కమల్‌ హాసన్‌ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ..! | Kamal Haasan Fans Travel Bengaluru To Hosur To Watch Thug Life After Ban In Karnataka, Deets Inside | Sakshi
Sakshi News home page

Kamal Haasan: కర్ణాటకలో సినిమా బ్యాన్‌.. అయినా థగ్‌ లైఫ్‌ చూస్తున్న కన్నడ ఫ్యాన్స్‌!

Jun 5 2025 2:15 PM | Updated on Jun 5 2025 3:51 PM

Kamal Haasan Fans Travel Bengaluru to Hosur to watch Thug Life After ban in Karnataka

కమల్‌ హాసన్‌- మణిరత్నం కాంబినేషన్‌లో 1987లో వచ్చిన నాయకన్‌ (నాయకుడు) మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వచ్చిన 38 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ నాయకుడు సినిమాకు ప్రత్యేక అభిమానులున్నారు. ఇన్నేళ్ల తర్వాత కమల్‌-మణిరత్నం కాంబోలో థగ్‌ లైఫ్‌ సినిమా రూపుదిద్దుకుంది. శింబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కన్నడలో ప్రదర్శితం కాని థగ్‌ లైఫ్‌
అయితే కమల్‌ కన్నడ భాషపై చేసిన కామెంట్లతో పెద్ద వివాదం రాజుకుంది. తమిళం నుంచే కన్నడ పుట్టిందనడంతో కర్ణాటకలో సినిమాపై నిషేధం విధించారు. అయినప్పటికీ కమల్‌ క్షమాపణ చెప్పేందుకు ఒప్పుకోలేదు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, కన్నడ ప్రజలంటే ఎంతో ప్రేమ అని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు కూడా తన సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని ప్రకటించాడు. కానీ అక్కడి అభిమానులు థగ్‌ లైఫ్‌ చూడకుండా ఉండలేకపోయారు.

అభిమానం
ఓ ఫ్రెండ్స్‌ గ్రూప్‌ 42 కి.మీ. ప్రయాణించి తమిళనాడులోని హోసూర్‌లో థగ్‌ లైఫ్‌ ప్రదర్శితమవుతున్న థియేటర్‌కు చేరుకున్నారు. మరో అభిమానైతే.. కమల్‌కు నేను వీరాభిమానిని. సినిమా చూసేందుకు బైక్‌పై హోసూర్‌ రావడం సురక్షితమేనా? లేదంటే అక్కడకు వచ్చాక కర్ణాటకవాసినని నా బైక్‌ టైర్లు పంక్చర్‌ చేసి, పాడు చేయరు కదా? అని ప్రశ్నించాడు. అందుకు కొందరు.. అలా ఏం జరగదు. నిరభ్యంతరంగా వచ్చి సినిమా చూడొచ్చు. హోసూర్‌లో కర్ణాటకలో రిజిస్టర్‌ అయిన వాహనాలు ఎన్నో తిరుగుతాయి. భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చాడు.

చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement