Kamal Haasan
-
ప్రేమించిన వ్యక్తి కోసం సారిక చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది: నటుడు
మిసెస్ సినిమా (Mrs Movie)లో తన నటనతో ప్రశంసలు అందుకుంటున్నాడు సీనియర్ నటుడు కన్వల్జిత్ సింగ్ (Kanwaljit Singh). తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడు గతంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. కన్వల్జిత్ మాట్లాడుతూ.. 1985లో ఛప్టే ఛప్టే సీరియల్ చేశాను. సారిక (Sarika) నాతో జోడీ కట్టింది. కానీ అప్పుడు తను మద్రాస్లో ఉన్న ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడి కోసం షూటింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది. మళ్లీ సెట్కు రానేలేదు.ఆమె వెళ్లిపోవడం వల్ల..దానివల్ల ఒకరకంగా మంచే జరిగిందనుకుంటాను. సారిక స్థానంలో నటి అనురాధ పటేల్ను తీసుకున్నారు. అనురాధ నాకు జంటగా నటించింది. సీరియల్ షూటింగ్ సమయంలో మేము బాగా క్లోజ్ అయ్యాం. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్ (Kamal Haasan) కోసమే సారిక సీరియల్ వదిలేసుకుని మరీ వెళ్లిపోయింది. అప్పటికే కమల్కు వాణి గణపతితో పెళ్లవగా.. 1984లో ఆమెకు విడాకులిచ్చేశాడు. కమల్ రిలేషన్స్..1988లో సారికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2004లో విడాకులు తీసుకున్నారు. అనంతరం కమల్.. నటి గౌతమిని ప్రేమించాడు. కానీ పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడానికి ఇష్టపడ్డారు. అలా 2005-2016 వరకు కలిసున్నారు. తర్వాత బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.చదవండి: ‘హాలీవుడ్ రిపోర్టర్’పై అల్లు అర్జున్.. అరుదైన ఘనత -
రాజ్యసభకు కమల్ హాసన్?
చెన్నై, సాక్షి: సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే చర్చ తమిళనాట జోరుగా నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించిన ఆయన.. డీఎంకే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లను కూటమి కైవసరం చేసుకుంది. దీంతో ఆయన్ను పెద్దల సభకు నామినేట్ చేయాలని డీఎంకే భావిస్తోందన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఏడాది జూన్లో రాజ్యసభ నుంచి ఆరు సీట్లు ఖాళీ కానున్నాయి. అయితే ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన కమల్ను రాజ్యసభకు పంపే యోచనలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారట. తాజాగా.. బుధవారం తమిళనాడు మంత్రి పీకే శేఖర్బాబు కమల్ హాసన్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. మరోవైపు కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(MNM) ప్రతినిధి మురళి అప్పాస్.. తమ పార్టీకి ఓ రాజ్యసభ సీటు దక్కబోతుందనే విషయాన్ని ధృవీకరించారు. అయితే అది ఎవరనేది పార్టీ అధ్యక్షుడు కమల్ హాసనే నిర్ణయిస్తారని తెలిపారాయన. శేఖర్బాబుతో కమల్ జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించేందుకు నిరాకరించారు.2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎన్ఎంఎం పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. -
ఖైదీలో..?
ప్రముఖ నటుడు కమల్హాసన్(kamal haasan) ‘ఖైదీ 2’(Khaidi2) సినిమాలో నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. కార్తీ(karthi) హీరోగా లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. 2019లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్గా ‘ఖైదీ 2’ రూపొందనుంది. ఈ మూవీలోనూ కార్తీ హీరోగా నటించనుండగా లోకేశ్ కనగరాజే దర్శకత్వం వహించనున్నారు.కాగా ఈ సీక్వెల్లో కమల్హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. కమల్హాసన్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమ్’ (2022) సినిమా సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పుడు వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. దీంతో ‘ఖైదీ 2’లోని ఓ కీలక పాత్ర చేయాలని కమల్ని లోకేశ్ అడగడం.. ఆ పాత్ర కూడా ఆయనకు బాగా నచ్చడంతో చేసేందుకు కమల్ ఓకే అన్నారని తమిళ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలో ఈ చిత్రం ఆరంభం కానుంది. -
ఇండియాలో రిచ్ స్టార్ మన టాలీవుడ్ హీరోనే. .ఏ హీరో ఆస్తి ఎంతంటే..?
ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్ని విధాలుగా మన టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. వ్యక్తిగత సంపదలో సైతం అక్కడి అగ్రగామి నటులదే పైచేయిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఉత్తరాది చిత్రాల రికార్డ్స్ను మన టాలీవుడ్ తుడిచిపెడుతున్నట్టే... సంపద విషయంలోనూ వారిని మనవాళ్లు తోసిరాజంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది మనీ కంట్రోల్ అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ చెబుతున్న ప్రకారం చూస్తే... దక్షిణాదికి చెందిన అత్యంత సంపన్న తార వాస్తవానికి బాలీవుడ్లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీకంట్రోల్ తేల్చి చెప్పింది. సంస్థ విశ్లేషణ ప్రకారం, నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు (రూ.3572 కోట్లకు పైగా) కలిగి ఉన్నారు, తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్లో ఒకరుగా నిలిచారు. మన నాగ్ కన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ బచ్చన్ (రూ.3200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ3100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2700 కోట్లు) అమీర్ ఖాన్ (రూ1900 కోట్లు) వంటి ఎ–లిస్ట్ బాలీవుడ్ తారల కంటే నాగార్జున ముందున్నారు.నాలుగు దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో, నాగార్జున సమకాలీనుడైన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు, ఆయన నికర ఆస్తుల విలువ రూ1650 కోట్లు. ఇతర అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో రామ్ చరణ్ (రూ1370 కోట్లు), కమల్ హాసన్ (రూ600 కోట్లు), రజనీకాంత్ (రూ500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ500 కోట్లు), ప్రభాస్ (రూ250 కోట్లు)...గా ఉన్నారు. నిస్సందేహంగా నాగార్జున తెలుగు సినిమాలలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. కానీ, ఆయన సమకాలికులైన చిరంజీవి కన్నా అలాగే నేటి బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్ రామ్ చరణ్ కన్నా కూడా ఎలా సూపర్రిచ్ అయ్యారు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్ను సాధించారని సదరు మనీ కంట్రోల్ వెల్లడించింది.నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన దైన మార్క్ని చూపారు. టాలీవుడ్లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ అయిన ఎన్3 రియల్టీ ఎంటర్ప్రైజెస్ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం, నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.900 కోట్లు. అలాగే నాగార్జునకు మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక థృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనార్హం. -
5 నెలల తరువాత చెన్నైకు తిరిగొచ్చిన కమల్ హాసన్
కోలీవుడ్ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Haasan) సుమారు 5 నెలల తరువాత చైన్నెకి చేరుకున్నారు. ఈయన ఏఐ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొందడానికి అమెరికా వెళ్లారు. ఈయన నిర్మించిన అమరన్ చిత్రం ప్రమోషన్లోగానీ, చిత్ర విడుదల సమయంలోగానీ పాల్గొనలేదు. ఆ సమయంలో అమెరికాలోనే ఉన్నారు. కాగా మక్కల్ నీది మయ్యం పార్టీలోనూ అనిశ్చితి వాతావరణం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కమలహాసన్ ఎట్టకేలకు 5 నెలల తరువాత అమెరికా నుంచి చైన్నెకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాను మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 6వ తేదీన విడుదల కానుందని చెప్పారు. అదేవిధంగా విక్రమ్ 2 చిత్రం చేస్తున్నారా అన్న ప్రశ్నకు అలాంటిది ఏమీ లేదని, వేరే చిత్రానికి కథను సిద్ధం చేసినట్లు కమలహాసన్ చెప్పారు. కాగా ఈయన త్వరలో ఫైట్ మాస్టర్ల ద్వయం అన్బరివ్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలను కూడా అమెరికాలోనే జరిపారన్నది గమనార్హం. -
కోలీవుడ్లో సీక్వెల్ సందడి
కోలీవుడ్లో సీక్వెల్ హవా బాగా వీస్తోంది. కోలీవుడ్ హీరోలందరూ సీక్వెల్ జపం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో పదికి పైగా సీక్వెల్స్ సినిమాలు ఉండటమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి... ఈ సీక్వెల్స్, ఫ్రాంచైజీ చిత్రాలతో బిజీగా ఉన్న తమిళ హీరోలు ఎవరో తెలుసుకుందాం...జైలర్ తిరిగి వస్తున్నాడురజనీకాంత్ హీరోగా చేసిన ‘జైలర్’ (2023) మూవీ బ్లాక్బస్టర్ హిట్. నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్షన్లో కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో రజనీ కొత్త తరహా స్టైల్, స్వాగ్, మేనరిజమ్స్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. వీటికి అనిరు«ధ్ రవిచందర్ మ్యూజిక్, ఆర్ఆర్ ప్లస్ అయ్యాయి. దీంతో ‘జైలర్’ మూవీ రజనీ ఖాతాలో ఓ బ్లాక్బస్టర్గా నిలిచిపోయింది. ఈ సినిమా మూవీ రిలీజ్ తర్వాత ‘జైలర్ 2’ ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాలను నిజం చేస్తూ నెల్సన్ దిలీప్కుమార్ ఇటీవలే ‘జైలర్ 2’ సినిమాను ప్రకటించారు. రజనీకాంత్ హీరోగా చేయనున్న ‘జైలర్ 2’ చిత్రీకరణ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. కాగా ‘జైలర్’లో రమ్యకృష్ణ, మీర్నా మీనన్ కీ రోల్స్లో, మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్లో నటించారు. వీరందరి పాత్రలు ‘జైలర్ 2’లోనూ కొనసాగుతాయని కోలీవుడ్ టాక్. అంతే కాదు... బాలకృష్ణ, ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘జైలర్ 2’లో యాడ్ అవుతారట. ఈ సీక్వెల్ 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.వీర శేఖరన్ పోరాటంహీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) మూవీ 1996లో విడుదలై, బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. 28 సంవత్సరాల తర్వాత కమల్, శంకర్ కాంబినేషన్లోనే 2024లో విడుదలైన ‘ఇండియన్ 2’ సినిమా మాత్రం ఆడియన్స్ను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ‘ఇండియన్ 2’ సినిమా తీస్తున్న సమయంలోనే ‘ఇండియన్ 3’ చిత్రీకరణను కూడా దాదాపు పూర్తి చేశారు దర్శకుడు శంకర్.ఈ ఏడాదే ‘ఇండియన్ 3’ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ పేర్కొన్నారు. ‘ఇండియన్, ఇండియన్ 2’ చిత్రాల్లో సేనాపతిగా కనిపించారు కమల్హాసన్. కానీ ‘ఇండియన్ 3’ మాత్రం సేనాపతి తండ్రి వీరశేఖరన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథనం ఉంటుంది. స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లతో వీరశేఖరన్ ఏ విధంగా పోరాడారు? అన్నది ‘ఇండియన్ 3’ స్టోరీ అని కోలీవుడ్ సమాచారం. ఈ ఫ్లాష్బ్యాక్లో వీరశేఖరన్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ఇండియన్ 3’కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఇటు సర్దార్... అటు ఖైదీతండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన స్పై యాక్షన్ మూవీ ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ 2022లో విడుదలై, బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ‘సర్దార్’ సినిమా క్లైమాక్స్లో ‘మిషన్ కంబోడియా’ అంటూ ఈ సినిమాకు సీక్వెల్గా ‘సర్దార్ 2’ను కన్ఫార్మ్ చేశారు పీఎస్ మిత్రన్. అలాగే జూలైలో ‘సర్దార్’కు సీక్వెల్గా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లోనే ‘సర్దార్ 2’ ప్రారంభమైంది.కార్తీ హీరోగా ఎస్జే సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ ప్రధాన తారాగణంగా నటిస్తారని ఆల్రెడీ మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్లో చూడొచ్చు. అప్పుడు మిషన్ కంబోడియా వివరాలు కూడా తెరపైన కనిపిస్తాయి. ఇక ‘ఖైదీ’లో కార్తీ చేసిన దిల్లీ రోల్ను మర్చిపోరు ఆడియన్స్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం 2019లో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో వెంటనే కార్తీతో ‘ఖైదీ 2’ చేయాలని లోకేశ్ ప్లాన్ చేశారు. కానీ లోకేశ్కు కమల్హాసన్తో ‘విక్రమ్’, రజనీకాంత్తో ‘కూలీ’ సినిమాల ఆఫర్స్ రావడంతో ‘ఖైదీ’ సీక్వెల్ షూటింగ్ను కాస్త ఆలస్యం చేశారు. రజనీకాంత్ ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. దీంతో లోకేశ్ నెక్ట్స్ మూవీ కార్తీ ‘ఖైదీ 2’నే ఉండొచ్చు. ఇలా రెండు సీక్వెల్స్తో ఆడియన్స్ను అలరించేందుకు రెడీ అవుతున్నారు కార్తీ.రెండు దశాబ్దాల తర్వాత..!‘7/జీ రెయిన్బో కాలనీ’ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ‘7/జీ బృందావన కాలనీ’ అంటే మాత్రం చాలామంది తెలుగు ఆడియన్స్కు ఈ సినిమా గుర్తొస్తుంది. 2004లో సెల్వ రాఘవన్ డైరెక్షన్లో రూపొందిన ‘7/జీ రెయిన్బో కాలనీ’ తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’గా అనువాదమై, సూపర్హిట్గా నిలి చింది. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించారు. ఏఎమ్ రత్నం నిర్మించారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ‘7/జీ బృందావన కాలనీ’ సినిమాకు సీక్వెల్గా ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా తీస్తున్నారు దర్శకుడు సెల్వ రాఘవన్.తొలి భాగంలో నటించిన రవికృష్ణనే మలి భాగంలోనూ హీరోగా చేస్తుండగా, అనశ్వర రాజన్ హీరోయిన్గా చేస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. జయరామ్, సుమన్ శెట్టి, సుధ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా రిలీజ్పై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. ఇక సెల్వ రాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) సినిమా గుర్తుండే ఉంటుంది.కార్తీ, రీమా సేన్, పార్తీబన్, ఆండ్రియా లీడ్ రోల్స్లో నటించిన ఈ మూవీ 2010లో విడుదలై, బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ సినిమాను 2021 జనవరి 1న ప్రకటించారు సెల్వ రాఘవన్. ఈ సీక్వెల్లో ధనుష్ను హీరోగా ప్రకటించారు. ఈ చిత్రం 2024లో రిలీజ్ అవుతుందని, అప్పట్లో ధనుష్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. ఇక ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సీక్వెల్ గురించి మరో అప్డేట్ రావాల్సి ఉంది.అమ్మోరు తల్లినయనతార నటించిన ‘ముకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) 2020 నవంబరులో డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా ‘ముక్కుత్తి అమ్మన్ 2’ను ప్రకటించింది వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ. ‘ముక్కుత్తి అమ్మన్’లో నటించిన నయనతారనే సీక్వెల్లోనూ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘ముక్కుత్తి అమ్మన్’కు నటుడు ఆర్జే బాలాజీ–ఎన్జే శరవణన్ దర్శకత్వం వహించగా, ‘ముకుత్తి అమ్మన్ 2’ను మాత్రం నటుడు–దర్శకుడు సుందర్ .సి తెరకెక్కించనున్నారు. సుందర్.సి నేతృత్వంలోని మరో ఫ్రాంచైజీ ‘కలగలప్పు’లోని ‘కలగలప్పు 3’ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కామెడీ డ్రామాగా ‘కలగలప్పు’కు తమిళ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది.హారర్ ఎఫెక్ట్!ఇవే కాదు... కమల్హాసన్ ‘విక్రమ్ 2’, ధనుష్ ‘వడ చెన్నై 2’ వంటి చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ చిత్రాల సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉంది.ఈసారి హారర్ జానర్ సీక్వెల్స్ కోలీవుడ్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవనున్నాయి. రాఘవా లారెన్స్ ఆధ్వర్యంలో ఆడియన్స్ను అలరిస్తున్న ‘కాంచన’ సిరీస్కు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్లో మరో చిత్రంగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘కాంచన 4’ రానుందని కోలీవుడ్ సమాచారం. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కాంచన 4’లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి... ‘కాంచన 4’లో ఎవరు నటిస్తారనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక సుందర్ .సి సారథ్యంలో నడుస్తున్న హారర్ ఫ్రాంచైజీ ‘అరణ్మణై’ గురించి చెప్పుకోవాలి. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్లో నటించిన ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘డాకు’) ఆడియన్స్ను మెప్పించింది. దీంతో ఈ ఏడాదిలోనే ‘అరణ్మణై 5’ను కూడా తీయాలని సుందర్ .సి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. అలాగే హారర్ జానర్లో సంతానం చేస్తున్న హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘డీడీ’ నుంచి నాలుగో మూవీగా ‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రం రానుంది. ఎస్. ప్రేమ్ ఆనంద్ డైరెక్షన్లోని ఈ మూవీలో సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ మేలో రిలీజ్ కానుంది. ఇక 2014లో మిస్కిన్ డైరెక్షన్లో వచ్చిన ‘పిశాసు’ (తెలుగులో ‘పిశాచి’) చిత్రం ఆడియన్స్ను ఆకట్టుకోగలిగింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పిశాసు’ సినిమాకు సీక్వెల్గా ‘పిశాసు 2’ తీస్తున్నారు మిస్కిన్. సీక్వెల్లో ఆండ్రియా మెయిన్ లీడ్ రోల్ చేశారు. మార్చిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘డీమాంటి కాలనీ’ ఫ్రాంచైజీ గురించి హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి తెలిసే ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘డీమాంటి కాలనీ 2’ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేసింది. కాగా ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ దర్శకుడు అజయ్.ఆర్ జ్ఞానముత్తు ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్గా ‘డీమాంటీ కాలనీ 3’ని ఆల్రెడీ ప్రకటించారు. ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. రిలీజ్ మాత్రం 2026లో ఉండొచ్చు.ప్రకటించారు... కానీ..!కోలీవుడ్లో కొన్ని హిట్ ఫిల్మ్స్కు సీక్వెల్స్ ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమాలు ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్పైకి వెళ్లలేదు. ఆ సినిమాలేవో చదవండి.విదేశాల్లో డిటెక్టివ్ విశాల్ కెరీర్లోని వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్లో ‘తుప్పరివాలన్’ ఒకటి. మిస్కిన్ డైరెక్షన్లోని ఈ మూవీ తెలుగులో ‘డిటెక్టివ్’గా విడుదలై, ప్రేక్షకులను మెప్పించింది. అప్పట్నుంచే ఈ మూవీకి సీక్వెల్ తీయానులనుకున్నారు విశాల్. మిస్కిన్ డైరెక్షన్లోనే ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు విశాల్. అయితే కథ విషయంలో మిస్కిన్కు, విశాల్కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. ఆ తర్వాత ‘డిటెక్టివ్ 2’కి తానే దర్శకత్వం వహించాలనుకున్నారు విశాల్.తన స్టైల్ ఆఫ్ ‘డిటెక్టివ్ 2’తో తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నానని, ఇది తన పాతికేళ్ల కల అని, ఇందుకోసం లండన్, అజర్ బైజాన్, మాల్తా వంటి లొకేషన్స్ను పరిశీలిస్తున్నానని గత ఏడాది మార్చిలో విశాల్ పేర్కొన్నారు. కానీ ‘డిటెక్టివ్ 2’ చిత్రం ఇంకా సెట్స్పైకి వెళ్లలేదని తెలుస్తోంది. ఇలా విశాల్ నుంచి ‘డిటెక్టివ్ 2’ అప్డేట్ రావాల్సి ఉంది. అలాగే విశాల్ హీరోగా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇరంబుదురై’ మూవీ 2018లో రిలీజై, హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందనే టాక్ వినిపిస్తోంది. బాక్సింగ్ రౌండ్ 2 నాలుగు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ‘సార్పట్టై పరంబర’ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైంది. పా. రంజిత్ డైరెక్షన్లోని ఈ మూవీకి వీక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ‘సార్పట్టై పరంబర’ సినిమా సీక్వెల్ను థియేటర్స్లో రిలీజ్ చేయాలని పా. రంజిత్ భావించారు. 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర’ సినిమాకు సీక్వెల్గా ‘సార్పట్టై రౌండ్ 2’ ప్రకటించారు. అయితే ఈ మూవీపై మరో అప్డేట్ రావాల్సి ఉంది.తని ఒరువన్ 2 రవి మోహన్ (‘జయం’ రవి తన పేరును ఇటీవల రవి మోహన్గా మార్చుకున్నారు) హీరోగా మోహన్ రాజా డైరెక్షన్లో వచ్చిన ‘తని ఒరువన్’ మూవీ గుర్తుండే ఉంటుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ మూవీ 2015లో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘తని ఒరువన్ 2’ని ప్రకటించారు మోహన్ రాజా. అయితే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్’తో రవి మోహన్ బిజీగా ఉండటం వల్ల ‘తని ఒరువన్ 2’ చేయడానికి వీలు పడలేదు. ఈ ఏడాది ఈ సినిమాను సెట్స్కు తీసుకువెళ్లే సాధ్యసాధ్యాలను రవి మోహన్ పరిశీలిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాని కూడా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇక ‘తన్ ఒరువన్’ మూవీ తెలుగులో ‘ధృవ’ (రామ్ చరణ్ హీరోగా నటించారు)గా రీమేక్ అయి, విజయం సాధించిన సంగతి తెలిసిందే. – ముసిమి శివాంజనేయులు -
ఇండియన్–3 సినిమాపై శంకర్ ప్రకటన
నటుడు కమలహాసన్(Kamal Haasan), శంకర్(S. Shankar) కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ఇండియన్.. ఏఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 1996లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. 26 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్గా ఇండియన్–2 రూపొందింది. అదే దర్శకుడు, నటుడు నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఇకపోతే దర్శకుడు శంకర్ తొలిసారిగా తెలుగులో రామ్చరణ్ కథానాయకుడుగా తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. బడ్జెట్లో బ్రహ్మాండంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సక్సెస్ఫుల్గా ప్రదర్శించబడుతోంది. దీంతో దర్శకుడు శంకర్ మరో చిత్రం ఏంటన్న విషయంపై జరుగుతున్న చర్చకు ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇండియన్–3 (Indian 3) చిత్రంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసి ఆరు నెలల్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా తన దర్శకత్వంలో వేల్పారి అనే చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చెప్పారు. మదురై ఎంపీ ఎస్ వెంకటేశన్ రాసిన రచించిన నవల ఆధారంగా కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీన్ని మూడు భాగాలుగా రూపొందించనున్నట్లు చెప్పారు.బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఇండియన్-2గత ఏడాదిలో విడుదలైన ఇండియన్ 2 మూవీ భారతీయ సినీ చరిత్రలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజైన ఈ చిత్రం 73 కోట్ల (నెట్) వరకు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కమల్హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. తెలుగులో కూడా భారతీయుడు 2 మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఫుల్ థియేట్రికల్ రన్లో పదమూడు కోట్లు మాత్రమే కలెక్షన్స్ అందుకుంది. సుమారు రూ. 12 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొంది. -
నాన్నకు తెలియకుండా దేవాలయాలకు వెళ్లేదాన్ని.. కారణం ఇదే: శృతిహాసన్
నటుడు కమలహాసన్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో ఉంటుంది. ఆయన గురించి ఎంత చెప్పినా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఆయన్ని చిత్ర పరిశ్రమలో ఎన్సైక్లోపిడియా అంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కమలహాసన్ నిత్య విద్యార్థి కూడా. అలాంటి కమల్ వారసుల ప్రతిభ గురించి ఇంకా చెప్పాలా. ఆయన పెద్ద కూతురు శృతిహాసన్ ఇప్పుడు ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. సంగీత దర్శకురాలు, గాయనీ, గీత రచయిత అంటూ ఆమెలో అదనపు ప్రతిభ కూడా ఉంది. తన తల్లిదండ్రుల గురించి ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పే శృతిహాసన్కు తండ్రి కమలహాసన్ అన్నా, తల్లి సారిక అన్నా చాలా ప్రేమ, గౌరవం. వాళ్లు విడిపోయినా, శృతిహాసన్ ఆ విషయాన్ని గౌరవిస్తారు. దీని గురించి ఇటీవల ఒక సమావేశంలో పేర్కొంటూ తన తల్లిదండ్రులు విడిపోవడం బాధాకరమేనన్నారు. అయితే విడిపోవడం వల్ల స్త్రీకి స్వేచ్ఛ వస్తుందని తనకు అప్పుడే తెలిసిందన్నారు. అదే విధంగా ఆర్థికపరమైన విషయాల గురించి తనకు అప్పుడే అవగతం అయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే తన తల్లికి దైవభక్తి ఎక్కువని, తన తండ్రి నాస్తికుడన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఇంట్లో దేవుడి పేరు వినిపించేది కాదన్నారు. ఇక దేవాలయాలకు వెళ్లే అవకాశమెక్కడుంటుందని అన్నారు. అలాంటిది కొంత కాలం తరువాత దేవుడిపై నమ్మకం ఏర్పడిందన్నారు. దీంతో తన తండ్రికి తెలియకుండా దేవాలయాలకు వెళ్లి వచ్చేదానినని చెప్పారు. ఆ అనుభవం చాలా ప్రత్యేకంగా ఉండేదన్నారు. ఇప్పటికీ ఆ అనుభవాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే తాను దేవాలయానికి వెళ్లే విషయాన్ని తన తండ్రికి తెలియకుండా చాలా కాలం జాగ్రత్త పడ్డానని పేర్కొన్నారు. దైవభక్తితో తనలో శక్తి పెరిగిందని అన్నారు. దైవభక్తే తననీ స్థాయికి చేర్చిందనే అభిప్రాయాన్ని నటి శృతిహాసన్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈమె నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. తదుపరి నటుడు ధనుష్తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం.. మన్మోహన్ సింగ్ మృతిపై సినీ ప్రముఖులు
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు. నెహ్రూ, ఇందిర, మోదీ తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్తగా ఆయన పేరు పొందారు. ఆర్థిక మంత్రిగా దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావిగా ఎప్పటికీ గుర్తుంటారు. మన్మోహన్ సింగ్ మృతిపై సినీ ప్రముఖులు చిరంజీవి, కమల్ హాసన్ సంతాపం తెలిపారు. వారికి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు.చిరంజీవి తన ఎక్స్ పేజీలో ఇలా పంచుకున్నారు. 'మన దేశంలో గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్సింగ్ ఒకరు. ఆయన ఉన్నత విద్యావంతులు, అత్యంత మృదుస్వభావి, వినయపూర్వకమైన నాయకుడు మన్మోహన్ సింగ్. ఆర్థిక మంత్రిగా అతని దార్శనికత దేశానికి ఎంతో ఉపయోగపడింది. వరుసగా రెండు పర్యాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన చరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు. అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా, పర్యటక శాఖ సహాయ మంత్రిగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆయన మరణం మన దేశానికి తీరని నష్టం. మన్మోహన్సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి !!' అంటూ చిరు పేర్కొన్నారు.తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా మన్మోహన్సింగ్కు సంతాపం తెలిపారు. ' భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. నిశ్శబ్ద గౌరవం కలిగిన వ్యక్తి, అతను తన దూరదృష్టితో కూడిన ఆర్థిక, సామాజిక విధానాల ద్వారా దేశాన్ని పునర్నిర్మించారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మందికి ఉపయోగపడ్డాయి. భారతదేశం పురోగతి విషయంలో సమాజంలోని ప్రతి మూలకు ప్రభుత్వ లక్ష్యాలు చేరేలా నిర్ధారిస్తూ.. సమగ్రత, సామాజిక న్యాయం పట్ల లోతైన నిబద్ధతతో అతని పాలన కొనసాగింది. ఆయన వారసత్వం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' కమల్ హాసన్ పేర్కొన్నారు.మాజీ ప్రధానికి మోహన్ బాబు సంతాపం..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల టాలీవుడ్ నటుడు మోహన్ బాబు సంతాపం తెలిపారు. ఆయన గొప్ప దార్శనికత కలిగిన నాయకుడని కొనియాడారు. అసాధారణ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మరణించడం బాధాకరమని.. ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక రంగంపై చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. రాజ్యసభలో ఆయనతో కలిసి పనిచేసిన ఘనత నాకు దక్కడం అదృష్టమన్నారు. ఆయన తెలివితేటలు, రాజనీతిజ్ఞత అందరికీ స్ఫూర్తినిచ్చాయని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. -
రిలేషన్షిప్ ఓకే.. పెళ్లంటేనే భయంగా ఉంది: శృతి హాసన్
ప్రేమలో పడ్డప్పుడు గాల్లో తేలుతుంటారు. అదే బ్రేకప్ అయ్యాక ఈ ప్రేమాగీమా జోలికే వెళ్లొద్దని బలంగా ఫిక్సవుతుంటారు. కానీ కొన్నాళ్లకు మళ్లీ లవ్లో పడటం.. చివరకూ అదీ బ్రేకప్ అవడం చూస్తూనే ఉన్నాం. కొన్నేళ్లుగా శాంతను హజారికతో ప్రేమలో ఉన్న శృతి హాసన్(Shruti Haasan) ఇటీవల అతడికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను హీరోయిన్ డిలీట్ చేయడంతో ఇది నిజమేనని అంతా ఫిక్సయిపోయారు. అంతే కాదు పెళ్లిపై ఆసక్తి కూడా లేదని తేల్చి చెప్పింది.ప్రేమ ఓకే, పెళ్లే వద్దు!తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి వివాహం గురించి మాట్లాడింది. 'రిలేషన్షిప్స్ అంటే నాకిష్టం. ఆ ప్రేమ, అనుబంధాలన్నీ నచ్చుతాయి. ప్రేమలో మునగడం ఇష్టమే కానీ పెళ్లి చేసుకుని ఒకరితో ఎక్కువ అటాచ్ అవ్వాలంటేనే భయంగా' ఉంది అని చెప్పుకొచ్చింది. తన పేరెంట్స్ కమల్ హాసన్ (Kamal Haasan)- సారిక(Sarika) గురించి మాట్లాడుతూ.. నేను అందమైన కుటుంబంలో జన్మించాను. మా అమ్మానాన్న ఈ ప్రపంచంలోనే ఉత్తమ జంట అని భావించాను. విడిపోతేనే హ్యాపీ అంటే..ఇద్దరూ కలిసి పని చేసుకునేవారు. కలిసే సెట్స్కు వెళ్లేవారు. అమ్మ కాస్ట్యూమ్ డిజైన్స్ చేసేది. సంతోషంగా, సరదాగా ఉండేవాళ్లం. కానీ ఎప్పుడైతే వాళ్లిద్దరూ విడిపోయారో అంతా మారిపోయింది. మా కుటుంబమంతా బాధపడ్డాం. కలిసుండటానికి ప్రయత్నించారు, కానీ కుదర్లేదు. అయినా బలవంతంగా కలిసుండటం కన్నా విడిపోతేనే సంతోషంగా ఉంటామనుకుంటే అది మాక్కూడా మంచిదే! అని చెప్పుకొచ్చింది.సినిమా..ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ కూలీ సినిమాలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ సలార్ 2లోనూ భాగం కానుంది. కాగా కమల్- సారిక 1988లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2004లో కమల్- సారిక విడాకులు తీసుకున్నారు.చదవండి: షాకింగ్.. యూట్యూబ్ నుంచి పుష్ప 2 సాంగ్ డిలీట్ -
మాస్ మెచ్చిన క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’
హీరో మానసికంగా ఎదగనివాడు... హీరోయిన్ అప్పటికే ఓ పిల్లాడికి తల్లైన విడో. అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరికీ ముడిపడితే? ఇలాంటి కథతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం. ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట కె.విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమల్హాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్బస్టర్ అద్భుతం ఈ ‘స్వాతిముత్యం’. 1985లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది.కమల్హాసన్ ట్యూన్... గానంమద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమల్హాసన్, రాధిక నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీ రికార్డింగ్ ప్రాణం పోశాయి. ఆత్రేయ, సినారె రాసిన పాటలు మరో అద్భుతం. ఈ సినిమా పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం. స్క్రీన్పై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని..’ అనే పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం వెళ్తుండగా మార్గమధ్యంలో కమల్హాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి పాడారు. ఆ వెర్షన్తోనే షూటింగ్ చేశారు. ఆ తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. ఇదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్ ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెరమీదకు వచ్చింది.రాజ్కపూర్ హార్ట్ టచ్ అయిన వేళబాలీవుడ్ రారాజు రాజ్ కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ నుండి ఏ సినిమా తీసినా బొంబాయిలో రాజ్ కపూర్కు చూపించడం కె. విశ్వనాథ్కు అలవాటు. అలాగే ‘స్వాతిముత్యం’ కూడా చూశారాయన. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్ వెనక్కి తిరిగి విశ్వనాథ్తో... మీరు నా హార్ట్ టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమల్హాసన్, విశ్వనాథ్లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్ కపూర్ ముచ్చటపడ్డారు. శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమల్హాసన్కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ, తర్వాత ఎందుకనో అది కుదరలేదు. అయితే... మూడేళ్ల తర్వాత అనిల్ కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’ పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే హిందీలో రీమేక్ చేశారు. అక్కడా హిట్ అయింది. తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ను తమిళ, మలయాళంలో డబ్ చేయగా మంచి విజయం సాధించాయి. అయితే 2003లో సుదీప్ కన్నడలో రీమేక్ చేయగా అది ఆకట్టుకోలేకపోయింది.కమల్ మనవడిగా అల్లు అర్జున్‘స్వాతిముత్యం’లో మరో విశేషం ఉంది.. ఇందులో రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనవడు మాస్టర్ కార్తీక్ నటించగా... కమల్హాసన్ మనవడిగా అల్లు అరవింద్ కొడుకు ఇప్పటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. మనవరాళ్లుగా అరవింద్ మేనకోడళ్లు విద్య, దీపు తెరపైకి వచ్చారు. అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక.. ఆ ఏడాది (1985) తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్ బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ కొట్టారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరుమీదున్నారు. బాక్సాఫీస్ ఖైదీ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా, రాక్షసుడు’ లాంటి హిట్స్తో పోటీపడుతున్నారు. నాగార్జున ‘విక్రమ్’తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’తో మాస్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడితో, నాన్ కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది . స్వాతిముత్యం’. అదీ... వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం. స్వాతిముత్యం.... ఓ నిరంతర స్ఫూర్తితెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమల్హాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్కు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియా ఫిల్మ్ కూడా ఇదే. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి.– దాచేపల్లి సురేష్కుమార్ -
నవ రసాలు + నవ రసాలు + నవ రసాలు= కమల్ హాసన్
లోక నాయకుడు కమల్ హాసన్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల విలక్షణ నటుడు ఆయన. నవరసాలను అద్భుతంగా పండించగలడని మాత్రమే మనకు తెలుసు. కానీ కమల్ హాసన్ 27 రకాల రసాలను కూడా పండించగలడు. అదేంటి భావోద్వేగాలు తొమ్మిది రకాలుగా మాత్రమే ఉంటాయి కదా అంటారా? అది తప్పు అట. మనిషిలో మొత్తం 27 రకాల ఎమోషన్స్ ఉంటాయని చెబుతోంది కాలిఫోర్నియా యూనివర్సీటీ. వాటి పేర్లను కూడా పేర్కొంది. అయితే ఈ 27 రకాల ఎమోషన్స్ని పండించిన ఏకైక హీరో కమల్ హాసన్ మాత్రమేనని ఆయన అభిమానుల మాట. దానికి సంబంధించిన ఓ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో కమల్ హాసన్ పాత సినిమాల్లోని కొన్ని సీన్లను ఈ 27 రకాల ఎమోషన్స్తో ముడిపెడూతూ.. అన్ని రకాల భావోద్వేగాలు పండించగల ఏకైన నటుడు కమల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. మరి లోకనాయకుడు కమల్ హాసన్ పండించిన 27 రకాల ఎమోషన్స్ని చూసేయండి. #KamalHaasan expressing all the 27 types of emotions denoted by University of California Berkeley❤️😍🔥💪pic.twitter.com/igpfyz0Llk— Nammavar (@nammavar11) November 29, 2024 -
నవరసాలు కాదు.. 27 రసాలు పండించిన ఏకైక నటుడు ఈయన (ఫొటోలు)
-
ఆల్ టైమ్ క్లాసిక్... నాలుగు దశాబ్దాల సాగర సంగమం
సాగర సంగమం... నృత్యంలోనే సుఖాన్ని, దుఃఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఓ నిస్వార్థ కళాకారుని కథ ఇది. 1983 జూన్ 3న తెలుగులో ‘సాగర సంగమం’గా రూపొందించి, తమిళంలో ‘సలంగై ఒలి’గా, మలయాళంలో ‘సాగర సంగమం’గా అనువదించి, విడుదల చేశారు. మూడు భాషల్లోనూ ఒకే రోజు విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ‘శంకరాభరణం’ అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కె. విశ్వనాథ్–నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో కళా ఖండం ‘సాగర సంగమం’.‘సప్తపది’ తర్వాత నృత్య కళాకారుడి జీవితం నేపథ్యంలో కమల్హాసన్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు దర్శకులు కె. విశ్వనాథ్. ఈ చిత్రానికి చేగొండి హరిరామజోగయ్య, అల్లు అరవింద్, వీవీ శాస్త్రి నిర్మాతలు. సంగీత దర్శకుడిగా ఎమ్మెస్ విశ్వనాథన్ ని ఎంపిక చేసుకొని మ్యూజిక్ సిట్టింగ్స్ ఆరంభించారు. ఆ సినిమా ఆగిపోయింది. ‘సీతాకోక చిలుక’ తర్వాత తనతో సినిమా చేయడానికి వచ్చిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి ఈ ఆగిపోయిన సినిమా కథను వినిపించారు విశ్వనాథ్. అది నచ్చడంతో నిర్మాణ పనులు మొదలు పెట్టారు ఏడిద నాగేశ్వరరావు.ముందుగా ఈ సినిమాకు వేరే పేరు అనుకున్నారు. నిజానికి ఏడిద నాగేశ్వరరావు ‘సీతాకోక చిలుక’ సినిమాకు ముందుగా ‘సాగర సంగమం’ టైటిల్ పెడదామనుకున్నారు. కానీ చివరగా ‘సీతాకోక చిలుక’ను ఖరారు చేశారు. అప్పట్లో ఈ సినిమా టైటిల్ ఏడిద నాగేశ్వరరావు దగ్గరే ఉంది. ‘సాగర ‡సంగమం’కి ముందుగా ‘మహా మనిషి’తో పాటు పలు టైటిల్స్ పరిశీలనకు వచ్చాయి. కానీ ‘సీతాకోక చిలుక’ సినిమా కోసం అనుకున్న ‘సాగర సంగమం’ను ఈ సినిమాకు పెట్టారు. కె. విశ్వనాథ్, కమల్హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం కూడా ఇదే.నిరాకరించిన కమల్హాసన్హీరో పాత్రకు కమల్హాసన్ ని సంప్రదించగా ఆయన నిరాకరించారు. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తాయన్నది కమల్ భయం. పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన ‘కడల్ మీన్గళ్’ అనే తమిళ మూవీ ఫ్లాప్ కావడంతో ఆయన ఆ సెంటిమెంట్ను బలంగా పట్టుకున్నారు. అయితే.. ఆ పాత్రను కమల్తోనే చేయించాలని ఏడిద నాగేశ్వరరావు ఐదారు నెలలు ఆయన వెంటపడి బతిమాలి మరీ ఒప్పించారట. ఇక హీరోయిన్ గా ముందు జయసుధను అనుకున్నారు.ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు క్లాసికల్ డ్యాన్స్ తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలనుకున్నారు విశ్వనాథ్. ఆ సమయంలో డ్యాన్స్ నేర్చుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజను ఆ పాత్రకు నిర్మాత నాగేశ్వరరావే సిఫార్సు చేశారట. ‘శంకరాభరణం’తో మంచి పేరు తెచ్చుకున్న మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్లి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపించారు.ఆ పాట కోసం 30 అడుగుల బావి సెట్ఈ సినిమాను మద్రాసు, విశాఖ, హైదరాబాద్, ఊటీలో చిత్రీకరించారు. ‘వేవేల గోపెమ్మలా...’ పాటను విశాఖ భీమిలి బీచ్లో ఉన్న పార్క్ హోటల్లో, అందులో వచ్చే ఊహా దృశ్యాలను మద్రాసులోని విజయా గార్డెన్స్లో తీశారు. జయప్రద ఇంట్లో జరిగే సన్నివేశాలు, ‘మౌనమేలనోయి...’ పాట, సముద్రపు ఒడ్డులోని సన్నివేశాల్నీ విశాఖలోనే షూట్ చేశారు. ‘ఓం నమఃశివాయ’ పాటను హైదరాబాదులో చిత్రీకరించారు. పత్రికా కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్లోని ఈనాడు కార్యాలయంలో తీశారు.మద్యం మత్తులో బావి మీదున్న పైపుపై కమల్హాసన్ డ్యాన్స్ చేసే ‘తకిట తథిమి...’ సాంగ్ను మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో 30 అడుగుల బావి సెట్ వేసి తీశారు. ‘నాద వినోదము...’ పాటను ఊటీలో తీశారు. శాంతారాం తీసిన ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే, నవరంగ్’ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన గోపీకృష్ణ ఈ పాటకు డ్యాన్స్ డైరక్షన్ చేశారు. ఆయన ఈ పాట కోసమే ప్రత్యేకంగా బొంబాయి నుండి వచ్చారు.క్లైమాక్స్లో వచ్చే ‘వేదం అణువణువున నాదం...’ పాట చిత్రీకరణకు ముందు కమల్ కాలికి ఓ హిందీ సినిమా షూటింగులో తీవ్రమైన గాయమైంది. దాంతో నెల రోజులపాటు షూటింగ్ ఆగింది. అప్పటికీ ఆయన కోలుకోలేదు. అడుగు తీసి అడుగేసే పరిస్థితి లేదు. అయినా సినిమా రిలీజ్కు లేటవుతుందని కమల్ ఆ పాటకు డ్యాన్స్ చేయడానికి ముందుకొచ్చారు. షాట్ అనగానే డ్యాన్స్ చేయడం కట్ చెప్పగానే కింద పడిపోవడం. అలా ఆ పాట పూర్తి చేశారు.ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన రాజేంద్రప్రసాద్ శరత్బాబుతో కలిసి సరదాగా డబ్బింగ్ థియేటరుకి వచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్ను నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అడగడంతో ఈ సినిమాలో శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్కు డబ్బింగ్ చెప్పారు. జయప్రద భర్తగా చేసిన మోహన్ శర్మకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. ‘వేవేల గోపెమ్మలా...’ పాటలో దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు.రెండు జాతీయ అవార్డులతో సహా...‘సాగర సంగమం’ విడుదలై నాలుగు దశాబ్దాలవుతోంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా గురించి అక్కడక్కడా ప్రస్తావన వస్తుంటుంది. నాటి ఈ క్లాసిక్ది సినీ చరిత్రలో ప్రత్యేకమైన పేజీ. ఈ ‘ఆల్ టైమ్ క్లాసిక్’ చిత్రం ఉత్తమ సంగీతదర్శకత్వం (ఇళయరాజా), ఉత్తమ నేపథ్య గాయకుడు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)... విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఇంకా నంది అవార్డులతో పాటు పలు అవార్డులను కూడా దక్కించుకుంది. – అలిపిరి సురేష్ -
ఫ్యాన్స్కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు
టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్లో కూడా ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తుందనే చెప్పాలి. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. తమిళ చిత్రాలు విషయానికొస్తే భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా రూపొందిన భారతీయుడు – 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ చిత్రానికి 3వ సీక్వెల్ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా తాజాగా విడులైన సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. కంగువ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ నిర్మాణానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన భారతీయుడు చిత్రం 1996లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అది తెర రూపం దాచడానికి 28 ఏళ్లకు పైగా పట్టింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా భారతీయుడు – 3 చిత్రాన్ని కూడా ఏకకాలంలో రూపొందించారు. అయితే భారతీయుడు – 2 చిత్రం విడుదలై డిజాస్టర్గా నిలిచింది. దీంతో పార్ట్ – 3 విడుదల సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ సిద్ధంగా లేరని తెలిసింది. అదేవిధంగా భారతీయుడు– 2 మాదిరిగా పార్ట్- 3 కాకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని నటుడు కమలహాసన్ దర్శకుడు శంకర్కు సూచించినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రూ.100 కోట్లు ఉంటేనే..భారతీయుడు – 3 చిత్రం కోసం ఆయన నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ.100 కోట్లు బడ్జెట్ను సమకూర్చమని చెప్పినట్లు సమాచారం. కాగా శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు రామ్చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది. ఆ తర్వాత భారతీయుడు– 3 చిత్ర రీషూట్కు శంకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. -
మళ్ళీ భారతీయుడి 3 పై రూమర్లు..
-
నన్ను అలా పిలవొద్దు: కమల్ హాసన్
‘ఉలగనాయగన్స్ , విశ్వ నటుడు, లోక నాయకుడు’... ఇలా కమల్హాసన్స్ ను ఆయన అభిమానులు ప్రేమగా, ఆ΄్యాయంగా పిలుచుకుంటుంటారు. అయితే ఇకపై తనను ఆ తరహా స్టార్ ట్యాగ్స్తో పిలవొద్దని, కమల్ హాసన్స్ అని పిలిస్తే చాలంటూ ‘ఎక్స్’లో ఓ లేఖను షేర్ చేశారు కమల్ హాసన్స్ . ‘‘నా పనిని మెచ్చి, నాకు ఎన్నో బిరుదులు ఇచ్చిన నా అభిమానులు, ప్రేక్షకులు, నా తోటి నటీనటులకు కృతజ్ఞతలు. ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు కలిస్తే ఓ సృజనాత్మక సినిమా అవుతుంది. కళ కంటే కళాకారుడు గొప్ప కాదని నా అభిప్రాయం.అలాగే ఓ వ్యక్తిగా నా మూలాలకు నేను కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. సినిమా రంగంలో నిత్య విద్యార్థిగా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దయచేసి ఇకపై నన్ను ఎవరూ బిరుదుల పేర్లతో పిలవొద్దు. ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. కమల్ హాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని పిలిస్తే చాలని నా ఫ్యాన్స్, నా తోటి నటీనటులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులను కోరుకుంటున్నాను’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారాయన. ఇక కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్’ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. -
నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్
తమిళ హీరో కమల్ హాసన్ పనైపోయిందని అందరూ అనుకున్నారు. అలాంటి టైంలో 'విక్రమ్' మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ఏడాది 'ఇండియన్ 2' రూపంలో దెబ్బ తగిలినప్పటికీ.. 'కల్కి'లో డిఫరెంట్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో తనవంతు ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మీడియా మిత్రులు, అభిమానులని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.'నా పనిని మెచ్చి 'ఉలగనాయగన్' లాంటి ఎన్నో బిరుదులు ఇచ్చినందుకు థ్యాంక్యూ. ప్రేక్షకులు, సహ నటీనటులు, ఆత్మీయులు నుంచి ఇలాంటి ప్రశంసలు నన్నెంతగానో కదిలించాయి. సినిమా విషయంలో నేను నిత్య విద్యార్థిని. ఇండస్ట్రీలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింత ఎదగాలని ఆశిస్తున్నాను. కళా కంటే కళాకారుడు గొప్ప కాదనేది నా నమ్మకం. ఎంతో ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాను. స్టార్ ట్యాగ్స్ని మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నాను'(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)'నా అభిమానులు, మీడియా, సినీ ప్రముఖులు.. నన్ను కమల్ హాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని పిలవండి చాలు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బిరుదులతో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు థ్యాంక్స్. మూలాలకు కట్టుబడి ఉండాలని, నటుడిగా బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.కమల్ హాసన్ అనే కాదు తమిళ హీరో అజిత్ కూడా గతంలో ఇలానే చేశాడు. తనని వేరే పేర్లతో పిలవొద్దని.. అజిత్ కుమార్ లేదా అజిత్ అని పిలవండి చాలు అని రిక్వెస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్.. ట్రోలర్స్కు అదిరిపోయే పంచ్)உங்கள் நான்,கமல் ஹாசன். pic.twitter.com/OpJrnYS9g2— Kamal Haasan (@ikamalhaasan) November 11, 2024 -
రజినీకాంత్ VS కమల్ హాసన్ బాక్సాఫీస్ ఫైట్
-
థగ్ లైఫ్ కూడా ఇండియన్ 2 లాగా..
-
స్టైల్ మార్చిన మణిరత్నం.. కమల్ 'థగ్ లైఫ్' రిలీజ్ ఫిక్స్
మణిరత్నం సినిమాలంటే క్లాస్, కూల్గా ఉంటాయి. చివరగా తీసిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలు మాత్రం పీరియాడికల్ గ్రాండియర్స్. కాకపోతే వీటికి తమిళంలో తప్పితే మిగతా ఏ భాషలోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'థగ్ లైఫ్' మూవీ చేస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)విడుదల తేదీ ప్రకటిస్తూ ఓ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్తో పాటు శింబుని కూడా చూపించారు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కి తోడు యాక్షన్ కట్ వచ్చేలా చూపించారు. విజువల్స్ చూస్తుంటే మణిరత్నం ఈసారి ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైన్ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. వచ్చే ఏడాది జూన్ 5న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో కమల్తో పాటు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, అభిరామి, నాజర్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?) -
ఆస్పత్రిలో చేరిన హీరో కమల్ హాసన్ సోదరుడు
ప్రముఖ నటుడు, దర్శకుడు చారు హాసన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ఈయన కుమార్తె, ఒకప్పటి హీరోయిన్ సుహాసిని చెప్పుకొచ్చింది. దీపావళి పండగ ముందు అంటే గురువారం రాత్రి చారు హాసన్.. అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'దీపావళికి ముందే మా నాన్న అస్వస్థతకు గురయ్యారు. మా పండగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు' అని సుహాసిని తన్ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, కమల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
'అమరన్' మూవీ ట్విటర్ రివ్యూ
వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం అమరన్. కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్, సాయి పల్లవి జోడిగా నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, సోని పిక్చర్స్ సంస్థలు కలసి నిర్మించిన ఈ చిత్రానికి జీవీ. ప్రకాశ్కుమార్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్లతో పాటు ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు వేశారు. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంన్నారు.ఆర్మీ బ్యాక్డ్రాప్లో సినిమా అంటేనే అందరిచూపు అటువైపే ఉంటుంది. అందుకే సినిమా అభిమానులు అందరూ అమరన్ సినిమావైపు పడింది. శివకార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో అదరగొట్టాడని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఇందు రెబెకా జాన్ పాత్రలో సాయిపల్లవి నటన సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్పాయింట్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. మొదటి భాగంలో శివకార్తికేయన్, సాయిపల్లవి మధ్య వచ్చే ప్రతి సీన్ సూపర్ అంటూ మెంచుకుంటున్నారు.ఈ సినిమా భారత ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. దేశ సైనికుల ధైర్య సాహసాలను తెరపై చక్కగా దర్శకుడు ఆవిష్కరించారని కొనియాడారు. సినిమా చూస్తున్న ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి కలిగించే చిత్రం అమరన్ అంటూ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ఓవర్సీస్, తమిళనాడులో చాలా చోట్ల 'అమరన్' సినిమాను ఒకరోజు ముందుగానే వేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో బ్లడ్ బాత్, ఆల్ఫా సన్నివేశాలు కిర్రాక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 'అమరన్'లో చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'తుపాకీ' సినిమాలో మెప్పించిన కొన్ని యాక్షన్ సీన్స్ లాంటివి ఇందులో కూడా ఉన్నాయంటూ హింట్ ఇస్తున్నారు. వార్ సీన్స్ కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించాడని ప్రశంసలు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ 15 నిమిషాల పాటు కన్నీళ్లను పెట్టిస్తుందని చాలామంది తెలుపుతున్నారు. ఆ సీన్లో సాయిపల్లవి తన యాక్టింగ్తో ఇరగదీసిందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.#Sivakarthikeyan𓃵 joins the Big league of #Rajinikanth #KamalHaasan #ajith #vijay from today 🔥🔥 #Amaran career defining movie for #SK @Siva_Kartikeyan pic.twitter.com/OqFuAOeiIU— Wetalkiess (@WeTalkiess) October 31, 2024Positive Reviews all over World ✅🌟#Amaran Blockbuster 💥 pic.twitter.com/booGzL9uiJ— Troll Unwanted Haters (@wanted_Hater67) October 31, 2024Amaran - 💔😭 🔥🔥#Amaran is undoubtedly one of the finest biographical films to hit the screens recently. Sai Pallavi delivered exceptional performances, making their characters unforgettable📈Sai Pallavi❤🦋> Full movie#USA #Amaran #AmaranFDFS #Sivakarthikeyan #SaiPallavi pic.twitter.com/ihiRu7Nhd2— Hari (@hariharanr0) October 31, 2024The first half of #Amaran is packed with emotion 🤌💥💥FOLLOW ✅️SK and Sai Pallavi acting 👌 , As usual GV cooked well 🎶 No Single lag till Now , Screen Play - Terrific ⚡#Sivakarthikeyan Last 15 Minutes of Interval " BLAST " 🔥#AmaranFDFS #BloodyBeggar #LuckyBaskhar pic.twitter.com/hPz9Xs1EP5— JD X PAGE (@holic2024) October 31, 2024#Amaran | Stunning FIRST HALF 🧨💥SK and Sai Pallavi acting 👌 , As usual GV cooked well 🎶 No Single lag till Now , Screen Play - Terrific ⚡ @Siva_Kartikeyan Last 15 Minutes of Interval " BLAST " 🔥 pic.twitter.com/MU5zjup8C6— Let's X OTT GLOBAL (@LetsXOtt) October 31, 2024#Amaran True tribute to Major Mukundan. Sai Pallavi & #Sivakarthikeyan are true emotion of the movie. Worth watching 🔥🫡. One of the best movies of SK— Cine Crick Madie (@diszzCinema) October 31, 2024 -
ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్న కమల్ హాసన్..
-
మిషన్ మేకోవర్
ఇప్పుడు కమల్హాసన్ మిషన్ ఏంటంటే... ‘మేకోవర్’ అన్నమాట. కొత్త సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు కమల్హాసన్. ఆయన హీరోగా ‘కేజీఎఫ్’ ఫైట్ మాస్టర్స్ అన్బు–అరివుల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను ప్రకటించారు. అయితే ‘ఇండియన్’ సీక్వెల్స్ ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలతో పాటు ‘థగ్ లైఫ్’ చిత్రంతో కమల్హాసన్ బిజీగా ఉన్నారు.ఈ కారణంగా అన్బు–అరివులతో కమల్హాసన్ సినిమా సెట్స్పైకి వెళ్లలేదు. ‘ఇండియన్ 2’ విడుదల కాగా, ‘ఇండియన్ 3, థగ్ లైఫ్’ చిత్రాలను కమల్ పూర్తి చేశారు. దీంతో అన్బు–అరివులతో చేయాల్సిన సినిమాను వచ్చే జనవరి నుంచి సెట్స్పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా కోసం కమల్హాసన్ స్పెషల్ మేకోవర్ అవుతున్నారు. ఆయన తాజా లుక్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరోవైపు ‘ఇండియన్ 3, థగ్ లైఫ్’ రిలీజ్కు రెడీ అవుతున్నాయి. -
ఓటీటీ రిలీజ్కు ఇండియన్ 3?
‘ఇండియన్ 3’ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ కానుందా? అంటే అవుననే సమాధానాలే కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరవైఎనిమిదేళ్ల తర్వాత ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్స్గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలను తెరకెక్కించారు దర్శకుడు శంకర్. రెండు సీక్వెల్స్లోనూ కమల్హాసన్ హీరోగా నటించారు. ‘ఇండియన్ 2’ విడుదలైన ఆరు నెలల తర్వాత ‘ఇండియన్ 3’ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ ఏడాది జూలై 12న ‘ఇండియన్ 2’ థియేటర్స్లో విడుదలైంది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లభించలేదు. దీంతో ‘ఇండియన్ 3’ విడుదల మరింత ఆలస్యం అవుతుందని, వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్సెస్ ఉన్నాయని కోలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే ‘ఇండియన్ 2’ సక్సెస్ కాని నేపథ్యంలో ‘ఇండియన్ 3’ సినిమాను డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అని చిత్రయూనిట్ ఆలోచిస్తోందనే టాక్ కోలీవుడ్లో ప్రచారంలోకి వచ్చి0ది. మరి... తమిళ పరిశ్రమలో ప్రచారంలో ఉన్నట్లుగా ‘ఇండియన్ 3’ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదలవుతుందా? అనేది చూడాలి. ఇక ‘ఇండియన్ 3’ సినిమాను లైకాప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... నయనతార, సిద్ధార్్థ, మాధవన్, మీరా జాస్మిన్ లీడ్ రోల్స్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ది టెస్ట్’. శశికాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం కూడా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే ప్రచారం కోలీవుడ్లో సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
ఒకటి..రెండు..మూడు.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!
ఒకటో సారి... రెండో సారి... మూడోసారి... అంటూ వేలం పాట నిర్వహించడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒకటో భాగం.. రెండో భాగం... మూడో భాగం... ఇలా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సినిమాలు మొదటి భాగం హిట్ అయితే రెండో భాగం తీస్తున్నారు. సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్ అయ్యిందంటే మూడో భాగం రూపొందిస్తున్నారు. మరికొన్నేమో రెండో భాగం షూటింగ్ దశలో ఉండగానే ముందుంది మూడో భాగం అంటూ ప్రకటించేస్తున్నారు. మూడో భాగం సీక్వెల్స్ విశేషాల్లోకి వెళదాం... పుష్ప: ది రోర్ ‘తగ్గేదే లే..’ అంటూ ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. తాము కూడా తగ్గేదే లే అంటూ ఆ సినిమాకి పాన్ ఇండియా హిట్ని అందించారు ఆడియన్స్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ వంటివారు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్ కావడంతో సేమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమాని పక్కాగా తీసుకురావాలని అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీమ్ కష్టపడుతున్నారు. లేటుగా వచ్చినా బ్లాక్బస్టర్ కొట్టాలనే ఆలోచనతో పని చేస్తోంది టీమ్. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి మూడో భాగం ఉంటుందని, ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్ని కూడా ఖరారు చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరిగిన 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అక్కడ ‘పుష్ప: ది రైజ్’ని ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘అన్నీ అనుకూలంగా ఉంటే ‘పుష్ప’ మూడో భాగం తీసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇలా మూడో భాగంపై ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. అయితే ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్ ఇతర ప్రాజెక్టులు చేశాక ‘పుష్ప’ మూడో భాగం చేస్తారని, ఇందుకు చాలా టైమ్ పట్టవచ్చని టాక్. ఆర్య 3 అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ (2004) హిట్ అయింది. వారి కాంబినేషన్లో ఆ మూవీకి సీక్వెల్గా వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం అందుకుంది. ఈ సినిమాకి మూడో భాగం కూడా రానుంది. ఓ సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆర్య 3’ సినిమా ఉంటుంది... అయితే ఎప్పుడు సెట్స్కి వెళుతుందనేది చెప్పలేను’’ అని పేర్కొన్నారు. నాలుగింతల వినోదం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 2– ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. సేమ్ కాంబినేషన్లో ఈ మూవీకి సీక్వెల్గా రెండో భాగం ‘ఎఫ్ 3’ని తెరకెక్కించారు. 2022 మే 27న రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. ‘ఎఫ్–3’కి కొనసాగింపుగా ‘ఎఫ్– 4’ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాతగా ఓ సినిమా ప్రకటన ‘వెంకీఅనిల్03’ (వర్కింగ్ టైటిల్) రావడంతో అందరూ ‘ఎఫ్–4’ అనుకున్నారు. అయితే ఇది ‘ఎఫ్–4’ కాదని చిత్రయూనిట్ స్పష్టత ఇచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందుతోన్న ‘వెంకీఅనిల్03’ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని ఫిల్మ్నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’తో పోలిస్తే ‘ఎఫ్–4’ లో వినోదం నాలుగింతలు ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మూడో కేసు ఆరంభం ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), ‘హిట్: ది సెకండ్ కేస్’(2022) వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ‘హిట్: ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ‘హిట్: ది సెకండ్ కేస్’లో అడివి శేష్ కథానాయకుడిగా నటించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన హీరో నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో తానే లీడ్ రోల్లో నటిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆఫీసర్ అర్జున్ సర్కార్గా కనిపించబోతున్నారు నాని. 2025 మే 1న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ కొలను స్పష్టం చేశారు. వేసవిలో భారతీయుడు కమల్హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 3’ (‘భారతీయుడు). కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా జూలై 12న విడుదలైంది. అయితే తొలి భాగం అందుకున్న విజయాన్ని మలి భాగం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రెండో భాగం సమయంలోనే ‘భారతీయుడు 3’ చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి చేసిందట యూనిట్. 2025 వేసవిలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.కేజీఎఫ్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ (2018) సినిమా పాన్ ఇండియా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చివర్లో రెండో భాగం ఉంటుందని ముందే ప్రక టించింది యూనిట్. యశ్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోనే వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ 2022లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీలో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ ప్రీ ్ర΄÷డక్షన్ పనుల్ని దాదాపు పూర్తి చేశారట ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమాలు బ్లాక్బస్టర్గా నిలవడంతో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ పై కర్నాటకలోనే కాదు... పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్గా నిలవడంతో సెకండ్ పార్ట్ ‘కార్తికేయ 2’ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. 2022 ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో నిఖిల్, చందు కలయికలో రానున్న ‘కార్తికేయ 3’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కార్తికేయ 3’ ఉంటుందంటూ ఈ ఏడాది మార్చి 16న సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు నిఖిల్. ‘‘చందు మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీ (‘కార్తికేయ 3’) సంబంధించిన స్క్రిప్ట్ వర్క్పై పని చేస్తున్నారు. స్పాన్, స్కేల్ పరంగా ‘కార్తికేయ 3’ చాలా పెద్దగా ఉండబోతోంది. డా. కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్’ మూవీ తీస్తున్నారు చందు మొండేటి. అటు నిఖిల్ ‘స్వయంభూ’, ఇటు చందు ‘తండేల్’ పూర్తయ్యాక ‘కార్తికేయ 3’ రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. 'నవ్వులు త్రిబుల్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి సీక్వెల్గా వచ్చిన రెండో భాగం ‘టిల్లు స్క్వేర్’ ఈ ఏడాది మార్చి 29న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ. 125 కోట్ల వసూళ్లు సాధించి సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘టిల్లు పాత్రపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ‘టిల్లు క్యూబ్’లో టిల్లు పాత్రను సూపర్ హీరోగా చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఫిల్మ్నగర్ టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మత్తు కొనసాగుతుందిశ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలై, హిట్గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూడా రితేష్ రానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. మొదటి, ద్వితీయ భాగాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అటు ఇంటర్వ్యూలో, ఇటు సక్సెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ రితేష్ రానా ‘మత్తు వదలరా 3’ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. పొలిమేరలో ట్విస్టులు‘సత్యం’ రాజేష్ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్గా నిలవడంతో ‘పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్. ‘సత్యం’ రాజేష్, బాలాదిత్య, కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొలిమేర 3’. మొదటి రెండు భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చేతబడితో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రేజీ థ్రిల్లర్గా రూపొందిన తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పొలిమేర 3’లో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేష్ తెలిపారు. – డేరంగుల జగన్ -
థగ్లైఫ్ షూటింగ్ పూర్తి.. భారీ ధరకు డిజిటల్ రైట్స్
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం థగ్లైఫ్. మణిరత్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు శింబు, నటి త్రిష, జోజూ జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని కమలహాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్, రెడ్జెయింట్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. 36 ఏళ్ల క్రితం మణిరత్నం, కమలహాసన్ కాంబోలో రూపొందిన చిత్రం నాయకన్ (నాయకుడు). ఆ తరువాత ఇన్నాళ్లకు వీరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం థగ్ లైఫ్. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. కాగా ఇది నటుడు కమలహాసన్ నటిస్తున్న 233వ చిత్రం కావడం గమనార్హం. అదే విధంగా ఆయన ఇందులో 3 పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో దానికి సంబందించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. థగ్లైఫ్ చిత్రం వ్యాపారం మొదలైందని సమాచారం. ఈ చిత్ర డిజిటల్ హాక్కులను రూ.150 కోట్లకు విక్రయించినట్లు తాజాగా సమాచారం. ఇంత పెద్దమొత్తంలో డిజిటల్ వ్యాపారం ఇంతకు ముందు ఏ చిత్రానికి జరగలేదనే ప్రచారం సాగుతోంది. కాగా థగ్లైఫ్ చిత్రాన్ని వచ్చే ఏడాది మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర వర్గాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
తగ్ లైఫ్ తో తగ్గేదేలే అంటోన్న కమల్..!
-
ఖైరతాబాద్ గణేశ్ దగ్గర కమల్ హాసన్ డ్యాన్స్.. ఏ సినిమానో తెలుసా?
హైదరాబాద్లో వినాయక చవితి అంటే అందరూ ఖైరతాబాద్ గణేశుడి గురించే మాట్లాడుకుంటారు. అంతలా పాపులార్ అయిపోయింది. ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు ఈ మహా గణపతిని దర్శించుకున్నారు. తాజాగా హుస్సేన్సాగర్లో నిమజ్జనం కూడా చేశారు. ఇంతలా పాపులర్ అయిన ఖైరతాబాద్ వినాయకుడని గతంలో ఓ తెలుగు సినిమాలో కూడా చూపించారని మీలో ఎంతమందికి తెలుసు?హైదరాబాద్లో వినాయకుడు అంటే ఖైరతాబాద్ మాత్రమే అనేంతలా గుర్తింపు వచ్చింది. ఇందుకు తగ్గట్లే ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకని నిర్వహిస్తున్నారు. గతంలో అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర విలక్షణ నటుడు కమల్ హాసన్ డ్యాన్స్ వేశాడు. మీరు సరిగానే విన్నారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్?)1983లో రిలీజైన 'సాగరసంగమం' సినిమా కమల్ హాసన్కి తెలుగు నాట ఎంత పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఓ చోట ఖైరతాబాద్ వినాయకుడిని చూపిస్తారు. అక్కడ కమల్ క్లాసికల్ డ్యాన్స్ చేస్తాడు.అయితే 1983లో జూన్లో 'సాగరసంగమం' సినిమా రిలీజైంది. ఆ ఏడాది సెప్టెంబరులో వినాయక చవితి వచ్చింది. రెండు చోట్ల ఉన్నది ఒకే వినాయకుడు. అంటే ఆ ఏడాది సినిమా కోసం చాలాముందుగానే గణేశుడి ప్రతిమ తయారు చేయించారనమాట. ఏదేమైనా అప్పట్లో ఖైరతాబాద్ వినాయకుడు సినిమాల్లో ఉన్నాడనమాట.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్) -
అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే..
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేడు ప్రతి రంగంలోనూ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) హవా జోరుగా సాగుతోంది. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన కోర్సును నేర్చుకోవడానికి ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' అమెరికా వెళ్లినట్లు తెలిసింది.టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే కుతూహలం ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు అమెరికాలో ఓ టాప్ యూనివర్సిటీలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ కోర్సు వ్యవధి 90 రోజులు ఉన్నప్పటికీ కమల్ 45 రోజులు ఈ కోర్సు నేర్చుకోవడానికి సమయం కేటాయించనున్నట్లు సమాచారం.ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్.. ఏఐ నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లడం చాలా గొప్ప విషయం. టెక్నాలజీ పట్ల ఆయనకు ఎంత మక్కువ ఉందో తెలుసుకోవడానికి ఇదోక ఉదాహరణ. కొత్త నైపుణ్యాలు భారతీయ సినిమాపై గణనీయమైన ప్రభావం చూపుతాయని, ఏఐ చిత్రనిర్మాణంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని చాలామంది ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెరగనున్న పెట్రోల్ ధరలుకమల్ హాసన్ సన్నిహితుల ప్రకారం.. భవిష్యత్తులో నిర్మించే ఆయన ప్రాజెక్టులు ఏఐ సాంకేతికతతో వస్తాయని తెలుస్తోంది. తనకు కొత్త టెక్నాలజీ మీద అమితమైన ఆసక్తి ఉందని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే కమల్ సినిమాలలో ఏఐ టెక్నాలజీ ఉందనునందని స్పష్టమవుతోంది. -
బిగ్బాస్ హోస్ట్గా విజయ్ సేతుపతి
బిగ్బాస్ ఎనిమిదో సీజన్కు రంగం సిద్ధమైంది. అదేంటి? ఆల్రెడీ మొదలైంది అంటారా! అవును, తెలుగులో మూడు రోజులక క్రితమే లాంచ్ అయింది. ఇప్పుడు చెప్పుకోబోయేది తమిళ బిగ్బాస్ గురించి! అక్కడ కూడా ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తమిళ బిగ్బాస్ ఎనిమిదో సీజన్ షురూ కానుంది.మొన్నటిదాకా లోకనాయకుడు.. ఇప్పుడు!అయితే ఇప్పటివరకు కమల్ హాసనే షో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కానీ ఈసారి హోస్టు మారాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి రంగంలోకి దిగాడు. ఈ విషయాన్ని బిగ్బాస్ టీమ్ అధికారికంగా ప్రోమో ద్వారా వెల్లడించింది. విజయ్ సేతుపతి బిగ్బాస్ హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిన అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.అనుభవజ్ఞుడేసేతుపతికి గతంలో మాస్టర్ చెఫ్ (తమిళ్) షో హోస్ట్ చేసిన అనుభవం ఉంది. కాబట్టి అతడు బిగ్బాస్ను కూడా రఫ్ఫాడించడం ఖాయంగా కనిపిస్తోంది. బిగ్బాస్ తమిళ్ ఎనిమిదో సీజన్ విజయ్ టీవీలో ప్రసారం కానుంది. అలాగే హాట్స్టార్లో 24 గంటల లైవ్ కూడా చూడొచ్చు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తమిళ 'బిగ్బాస్'హోస్ట్ రేసులో ముగ్గురు స్టార్ హీరోలు
తమిళ 'బిగ్బాస్' రియాల్టీ షో కోసం కొత్త హోస్ట్ వచ్చేస్తున్నాడు. ఏడు సీజన్ల వరకు లోకనాయుడు కమల్ హాసన్ హోస్ట్గా సక్సెస్ఫుల్గా నడిపారు. కమల్ ఇమేజ్తో ఈ షో పట్ల కోలీవుడ్లో మంచి బజ్ ఉంది. అక్కడ రేటింగ్స్ కూడా బాగానే బిగ్ బాస్ రాబట్టాడు. మరో కొద్దిరోజుల్లో సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి తాను హోస్ట్గా పనిచేయడంలేదని ప్రకటించారు. దీంతో కొత్తగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.2017లో తమిళ్లో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి హోస్ట్గా కమల్ హాసన్ ఉన్నారు. అయితే, వచ్చే సీజన్లో తాను హోస్ట్గా కొనసాగడంలేదని చెప్పారు. తను ఒప్పుకున్న సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్ వెల్లడించారు. కమల్ స్థానాన్ని భర్తి చేసేందుకు కోలీవుడ్ హీరో శింబు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ నుంచి వైదొలిగినప్పుడు శింబు బిగ్ బాస్ అల్టిమేట్ షోను హోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ షోను హోస్ట్ చేసేందుకు శింబు రానున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై శింబు మేనేజర్ ఇలా తెలిపాారు. 'బిగ్ బాస్ షోకు నటుడు శింబు హోస్ట్ చేయబోతున్నాడన్న సమాచారంలో నిజం లేదని.. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని' ఆయన చెప్పారు. శింబు తర్వాత విజయ్ సేతుపతి, సూర్య పేర్లు ఆ లిస్ట్లో కనిపిస్తున్నాయి. సరికొత్తగా రమ్యకృష్ణ పేరును కూడా బిగ్ బాస్ యూనిట్ పరిశీలిస్తుందట. మరొ కొద్దిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. -
'బిగ్బాస్' హోస్టింగ్ నుంచి తప్పుకొన్న కమల్.. కారణమదే
ప్రముఖ హీరో కమల్ హాసన్.. బిగ్ బాస్ షో నుంచి తప్పుకొన్నాడు. తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పాడు. త్వరలో తెలుగు, తమిళంలో కొత్త సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో కమల్ ట్వీట్ ఇప్పుడు అభిమానులకు షాకిచ్చింది.(ఇదీ చదవండి: 'జాతిరత్నాలు' హీరో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడా?)'ఏడేళ్ల క్రితం మొదలైన మా ప్రయాణంలో చిన్న విరామం. సినిమా కమిట్మెంట్స్ వల్ల రాబోయే బిగ్బాస్ సీజన్కి హోస్టింగ్ చేయట్లేదు. ఈ విషయాన్ని చాలా బాధతో చెబుతున్నా. ఈ షో ద్వారా ఇంటింటికీ చేరువైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అలా బిగ్ బాస్ తమిళ షోని భారతీయ టీవీ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్గా నిలిపారు. హోస్ట్గా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. ఈ క్రమంలోనే భాగమైన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు' అని కమల్ హాసన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.రీసెంట్గా 'కల్కి'లో విలన్గా ఆకట్టుకున్న కమల్.. 'భారతీయుడు 2'తో హీరోగా ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ఈయన చేతిలో ప్రస్తుతం థగ్ లైఫ్, భారతీయుడు 3 సినిమాలు ఉన్నాయి. 'కల్కి 2' ఉంది కానీ అదెప్పుడో సెట్స్పైకి వెళ్తుందో తెలీదు. కమల్ తప్పుకొన్నాడు సరే మరి ఈయన స్థానాన్ని భర్తీ చేసే కొత్త హోస్ట్ ఎవరా అనేది పెద్ద ప్రశ్న. ఇదిలా ఉండగా తెలుగులో మాత్రం నాగార్జునే కొత్త సీజన్కి హోస్టింగ్ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))என்றும் உங்கள் நான்.@vijaytelevision pic.twitter.com/q6v0ynDaLr— Kamal Haasan (@ikamalhaasan) August 6, 2024 -
ఓటీటీలోకి 'భారతీయుడు 2'.. అధికారిక తేదీ ప్రకటన
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన చిత్రానికి సీక్వెల్గా దీన్ని తెరకెక్కించారు. దాదాపు నాలుగేళ్ల పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొని షూటింగ్ పూర్తి చేసి.. గత నెలలో థియేటర్లలో రిలీజ్ చేశారు. టాక్ తేడా కొట్టేయడంతో ఇప్పుడు అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు అధికారిక తేదీ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)కమల్ హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన 'భారతీయుడు'.. 1996లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. లంచగొండితనం కాన్సెప్ట్ అప్పట్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. దీనికి సీక్వెల్ని తాజాగా జూలై 12న థియేటర్లలో రిలీజ్ చేశారు. కట్ చేస్తే కమల్ కెరీర్లోనే ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. కథాకథనాలు మరీ తీసికట్టుగా ఉన్నాయని ఆడియెన్స్ తేల్చేశారు.ఇకపోతే భారతీయుడు 2 సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ముందు అనుకున్న ప్రకారం 6-8 వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఫ్లాప్ టాక్ రావడంతో ప్లాన్ మారింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఆగస్టు 9 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీలో రిలీజ్ ఉంటుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)Thatha varaaru, kadhara vida poraaru 🔥#Indian2 is coming to Netflix on 9 August in Tamil, Telugu, Malayalam and Kannada!#Indian2OnNetflix pic.twitter.com/cJN0JWaprp— Netflix India South (@Netflix_INSouth) August 4, 2024 -
కమ్ బ్యాక్ కోసం ట్రై చేస్తున్న కమల్, రజిని
-
వయనాడ్ కోసం కమల్ హాసన్ భారీ విరాళం
కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జులై 29 నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మఖ్యంగా వయనాడ్ ప్రాంత ప్రజలు భారీగ నష్టపోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలు చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ సాయం చేసి అండగా నిలిచారు. అయితే, తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా భారీ విరాళం అందించారు.మక్కల్ నీది మయ్యం అనే రాజకీయ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ సినిమాలతో పాటు సామాజిక అంశాలపై తన నిబద్ధతను ప్రదర్శింస్తారు. భారీ వర్షాల వల్ల వయనాడ్ ప్రజలు తీరని కష్టాలను ఎదుర్కొంటుకున్నారు. వారిని ఆదుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు విరాళంగా అందించారు. చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తుగా ఈ ఘటన మిగిలిపోతుందని ఆయన కామెంట్ చేశారు. చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో సుమారు 320 మందికి పైగా మరణించారు. 250 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రాణాలతో బయటపడినవారి కోసం వెతకడానికి డ్రోన్ ఆధారిత రాడార్ సాంకేతికతను అక్కడి ప్రభుత్వం అనుసరిస్తుంది.కమల్ హాసన్కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో గతం నుంచే సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కమల్ హాసన్ చేసిన విరాళం చాలా ముఖ్యమైనది. ఆయనతో బలమైన బంధాన్ని పంచుకున్నారు. వారిద్దరూ కూడా అనేక సందర్భాల్లో భేటీ అయిన విషయం తెలిసిందే. -
భారతీయుడు 2 చిత్రానికి ఓటీటీ చిక్కులు
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు 2 సినిమాకు ఓటీటీ చిక్కులు ఎదురుకానున్నాయని తెలుస్తోంది. జులై 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్గా మిగిలిపోయింది. సినిమాలో డైరెక్టర్ శంకర్ మార్క్ ఎక్కడా కనిపించకపోవడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆదరించలేదు. సినిమాపై ఆశలు పెట్టుకుని భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. దీంతో భారతీయుడు 2 ఓటీటీ విషయంలో సందిగ్ధత నెలకొనే అవకాశాలు ఉన్నాయి.1996లో విడుదలైన భారతీయుడు సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్గా పార్ట్ 2 వచ్చింది. ఇందులో కమల్ హాసన్తో పాటుగా సిద్ధార్, రకుల్ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు. సినిమా విడుదలకు ముందు భారీ బజ్ క్రియేట్ కావడంతో భారతీయుడు 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సుమారు రూ.120 కోట్లకు డీల్ సెట్ చేసుకుందని సమాచారం. అయితే, సినిమా విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది. దీంతో డీల్ ప్రకారం ఉన్న అంత మొత్తం చెల్లించేందుకు నెట్ఫ్లిక్స్ ముందుకు రావడం లేదట. ఈమేరకు లైకా ప్రొడక్షన్స్తో మళ్లీ చర్చలు జరిపి రూ. 60 కోట్లకు ఫైనల్ చేయాలని కోరిందట. ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో భారతీయుడు ఓటీటీలో వచ్చేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో రజనీకాంత్ 'లాల్ సలామ్', టైగర్ ష్రాఫ్ 'గణపత్' కూడా నెట్ఫ్లిక్స్లో ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. భారతీయుడు 2 కోసం సుమారు రూ. 250 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా.. అయితే, ఈ సినిమా రూ. 120 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. -
ఆస్పత్రి పాలైన హీరో కమల్ హాసన్ సోదరుడు.. ఏమైందంటే?
ప్రముఖ హీరో కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్ ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఈయన వయసు 93 ఏళ్లు. ఈ వయసులో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు హాస్పిటల్లో చేర్చారు. ఈ క్రమంలోనే ఈయన కూతురు, ప్రముఖ నటి సుహాసిని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తండ్రి పరిస్థితి గురించి ఆసక్తికరంగా రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నాం.. హీరో రాజశేఖర్ ట్వీట్)కమల్ హాసన్కి చారు హాసన్ అన్నయ్య. వీళ్లిద్దరి మధ్య 15 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇకపోతే చారు హాసన్ కి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సుహాసిని ఇందులో ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో అప్పట్లో హీరోయిన్ గా చాలాగుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తోంది.ఇదిలా ఉండగా నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చారు హాసన్.. 1979 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. 93 ఏళ్ల వయసులోనూ 'హర' అనే సినిమాలో నటించారు. తాజాగా ఆరోగ్య రీత్యా వచ్చే సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం తన తండ్రికి ఏం పర్లేదని, కోలుకుంటున్నారని సుహాసిని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
70 ఏళ్ళ వయసులో యాక్షన్ ఫిల్మ్స్ తో అదరగొడుతున్న కమల్...
-
ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 1996లో విడుదలైన భారతీయుడు సూపర్ హిట్ దక్కించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్గా పార్ట్ 2 జులై 12న విడుదలైంది. అయితే, సినిమా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్తో పాటుగా సిద్ధార్, రకుల్ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు.భారతీయుడు 2 సినిమాను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. కోలీవుడ్లో అత్యంత ఎక్కువ ధరతో ఈ సినిమా రైట్స్ను వారు తీసుకున్నట్లు సమాచారం. విడుదల సమయం నుంచి సుమారు 2 నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావలనే షరతుతో నెట్ఫ్లిక్స్ అగ్రిమెంట్ చేసుకుందట. వారి ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 12 తర్వాత ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమా రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. భారీ డిజాస్టర్గా మిగిలింది. ఇప్పటి వరకు కనీసం రూ.70 కోట్లు కూడా దాటలేదు. భారీ బడ్జెట్తో తెరకెక్కడంతో నిర్మాతలకు కూడా తీరని నష్టాన్ని ఇండియన్ 2 సినిమా మిగిల్చిందనే చెప్పవచ్చు.భారతీయుడు 2 చిత్రాన్ని ఇప్పటికే చాలాచోట్ల తొలగించేశారు. ఓటీటీలో చూడొచ్చని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోయారు. దీంతో ఈ చిత్రాన్ని అగ్రిమెంట్ ప్రకారం కాకుండా నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందట. ఆగష్టు 2న భారతీయుడు 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నెట్ఫ్లిక్స్ మంతనాలు జరుపుతుందట. ఈమేరకు అధికారికంగా త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. -
కమల్ హాసన్ 'కలి' కాదు.. 'కల్కి' సీక్రెట్స్ బయటపడ్డాయ్!
'కల్కి' సినిమా వచ్చి నెలరోజులు దగ్గరైపోయింది. వేరే సినిమాలేం సరైనవి లేకపోవడంతో ఇప్పటికీ చాలా చోట్ల విజయవంతంగా రన్ అవుతోంది. మూవీ గురించి ఇప్పటికీ ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసిన నితిన్ జిహానీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 'కల్కి' నుంచి సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)'మీరు 'కల్కి'లో చూసింది ఒక్క కాంప్లెక్స్ మాత్రమే. కానీ ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఏడు కాంప్లెక్స్లు ఉంటాయి. వీటన్నింటినికీ సుప్రీం యాష్కిన్ నాయకుడు. కంటికి కనిపించని అద్భుత శక్తి 'కలి' దిగువన ఇతడు పనిచేస్తుంటాడు' అని నితిన్ జిహానీ చెప్పుకొచ్చాడు.'కల్కి' చూసిన తర్వాత చాలామంది కమల్ హాసన్.. కలి పాత్రధారి అనుకున్నారు. కానీ నితిన్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే కలి, సుప్రీం యాష్కిన్ వేర్వేరు అని క్లారిటీ వచ్చేసింది. అలానే ఏడు కాంప్లెక్స్లు అంటే నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్లో రాబోయే సినిమాల్లో వీటిని చూపిస్తారేమో? దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేశాడో ఏంటో?(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్కి కూడా!) View this post on Instagram A post shared by SoSouth (@sosouthofficial) -
'ప్రతి ఒక్కరూ మేధావులు అనుకుంటారు'.. బాబీ సింహా షాకింగ్ కామెంట్స్!
అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం భారతీయుడు-2. శంకర్- కమల్ కాంబోలో వచ్చిన ఈ మూవీని 1996లో భారతీయుడుకు సీక్వెల్గా తీసుకొచ్చారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ రావడంతో అందరి చూపు ఇండియన్-2 పైనే ఉంది. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఊహించని షాకిచ్చింది. తొలిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీంతో వసూళ్లు భారీగా పడిపోయాయి. వారం రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాబీ సింహాకు నెగెటివ్ రివ్యూలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఇండియన్-2కు నెగెటివ్ రివ్యూలపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.బాబీ సింహా మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరూ తమకు తాము తెలివైన వారని అనుకుంటారు. సినిమాను విమర్శించడానికి కారణాలను వాళ్లే వెతుక్కుంటారు. మేము అలాంటి వాటిని అస్సలు పట్టించుకోం. కేవలం సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను మాత్రమే గుర్తుంచుకుంటాం. రివ్యూలు ఇచ్చే కొందరు మేధావుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు.అంతే కాకుండా ఇండియన్-3 చూసే వరకు ఇండియన్ -2ని అంచనా వేయకూడదని సూచించారు. అయితే బాబీ సింహా కామెంట్స్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమా నచ్చకపోతే మీ పొరపాట్లను సరిదిద్దుకోవాలని సలహాలు ఇస్తున్నారు. అయితే మరికొందరు బాబీని సమర్థించారు. ఎప్పుడూ నెగెటివ్ రివ్యూలు ఇచ్చే మేధావుల గురించే ఆయన స్పష్టంగా మాట్లాడారని అంటున్నారు.కాగా.. ఇండియన్-2 చిత్రంలో బాబీ సింహా కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో కమల్హాసన్ సేనాపతి పాత్రలో నటించగా.. ఆయనను పట్టుకునే సీబీఐ ఆఫీసర్గా బాబీ మెప్పించారు. ఇందులో సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్, సముద్రఖని కూడా నటించారు. #BobbySimha rather than you blaming audiences, admit the flaws in the movie and try to entertain audiences genuinely. Please re-watch your brilliant performances in #Indian2 again. Don't underestimate audiences.@actorsimha https://t.co/e8l52b9L9y pic.twitter.com/ndyPJNnYhi— Tharan (@jayshah_my) July 19, 2024Bobby Simha criticize the Audience 😐pic.twitter.com/sCBdXzlrDd— Ayyappan (@Ayyappan_1504) July 18, 2024 -
దారుణంగా ఇండియన్-2 కలెక్షన్స్.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
శంకర్ - కమల్ హాసన్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. భారతీయుడు సీక్వెల్గా తీసుకొచ్చిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. తొలి రెండు కలెక్షన్స్ ఫర్వాలేదనిపించినప్పటికీ... ఆ తర్వాత దారుణంగా పడిపోయాయి. వీక్ డేస్లో ఊహించనా కలెక్షన్స్ రాలేదు. తాజాగా ఏడు రోజుల్లో ఇండియన్-2 సినిమాకు ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ 2 అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.ఏడో రోజు ఇండియాలో కేవలం రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూళ్లు సాధించింది. ఇండియన్ 2 మూవీపై మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడం కలెక్షన్స్ను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వారం రోజుల్లో రూ. 121.65కిపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇలాగే కొనసాగితే ఇండియాలో రూ.100 కోట్ల మార్కును చేరుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. కాగా.. ఇండియన్ 2 సినిమాకు మొదటి రోజు రూ. 25.6 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. కాగా. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో నటించారు. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. -
'రెబల్స్ ఆఫ్ కల్కి' వీడియో వైరల్
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది.'బుక్ మై షో'లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇప్పటికీ టికెట్ల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా 'రెబల్స్ ఆఫ్ కల్కి' పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అందులో భారీ యాక్షన్ సీన్స్ను వారు చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూసేయండి. -
దీపావళి రేసులో కమల్ హాసన్.. కాకపోతే నిర్మాతగా!
'కల్కి'లో విలన్గా హిట్ కొట్టిన కమల్ హాసన్.. రీసెంట్గా 'భారతీయుడు 2'గా ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు నెలల గ్యాప్లో నిర్మాతగా యాక్షన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమరన్'. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత సాయిపల్లవి చేస్తున్న తమిళ చిత్రమిది. రాజ్కుమార్ పెరియసామి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఇందులో శివకార్తికేయన్ ముకుందన్ అనే సైనికుడిగా పవర్పుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే విలన్గా హిట్ కొట్టి, హీరోగా ఫ్లాప్ అందుకున్న కమల్.. నిర్మాతగా మరి ఎలాంటి ఫలితం అందుకుంటాడనేది చూడాలి?(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!) -
పేరెంట్స్ విడాకులు.. మేమూ మనుషులమే: అక్షర హాసన్
తల్లిదండ్రులు కమల్ హాసన్- సారిక పేరు మోసిన యాక్టర్స్. అక్క శృతి హాసన్ కూడా సౌత్లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. అక్షర హాసన్ మాత్రం సినీ ఫీల్డులో కాస్త వెనుకబడే ఉంది. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన ఈ బ్యూటీ షమితాబ్ మూవీతో నటిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. వివేగం, కరం కొందాన్, అచ్చం మేడమ్ నానమ్ పయిరప్పు వంటి చిత్రాలతో కోలీవుడ్లోనూ పేరు సంపాదించుకుంది. కానీ స్టార్ స్టేటస్కు మాత్రం దూరంగానే ఉండిపోయింది.ఒంటరిగా వదిలేయలేదుతాజాగా ఈ బ్యూటీ తన పేరెంట్స్ విడాకులు తమను ఎంత బాధపెట్టాయో వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సెలబ్రిటీ పిల్లలమైనంత మాత్రాన మాకు ఎమోషన్స్ ఉండవా? మేమూ మనుషులమే! తల్లిదండ్రులు విడిపోతే అందరూ ఎలా బాధపడతారో మేమూ అలాగే బాధపడ్డాం. కానీ వారు మమ్మల్ని ఒంటరిగా వదిలేయలేదు. ఎంతో ప్రేమ చూపించారు. ఇద్దరి మధ్య ఎన్ని ఉన్నా పేరెంట్స్గా మాకు అండగా నిలబడ్డారు.అండగా నిలబడ్డ శ్రుతి హాసన్కొన్నిసార్లు నాకేదైనా అవసరమైతే మా అక్క దగ్గరకు వెళ్లేదాన్ని. స్కూల్లో కొందరు ఏడిపిస్తున్నారని, కొట్టాలని ఉందని చెప్తే హింస వద్దని సూచించేది. తను రంగంలోకి దిగి పరిస్థితులు చక్కబెట్టేది. మేము ఒకరి కోసం ఒకరం నిలబడతాం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే మా కుటుంబంలో అందరం ఒకరికొకరు సపోర్ట్గానే ఉన్నారు. ఆ ప్రేమానురాగాలను అలాగే కొనసాగించాం' అని పేర్కొంది. కాగా కమల్- సారిక 2002లో విడిపోగా 2004లో విడాకులు తీసుకున్నారు.చదవండి: ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్ -
ఇండియన్-2 పై నెగెటివ్ టాక్.. మేకర్స్ కీలక నిర్ణయం!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయుడు మూవీకి సీక్వెల్గా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే ఇండియన్-2 నిడివి ఎక్కువగా ఉండడం.. శంకర్ మార్క్ కనిపించలేదంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.అయితే నిడివి ఎక్కువగా ఉండడం.. మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 3.04 నిమిషాల రన్టైమ్తో థియేటర్లలోకి వచ్చిన ఇండియన్-2 నిడివి తగ్గించినట్లు లైకా ప్రొడక్షన్స్ తాజాగా ట్వీట్ చేసింది. దాదాపు 12 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు వెల్లడించింది. మీకు దగ్గర్లోని థియేటర్కు రన్ టైన్ తగ్గించిన ఇండియన్-2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేశారు. పడిపోయిన వసూళ్లుఇండియన్-2కు మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఇండియావ్యాప్తంగా కేవలం రూ.65 కోట్లకు పైగా వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో కమల్ అవినీతిపై పోరాడే సేనాపతి పాత్రలో కనిపించారు. ఇందులో సముద్రఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. Witness the enhanced version of #Indian2 🇮🇳✂️ Now presenting a streamlined edition trimmed by 12 min. Catch it in cinemas near you for a crisper experience! 💥@IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @actorsimha @anirudhofficial @dop_ravivarman… pic.twitter.com/0reMKOvMIe— Lyca Productions (@LycaProductions) July 17, 2024 -
పూర్తిగా యాక్షన్ హాసన్ గా మారిపోయిన కమల్ హాసన్..
-
మెగా ప్యాన్స్ని భయపెడుతున్న ‘భారతీయుడు’
సాధారణంగా పెద్ద డైరెక్టర్ల సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తే..దాని ఎఫెక్ట్ నెక్ట్స్ ఫిల్మ్పై కచ్చితంగా ఉంటుంది. సదరు డైరెక్టర్తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు కూడా. ఒకవేళ అల్రేడీ సినిమా స్టార్ట్ చేసి ఉంటే.. సదరు హీరో అభిమానులకు టెన్షన్ తప్పదు. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఆ టెన్షన్ పట్టుకుంది. ‘భారతీయుడు 2’ రిజల్ట్ చూసి వారు భయపడిపోతున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.భారతీయుడు 2 రిజల్ట్ చూసిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్తో టెన్షన్ మొదలైంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ డిలే కావడంతో రీలీజ్ పోస్ట్ పోన్ అయింది. అయితే మొన్నటి వరకు చరణ్ ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ప్రకటించాలని టీమ్పై ఒత్తిడి తెచ్చారు. అప్డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడయా వేదికగా శంకర్కి, నిర్మాత దిల్రాజ్కి విజ్ఞప్తులు చేశారు. కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్.. ఇప్పట్లో రిలీజ్ వద్దంటూ వేడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శంకర్పై ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది. భారతీయుడు 2 చిత్రాన్ని నాసిరకంగా తెరకెక్కించారంటూ శంకర్ని విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. ట్రోలింగ్ తప్పదు. అందుకే కొన్నాళ్ల పాటు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని, వీలైతే రిలీజ్ డేట్ని కూడా పోస్ట్పోన్ చేసుకోండి అని చిత్ర యూనిట్కి మెగా ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. -
'భారతీయుడు 2' కంటే 'కల్కి'పైనే కమల్ స్పెషల్ ఇంట్రెస్ట్!
విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇది 'భారతీయుడు 2' మూవీ గురించి అనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయిందని ఈయనకు కూడా తెలిసినట్లు ఉంది. దీంతో పూర్తిగా మర్చిపోయినట్లు ఉన్నారు. మరోవైపు 'కల్కి' సక్సెస్ గురించి ఏకంగా మూడున్నర నిమిషాలు మాట్లాడారు.(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)కమల్ హాసన్ లీడ్ రోల్ చేసిన 'భారతీయుడు 2' రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు ఓ మాదిరి అంచనాలు ఉండేవి. కానీ సినిమా మరీ ల్యాగ్ ఉండటం పెద్ద మైనస్ అయింది. దీంతో ఘోరమైన డిజాస్టర్ దిశగా వెళ్తోంది. మరోవైపు దీనికి రెండు వారాల ముందు రిలీజైన పాన్ ఇండియా మూవీ 'కల్కి'లోనూ సుప్రీం యాష్కిన్ అనే విలన్ పాత్రని కమల్ చేశారు. రెండు మూడు సీన్లలో కనిపించినప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ క్రమంలోనే కమల్ హాసన్ 'కల్కి' బ్లాక్ బస్టర్ కావడంపై స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మూవీ టీమ్ని అభినందిస్తూనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ని ఆకాశానికెత్తేశారు. దాదాపు మూడన్నర నిమిషాలు మాట్లాడారు. 'కల్కి' గురించి చాలా మాట్లాడారు కానీ రిలీజ్ తర్వాత 'భారతీయుడు 2' గురించి ఒక్క ట్వీట్, పోస్ట్, వీడియో గానీ కమల్ పెట్టలేదు. అంటే ఈయనకు కూడా రిజల్ట్ ఏంటే అర్థమైపోయింది అనుకుంటా!(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి) -
సెప్టెంబరులో స్టార్ట్?
ప్రభాస్ ‘సలార్: సీజ్ఫైర్, కల్కి 2898 ఏడీ, కమల్హాసన్ ‘విక్రమ్’, రామ్చరణ్ ‘గేమ్చేంజర్’, యశ్ ‘కేజీఎఫ్’ వంటి భారీ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్గా చేసిన అన్బరివ్ (అన్బు, అరివు ద్వయం)దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ మూవీని ప్రకటించారు. అయితే ‘ఇండియన్ 2’, ‘థగ్ లైఫ్’ సినిమాలతో కమల్ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ‘ఇండియన్ 2’ విడుదలవడం, ‘థగ్ లైఫ్’ చిత్రీకరణ తుదిదశకు చేరుకోవడంతో అన్బరివ్ల సినిమాపై కమల్ దృష్టిసారించారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబరు నుంచి మొదలయ్యేలా కమల్ అండ్ కో సన్నాహాలు చేస్తున్నారట. కమల్హాసన్ , ఆర్.మహేంద్రన్ నిర్మించనున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీని 2025లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
భారతీయుడు-2 మూవీపై అలాంటి ట్వీట్.. డైరెక్టర్పై నెటిజన్స్ ఫైర్!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. 1996లో సూపర్ హిట్గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్గా తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. ఈ చిత్రంలో శంకర్ మార్క్ కనిపించలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇండియన్-2 సినిమాపై ట్వీట్ చేశారు. శంకర్ సార్ నిబద్ధతకు.. కమల్ హాసన్ నటనకు భారతీయుడు-2 చిత్రం నిదర్శనమన్నారు. అద్భుతమైన బీజీఎం అందించిన అనిరుధ్ రవిచందర్కు నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ఇండియన్-3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాసుకొచ్చారు.అయితే ఇది చూసిన నెటిజన్స్ లోకేశ్ కనగరాజ్ ట్వీట్పై మండిపడుతున్నారు. మీరు ఇలాంటి రివ్యూ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇలాంటి జోకులు వేయడం అపండి సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇండియన్-3 కోసం తాము సిద్ధంగా లేమని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మీరు కమల్ సార్ ఫ్యాన్ అయినప్పటికీ.. ఇలా చెప్పడం తగదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దయచేసి కూలీ మూవీ, ఖైదీ, విక్రమ్ లాంటి సీక్వెల్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండని లోకేశ్కు సూచిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నిడివి ఎక్కువైందంటూ బాక్సాఫీస్ వద్ద విమర్శలు ఎదుర్కొంటున్న ఇండియన్-2పై పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో నెటిజన్స్ ఇలా రియాక్ట్ అయ్యారు. #Indian2 is proof of our #Ulaganayagan @ikamalhaasan sir’s commitment to his craft. Kudos to @shankarshanmugh sir for bringing grand visions to life on a massive scale with @anirudhofficial’s scintillating background score for the film! 🤗❤️Can’t wait for #Indian3 🔥🔥— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 13, 2024 -
పొరపాటు సరిదిద్దుకున్న 'భారతీయుడు 2'.. ఇదేదో ముందే చేసుంటే!
తప్పు జరిగిన తర్వాత కానీ సేనాపతి తాతయ్యకి ఎంత పొరపాటు జరిగిందో తెలిసీ రాలేదు. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'భారతీయుడు 2' తొలిరోజు తొలి ఆట నుంచే ఘోరమైన నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రారంభ షోలు చూసిన వాళ్ల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాత మాత్రం టాక్ పూర్తిగా మారిపోయింది. చాలా తక్కువమంది మాత్రమే పాజిటివ్ అన్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే మూవీ టీమ్ పొరపాటు సరిదిద్దుకుంది.యాక్షన్ సినిమాల్లాంటివి అంటే మూడు గంటలు చూస్తారు గానీ డ్రామా ఉండే సినిమాలు ఎంత క్రిస్పీగా ఉంటే అంత బెటర్. ఇలానే తను తీసిన సీన్లపై నమ్మకంతో దాదాపు 3 గంటల నిడివితో 'భారతీయుడు 2'ని డైరెక్టర్ శంకర్.. ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఇంత ల్యాగ్ ఏంట్రా బాబు అని చెప్పి అదే ఆడియెన్స్ సైడ్ చేసేశారు. దీంతో సినిమాలో అనవసరంగా అనిపించిన 20 నిమిషాల సన్నివేశాల్ని ఇప్పుడు తీసేశారు.(ఇదీ చదవండి: Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ)అలా 2 గంటల 40 నిమిషాల ఎడిట్ వెర్షన్ని ఆదివారం నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ న్యూస్ బయటకొచ్చిన వెంటనే.. నెటిజన్లు కూడా తలో రకంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ పనేదో ముందే చేసుంటే కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ అయ్యేదని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా చేతులు కాల్చుకున్న తర్వాత గానీ భారతీయుడు తాతయ్య ఆకులు గుర్తుకురాలేదు!ఇదిలా ఉండగా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 'భారతీయుడు 2' సినిమాకు రూ.12 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెగిటివ్ టాక్, మరోవైపు సీన్లు తీసేసిన దృష్ట్యా ఆడియెన్స్ ఏ మేరకు థియేటర్లకు వెళ్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!) -
'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!
'భారతీయుడు 2' నిన్న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శుక్రవారం నాడు బాగానే ఆక్యుపెన్సీలు కనిపించాయి. తమిళంలో ఇలా కూడా కనిపించలేదు. అయితే సినిమా మరీ అంత కాకపోయినా ఓ మాదిరి అంచనాలతో బరిలో నిలిచింది. కానీ కనీసం అంటే కనీస వసూళ్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. అయితే సినిమాకు ఇలా అవుతుందని కమల్ ముందే పసిగట్టాడా అని సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: భారతీయుడు 2 కలెక్షన్స్.. తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయలంటే?)1996లో వచ్చిన 'భారతీయుడు'.. అప్పట్లో తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సెన్సేషన్ సృష్టించింది. దీనికి సీక్వెల్ తీయాలని చాలా ఏళ్ల క్రితమే అనుకున్నారు. కాకపోతే షూటింగ్లో ప్రమాదం, కరోనా వల్ల లేట్ అయిపోయింది. ఎలాగోలా పూర్తి చేసి తాజాగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. సీక్వెల్ ఒకటే అనుకున్నది కాస్త రెండు భాగాలైంది. ఇప్పుడు రెండో భాగం రిలీజ్ చేయగా, ఆరు నెలల తర్వాత మూడో భాగాన్ని విడుదల చేయనున్నారు.'భారతీయుడు 2' ఫలితాన్ని కమల్ హాసన్ ముందే పసిగట్టేశాడో ఏమో గానీ రిలీజ్కి ముందే తనకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో నిర్మాణ సంస్థ లైకా రెండు భాగాలకు తలో రూ.75 కోట్ల చెప్పున మొత్తంగా రూ.150 కోట్లు ఇచ్చిందట. మిగతా నటీనటులకు మాత్రం ఒక్క మూవీకి అన్నట్లే పారితోషికంగా ఇచ్చారు. ఇక ప్రాజెక్టులో డైరెక్టర్ శంకర్ కూడా భాగస్వామినే. కాబట్టి అతడికి కూడా నష్టాలు గ్యారంటీ. ఓవరాల్గా 'భారతీయుడు 2' వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది కమల్ మాత్రమే అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్బాస్ భోలే షావలి) -
ఓటీటీలో భారతీయుడు.. అప్పటినుంచే స్ట్రీమింగ్..
కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంటాయి. అలాంటివాటిలో భారతీయులు మూవీ ముందు వరుసలో ఉంటుంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 1996లో వచ్చింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది.రెండున్నర దశాబ్దాల తర్వాత దీనికి సీక్వెల్ వచ్చింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ తెలుగులో భారతీయుడు 2, తమిళంలో ఇండియన్ 2, హిందీలో హిందుస్థానీ 2 పేరుతో జూలై 12న విడుదలైంది. ఈ క్రమంలో ఇండియన్ సినిమా ఫస్ట్ పార్ట్ కోసం కొందరు ఓటీటీలో వెతికేస్తున్నారు.అలాంటివారికోసం నెట్ఫ్లిక్స్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ సోమవారం (జూలై 15న) ఇండియన్ మొదటి భాగాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమాను మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే భారతీయుడు 2 చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఫస్ట్ సినిమా ఓ రేంజ్లో ఉందని, కానీ రెండో భాగం దాని దరిదాపుల్లోకి కూడా రాలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. #Indian (1996) by @shankarshanmugh, streams on @NetflixIndia from July 15th. @ikamalhaasan @mkoirala @UrmilaMatondkar @arrahman pic.twitter.com/t7ZAkfk4xP— CinemaRare (@CinemaRareIN) July 13, 2024 చదవండి: 15 ఏళ్లలోనే తొలిసారి.. అత్యంత దారుణమైన కలెక్షన్స్ -
భారతీయుడు 2 మూవీ స్టిల్స్ HD
-
భారతీయుడు 2 కలెక్షన్స్.. ఆ సినిమాకు దరిదాపుల్లో కూడా లేవు
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా జులై 12న ఈ మూవీ విడుదలైంది. ఇందులో కమల్ హాసన్తో పాటుగా సిద్ధార్, రకుల్ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు. అయితే, సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదని చాలామంది క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సినిమాకు మొదటిరోజు కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేదని తేలుతుంది.(చదవండి: : ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ)ఇండియన్ 2 మూవీ తొలిరోజు రూ. 26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ్ వర్షన్లో రూ. 16 కోట్లు వస్తే.. తెలుగులో రూ. 8 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో అయితే మరీ దారణంగా కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్లో మొదటిరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. శంకర్ లాంటి పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ సినిమాకు బాలీవుడ్లో ఇంత తక్కువ కలెక్షన్స్ రావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.2022లో విడుదలైన విక్రమ్ సినిమా మొదటిరోజు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, భారతీయుడు 2 మూవీ మాత్రం విక్రమ్ కలెక్షన్స్కు దరిదాపుల్లో కూడా చేరుకోలేకపోయింది. ఇదే క్రమంలో డైరెక్టర్ శంకర్ చివరి సినిమా రోబో 2.ఓ తొలిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు పైగా రాబట్టింది. భారతీయుడు 2 సినిమా బాగాలేదంటూ ఇప్పటికే మోత్ టాక్ పబ్లిక్లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా తెలంగాణలో ఈ సినిమా టిక్కెట్ల ధరలు పెంచారు. ఈ ప్రభావం భారతీయుడు 2 కలెక్షన్ల మీద భారీగా పడనుంది. ఒక డబ్బింగ్ సినిమాకు టిక్కెట్ల ధరలు పెంచుకోవడం ఏంటి..? అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో సినిమా కదా చూసేద్దామని కుటుంబంతో వీకెండ్లో సినిమా ప్లాన్ చేసుకునే వారు కూడా భారతీయుడు వైపు వెళ్లకుండా చేసేలా టికెట్ల ధరలు ఉన్నాయిని నెటిజన్లు వాపోతున్నారు. -
రెండుసార్లు పరీక్షలు రాశాను.. అయినా ఫెయిల్ కావడంతో..: అక్షర
చదువు వల్ల విజ్ఞానం పెరుగుతుంది. అయితే చదువు లేకపోతే జీవితమే లేదు అనుకోవడం కూడా సరికాదు. పెద్దగా చదువుకోని వారు కూడా జీవితంలో అనుకున్నది సాధించారు, సాధిస్తున్నారు. ఎవరి దాకో ఎందుకు అంబానీ వంటి వారి గురించి కాకుండా, మనందరికీ స్ఫూర్తిదాయకుడు అయిన లోకనాయకుడిగా పిలవబడుతున్న నటుడు కమలహాసన్నే తీసుకుంటే ఆయన ఉన్నత విద్య చదువుకోలేదు. ఆయన జీవితమనే పాఠశాలలో చదువుకుంటూ తనే ఒక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతున్నారు. పలు ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్ల భాషను అద్భుతంగా మాట్లాడగలరు.ఇక ఆయన రెండో వారసురాలు అక్షరహాసన్ కూడా చదువులో కాస్త వెనుకే ఉండేవారు. కమలహాసన్, సారిక దంపతుల వారసులు శ్రుతిహాసన్, అక్షరహాసన్. అక్షరహాసన్ కమలహాసన్ ముద్దుల కూతురు. ఈమె నటిగా మారింది ఎలా అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనకు చదువు పెద్దగా అబ్బలేదన్నారు. తాను పది ఫెయిల్ అని, రెండు సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణత కాలేకపోయానని చెప్పారు. దీంతో తనకు చదువుపై ఆసక్తి లేదని తన తండ్రితో చెప్పానన్నారు. మరో విషయం ఏమిటంటే తన తండ్రి పెద్దగా చదువుకోలేదని, తల్లి సారిక కూడా చిన్న వయసు నుంచే నటించడంతో ఉన్నత చదువులు చదువుకోలేదని చెప్పారు. తాను డాన్స్పై ఆసక్తితో సింగపూర్ వెళ్లి అక్కడ పరీక్ష రాసి నాట్య కళాశాలలో చేరానన్నారు. అయితే దాన్ని కొనసాగించలేకపోయానన్నారు. తరువాత తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బాలీవుడ్లో నటించడానికి ప్రయత్నించానని, అయితే అక్కడ పలు అవకాశాలు మిస్ చేసుకోవడంతో తిరిగి తమిళ చిత్ర పరిశ్రమకు వచ్చినట్లు చెప్పారు. అలా అజిత్ కథానాయకుడిగా నటించిన వివేకం చిత్రం ద్వారా నటిగా పరిచయమైనట్లు చెప్పారు. ఆ తరువాత విక్రమ్ హీరోగా నటించిన కడియారం కొండాన్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినట్లు చెప్పారు. ఇప్పటికీ నటిగా బిజీగా ఉన్నట్లు అక్షరహాసన్ పేర్కొన్నారు. భవిష్యత్లో మరింతగా శ్రమిస్తానన్నారు. -
'భారతీయుడు 2' ఆ ఓటీటీలోనే.. ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఎట్టకేలకు భారతీయుడు తాత థియేటర్లలోకి వచ్చేశాడు. అప్పుడెప్పుడో 1996లో వచ్చిన సినిమాకు సీక్వెల్ని తాజాగా బిగ్ స్క్రీన్పై రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచి మిక్స్డ్ టాక్ వచ్చేసింది. మరోవైపు ఈ చిత్ర ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది కూడా క్లారిటీ వచ్చేసింది. అలానే స్ట్రీమింగ్ డేట్ కూడా ఇదే కావొచ్చని టాక్ కూడా వినిపిస్తోంది.(ఇదీ చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?)కమల్ హాసన్ - శంకర్ కాంబోలో అప్పట్లో వచ్చిన 'భారతీయుడు'.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. తీసింది తమిళంలో అయినా తెలుగు డబ్బింగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక కొన్నేళ్ల క్రితం రెండో భాగాన్ని మొదలుపెట్టగా.. కొవిడ్, షూటింగ్ స్పాట్లో ప్రమాదం వల్ల ఏళ్లకు ఏళ్లు లేట్ అవుతూ వచ్చింది. చివరకు ఎలాగోలా పూర్తి చేసి ఇప్పుడు థియేటర్లలోకి తీసుకొచ్చారు.సినిమా మరీ ల్యాగ్ ఉందని చూసొచ్చిన ప్రేక్షకులు అంటున్నారు. తాతయ్య మరీ విసిగించేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే 'భారతీయుడు 2' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. లెక్క ప్రకారం అయితే 6-8 వారాల తర్వాత రావొచ్చు. కానీ టాక్ తేడాగా వస్తుండటంతో 4-5 వారాల్లోపే వచ్చే అవకాశముంది. దీనిబట్టి చూస్తే ఇండిపెండెన్స్ డే వీక్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు) -
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్: భారతీయుడు 2(ఇండియన్ 2)నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్,సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్కరన్ కథ, దర్శకత్వం: ఎస్.శంకర్సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్రఫీ: రవి వర్మన్విడుదల తేది: జులై 12, 2024కమల్ హాసన్ నటించిన బెస్ట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్(సిద్దార్థ్), హారతి(ప్రియాభవాని శంకర్) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో య్యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో షేర్ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్బ్యాక్ ఇండియా(Comeback India) హ్యాష్ట్యాగ్తో సేనాపతి(కమల్ హాసన్) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌంట్ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్ప్లే కూడా చాలా రొటీన్గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్ లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఇక సెకండాఫ్లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో మర్మకళను ఉపయోగించి సీక్స్ ఫ్యాక్తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్ హాసన్కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్ ఫ్యాక్స్తో కమల్ చేసే యాక్షన్ సీన్కి థియేటర్లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ప్రియురాలు దిశగా నటించిన రకుల్కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్గా ఎస్ జే సూర్యకి పార్ట్ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
భారతీయుడు 2 దెబ్బకు అక్షయ్ వెనక్కి
-
Bharateeyudu 2 X Review: ‘భారతీయుడు 2’ టాక్ ఎలా ఉందంటే.. ?
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు(1996)’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి(కమల్ హాసన్) చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదలైన 28 ఏళ్ల తర్వాత సీక్వెల్గా భారతీయుడు 2(ఇండియన్ 2) వచ్చింది. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న శంకర్.. మరోసారి తనదైన మార్క్ సందేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.Bharateeyudu 2 Telugu Review: ‘భారతీయుడు 2’ మూవీ ఎలా ఉందంటే..?ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘భారతీయుడు కథేంటి?, సేనాపతిగా మరోసారి కమల్ ఆకట్టుకున్నాడా? లేదా? శంకర్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. . ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్లో ‘భారతీయుడు 2’కి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. అంతగా ఆకట్టుకోలేకపోయిందని మరికొంత మంది ట్వీట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా వరకు నెగెటివ్ టాకే వినిపిస్తోంది. కొంతమంది అయితే ఈ చిత్రానికి నిజంగానే శంకర్ దర్శకత్వం వహించాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. #Bharateeyudu2 Movie Review 🔥🔥🔥 1/2Hats off to director #Shankar for his top level direction.#KamalHassan is steel the complete show. Social Message of the movie will reach to every audience.Overall movie wins normal audience heart💐💐#Bharateeyudu2Review#Indian2Review pic.twitter.com/tRB6cidHsV— Movie Muchatlu (@MovieMuchatlu1) July 12, 2024 డైరెక్టర్ శంకర్కి హాట్సాఫ్. అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు. కమల్ హాసన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సోషల్ మెసేజ్ ప్రతి ఆడియన్కి రీచ్ అవుతుంది. నార్మల్ ఆడియన్స్ మనసును కూడా ఆకట్టుకునేలా సినిమా ఉంది’ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. Genuine #Indian2Review/#Bharateeyudu2ReviewDISASTER👎Rating 1.5/5Impactless,Dragged, Boring,Outdated,Cringe Movie👎#Siddharth #KamalHaasan (Less Screen time) &Director #Shankar gone Outdated👎#Indian2 #Bharateeyudu2#Hindustani2Review #Hindustani2 https://t.co/3c9WuK58GK— #Kalki2989AD ❤ (@TheWarriorr26) July 12, 2024 భారతీయుడు 2 డిజాస్టర్ మూవీ. బోరింగ్, ఔడేటెడ్ స్టోరీ. సాగదీశారు. ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. డైరెక్టర్ శంకర్ పని అయిపోయింది’ అంటూ మరో నెటిజన్ కేవలం 1.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. first half: movie starts well, but follows conventional shankar sir’s screenplay making it very predictable and boring.. no gripping/exciting sequences.. needs a very strong second half #Indian2 #Bharateeyudu2 https://t.co/fgOf5prfHJ— movie buff (@newMovieBuff007) July 12, 2024 ఇప్పుడే ఫస్టాఫ్ కంప్లీట్ అయింది. మూవీ ప్రారంభం బాగానే ఉంది. కానీ కథ ముందుగు సాగుతున్నకొద్ది బోరింగ్గా అనిపించింది. శంకర్ స్క్రీన్ప్లే ఆకట్టుకోలేకపోయింది. గ్రిస్పింగ్గా, ఎగ్జైట్మెంట్ చేసే సీక్వెన్స్లేవి లేవు. సెకండాఫ్ బాగుండాల్సి ఉంది’అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.. #Indian2 Review 1.5/5Fully disappointed Bad screenplay Emotions lackIndian 3 kastame... pic.twitter.com/fcaOB7vPHX— 👥𝕳𝖆𝖗𝖘𝖍𝖆💫 (@Harsh___07__) July 12, 2024 ‘సినిమా నిరుత్సాహపరిచింది. స్క్రీన్ప్లే అస్సల్ బాగోలేదు. ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కాలేదు. ఇండియన్ 3 కష్టమే’ అని ఒకరు ట్వీట్ చేశారు.#Indian2 is an outdated and tedious movie. Though the movie tries to give honest messages, it’s done in a boring way with no proper emotion and drama at all. Shankar tried to repeat the screenplay of his old movies but fails to recreate the magic big time. All of the emotions…— Venky Reviews (@venkyreviews) July 12, 2024#Indian2 #Bharateeyudu2 #indian2review Telugu review:It’s just an average to below average movie. There is no story it is just like a set up to Indian3. Yes Indian3 trailer was played after the rolling titles and Indian3 seems pretty interesting and I think Indian3 would be…— Vijay (@vijay827482) July 12, 2024#Bharateeyudu2 #Indian2 Stil remember the first part can't say whether the sequel could match it as the bench mark was high it releases today but there is no buzz at least in Hindi. Why aren't films being promoted ##Kalki2898AD too was released in a similar way. WOM will decide.— Bhaskar Agnihotri (@BHASKARAGNIHOT) July 12, 2024#Indian2 #Bharateeydu2 #Indian2Review #Bharateeydu2Review #Review *Not Engaging at all*No shankar mark*No emotional ConnectDid Shankar directed this movie for real ?— Raju (@rsofficial18) July 12, 2024Finally Kamal Hassan's entry.. But it has zero impact in the audience with 30 mins of lag boring scenes. Even Kamal Hassan's entry failed to excite the mass audience. Till now, there is not even a single scene of Shankar's calibre #Indian2 #Bharateeyudu2 pic.twitter.com/gztpLV2iwJ— Taran Adarsh (@tarann_adarshh) July 12, 2024 -
భారతీయుడు 2 రిలీజ్.. టెన్షన్లో రామ్ చరణ్ ఫ్యాన్స్!
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 రేపు(జులై 12) విడుదల కానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినా.. తెలంగాణలో మాత్రం టికెట్స్ రేట్స్ పెంచడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాడు కంటే తెలంగాణలోనే టికెట్ ధరలు అత్యధికం. ఇది సినిమాకు ప్లస్ అవుతుందా లేదా అనేది రేపటి టాక్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. హిట్ టాక్ వస్తే.. ఆటోమేటిక్గా బుకింగ్స్ పెరుగుతాయి. ఒకవేళ నెగెటివ్ టాక్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2ని ఆదరించడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇప్పటికీ థియేటర్స్లో ‘కల్కి 2898 ఏడీ’ దుమ్ము రేపుతోంది. వీకెండ్లో చాలా మంది కల్కి 2898 మూవీ చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.(చదవండి: తెలుగులో ఇలా.. అక్కడేమో అలా.. టికెట్ ధరల్లో ఇంత తేడాలేంటి?)ఇన్ని సవాళ్ల మధ్య రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 కచ్చితంగా విజయం సాధించాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దానికి కారణంగా డైరెక్టర్ శంకరే. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి కావోస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలో చివరల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు విడుదలవుతున్న భారతీయుడు రిజల్ట్ కచ్చితంగా ఈ సినిమాపై ఉంటుంది. అది హిట్ అయితే గేమ్ ఛేంజర్కి ప్లస్ అవుతుంది. (చదవండి: కమల్ హాసన్ 'గుణ' రీ-రిలీజ్పై కోర్టు నోటీసులు)ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం గేమ్ ఛేంజర్కు కాస్త ఇబ్బందే. అదే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ని కలవరపెడుతోంది. అసలే శంకర్కి సాలిడ్ హిట్ లేక చాలా కాలం అవుతుంది. భారతీయుడు2తో కమ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపు సిద్ధార్థ్ కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇందులో ఆయన పోషించింది చిన్న పాత్రే అయితే..హిట్ అయితే మాత్రం మంచి పేరే వస్తుంది. రకుల్కి కూడా భారతీయుడు2 హిట్ చాలా అవసరం. మరి వీరిద్దరి ఆశలు నెరవేరుతాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. -
భారతీయుడు 2 ఎండింగ్లో బిగ్ సర్ప్రైజ్ ప్లాన్
భారతీయుడు.. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత వారిద్దరి కాంబోలేనే భారతీయుడు 2 సీక్వెల్ రానుంది. జులై 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్తో పాటుగా సిద్ధార్, రకుల్ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు.'భారతీయుడు 2' సినిమా టికెట్లు ఆన్లైన్ పెట్టిన వెంటనే భారీగా అమ్ముడుపోతున్నాయి. వీటి ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్ల్లో రూ. 75 పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. నాటికి, నేటికి సమాజంలో ఎలాంటి మార్పులు రాలేదని అందుకే పార్ట్ 2 నిర్మించామని కమల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సమాజాన్ని పట్టిపీడించే అవినీతిపై పోరాటం గురించి పార్ట్ 1 లోనే తాను చెప్పాలనుకుంది చెప్పానని డైరెక్టర్ శంకర్ అన్నారు. పార్ట్ 2ని అందుకు భిన్నంగా తెరకెక్కించాలనే క్రమంలోనే కథ రాసేందుకు చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు.భారతీయుడు 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల సందర్భంగా కేరళలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. అందుకు అభిమానులు ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమా ఎండ్ టైటిల్స్ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ చూపించబోతున్నట్లు నెట్టింట చర్చ జరుగుతుంది. పార్ట్ 3 చిత్రీకరణ కూడా ఇప్పటికే దాదాపు 70 శాతం పైగా జరిగినట్లు సమాచారం. ఎప్పుడో విడుదల కానున్న సినిమా ట్రైలర్ను ముందే విడుదల చేస్తున్నట్లు వార్తలు రావడంతో సినీ ప్రేమికులు సంతోషిస్తున్నారు. ఇలా భారతీయుడు 2 సినిమాలో పార్ట్ 3 ట్రైలర్ను విడుదల చేసి కమల్ ఫ్యాన్స్ను ఫిదా చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉన్నారని తెలుస్తోంది. -
కమల్ హాసన్ 'గుణ' రీ-రిలీజ్పై కోర్టు నోటీసులు
కమల్ హాసన్ నటించిన గుణ సినిమా 1991లో విడుదలైంది. స్వాతి చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్పై పల్లవి- చరణ్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సంతాన భారతి దర్శకత్వం వహించాడు. ఇందులో కమల్ హాసన్, రేఖ నటించారు. ఇది తమిళ, తెలుగులో కూడా విడుదలైంది. అయితే, జూన్ 21న ఈ చిత్రాన్ని పిరమిడ్, ఎవర్గ్రీన్ మీడియా కలిసి తమిళనాట రీ-రిలీజ్ చేశాయ్. దీంతో వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది.మలయాళ చిత్రసీమలో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా 'మంజుమ్మాళ్ బాయ్స్'. ఈ సినిమా కథకు మూలం గుణ గుహలు అనే విషయం తెలిసిందే. సినిమా మొత్తం ఆ గుహల చుట్టూ తిరుగుతుంది. అదే ప్రాంతంలో కమల్ హాసన్ గుణ సినిమా కూడా ఎక్కువ భాగం అక్కడే షూటింగ్ జరిగింది. 'మంజుమ్మాళ్ బాయ్స్' సినిమా వల్ల గుణ గుహలకు వచ్చిన క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని కమల్ సినిమాను రీ-రిలీజ్ చేశారు. అయితే, గన్శ్యామ్ హేమ్దేవ్ దీనిని తప్పుపట్టారు. మద్రాస్ హైకోర్టులో పిరమిడ్, ఎవర్గ్రీన్ మీడియాను తిరిగి గుణ చిత్రాన్ని విడుదల చేయకుండా శాశ్వతంగా నిషేధించాలని కోరుతూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. ఈ సినిమా కాపీరైట్ను తాను కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.కమల్ గుణ సినిమాకు పూర్తి యజమానిగా తనను ప్రకటించాలని కోర్టును ఆయన కోరారు. అంతేకాకుండా సినిమా రీ-రిలీజ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెల్లడించి, అంతే మొత్తాన్ని తనకు ఇవ్వాలని పిరమిడ్ అండ్ ఎవర్గ్రీన్ మీడియా కంపెనీని ఆదేశించాలని గన్శ్యామ్ హేమ్దేవ్ డిమాండ్ చేశారు. గుణ సినిమా రీ-రిలీజ్పై మధ్యంతర నిషేధం విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గన్శ్యామ్ హేమ్దేవ్ పిటీషన్పై పిరమిడ్, ఎవర్గ్రీన్ మీడియా కూడా జూలై 22లోగా స్పందించాలని కోర్టు తెలిపింది. -
ఇదేంటి భయ్యా?.. ఇండియన్-2 టికెట్స్ అక్కడే చీపా?
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న తాజా ఇండియన్-2. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.అయితే ఇప్పటికే తెలంగాణలో వారం రోజుల పాటు టికెట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్లో రూ.50 టికెట్పై పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని మల్టీప్లెక్స్ల్లోని ఒక్కో టికెట్ ధర రూ.350 రూపాయలుగా ఉంది.అయితే ఇండియన్-2 సినిమాకు చెన్నైలో మాత్రం ఇందుకు భిన్నంగా టికెట్ రేట్లు దర్శమిస్తున్నాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్ ధర కేవలం రూ.190 రూపాయలుగా ఉంది. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్గా మారింది. కోలీవుడ్ సినిమాకు తెలుగులో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడమేంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐌𝐚𝐧𝐚 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐓𝐫𝐨𝐥𝐥𝐬 🤗 (@mana_telugu_trolls) -
ఇండియన్-2 బుకింగ్స్.. టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే?
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్కు సిద్ధమవ్వగా.. చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇండియన్-2 చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయుడు2 టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. దీంతో రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్లో రూ.50 చొప్పున టికెట్పై పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఈ నెల 12 నుంచి 19 వరకు వారం రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా వారం రోజుల పాటు ఐదో ఆట ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది.కాగా.. ఇటీవల తెలంగాణ సీఎం డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేలా వీడియోను తయారు చేసి ఇవ్వాలని సినీ ఇండస్ట్రీని కోరారు. అందులో భాగంగా కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రఖని లాంటి యాంటి డ్రగ్స్పై వీడియోను రిలీజ్ చేశారు. దీంతో టికెట్స్ పెంపుతో పాటు బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతులు జారీ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని, ఎస్ జె సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
రిలీజ్ ముందు షాక్.. చిక్కుల్లో ఇండియన్-2!
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రమోషన్లలో చిత్రబృందం బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న ఇండియన్-2 చిక్కుల్లో పడింది. తాజాగా ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆసాన్ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్ను ఈ చిత్రంలో వాడుకున్నారని మదురై జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమాను రిలీజ్ కాకుండా నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.కాగా.. ప్రాచీన యుద్ధకళల్లో ఒకటైన మర్మకళలో రాజేంద్రన్ ప్రసిద్ధుడు. ఆయన రాసిన పుస్తకం చదివిన డైరెక్టర్ శంకర్ గతంలో వచ్చిన భారతీయుడు చిత్రంలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. సేనాపతి పాత్ర కోసం నటుడు కమల్హాసన్కు రాజేంద్రన్ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే తాజాగా సీక్వెల్గా వస్తోన్న ఇండియన్-2లో తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్ వాడారని రాజేంద్రన్ ఆరోపిస్తున్నారు. -
1000 కోట్లు ఊరికే రాలేదు..! ఇవి కదా ప్లస్ పాయింట్స్
-
వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్ ఎవరు?
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి? అని కళ్లకు గంతలు కట్టి అడుగుతారు. కానీ గంతలు కట్టకుండానే ఫొటోలు చూపించి, వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్ ఎవరు? అని అడిగితే... పేరు చెప్పడానికి తడబడాల్సిందే. అలా పోల్చుకోలేనంతగా మారిపోయారు కొందరు స్టార్స్. గుర్తుపట్టలేని వెరైటీ గెటప్స్లో ఆ స్టార్స్ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ మేకోవర్, కొత్త గెటప్ అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోల్లో విక్రమ్ ఒకరు. ‘పితామగన్’ (‘శివపుత్రుడు’), సేతు, అపరిచితుడు, ఐ, కోబ్రా’... ఇలా చెప్పుకుంటూ పోతే విక్రమ్ చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లోని పాత్రల జాబితా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ‘తంగలాన్’లోనూ విక్రమ్ వినూత్నంగా కనిపించనున్నారు. పద్దెనిమిదో శతాబ్దంలో కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నేపథ్యంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘తంగలాన్’ తీశామని ఈ చిత్రదర్శకుడు పా. రంజిత్ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్లు మాళవికా మోహనన్, పార్వతీ తిరువోత్తుల గెటప్స్ కూడా పూర్తి డీ–గ్లామరస్గా, ఆడియన్స్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి.⇒ తమిళ హిట్ ఫిల్మ్ ‘సారపట్ట పరంపరై’లో డీ–గ్లామరస్ రోల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు హీరోయిన్ దుషారా విజయన్. ఇప్పుడైతే మరీ గుర్తుపట్టలేని గెటప్లో కనిపించనున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’ సినిమాలోనే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ సినిమాలో దుషారతో పాటు వరలక్ష్మీ శరత్కుమార్, అపర్ణా బాలమురళి కూడా డీగ్లామరస్ రోల్స్లోనే కనిపిస్తారు. సందీప్ కిషన్, కాళిదాసు ఇతర లీడ్ రోల్స్లో నటించారు. నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో ముగ్గురు అన్నదమ్ముల కథగా సాగే ఈ మూవీ ఈ నెల 26న రిలీజ్ కానుంది.⇒ కథ డిమాండ్ చేస్తే అందులోని గెటప్లోకి అవలీలగా మారిపోతారు కమల్హాసన్. ‘భామనే సత్యభామనే’లో బామ్మగా, పది అవతారాల్లో ‘దశావతారం’ వంటి చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. ‘దశావతారం’ (2008) తర్వాత కమల్ ఒకే సినిమాలో ఎక్కువ గెటప్స్లో కనిపించలేదు. ఇప్పుడు ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’)లో ఐదారు గెటప్స్లో కనిపించనున్నారు. వీటిలో ఒకట్రెండు గెటప్స్ ఇప్పటికే బయటకు రాగా మిగిలినవి థియేటర్స్లో సర్ప్రైజ్గా ఉండబోతున్నాయని తెలిసింది. ‘భారతీయుడు 2’ కథ రీత్యా కమల్ వందేళ్ల వయసుపైబడిన సేనాపతి పాత్రలో నటించారు. మొత్తంగా ఆయన ఎన్ని పాత్రల్లో కనిపిస్తారో థియేటర్స్లోనే చూడాలి. ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్ 2’ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. ⇒ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ను మెప్పించడంలో ధనుష్ ముందు ఉంటారు. ఈ విలక్షణ హీరో ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ములతో ‘కుబేర’ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున మరో హీరో. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా, సామాజిక అసమానతల మేళవింపుతో రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ బిచ్చగాడి గెటప్లో కనిపిస్తారట.⇒ మాస్ హీరో అనిపించుకున్న విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేశారు. అది ‘లైలా’ సినిమా కోసం అన్నమాట. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఫస్టాఫ్ అబ్బాయిగా, సెకండాఫ్ లైలా అనే అమ్మాయిగా కనిపిస్తారు. ఆకాంక్షా శర్మను హీరోయిన్గా పరిచయం చేస్తూ రామ్నారాయణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.⇒ అటు కన్నడకు వెళితే ఇప్పుడు శివ రాజ్కుమార్ గెటప్ హాట్ టాపిక్గా నిలిచింది. ‘భైరవనకోనెపాఠ’ అనే చిత్రంలో శివ రాజ్కుమార్ గుర్తుపట్టలేని గెటప్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి హేమంత్రావు దర్శకుడు. ఈ సినిమా తెలుగు లోనూ రిలీజ్ కానుంది.ఇలా గుర్తు పట్టలేని గెటప్కి సై అని, సవాల్గా తీసుకుని నటిస్తున్న స్టార్స్ మరికొందరు ఉన్నారు. -
'భారతీయుడు 2' టీమ్కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కమల్ హాసన్ 'భారతీయుడు 2' చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా వేశారు. అయితే ఓ సినిమా కోసం సీఎం రేవంత్ ఇలా ట్వీట్ ఎందుకు చేశారు? అసలేంటి విషయం?(ఇదీ చదవండి: నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్)కొన్నిరోజుల క్రితం సినిమా టికెట్ రేట్ల గురించి ఓ సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇకపై ఎవరికైనా సరే రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే 'భారతీయుడు 2' టీమ్ నుంచి కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రఖని, డైరెక్టర్ శంకర్.. ఓ వీడియో రిలీజ్ చేశారు.దీనికి రిప్లై ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. 'భారతీయుడు 2 బృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా.. శ్రీ కమల్ హాసన్, శ్రీ శంకర్, శ్రీ సిద్దార్, శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం' అని రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: 'ఈ జనరేషన్లోనే వరస్ట్ హీరో'.. అందుకే 4 జాతీయ అవార్డులు!)భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు.డ్రగ్స్ రహిత సమాజం కోసం…ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా…శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ…శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో…రూపొందించడం హర్షించదగ్గ విషయం.#DrugFreeTelangana #SayNoToDrugs pic.twitter.com/MDkT95sqze— Revanth Reddy (@revanth_anumula) July 9, 2024 -
భారతీయుడు సందేశం సమాజానికి చేరాలి: కమల్హాసన్
‘‘ప్రపంచంలో జనాభా పెరుగుతున్న కొద్దీ కరప్షన్ పెరిగిపోతోంది. లంచాల నిర్మూలనకు మనం గట్టిగా ప్రయత్నించడం లేదు. ఈ అంశాలతో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాలోని సందేశం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలి’’ అని కమల్హాసన్ అన్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా నటించిన చిత్రం ‘భారతీయుడు 2’. సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ప్రీత్ సింగ్ ఇతర పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు.ఈ చిత్రం తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, శ్రీ లక్ష్మి మూవీస్ విడుదల చేస్తున్నాయి. సోమవారం జరిగిన సమావేశంలో కమల్హాసన్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ ఆరంభంలో తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసినా సరైన హిట్టు పడలేదు. తెలుగులో నాకు ‘మరోచరిత్ర, ఆకలి రాజ్యం, సాగర సంగమం, స్వాతి ముత్యం’ వంటి ఎన్నో హిట్స్ వచ్చాయి.తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్ని చేశారు. బాలచందర్గారు, విశ్వనాథ్గారు నన్నెంతో ప్రోత్సహించారు’’ అన్నారు. ‘‘భారతీయుడు’కి సీక్వెల్ తీయాలని ముందు అనుకోలేదు. అయితే కరప్షన్ వార్తలు చదివినప్పుడు నాకు సేనాపతి గుర్తుకు వచ్చేవాడు. ఆ ఆలోచనతో ‘భారతీయుడు 2’ తీశాను’’ అన్నారు శంకర్. ‘‘వినోదం, సందేశంతో తీసే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ‘భారతీయుడు’ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత సురేష్బాబు. -
మిమిక్రీ చేసి ఆశ్చర్యపరిచిన బ్రహ్మనందం..
-
బ్రహ్మానందంలో ఈ టాలెంట్ చూశారా? ఆయన ముందే మిమిక్రీ..
భారతీయుడు.. దశాబ్ధం క్రితం వచ్చిన ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. జనాలను ఆలోచింపజేసిన ఈ మూవీకి సీక్వెల్గా భారతీయుడు 2 వస్తోంది. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఆదివారం ఘనంగా జరిగింది.లోకనాయకుడిని దింపేసిన బ్రహ్మానందంఈ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ విశ్వంలోనే కమల్ హాసన్లాంటి నటుడు మరొకరు ఉండరని, ఆయనతో నటించినందుకు గర్వపడుతున్నాని తెలిపారు. అలాగే కమల్ హాసన్ వాయిస్ను మిమిక్రీ చేశారు. 'ఈ రోజు నేను భారతీయుడు 2లో యాక్ట్ చేశాను. ఇండియన్ 1 మూవీని బాగా హిట్ చేశారు. అది మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం. సౌత్ ఇండియన్స్ అందరూ నన్నెంతో ఆశీర్వదించారు, అభినందించారు. మాటలు రావడం లేదుచాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేస్తే నేను హ్యాపీ.. ఆల్వేస్.. యువర్ కమల్ హాసన్' అంటూ విశ్వనటుడి వాయిస్ను దింపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారగా బ్రహ్మానందంలోని ఈ టాలెంట్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కదా మిమ్మల్ని లెజెండ్ అనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. Brahmanandam Garu mimics Kamal Haasan Sir’s voice. Wow!!! #Bharateeyudu2 pic.twitter.com/ka16cyYMGB— Aakashavaani (@TheAakashavaani) July 7, 2024 చదవండి: కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్, మౌనిక -
'మా సినిమాను అమ్ముతున్నాం'.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం ఇండియన్-2. గతంలో సూపర్ హిట్గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో కమల్ హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'నేను ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. ఎందుకంటే మేము రూపొందించిన ప్రొడక్ట్ గురించి తెలియాలి. ఏ వ్యాపారి అయినా తన ప్రొడక్ట్ గురించి ప్రజలకు వివరించాలి. అలాగే మా ప్రొడక్ట్ ఇండియన్-2 అమ్ముతున్నా. మంచి క్వాలిటీగా తయారు చేశాం. ఇందులో నాకు ఎలాంటి సిగ్గు, మొహమాటం లేదు. ఇది మా పని.' అని అన్నారు. ఇది విన్న నెటిజన్స్ కమల్ హాసన్ సింప్లీసిటీని మెచ్చుకుంటున్నారు. కాగా.. ఇండియన్-2 ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషించారు. -
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నా స్నేహితుడు...
-
భారతీయుడు 2 తీయడానికి 25 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే..
-
ఇండియన్ 2 అమ్ముతున్నాం అందరూ కొనండి ప్లీజ్
-
Kamal Haasan: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు