చూడాల్సిందే’’ అని వెంకటేశ్ చెప్పారు. మలయాళ చిత్రం ‘దృశ్యం’ని అదే పేరుతో వెంకటేశ్, మీనా జంటగా సురేష్బాబు, రాజ్కుమార్ సేతుపతి తెలుగులోకి పునర్నిర్మించిన విషయం తెలిసిందే. నటి శ్రీప్రియ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డి. రామానాయుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రచార చిత్రాలు ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి’’ అన్నారు. సురేష్బాబు మాట్లాడుతూ -‘‘శంకరాభరణం, త్రీ ఇడియట్స్ లాంటి చిత్రాలు ఆర్టిస్టిక్గా ఉండే కమర్షియల్ ఎంటర్టైనర్స్. మలయాళ ‘దృశ్యం’ కూడా ఆ తరహా సినిమానే. మూడు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్లు, ఐదు పాటల ఫార్మాట్కి అలవాటు పడిపోయాం. కానీ, అందుకు భిన్నంగా ఉండే సినిమా ఇది’’ అని చెప్పారు. సంసారానికి రాముడుగా ఉండే రాంబాబు అనే వ్యక్తి.. అదే సంసారాన్ని కాపాడుకోవడానికి కృష్ణుడిగా కూడా ఎలా మారతాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుందని, మొగుడు, మగాడు ఎలా ఉండాలో చెప్పే చిత్రమని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. ఇంకా నరేశ్, బెనర్జీ కూడా మాట్లాడారు. -
దృశ్యం మూవీ ప్రమోషనల్ ప్రెస్ మీట్
-
రాంబాబు ఫ్యామిలీ స్టోరీ
రాంబాబు ఓ కేబుల్ ఆపరేటర్. అతనిది చిన్న కుటుంబం. చింతలు లేని కుటుంబం. మనసెరిగిన భార్య. రత్నాల్లాంటి ఇద్దరమ్మాయిలు. ఓ సంఘటన ఈ కుటుంబాన్ని కల్లోలానికి గురి చేస్తుంది. అదేంటో తెలియాలంటే ‘దృశ్యం’ సినిమా చూడాల్సిందే. వెంకటేశ్, మీనా ఇందులో హీరో హీరోయిన్లు. చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం లాంటి హిట్ సినిమాలు వీరి కాంబినేషన్లో రూపొందాయి. సీనియర్ కథానాయిక శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకురాలు. డి. సురేశ్బాబు, రాజ్కుమార్ సేతుపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా డి. సురేశ్బాబు మాట్లాడుతూ -‘‘ఇప్పటి వరకూ ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, థ్రిల్లర్ సినిమాలు చూశాం. ఈ రెంటినీ మిళితం చేసి తీసిన సినిమా ఇది. ఇందులో కుటుంబ భావోద్వేగాలతో పాటు థ్రిల్ కూడా ఉంటుంది’’ అని చెప్పారు. శ్రీప్రియ మాట్లాడుతూ -‘‘మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’కు ఇది రీమేక్. ఇందులో ప్రతి పాత్రనూ అందరూ ఐడెంటిఫై చేసుకుంటారు’’ అన్నారు. -
నెటిజన్లను ఆకర్షిస్తున్న 'దృశ్యం' పజిల్ గేమ్
మలయాళ చిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం దృశ్యం నిర్మాతలు సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో జిగ్సా పజిల్ గేమ్ ను ఆరంభించారు. దృశ్యం పజిల్ గేమ్ ఇప్పటికే నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ గేమ్ ఆడిన నెటిజన్లు ప్రతి రోజుల బహుమతులను కూడా గెల్చుకుంటున్నారు. ఈ పజిల్ గేమ్ లో దృశ్యం చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు పొందుపరిచారు. వెంకటేశ్, మీనాలు కలిసి నటిస్తున్న దృశ్యం చిత్రానికి అలనాటి నటి శ్రీప్రియ రాజ్ కుమార్ దర్శకత్వం వహించగా, సురేశ్ ప్రోడక్షన్ నిర్మిస్తోంది. ఈ పజిల్ లో పాల్గొనేందుకు http:// bit.ly/DrishyamPuzzle క్లిక్ చేయవచ్చు. -
కమల్తో మరోసారి గౌతమి
కమలహాసన్తో గౌతమి మరోసారి వెండితెరపై కనిపించనున్నారా? అనే ప్రశ్నకు కోలీవుడ్లో ఔననే సమాధానం వస్తోంది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించి న దృశ్యం చిత్రం తమిళంలో రీమేక్ కానుంది. పద్మశ్రీ కమలహాసన్ హీరో గా నటించనున్న ఈ చిత్రంలో ఆయన సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతునే ఉం ది. ఈ చిత్రం మలయూళంలో మీనా నటిం చారు. తెలుగు రీమేక్లోను ఆమె నటిస్తున్నారు. తమిళంలో ఈ పాత్రను గౌతమి నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె కూడా ఈ పాత్రపై ఆసక్తి చూపడం విశేషం. ఈ విషయమై గౌతమి కమలహాసన్తో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈమె చివరిగా 2006లో శాసనం అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం కమలహాసన్ సహజీవనం గడుపుతున్న గౌతమి ఆయన సరసన అపూర్వ సహోదరగళ్, దేవర్మగన్, నమ్మవర్, కురుదిపునల్ చిత్రాల్లో నటించారు. దృశ్యం చిత్రంలో నటించడం ఖాయమైతే కమలహాసన్తో ఆమె నటించే ఐదో చిత్రం అవుతుంది. దృశ్యం చిత్రంలో గౌతమి నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు చిత్ర దర్శకుడు జియా జోసఫ్ తెలిపారు. ఈ చిత్రం జూలై 15న సెట్పైకి వెళ్లనున్నట్లు ఆయన వెల్లడిం చారు. చిత్రం తిరునెల్వేలి బ్యాక్ డ్రాప్లో రూపొందనున్నట్లు చెప్పారు. యువ సంగీత దర్శకుడు జిబ్బాన్ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రానికి మలయాళ చిత్రానికి పని చేసిన సుజిత్ వాసుదేవన్నే ఛాయాగ్రహణం అందిస్తారు. -
దృశ్యం మూవీ ప్రెస్ మీట్
-
కుటుంబం కోసం పోరాడే హీరో
‘‘ప్రతి కుటుంబంలోనూ మంచి, చెడూ ఉంటాయి. ఈ సినిమాలో రాంబాబు అనే వ్యక్తి కుటుంబంలో ఆ రెండూ చోటుచేసుకుంటాయి. చెడుతో తను ఎలా పోరాటం చేశాడు? అనేదే ‘దృశ్యం’ సినిమా’’ అని నటుడు వెంకటేశ్ అన్నారు. ఆయన హీరోగా మలయాళ ‘దృశ్యం’ని అదే పేరుతో డి. సురేశ్బాబు, రాజ్కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనా కథానాయిక. పోలీసు అధికారిగా ఓ కీలక పాత్రను నిన్నటి తరం నాయిక, నదియా చేస్తున్నారు. కాగా, ఫాదర్స్ డేని పురస్కరించుకుని ఈ చిత్రబృందం ఓ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ‘మై డాడ్ మై హీరో’ అనే కాన్సెప్ట్కు... ఎవరికి వారు తమ తండ్రితో స్మార్ఫోన్లలో స్వీయ చిత్రా (సెల్ఫీ)లు తీసుకుని, తమ జీవితంలో తండ్రి ప్రాధాన్యం, ఆయనతో అనుబంధం గురించి కథనం రాసి, ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేయాలి. ఉత్తమ కథనానికి ‘దృశ్యం’ బృందం బహుమతి అందిస్తారు. దీని కోసం ‘దృశ్యం’ పేరుతో ఫేస్బుక్, ట్విట్టర్లో ఖాతా ప్రారంభించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందని రామానాయడు అన్నారు. ‘‘ఇందులో వెంకటేశ్ పోషిస్తున్న రాంబాబు పాత్రకు భార్యగా నటిస్తున్నా. నా పాత్ర పేరు జ్యోతి. ఒక మంచి భర్తకు భార్యగా కనిపిస్తాను’’ అని మీనా చెప్పారు. శ్రీప్రియ మాట్లాడుతూ, ‘‘వెంకటేశ్ సినిమాల్లోనే కాదు.. విడిగా కూడా మంచివాడే. ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయనను చెడ్డవాడిగా ఎవరూ చూపించలేరు. ఒకవేళ చూపించినా ప్రేక్షకులు స్వీకరించరు’’ అని చెప్పారు. రాజ్కుమార్ సేతుపతి మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా గురించి ఆలోచించినప్పుడు మేం చెన్నైలో ఉన్నాం. ఇందులో హీరోగా ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించినప్పుడు అందరూ ఏకగ్రీవంగా వెంకటేశ్ పేరు చెప్పారు. కమల్హాసన్ కూడా వెంకటేశ్ పేరే చెప్పారు. సురేష్బాబు మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాకి చాలా పేర్లు అనుకున్నాం. చివరికి మాతృక టైటిల్ అయిన ‘దృశ్యం’ అయితేనే బాగుంటుందని, దాన్నే ఖరారు చేశాం. ఇది థ్రిల్లర్ అంశాలున్న కుటుంబ కథ’’ అని చెప్పారు. -
విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం’ మూవీ స్టిల్స్
-
ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా వెంకీ
ఆపదలో చిక్కుకున్న భార్యాబిడ్డల్ని కాపాడుకోవడం కోసం సగటు మనిషి చేసిన పోరాటమే ఇతివృత్తంగా మలయాళంలో రూపొందిన చిత్రం ‘దృశ్యం’. మోహన్లాల్, మీనా జంటగా రూపొందిన ఆ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మరి.. తెలుగులో ఈ సినిమా తీయాలంటే... ఏ హీరో కరెక్ట్ అంటే... ఠకీమని ఎవరైనా వెంకటేశ్ పేరు చెప్పాల్సిందే. కుటుంబ కథాచిత్రాల కథానాయకునిగా వెంకటేశ్కున్న బ్రాండ్ ఇమేజ్ అలాంటిది. అందుకే వెంకటేశ్ హీరోగా తెలుగులో అదే పేరుతో ఈ కథను రీమేక్ చేస్తున్నారు. మీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.సురేశ్బాబు, రాజ్కుమార్ సేతుపతి కలిసి నిర్మిస్తున్నారు. అలనాటి అందాల తార శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకురాలు కావడం విశేషం. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. భాషా భేదం లేకుండా అందరికీ నచ్చే కథాంశం కాబట్టే తెలుగులోకి రీమేక్ చేస్తున్నాం. ఇందులో వెంకటేశ్ ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నటిస్తున్నారు. పాతికేళ్ల కెరీర్లో ఆయన ఎన్ని బరువైన పాత్రలు పోషించినా... ఇది మాత్రం ఆయనకు కచ్చితంగా ప్రత్యేకమైన సినిమా. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నదియా ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, రవి కాలే, సమీర్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: జీతూ జోసఫ్, రచన: పరుచూరి బ్రదర్స్. మాటలు: స్వామి, కెమెరా: ఎస్.గోపాల్రెడ్డి, సంగీతం: శరత్, కళ: వివేక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సురేశ్ బాలాజీ, జార్జ్ పైయస్, సమర్పణ: డా. డి.రామానాయుడు, నిర్మాణం: సురేశ్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్, రాజ్కుమార్ థియేటర్స్ ప్రై.లిమిటెడ్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్. -
మరో రీమేక్లో...
కమల్హాసన్ చేసిన సినిమాను రీమేక్ చేయడం సాహసమే. అందుకే... ఆ సాహసానికి అంత తేలిగ్గా ఎవరూ పూనుకోరు. కానీ... కమల్ మాత్రం ఈ మధ్య రీమేక్లపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ను ‘వసూల్రాజా ఎం.బి.బి.ఎస్’గా రీమేక్ చేశారాయన. తర్వాత నసీరుద్దీన్షా ‘వెడ్నెస్ డే’ చిత్రాన్ని ‘ఈనాడు’గా రీమేక్ చేశారు. ఇప్పుడేమో... మలయాళంలో మోహన్లాల్ నటించిన ‘దృశ్యం’ చిత్రాన్ని తమిళంలో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా సెట్స్కి వెళ్లక ముందే... మరో రీమేక్కి కూడా ‘సై’ అనేశారు. ఇంతకీ కమల్ చేయనున్న ఆ రీమేక్ ఏంటా అనుకుంటున్నారా! ప్రస్తుతం మలయాళంలో మోహన్లాల్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా పేరు ‘పెరుచ్చాళి’. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కథ ఇటీవలే కమల్ విన్నారట. ఆయనకు తెగ నచ్చేయడంతో ఆ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి కమల్ ఉత్సాహం చూపుతున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం సదరు చిత్ర నిర్మాతలతో కమల్ సంప్రదింపులు జరుపుతున్నారట. అరుణ్ వైద్యనాథన్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి తమిళంలో ఈ చిత్రాన్ని ఎవరు డెరైక్ట్ చేస్తారో చూడాలి. -
తేజ దర్శకత్వంలో కమల్హాసన్ త్రిభాషా చిత్రం?
కమల్హాసన్కి కథ చెప్పి ఒప్పించడం అంత సులభసాధ్యం కాదంటారు. కానీ మన తెలుగు దర్శకుడు తేజ చెప్పిన కథకు సింగిల్ సిట్టింగ్లోనే కమల్ ఓకే చెప్పేశారట. తేజ దర్శకత్వంలో మూడు భాషల్లో సినిమా చేయడానికి ఆయన పచ్చ జెండా ఊపారట. చెన్నై పాండీ బజార్లోనూ, హైదరాబాద్ ఫిలిమ్నగర్లోనూ ఈ వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో ‘ఉత్తమ విలన్’ షూటింగ్లో కమల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ‘దృశ్యం’ తమిళ రీమేక్లో నటించనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత తేజ ప్రాజెక్ట్ పట్టా లెక్కనుందని సమాచారం. చిత్రం, నువ్వు-నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన తేజకు ఇటీవల కాలంలో సరైన విజయాలు లేవు. కమల్ సినిమాతో మళ్లీ తన పూర్వవైభవం సాధించుకునే దిశగా తేజ కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో భారీ ఎత్తున ఆ చిత్రం తెరకెక్కనుందట. -
అరకు లోయలో ‘దృశ్యం’
కుటుంబ కథానాయకుడిగా వెంకటేశ్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లే. సుందరకాండ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సూర్యవంశం, సంక్రాంతి... ఇవన్నీ ఆ కోవకు చెందిన సినిమాలే. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘దృశ్యం’, చేయబోతున్న ‘ఓ మైగాడ్’ సినిమాల్లో కూడా వెంకీ ఫ్యామిలీ మేన్గానే కనిపించబోతున్నారు. ఈ రెండూ విభిన్న కథాంశాలే కావడం విశేషం. ‘దృశ్యం’ షూటింగ్ ప్రస్తుతం అరకు లోయలో జరుగుతోంది. నిరవధికంగా సాగే ఈ షెడ్యూల్లోనే వైజాగ్, విజయనగరం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా చిత్రీకరణ జరుపుతారు. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత డి.సురేశ్బాబు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న భార్యాబిడ్డల్ని కాపాడుకోవడం కోసం ఓ మధ్యతరగతి వ్యక్తి చేసిన సాహసమే ‘దృశ్యం’. మలయాళంలో మోహన్లాల్ నటించిన ఈ పాత్రను తెలుగులో వెంకటేశ్ చేస్తుండటం నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. నాటి తరం కథానాయిక శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.గోపాల్రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నదియా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: వివేక్. -
‘దృశ్యం’ మొదలైంది
వెంకటేశ్ స్పీడ్ పెంచారు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో రెండు సినిమాలైనా విడుదలయ్యేలా ప్లాన్ చేశారాయన. అందుకు తగ్గట్టుగానే అడుగులేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు సినిమాలూ రీమేక్లే కావడం విశేషం. వాటిల్లో మలయాళం ‘దృశ్యం’ రీమేక్ ఒకటి. ఇప్పటికే కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. అత్యధిక భాగం చిత్రీకరణ కేరళలోనే జరుగుతుందట. మాతృకలో కథానాయికగా నటించిన మీనానే తెలుగులోనూ హీరోయిన్. కథలో కీలకమైన పోలీసాఫీసర్గా నదియా కనిపిస్తారు. శ్రీప్రియ దర్శకురాలు. తెలుగులోనూ ‘దృశ్యం’ టైటిల్నే ఖరారు చేస్తారా? లేక కొత్త టైటిల్ నిర్ణయిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక హిందీ చిత్రం ‘ఓ మైగాడ్’ రీమేక్ అయితే... ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. -
దృశ్యం కోసం కేరళ వెళ్లిన వెంకీ
మళయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం కేరళలోని ఇడుక్కి జిల్లాలో షూటింగ్ జరుపుకొంటోంది. దీనికోసం వెంకటేష్ కూడా కేరళ వెళ్లాడు. మళయాళ మాతృకలో సన్నివేశాలన్నీ కేరళలోనే ఉంటాయి కాబట్టి, ఈ రీమేక్లో కూడా ఒరిజినల్ లాగే కనపడేందుకు కేరళలో కొంత భాగం షూటింగ్ చేస్తున్నట్లు ఈ సినిమా ప్రతినిధి ఒకరు తెలిపారు. రాష్ట్రం వెలుపల కూడా ఇంకా చాలా సన్నివేశాలు ఉంటాయని, మొదటి షెడ్యూల్ త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. శ్రీప్రియ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, నదియా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తన కుటుంబం చేసిన ఓ హత్యను కప్పిపెట్టేందుకు ఓ వ్యక్తి చేసే ప్రయత్నం గురించి ఈ సినిమా ఉంటుంది. మళయాళంలో సూపర్స్టార్ మోహన్లాల్ ఈ పాత్రను పోషించారు. తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్, కన్నడలో సీనియర్ నటుడు రవిచంద్రన్ హీరోలుగా చేస్తున్నారు. -
కమల్తో నటించడం లేదు
కమల్హాసన్, సిమ్రాన్లది సక్సెస్ఫుల్ జంట. వీరిద్దరూ ఇంతకు ముందు పంపల్కే సంబంధం (తెలుగులో బ్రహ్మచారి) పంచతంత్రం తదితర చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో కమల్ హాసన్, సిమ్రాన్లు సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత సిమ్రాన్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లిచేసుకుని నటనకు దూరం అయ్యారు. మళ్లీ ఇప్పుడు నటనకు దగ్గరయిన సిమ్రాన్ ఇటీవల ఆహా కల్యాణం చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. అసలు విషయం ఏమిటంటే ఒకప్పటి సూపర్ జోడీ అయిన కమల్, సిమ్రాన్లు కలిసి మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన దృశ్యం చిత్రం తమిళ రీమేక్లో కమల్ హాసన్ నటించనున్నారు. మలయాళంలో నటించిన నటి మీనానే తమిళంలోను కమల్ సరసన నటించనున్నట్లు మొదట ప్రచారం జరిగింది. దీన్ని మానా ఖండించారు. ఆమె దృశ్యం తెలుగు రీమేక్లో వెంకటేశ్ సరసన నటిస్తున్నారు. తమిళంలో నటి నదియా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత నటి సిమ్రాన్ కమల్తో మరోసారి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని సిమ్రాన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ దృశ్యం తమిళ రీమేక్లోనే కాదు ఏ భాషలోనూ తాను నటించడం లేదని స్పష్టం చేశారు. తన సినీ ప్రణాళికను త్వరలోనే వెల్లడించనున్నట్లు సిమ్రాన్ తెలిపారు. -
కమల్ సరసన సిమ్రాన్..!
ఏజ్బార్ హీరోయిన్లకు ఇప్పుడు కాలం అనుకూలంగా ఉంది. ట్రెండ్ వాళ్లకు ఆహ్వానం పలుకుతోంది. 50 ప్లస్ హీరోలందరూ వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో కాస్త ఏజ్డ్ పాత్రలకు కూడా వాళ్లు ‘సై’ అనేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ పాత్రల్లో వారికి ఒక జోడీ ఉండాలి కదా. ఆ జోడీ కూడా హీరోకు తగ్గట్టు కాస్త ఏజ్డ్గా ఉండాలి కదా. ఇదిగో... సరిగ్గా ఏజ్బార్ హీరోయిన్లకు కలిసొచ్చిన అంశం ఇదే. మలయాళ ‘దృశ్యం’ తమిళంలో, తెలుగులో రీమేక్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ‘దృశ్యం’లో హీరోహీరోయిన్లు వయసొచ్చిన బిడ్డలకు తల్లితండ్రులు. మోహన్లాల్, మీనా ఆ పాత్రలు చేశారు. తెలుగులో మోహన్లాల్ పాత్రను వెంకటేశ్ చేయబోతున్నారు. మాతృకలో చేసిన మీనానే ఇక్కడ కూడా హీరోయిన్గా బుక్ అయ్యారు. ఇక తమిళ ‘దృశ్యం’లో హీరో కమల్హాసన్. ఆయనతో జతకట్టే ఏజ్బార్ హీరోయిన్ ఎవరు? అనేది కొన్నాళ్లుగా నలుగుతున్న ప్రశ్న. మొన్నటిదాకా నదియా పేరు ఎక్కువగా వినిపించింది. అయితే... ఎట్టకేలకు ఆ పాత్రకు నిన్నటి మేటి కథానాయిక సిమ్రాన్ ఎంపికయ్యారు. కథానాయికగా కెరీర్ ముగిసిన తర్వాత కూడా మళ్లీ కమల్ లాంటి స్టార్తో నటించే అవకాశం రావడం మామూలు విషయమా? అయితే కమల్-సిమ్రాన్ది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి ‘బ్రహ్మచారి’, ‘పంచతంత్రం’ చిత్రాల్లో నటించారు. ఇటీవలే ‘ఆహా కల్యాణం’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సిమ్రాన్కి ఇది నిజంగా సువర్ణావకాశమే! -
నన్నెవరూ అడగలేదు
వివాహమైన తరువాత కూడా హీరోయిన్గా రాణిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో మీనా ఒకరు. ఒక బిడ్డకు తల్లి అయిన ఈ బహుభాషా నటి రీ ఎంట్రీలోనూ హీరోయిన్గా విజ యాలబాటలో పయనించడం విశేషం. మలయాళంలో మోహన్లాల్, మీనా జంటగా నటించిన చిత్రం దృశ్యం. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఇతర భాషల ప్రముఖ హీరోల దృష్టిని తన వైపు తిప్పుకోవడం విశేషం. దృశ్యం చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడంలో రవిచంద్రన్లు చేస్తున్నారు. ఇక తమిళంలో పద్మభూషణ్ కమలహాసన్ చేయడానికి ముందుకు రావడం మరో విశేషం. మలయాళంలో మీనా నటించిన పాత్రను తమిళంలోనూ ఆమె పోషించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను మీనా ఖండించారు. దీని గురించి ఆమె స్పందిస్తూ దృశ్యం తమిళ రీమేక్లో నటించమని ఇంతవరకు తననెవరూ అడగలేదని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రస్తుతం తాను ఏ భాషలోనూ నూతన చిత్రాన్ని ఒప్పుకోలేదని మీనా తెలిపారు. -
రజనీ ‘నో’.. కమల్ ‘ఎస్’!
అన్ని కథలూ అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి బ్రహ్మాండంగా ఉందనిపించిన కథ మరికొంతమందికి సాదాసీదాగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే, సినిమాలోని అన్ని సన్నివేశాలూ అందర్నీ సంతృప్తిపరచవు. అలా, మలయాళ చిత్రం ‘దృశ్యం’ విషయంలో రజనీకాంత్కి, కమల్హాసన్కి భిన్నాభిప్రాయం ఏర్పడింది. మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పరభాషలవారు రీమేక్ చేయడానికి ఉత్సాహపడుతున్నారు. ఈ చిత్రం తెలుగు రీమేక్లో వెంకటేష్ నటించబోతున్నారు. తమిళ రీమేక్లో కమల్హాసన్ చేయబోతున్నారు. మలయాళ ‘దృశ్యం’కి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్ఫే తమిళ వెర్షన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ముందు కమల్ని కాకుండా రజనీకాంత్ని హీరోగా అనుకున్నారు జీతు. మలయాళ ‘దృశ్యం’ని చూసి, రజనీ కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. అక్కడ మోహన్లాల్ చేసిన లీడ్ రోల్ని చేయడానికి ఉత్సాహపడ్డారు కూడా. కానీ, కొన్ని సన్నివేశాల విషయంలో రజనీ సందేహపడ్డారు. ఆ సన్నివేశాలు తన అభిమానులకు నచ్చుతాయా? అనే సందేహం వ్యక్తపరిచారు ఈ సూపర్స్టార్. చివరికి ఈ సినిమా చేయాలనే ఆలోచన విరమించుకున్నారు. ఆ తర్వాత జీతు కోరిన మీదట కమల్ ‘దృశ్యం’ని చూడటం, పచ్చజెండా ఊపడం జరిగిపోయింది. కమల్లో మంచి రచయిత కూడా ఉన్నాడు కాబట్టి, కథలో మార్పులు, చేర్పులు చేయడానికి సహకరిస్తానని జీతూకి మాటిచ్చారు. ఈ చిత్రం షూటింగ్ని జూన్లో ప్రారంభిస్తామని జీతు పేర్కొన్నారు. -
దృశ్యం రీమేక్లో కమలహాసన్?
ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో తెరకెక్కించడానికి పోటీ ఉంటుంది. ప్రస్తుతం దృశ్యం చిత్రంపై అలాంటి పోటీనే నెలకొంది. మలయాళంలో మోహన్లాల్, మీనా జంటగా నటించిన దృశ్యం విశేష ప్రజాదరణ చూరగొం టోంది. ఇప్పటికే తెలుగు రీమేక్ హక్కులను నటి శ్రీప్రియ సొంతం చేసుకున్నారు. తమిళం రీమేక్లో నటించడానికి విక్రమ్, శరత్కుమార్ ఆసక్తి చూపినప్పటికీ తాజాగా కమలహాసన్ నటించే అవకాశం ఉందని సమాచారం. దృశ్యం తమి ళం, హిందీ రీమేక్ హక్కులను బాలాజీ సురేష్ పొందారు. ఈయన కమల్కు చిత్రాన్ని చూపించగా, ఆయన బాగుందని కితాబిచ్చారట. దీనిపై నిర్మాత బాలాజీ సురేష్ మాట్లాడుతూ కమలహాసన్తో నిర్మించే విషయమై చర్చలు జరుగుతున్నాయన్నారు. హిందీలో ఇఫ్రాన్ఖాన్, నానా పటేకర్, అజయ్ దేవగణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. -
శ్రీప్రియ దర్శకత్వంలో వెంకీ
చంటి, చినరాయుడు, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, రాజా, శీను, జెమిని, ఘర్షణ, బాడీగార్డ్... ఇలా వెంకటేష్ నటించిన రీమేక్ చిత్రాల జాబితా చాలానే ఉంది. ఇటీవల హిందీ ‘బోల్ బచ్చన్’ రీమేక్ ‘మసాలా’లో కూడా నటించిన విషయం తెలిసిందే. వెంకీ నటించిన రీమేక్ చిత్రాల్లో విజయం సాధించినవే ఎక్కువ. ప్రస్తుతం ఆయన హిందీ ‘ఓ మై గాడ్’ రీమేక్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా, మరో రీమేక్ని కూడా అంగీకరించారు. మలయాళంలో జీతు జోసఫ్ దర్శకత్వంలో మోహన్లాల్ హీరోగా రూపొందిన ‘దృశ్యం’ని తెలుగులో పునర్నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘మాలిని 22’ చిత్రాన్ని నిర్మిస్తున్న రాజ్కుమార్ థియేటర్స్ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ క్రియేషన్స్తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ‘మాలిని 22’కి దర్శకత్వం వహిస్తున్న శ్రీప్రియ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. లేడీ డెరైక్టర్తో సినిమా చేయడం వెంకీకి ఇదే మొదటిసారి అవుతుంది. మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్రంలో మోహన్లాల్ సరసన మీనా కథానాయికగా నటించారు.మరి... తెలుగు రీమేక్లో కథానాయికగా ఎవర్ని ఎంపిక చేస్తారు తదితర వివరాలు త్వరలోనే తెలుస్తాయి.