కమల్‌తో మరోసారి గౌతమి | Kamal Haasan and Gauthami reunite for Drishyam remake? | Sakshi
Sakshi News home page

కమల్‌తో మరోసారి గౌతమి

Published Thu, Jun 19 2014 11:51 PM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

కమల్‌తో మరోసారి గౌతమి - Sakshi

కమలహాసన్‌తో గౌతమి మరోసారి వెండితెరపై కనిపించనున్నారా? అనే ప్రశ్నకు కోలీవుడ్‌లో ఔననే సమాధానం వస్తోంది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించి న దృశ్యం చిత్రం తమిళంలో రీమేక్ కానుంది. పద్మశ్రీ కమలహాసన్ హీరో గా నటించనున్న ఈ చిత్రంలో ఆయన సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతునే ఉం ది. ఈ చిత్రం మలయూళంలో మీనా నటిం చారు. తెలుగు రీమేక్‌లోను ఆమె నటిస్తున్నారు. తమిళంలో ఈ పాత్రను గౌతమి నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె కూడా ఈ పాత్రపై ఆసక్తి చూపడం విశేషం. ఈ విషయమై గౌతమి కమలహాసన్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం.
 
 ఈమె చివరిగా 2006లో శాసనం అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం కమలహాసన్ సహజీవనం గడుపుతున్న గౌతమి ఆయన సరసన అపూర్వ సహోదరగళ్, దేవర్‌మగన్, నమ్మవర్, కురుదిపునల్  చిత్రాల్లో నటించారు. దృశ్యం చిత్రంలో నటించడం ఖాయమైతే కమలహాసన్‌తో ఆమె నటించే ఐదో చిత్రం అవుతుంది. దృశ్యం చిత్రంలో గౌతమి నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు చిత్ర దర్శకుడు జియా జోసఫ్ తెలిపారు. ఈ చిత్రం జూలై 15న సెట్‌పైకి వెళ్లనున్నట్లు ఆయన వెల్లడిం చారు. చిత్రం తిరునెల్వేలి బ్యాక్ డ్రాప్‌లో రూపొందనున్నట్లు చెప్పారు. యువ సంగీత దర్శకుడు జిబ్బాన్ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రానికి మలయాళ చిత్రానికి పని చేసిన సుజిత్ వాసుదేవన్‌నే ఛాయాగ్రహణం అందిస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement