Thug Life Movie
-
తొలిరోజే నెగిటివ్ టాక్.. 'థగ్ లైఫ్' కలెక్షన్స్ ఎంత?
కమల్ హాసన్ దిగ్గజ నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 'విక్రమ్' తప్పితే ఆయన కెరీర్లో గత కొన్నేళ్లలో సరైన హిట్ అన్నది లేదు. దీంతో 'థగ్ లైఫ్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. భాష వివాదం వల్ల కర్ణాటకలో పూర్తిగా ఈ మూవీని రిలీజ్ చేయనని తెగేసి చెప్పాడు. దీంతో తెలుగు-తమిళ భాషల్లో నిన్న(జూన్ 5) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ దీనికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్? సోషల్ మీడియాలో టాక్ ఏం నడుస్తోంది?కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో మూడు దశాబ్దాల క్రితం 'నాయకుడు' అనే సినిమా వచ్చింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్లాసిక్గా నిలిచిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే హీరో-దర్శకుడు కలిసి ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారనేసరికి హైప్ ఏర్పడింది. 'థగ్ లైఫ్' ట్రైలర్ కూడా బాగుండేసరికి కమల్ హిట్ కొట్టడం గ్యారంటీ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా టాక్ మారిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)తెలుగు, తమిళంలో ఎక్కడా కూడా కమల్ 'థగ్ లైఫ్' చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అయినా సరే తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.17 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.కోటి షేర్ కూడా రాలేదని అంటున్నారు. కమల్-మణిరత్నం కాంబోకి ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఘోరమైన ఫ్లాప్. కానీ ఈ చిత్రానికి తొలిరోజు రూ.25 కోట్ల వరకు వచ్చాయి. 'థగ్ లైఫ్'కి మాత్రం వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు.'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్స్టర్. తల్లిదండ్రులు కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని పెంచుకుంటాడు. తన నేర సామ్రాజ్యానికి కీలకంగా మారుస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల శక్తిరాజు-అమర్ మధ్య గొడవలు వస్తాయి. ఒకరిని ఒకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతకీ ఇలా జరగడానికి కారణాలేంటి? ఈ కథలో త్రిష పాత్రేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు) -
ఆ ఓటీటీలోకి ‘థగ్ లైఫ్’ .. స్ట్రీమింగ్ అప్పుడేనా?
కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష,అభిరామి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కమల్కు ‘నాయకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మణిరత్నం.. ఈ సారి మాత్రం ఆ స్థాయి కథతో రాలేదని చాలా మంచి అభిప్రాయ పడుతున్నారు. మణిరత్నం మార్క్ సినిమాలో కనిపించేలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇలా మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీ వివరాలు ఆసక్తికరంగా మారాయి. (థగ్ లైఫ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)భారీ ధరకు ఓటీటీ రైట్స్38 ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కలయికలో వచ్చిన చిత్రం కావడంతో థగ్లైఫ్పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు భారీ ధరకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ దాదాపు రూ. 149 కోట్లకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అలాగే శాటిలైట్ రైట్స్ని స్టార్ విజయ్ టీవీ రూ. 60 కోట్లకు కొనుగోలు చేసినట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా.. థియేటర్స్లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందంలో నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిందట. ఈ లెక్కన ఆగస్ట్ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అయితే స్వతంత్ర దినోత్సవం(ఆగస్ట్ 15) కానుకగా ఆగస్ట్ 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నెటిఫిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
కమల్ హాసన్ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ..!
కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో 1987లో వచ్చిన నాయకన్ (నాయకుడు) మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వచ్చిన 38 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ నాయకుడు సినిమాకు ప్రత్యేక అభిమానులున్నారు. ఇన్నేళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్ సినిమా రూపుదిద్దుకుంది. శింబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కన్నడలో ప్రదర్శితం కాని థగ్ లైఫ్అయితే కమల్ కన్నడ భాషపై చేసిన కామెంట్లతో పెద్ద వివాదం రాజుకుంది. తమిళం నుంచే కన్నడ పుట్టిందనడంతో కర్ణాటకలో సినిమాపై నిషేధం విధించారు. అయినప్పటికీ కమల్ క్షమాపణ చెప్పేందుకు ఒప్పుకోలేదు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, కన్నడ ప్రజలంటే ఎంతో ప్రేమ అని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు కూడా తన సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని ప్రకటించాడు. కానీ అక్కడి అభిమానులు థగ్ లైఫ్ చూడకుండా ఉండలేకపోయారు.అభిమానంఓ ఫ్రెండ్స్ గ్రూప్ 42 కి.మీ. ప్రయాణించి తమిళనాడులోని హోసూర్లో థగ్ లైఫ్ ప్రదర్శితమవుతున్న థియేటర్కు చేరుకున్నారు. మరో అభిమానైతే.. కమల్కు నేను వీరాభిమానిని. సినిమా చూసేందుకు బైక్పై హోసూర్ రావడం సురక్షితమేనా? లేదంటే అక్కడకు వచ్చాక కర్ణాటకవాసినని నా బైక్ టైర్లు పంక్చర్ చేసి, పాడు చేయరు కదా? అని ప్రశ్నించాడు. అందుకు కొందరు.. అలా ఏం జరగదు. నిరభ్యంతరంగా వచ్చి సినిమా చూడొచ్చు. హోసూర్లో కర్ణాటకలో రిజిస్టర్ అయిన వాహనాలు ఎన్నో తిరుగుతాయి. భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చాడు.చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్ -
‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ
38 ఏళ్ల క్రితం ‘నాయకుడు’తో బాక్సాఫీస్ని షేక్ చేశారు దర్శకుడు మణిరత్నం, హీరో కమల్ హాసస్. ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే ‘థగ్ లైఫ్’(Thug Life Review). ఈ హై ఓల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 5) ఈ చిత్రం రిలీజైంది. దాదాపు 38 ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.‘థగ్ లైఫ్’ కథేంటంటే..?ఢిల్లీకి చెందిన రంగరాయ శక్తిరాజు(కమల్ హాసన్) ఒక గ్యాంగ్స్టర్. తన అన్న మాణిక్యం(నాజర్)తో కలిసి మరో గ్యాంగ్స్టర్ సదానందం(మహేశ్ మంజ్రేకర్)తో ఒక సెటిల్మెంట్కి వెళ్తాడు. అక్కడికి పోలీసులు రావడంతో కాల్పులు జరుగుతాయి. దీంతో రంగరాయ శక్తిరాజు అమర్(శింబు) అనే చిన్నారిని అడ్డుపెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తన ప్రాణాలను కాపాడినందుకు అమర్ని పెంచి పెద్ద చేస్తాడు. తన నేర సామ్రాజ్యానికి అమర్ని కీలక శక్తిగా మారుస్తాడు. కొన్నాళ్ల తర్వాత అమర్నే అనుమానిస్తాడు రంగరాయ శక్తిరాజు(Thug Life Review). అదే సమయంలో రంగరాయ శక్తిరాజే తన తండ్రిని చంపాడని అమర్కి తెలుస్తుంది. దీంతో రంగరాయ శక్తిరాజును చంపేందుకు ప్రయత్నిస్తాడు. మరి అమర్ ప్రయత్నం ఫలించిందా? సొంత అన్న మాణిక్యం కూడా రంగరాయ శక్తిరాజుని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు అమర్ తండ్రిని చంపిందెవరు? చిన్నప్పుడే తప్పిపోయిన చెల్లెలు చంద్ర(ఐశ్వర్య లక్ష్మీ) మళ్లీ అమర్ని కలిసిందా? సొంత తమ్ముడిలా పెంచిన అమరే తన ప్రాణాలను తీసేందుకు కుట్ర చేశాడనే విషయం తెలిసిన తర్వాత రంగరాయ శక్తిరాజు ఏం చేశాడు? భార్య లక్ష్మీ(అభిరామి), కూతురు మంగ(సంజన) కోసం శక్తిరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ కథలో త్రిష పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మణిరత్నం-కమల్ కాంబినేషన్లో ఓ సినిమా అంటే అంచనాలు పెరగడం సర్వ సాధారణం. అందుకే ‘థగ్ లైఫ్’పై కమల్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా మొదటి నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ప్రమోషన్స్లో కమల్ ‘ఈ చిత్రం ‘నాయకుడు’ కంటే పెద్ద హిట్ అవుతుంది’ అని చెప్పడంతో సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతోనే సినిమాకు వెళ్లారు. వారి అంచనాలను అందుకోవడంలో మణిరత్నం సఫలం కాలేదనే చెప్పాలి. ఓ రొటీన్ గ్యాంగ్స్టర్ కథనే కమల్తో చెప్పించాడు. కథనంలో కూడా కొత్తదనం లేదు. సినిమా చూస్తున్నంతసేపు మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్’ చిత్రమే గుర్తుకొస్తుంది. అందులో వచ్చే ట్విస్టులు కొంతమేర ఆకట్టుకుంటాయి. ఇందులో అదీ కూడా ఉండదు. ఓ సాధారణమైన గ్యాంగ్స్టర్ కథకి ఫ్యామిలీ ఎమోషన్స్ని యాడ్ చేసి ‘థగ్ లైఫ్’ ని తీర్చిదిద్దాడు మణి. సాధారణ కథనైనా తెరపై ఎంతో అద్భుతంగా చూపించే సత్తా ఉన్న మణిరత్నం.. ఈ కథ, అందులో రాసుకున్న పాత్రలు, వాటిని తీర్చిదిద్దిన విధానం చూస్తే నిజంగానే ఇది మణి సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది. కమల్తో పాటు ఏ ఒక్కరి పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ట్విస్టులూ ఉండవు. ఊహకందేలా కథనం సాగుతుంది. అయితే ఎప్పటి మాదిరే నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ‘ఇది యముడికి నాకు జరిగే కథ’ అని కమల్ పాత్రలో చెప్పిస్తూ సినిమాను ప్రారంభించారు దర్శకుడు. కీలక పాత్రల పరిచయం వరకు కథనం ఆసక్తికరంగానే సాగుతుంది. తన అన్న మాణిక్యం కూతురు ఆత్మహత్య చేసుకోవడం.. దానికి కారణమైన వ్యక్తిని కాల్చి చంపి శక్తిరాజు జైలుకు వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అమర్ మారిపోవడం.. ఆధిపత్య పోరుతో శక్తిరాజుని చంపేందుకు చేసే కుట్ర ఇవ్వన్నీ రొటీన్గా ఉన్నా.. మధ్యలో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కమల్-అభిరామి మధ్య వచ్చే సన్నివేశాలను రొటీన్ కథనంతో విగిసిపోతున్న ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత రొటీన్గా సాగుతుంది. రివేంజ్ డ్రామా అంత ఆస్తికరంగా అనిపించదు. క్లైమాక్స్ కూడా రొటీన్గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కమల్ నటన గురించి ఎం చెప్పగలం. ఎలాంటి పాత్రల్లోనైనా జీవించగలడు. రంగరాయ శక్తిరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. అయితే కమల్ గతంలో అలాంటి పాత్రలు చాలా చేడయంతో తెరపై చూసినప్పుడు కొత్తగా అనిపించదు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా కమల్ పాత చిత్రాలను గుర్తుకు చేస్తాయి. అమర్ పాత్రకు శింబు న్యాయం చేశాడు. అయితే ఆ పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. మాణిక్యంగా నాజర్ రొటీన్ పాత్రే చేశాడు. ఇక శక్తిరాజు భార్య లక్ష్మీగా అభిరామి ఉన్నంతలో బాగానే నటించింది. త్రిష పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. మణిరత్నం- కమల్ సినిమా కాబట్టే ఆ పాత్ర చేయడానికి త్రిష ఒప్పుకుందేమో. పోలీస్ ఆఫీసర్గా అశోక్ సెల్వరాజ్, శక్తిరాజు టీంలో కీలక వ్యక్తి పత్రాస్గా జోజు జార్జ్ తో పాటు తనికెళ్ల భరణి, ఐశ్వర్య లక్ష్మీ, మహేశ్ మంజ్రేకర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు ప్రధాన బలం ఏఆర్ రెహమాన్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు పర్వాలేదు. రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ HD స్టిల్స్
-
కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం 'థగ్ లైఫ్'. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్గా ఉందని చెబుతున్నారు. మణిరత్నం డైరెక్షన్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈసినిమాలో కమల్ హాసన్ లుక్ అదిరిపోయిందని మరికొందరు రాసుకొచ్చారు. మరికొందరేమో ఇండియన్-2 కంటే వరస్ట్గా ఉందని.. కమల్ హాసన్ ఫర్మామెన్స్ అస్సలు బాగాలేదని పోస్ట్ చేశారు. శింబు రోల్కు పెద్దగా ప్రాధాన్యత లేదని.. కథ చాలా బోరింగ్గా ఉందంటున్నారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ నటన బాగానే ఉందని.. కానీ అతని నాన్ స్టాప్ డైలాగ్స్ బోరింగ్గా అనిపించాయని ఓ నెటిజన్స్ ట్వీట్ చేశారు. శింబు తన పాత్రను చక్కగా చేశాడు.. కానీ అది కూడా చాలా నార్మల్గా ఉందని.. సాగే సెకండ్ హాఫ్ స్లోగా ఉండడంతో బోరింగ్గా ఉందంటూ..ఈ చిత్రంలో మణిరత్నం స్పార్క్ కనిపించలేదని పోస్ట్ చేశాడు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం లేదు. #ThugLife had potential but turns into a drag. Kamal acted well, but his nonstop dialogues get tiring. Simbu did his role neatly, but even that couldn’t save the flat, slow-paced second half. No Mani Ratnam spark.Below average 👍#ThugLife #KamalHaasan #ThugLifeFDFS pic.twitter.com/I5wQlxoBO7— The Flicks (@Flicks_rithick) June 5, 2025 #ThugLifeReview Kindly tighten the security & don’t let him enter this street, if he is coming with a story for a new movie.🙏 #ThugLife pic.twitter.com/8n9QZyWd8D— Kingsley (@CineKingsley) June 5, 2025 #ThugLife Mani sir what were u thinking? Worse than #Indian2 #KamalHaasan𓃵 is aged and gives the weakest perf. #SilambarasanTR is wasted in a role with 0 scope. #Trisha is in a dummy role. Slow boring and hard to sit through this bad gangster drama. Semma mokka! 1.25/5 pic.twitter.com/tPQkbHaFB4— AllAboutMovies (@MoviesAbout12) June 5, 2025 #FDFS Never Miss!! #KamalHaasan𓃵 So it Beginsssss 😘♥️ #ThugLife #Malaysia ♥️ pic.twitter.com/pdWBRCuAZQ— 𝓡𝓲𝓓𝓓𝓲𝓜 (@RiDDiM04) June 5, 2025 Thug life review: first half 🇨🇦 - super engaging 🏆🏆Mani ratnam aesthetics >>>>>🧨🧨🧨🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩Hoping for a better second half .Mani ratnam is the Hayao Miyazaki of Indian Cinema ✨✨✨❤️❤️#ThugLife #KamalHaasan𓃵 #ThugLifeBlockbuster #Thuglifereview pic.twitter.com/UtFcICxImv— juice9 (@Georgej39718648) June 5, 2025 -
'థగ్ లైఫ్' మేకింగ్ వీడియో.. ఇంత కష్టపడ్డారా?
గత కొన్నిరోజుల నుంచి తమిళ హీరో కమల్ హాసన్ వార్తల్లో ఉంటూనే ఉన్నారు. దీనికి కారణం 'థగ్ లైఫ్' సినిమా. కొన్నిరోజుల క్రితం జరిగిన చిత్ర ఈవెంట్లో మాట్లాడుతూ కన్నడ భాష.. తమిళం నుంచే పుట్టిందని అన్నాడు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. కమల్ వేసిన పిటిషన్ వల్ల ఈ వివాదంలోకి కర్ణాటక హైకోర్ట్ కూడా ఎంటరైంది. సారీ చెబితే సరిపోతుంది కదా అని చివాట్లు పెట్టింది.(ఇదీ చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్)ఇలా కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచిన కమల్ హాసన్.. మరోవైపు 'థగ్ లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయనని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఈ మూవీ రేపు అనగా జూన్ 05న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఎలాంటి లొకేషన్స్లో మూవీని చిత్రీకరించారో చూపించారు. ఈ వీడియోకి ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్గా ఉంది.దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్-మణిరత్నం కలిసి చేసిన సినిమా ఇది. వీళ్లే నిర్మాతలగానూ వ్యవహరించారు. మరి కమల్ కావాలనే కన్నడ ప్రేక్షకులతో ఈ గొడవ పెట్టుకున్నాడా? అనిపిస్తుంది. ఎందుకంటే సారీ చెప్పనని లెటర్ రిలీజ్ చేయడం లాంటివి చూస్తుంటే భవిష్యత్తులో తమిళ మూవీస్కి సెగ తప్పదేమో అనిపిస్తుంది. మరి చూడాలి కమల్ 'థగ్ లైఫ్'తో ఏం చేస్తాడో?(ఇదీ చదవండి: 'థగ్లైఫ్' కమల్ దెబ్బ.. జన నాయకన్ విజయ్కి తగిలింది) -
'థగ్లైఫ్' కమల్ దెబ్బ.. జన నాయకన్ విజయ్కి తగిలింది
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు.. కమల్కి కన్నడిగులకు మధ్య నెలకొన్న వివాదం కాస్త.. దీనితో ఏ సంబంధం లేని తమిళ సినీ నటుడు విజయ్ మీద పడనుందా? అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. కన్నడ భాష మీద ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగి థగ్లైఫ్ సినిమాని నిషేధించాలనే వరకూ దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇరు పక్షాలూ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తుండడంతో థగ్లైఫ్ సినిమా విడుదల అనంతరం పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.ఈ నేపధ్యంలో ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్కు చుట్టుకోనుంది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టడానికి ముందుగా విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయకన్', ఇప్పుడు 'థగ్ లైఫ్' వివాదంతో ఇది పెనవేసుకుని పెను వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం జననాయకన్ చిత్రాన్ని నిర్మిస్తోంది బెంగళూరు కేంద్రంగా ఉన్న నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కావడమే.వచ్చే ఏడాది జనవరి 9న తమిళ పొంగల్ సందర్భంగా విడుదల కావల్సిన ఈ సినిమా.. విజయ్ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల సమరాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందింది. దీనిని సమయోచితంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే వీరి ప్లాన్స్ను థగ్లైఫ్ దుమారం పెద్ద దెబ్బ కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. థగ్ లైఫ్ని బ్యాన్ చేయాలనే ప్రచారం ఊపందుకోవడంతో పాటే సామాజిక మాధ్యమాల్లో 'బ్యాన్ జననాయకన్' అనే కొత్త క్యాంపెయిన్ మొదలైంది.థగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో నిషేధిస్తే, కన్నడ సినిమాలు తమిళనాడులో నిషేధించాలి. విజయ్ తన జననాయకన్ సినిమాని ఇక వదులుకోవాలి అంటూ ఎక్స్ వేదికగా రాజేష్ లింగేష్ అనే వ్యక్తి చేసిన ప్రకటనకు అనేక మంది మద్దతు తెలుపుతూ, జననాయకన్ కూడా బ్యాన్ చేయాలి అంటూ పోస్ట్లు చేస్తుండడం ఎక్కువైంది. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానున్న జననాయకన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ పెట్టిన రాజకీయ పార్టీ తమిళక వెట్రి కజగం.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పరిస్థితుల్లో... ఈ చిత్రం విడుదల, విజయం కూడా ఆ పార్టీకి చాలా కీలకం.దీంతో విజయ్ అభిమానులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాని విజయ్కు అత్యంత నమ్మకస్తుడైన జగదీష్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. కేవలం కన్నడ సంస్థ నిర్మిస్తున్నందుకు సినిమా నిషేధించడం న్యాయం కాదు. జననాయకన్ విడుదల కోసం భాషా బేధాలకు అతీతంగా అందరూ ఎదురు చూస్తున్నారు అంటూ వారు అంటున్నారు. మరోవైపు విజయ్ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈ ప్రచారాన్ని ఎగదోస్తున్నారంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా నేడు థగ్లైఫ్.. కర్ణాటకలో ఎదుర్కోబోయే పరిస్థితులు రేపటి జననాయకన్ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది సుస్పష్టం. -
‘థగ్ లైఫ్’ కోసం భారీ రెమ్యునరేషన్.. కమల్, త్రిష, శింబు ఎంతెంత తీసుకున్నారంటే?
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’(Thug Life). కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, పంకజ్ త్రిపాఠి, సాన్య మల్హోత్రా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘నాయకుడు’ తర్వాత కమల్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. 38 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో థగ్ లైఫ్పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే భారీ బడ్జెట్తో సినిమాను తెరకెక్కించారు. ప్రమోషన్స్కి కూడా భారీగానే ఖర్చు చేశారు. అయితే బడ్జెట్లో ఎక్కువ భాగం నటీనటుల రెమ్యునరేషన్కే వెళ్లిందట. ఈ చిత్రానికి కమల్ నిర్మాతగా వ్యవహరించాడు. మణిరత్నం కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వీరిద్దరు పారితోషికాలు తీసుకోకుండా లాభాల్లో వాటాలను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్ శింబుకి ఇచ్చారట. ఈ చిత్రంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. దీంతో రూ. 40 కోట్ల పారితోషికం ఇచ్చి మరీ శింబుని ఆ పాత్రకు తీసుకున్నారట.ఇక హీరోయిన్గా నటించిన త్రిష కూడా భారీగానే తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించినందుకు గాను రూ. 12 కోట్ల పారితోషికం పుచ్చుకుందట. గత సినిమాతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అలాగే ఇతర కీలక పాత్రలో నటించిన అశోఖ్ సెల్వన్, బోజు జార్జ్ కోటి రూపాయల చొప్పున పారితోషికంగా తీసుకున్నారు. ఇక మరో కీలక పాత్రలో నటించిన అభిరామి రూ. 50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్లతో కలిపి మొత్తం ఈ సినిమాకు రూ. 300 కోట్ల బడ్జెట్ అయిందట. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. -
దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: తమిళ నిర్మాతల సంఘం వినతి
కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా నిషేధంపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు లేఖ రాసింది. ఈనెల 5న విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కమల్ హాసన్ కన్నడ భాషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తూ కేఎఫ్సీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తమ లేఖలో రాస్తూ..' ఎన్నో ఏళ్లుగా కన్నడ, తమిళ సినీ పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి. శివరాజ్కుమార్, ఉపేంద్ర, సుదీప్ లాంటి కన్నడ హీరోలు తమిళ సినిమాల్లో నటించారు. కోలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సైతం కన్నడ చిత్రాలు తీశారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఇద్దరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి భాషకు ఓ చరిత్ర ఉంది. ప్రత్యేకత ఉంది. ఈ సినిమా ఈవెంట్లో కమల్హాసన్ ప్రేమతో మాట్లాడారు. అంతేకానీ మీ భాషను తక్కువ చేయాలని కాదు. కన్నడ చిత్ర పరిశ్రమకు కమల్ ఎంతో సహకారం అందించారు. కన్నడ చిత్ర దర్శకులంటే ఆయన గౌరవం. థగ్ లైఫ్ వాయిదా వేసినా.. బ్యాన్ చేసినా భవిష్యత్తులో ఇండస్ట్రీల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది.' ' అని ప్రస్తావించారు.కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆయన కామెంట్స్ చేయడంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కన్నడిగులు. ఈ నేపథ్యంలోనే కేఎఫ్సీసీ ఆయన సినిమా థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కమల్ హాసన్ తాను క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. -
క్షమాపణ చెప్పనన్న కమల్
-
కమల్ హాసన్ థగ్ లైఫ్లో మీర్జాపూర్ నటుడు.. క్లారిటీ ఇదే!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన పంకజ్.. ఈ వార్తలపై స్పందించారు. కమల్ హాసన్ మూవీ థగ్ లైఫ్లో తాను నటించలేదని అన్నారు. ఆ కథనాల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ మాత్రమేనని తెలిపారు.గతంలో తాను దక్షిణాది భాషల్లో నటించడంపై పంకజ్ మాట్లాడారు. అక్కడ నటించాలంటే తనకు భాష ప్రధాన సమస్య అని తెలిపారు. తెలియని భాషలో నటించాలంటే అసౌకర్యంగా ఉంటుందని.. హిందీ అయితే తనకు కంఫర్ట్గా ఉంటుందన్నారు. ఒకసారి తెలుగు సినిమాలో చేయడానికి వెళ్లినప్పుడు ఏబీసీడీల దగ్గర నుంచి చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో తనకు అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించారు. నా పాత్రలో చెప్పేది అర్థం నాకు అర్థం కావాలని.. అలాగే నా పాత్ర హిందీలో మాట్లాడాలి.. అప్పుడే నా నటన సహజంగా అనిపిస్తుందని పంకజ్ త్రిపాఠి పంచుకున్నారు. కాగా.. పంకజ్ త్రిపాఠి ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'మెట్రో ఇన్ డినో' ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. -
వెనక్కి తగ్గని కమల్..సారీ చెప్పను- రిలీజ్ చేయను
ప్రస్తుతం కమల్ హాసన్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. కొన్నిరోజుల క్రితం 'థగ్ లైఫ్' ఈవెంట్లో మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ కామెంట్ చేశాడు. దీనిపై కర్ణాటక అధికార, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమాని తమ దగ్గర నిషేధిస్తున్నట్లు స్వయంగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ విషయమై కమల్ లేఖ విడుదల చేశారు.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?)కన్నడ సూపర్స్టార్ రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడిన కమల్.. 'కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల్ని అక్కడి వారు అపార్థం చేసుకోవడం బాధగా ఉంది. మనదంతా ఒకే కుటుంబం అని చెప్పడమే తన ఉద్దేశమని, ఆ భాషని తక్కువ చేయడం కాదు' అని కమల్ చెప్పారు. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ నరసింహులుకు లేఖ రాశారు.కర్ణాటకలో 'థగ్ లైఫ్' నిషేధించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకోవడంతో కమల్ హాసన్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా కమల్కి చివాట్లు పెట్టింది. మీరేమైనా చరిత్రకారులు అనుకుంటున్నారా? ఏ ఆధారంతో ఈ కామెంట్స్ చేశారు, సారీ చెబితే సరిపోతుంది కదా అని తీర్పు ఇచ్చింది. అయినా సరే కమల్ వెనక్కి తగ్గలేదు. క్షమాపణ చెప్పలేదు సరికదా.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్ చేయట్లేదని తన లేఖలో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?) -
కమల్ హాసన్కు కర్ణాటక హైకోర్టు చివాట్లు
సాక్షి,బెంగళూరు: ప్రముఖ నటుడు కమల్ హాసన్ను కర్ణాటక హైకోర్టు చివాట్లు పెట్టింది. ‘మీరేమైనా చరిత్రకారులా అంటూ మండిపడింది. ప్రజలకు క్షమాపణలు చెబితే సరిపోతుంది కదా. కానీ మీరు రక్షణ కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది. జూన్ 5న థగ్లైఫ్ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో థగ్లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ కన్నడ మద్దతు దారులు ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కర్ణాటకలో థగ్లైఫ్ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్షణ కల్పించాలని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది. ‘మీరు కమల్ హాసన్ అయితే కావొచ్చు ప్రజల మనోభావాలు దెబ్బ తీయోచ్చా?. ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు చెప్పమనే కోరారు.. కానీ మీరు థగ్ లైఫ్ సినిమా విడుదల విషయంలో రక్షణ కల్పించాలని ఇక్కడి వచ్చారు. సినిమా సాఫీగా విడుదల కావాలంటే క్షమాపణ చెబితే సరిపోతుంది కదా.మీరు కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టిందని స్టేట్మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ.. ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కన్నడిగుల మనోభావాలో తక్కువగా అంచనా వేశారు. 75ఏళ్ల క్రితం ఇలాంటి వ్యాఖ్యలే చేసినా శ్రీరాజగోపాలకృష్ణ చార్య క్షమాపణలు చెప్పారు. మీరూ క్షమాపణలు చెప్పండి అని సూచించింది.అందుకు తన స్టేట్మెంట్ను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ కమల్ హాసన్ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కమల్ హాసన్ తప్పని సరిగా ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని సూచించింది. -
సారీ చెప్పాల్సిందే.. కమల్ హాసన్పై హైకోర్ట్ ఆగ్రహం
కమల్ హాసన్ చేసిన 'కన్నడ' కామెంట్స్ వల్ల 'థగ్ లైఫ్' సినిమా వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో ఈ మూవీపై నిషేధం విధించారు. దీంతో కమల్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు తన చిత్ర విడుదల విషయమై పిటిషన్ వేశారు. ఇప్పుడు దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కమల్ హాసన్కి చివాట్లు పెట్టింది. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది.(ఇదీ చదవండి: అలా చేసుంటే సత్య సినిమా సర్వనాశనమయ్యేది: ఆర్జీవీ)కమల్ పిటిషన్పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్ట్.. 'మీరేమైనా చరిత్రకారుడా లేదా భాష పండితుడా? కన్నడ అనేది తమిళ నుంచి పుట్టిందని మీరు ఏ ఆధారంతో చెప్పారు? మీ మాటల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు క్షమాపణ చెప్పింది. సమస్య పరిష్కారమవుతుంది' అని తీర్పు ఇచ్చింది.వివాదం విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం 'థగ్ లైఫ్' ఈవెంట్లో మాట్లాడుతూ కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందని కమల్ చెప్పారు. దీంతో కర్ణాటకలోని అధికార, విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్.. తమ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరో దారిలేక కమల్.. కర్ణాటక హైకోర్ట్ని ఆశ్రయించారు. ఇప్పుడు తీర్పు కమల్కి వ్యతిరేకంగా వచ్చింది. మరి ఇప్పటికైనా కమల్ సారీ చెబుతారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: రానా నాయుడు 2 ట్రైలర్ వచ్చేసింది) -
Upcoming Tollywood Movies: జూన్లో పెద్ద సినిమాల జాతర.. గ్యాపే లేదు!
టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత సమ్మర్కు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవి కాలం వృథాగా పోయింది. మే నెలలో పెద్ద సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. వచ్చిన వాటిలో హిట్ 3 చిత్రం ఒక్కటే కాస్త బెటర్గా ఆడింది. సమంత ‘శుభం’, శ్రీ విష్ణు ‘సింగిల్’ లాంటి చిత్రాలు కొంతమేర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇలా సమ్మర్కి కీలకమైన మే నెల టాలీవుడ్ని పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. కానీ అనూహ్యంగా జూన్ నెల టాలీవుడ్కి కీలకంగా మారబోతుంది. ఈ నెలలో వారానికొక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. వాటిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’తో ఈ నెల టాలీవుడ్ బాక్సాఫీస్ ఓపెన్ కాబోతుంది. ఈ చిత్రంపై టాలీవుడ్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దశాబ్దాల తర్వాత మణిరత్నం, కమల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. శింబు కీలక పాత్ర పోషించారు. కోలీవుడ్లో మాదిరే టాలీవుడ్లోనూ భారీ ప్రమోషన్స్ చేశారు. కమల్ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దీంతో థగ్ లైఫ్పై తెలుగులోనూ మంచి హైప్ క్రియేట్ అయింది. జూన్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.ఇక థగ్ లైఫ్ వచ్చిన వారానికే పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న రిలీజ్ కాబోతుంది. చాలా రోజుల తర్వాత పవన్ నుంచి వస్తున్న చిత్రమిది. అంతేకాదు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ కాబోతున్న తొలి సినిమా.దీనిపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.ఎప్పుడైన ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే.. మరుసటి వారం కాస్త గ్యాప్ ఉండేది. లేదంటే చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవి. కానీ ఈ సారి పవన్ సినిమాకు కూడా పోటీ ఎదురైంది. హరిహర వీరమల్లు వచ్చిన మరుసటి వారమే(మే 20) ధనుష్-నాగార్జునల ‘కుబేర’ రిలీజ్ కానుంది. శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై కూడా ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అదే రోజు ఆమిర్ ఖాన్ సితారే జమీర్పర్ రిలీజ్ కాబోతుంది.ఇక జూన్ చివరివారంపై ‘కన్నప్ప’ కర్ఛీఫ్ వేశాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీ అయ్యారు విష్ణు. చెన్నై, బెంగళూరు, ముంబై తదితర పట్టణాలలో ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇలా జూన్ నెలలో ప్రతి వారం ఒక్కో పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటు గ్యాంబ్లర్స్(జూన్ 6), 8 వసంతాలు (జూన్ 20), మర్గాన్ (జూన్ 27) చిత్రాలు కూడా ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం సూపర్ హిట్గా నిలుస్తుందో చూడాలి. -
'థగ్ లైఫ్ ఆడకూడదు అంటూ వార్నింగ్'
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్పై కర్ణాటక వ్యాప్తంగా వ్యతిరేకత అధికమవుతోంది. ఆయన నటించిన కొత్త సినిమా థగ్ లైఫ్ను కర్ణాటకలో విడుదల చేయకండి అంటూ కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఒక్క థియేటర్లో సినిమా ఆడినా బెంగళూరును బంద్ చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక నాయకులు తెలిపారు. ఈ సినిమా జూన్ 5న దేశమంతటా విడుదల అవుతోంది. కమల్ క్షమాపణ చెప్పకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ఆడిస్తే థియేటర్ లోపలికి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాలన్ని ఏకమై ఈ తీర్మానం చేసినట్లు నేతలు తెలిపారు. కమల్ సినిమా ఎట్టిపరిస్థితిల్లోనూ ఇక్కడ రన్ చేసేది ఉండదని వారు పేర్కొన్నారు. కమల్ని అరెస్టు చేయాలి కమల్ హాసన్ను వెంటనే అరెస్టు చేయాలని మైసూరులో కన్నడ చళువళి పోరాటదారుడు వాటాల్ నాగరాజు, సంఘాల నేతలు కమల్ చిత్రానికి నిప్పుపెట్టారు. కమల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటాల్ మాట్లాడుతూ కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలను పూర్తిగా బహిష్కరణ చేయాలని అన్నారు. కన్నడ ప్రజలు కమల్ సినిమాలను వ్యతిరేకించాలని చెప్పారు. -
మనసు నీకై రథమయ్యే రారా...
కమల్హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు, త్రిష, అభిరామి, నాజర్ ఇతర ప్రధానపాత్రలు పోషించారు. రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 5నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్పై ఎన్. సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘విశ్వద నాయక...’ అంటూ సాగే నాలుగోపాటని విడుదల చేశారు. ‘విశ్వద నాయక.. విహిత వీరా... మనసు నీకై.. రథమయ్యే రారా...’ అంటూ ఈపాట సాగుతుంది. ‘‘ఈపాటలో కమల్హాసన్ క్యారెక్టర్ నేచర్, అభిరామి, త్రిషపాత్రల్లోని డైనమిక్స్ని లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రశాంత్ వెంకట్ రాసిన ర్యాప్ ఈపాటకు మరో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అలెగ్జాండ్రా జాయ్ వండర్ ఫుల్ వోకల్స్ ఎమోషన్ని నావిగేట్ చేయగా, ఏఆర్ అమీన్ ర్యాప్ ఎనర్జీని మరింతగా పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
హైకోర్టుకు కమల్ హాసన్.. ‘థగ్లైఫ్’ సినిమాను అడ్డుకొని తీరుతాం
సాక్షి,బెంగళూరు: కన్నడ భాషా వివాదంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును (karanataka high court) ఆశ్రయించారు. ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ‘థగ్లైఫ్’ (Thug Life) సినిమాను కర్ణాటకలో విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. జూన్ 5న ఈ సినిమా విడుదల ఎలాంటి అడ్డంకులు లేకుండా తగిన భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ క్రమంలో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎం.నరసింహులు కమల్ హాసన్కు హెచ్చరికలు జారీ చేశారు. కన్నడ భాషనే కాదు, రాష్ట్రాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ కన్నడ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.🚨THUG LIFE BAN ISSUE IN KARNATAKA : #KamalHaasan has approached the #Karnataka HC seeking directions to ensure the release and screening of the film #ThugLife in the state, following widespread backlash over his recent comments about the origins of the Kannada language. pic.twitter.com/IGrUQFHU0d— Venkatramanan (@VenkatRamanan_) June 2, 2025 ‘కమల్ హాసన్ (kamal hasan) క్షమాపణలు చెప్పాలనేది సినిమా ఇండస్ట్రీ కోసం కాదు.. రాష్ట్రం కోసం. కమల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ రాజకీయ,కన్నడ అనుకూల సంస్థలు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పాయి. క్షమాపణలు చెప్పకుండా థగ్ లైఫ్ సినిమాను విడుదల చేస్తామంటే తాము ఒప్పుకోబోమని, అడ్డంకులు సృష్టించామని సూచించారు. రాష్ట్రంలో ఎగ్జిబిటర్లు,డిస్టిబ్యూటర్లు సినిమాను విడుదల చేయడం లేదు. క్షమాపణలు చెప్పకుండా థగ్లైఫ్ ఎలా విడుదల చేస్తామో మేమూ చూస్తాం’ అని హెచ్చరికలు జారీ చేశారు.తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, కన్నడ భాషను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను కమల్ తన వ్యాఖ్యలకు క్షమాణలు చెప్పాలని కోరారు. ఆ విజ్ఞప్తులపై కమల్ హాసన్ స్పందిస్తూ బలవంతంగా తనతో క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేయొద్దని నొక్కాణించారు. ఈ తరుణంలో థగ్ లైఫ్ సినిమా విడుదల కోసం కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. -
థగ్ లైఫ్ చాలా గొప్ప సినిమా: కమల్ హాసన్
-
కర్ణాటకలో బ్యాన్.. తమిళనాడులో గుడ్న్యూస్.. థగ్ లైఫ్కు బిగ్ రిలీఫ్!
కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటేడ్ చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిరత్న దర్శకత్వం వహించారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాయకుడు (1987) సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు.తాజాగా ఈ మూవీకి తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ విధిస్తోన్న వినోద పన్నును భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా థగ్ లైఫ్ పన్నులు తగ్గించాలని కమల్ హాసన్ ప్రభుత్వాన్ని కోరారు. కొవిడ్-19 తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల వల్ల పన్ను తగ్గించాలని కమల్ విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం వినోద పన్ను 8.6 శాతం నుంచి 4 శాతానికి పన్ను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, సమాచార మంత్రి తిరు ఎంపీ సామినాథన్కు కూడా ధన్యవాదాలు తెలిపింది. చాలా మంది నిర్మాతలు, పంపిణీదారులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు కాగా.. ఇటీవల కన్నడ భాషపై కమల్ హాసన్ కామెంట్స్తో పెద్ద వివాదం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటకలో థగ్ లైఫ్ను సినిమాపై నిషేధం విధించారు. -
అది మూడు సెకన్ల సీన్.. ఇంత గోల ఏంటి: నటి
'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ విడుదల తర్వాత మూడు సెకన్ల సీన్పై పెద్ద చర్చే జరిగింది. 70 ఏళ్ల కమల్ హాసన్, 42 ఏళ్ల అభిరామి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ట్రైలర్లో కనిపించడంతో చాలా విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, జాతీయ వార్తా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి అభిరామి తొలిసారి మాట్లాడింది. ట్రైలర్లోని సన్నివేశం కేవలం మూడు సెకన్ల నిడివి మాత్రమే ఉందని, దాని గురించి ఇంత వివాదం సృష్టించడం అనవసరమని నటి అభిరామి పేర్కొంది.థగ్ లైఫ్ ప్రమోషన్స్లతో బిజీగా ఉన్న అభిరామి ఆ సీన్ గురించి ఇలా చెప్పింది. 'ఈ రోజుల్లో ఏదైనా క్షణాల్లోనే వివాదంగా మారవచ్చు. మనం దాని నుంచి తప్పించుకోలేము. దర్శకులు మణిరత్నం సార్ నన్ను ఆ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారో నేను ఆయన్ను ప్రశ్నించను. సినిమా విషయంలో వారి నిర్ణయం ఏదైనా సరే నేను దానిని అంగీకరిస్తున్నాను. పూర్తి నా ఇష్టంతోనే ఆ సీన్ తీశారు. ఇది కేవలం మూడు సెకన్ల దృశ్యం. కానీ, ట్రైలర్ వల్ల కొన్ని అపార్థాలు ఏర్పడ్డాయి. సినిమాలోని ఆ సన్నివేశంతోనూ, లిప్లాక్కు దారితీసే విషయాలతోనూ చాలా లింక్ ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఎవరూ అలాంటి కామెంట్లు చేయరని అనుకుంటున్నాను. అది ఆ సన్నివేశానికి బాగా సరిపోతుందనే చేశాం. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. వారు ముందు సినిమా చూడాలని నేను అభ్యర్థిస్తున్నాను' అని అభిరామి అన్నారు.కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతున్న 'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. ఈ చిత్రంలో శింబు, జోజు జార్జ్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, నాసర్, అశోక్ సెల్వన్,అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ నిర్మించారు.కమల్ హాసన్, మణిరత్నం 37 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
కమల్ హాసన్ వివాదాస్పద కామెంట్స్.. మద్దతుగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
కమల్ హాసన్ కామెంట్స్పై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన థగ్ లైఫ్ మూవీ అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం కమల్ హాసన్కు గట్టి షాకిచ్చింది. క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్పై బ్యాన్ విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో కమల్ హాసన్కు ఇచ్చిన డెడ్ లైన్ పూర్తి కాగానే థగ్ లైఫ్ను నిషేధించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.అయితే ఈ వివాదం మరింత ముదురుతున్న వేళ.. కమల్ అండగా ఓ ప్రకటన విడుదలైంది. కమల్ హాసన్కు మద్దతుగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిలిచింది. కమల్ హాసన్పై ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకత సినీ ఇండస్ట్రీలో ఓ చీకటికోణంగా నిలుస్తుందని తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ప్రజలు, కన్నడ చిత్ర పరిశ్రమ ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. ప్రాంతీయ, భాషా రంగాలకు అతీతంగా ఐక్యతను ప్రోత్సహించిన కమల్ హాసన్ లాంటి వ్యక్తిని తప్పుగా చిత్రీకరించడం అన్యాయమని అసోసియేషన్ ప్రకటనలో వెల్లడించింది. కమల్ హాసన్ను కన్నడ భాష వ్యతిరేకిగా చిత్రీకరించడాన్ని అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.అయితే తాను చేసిన కామెంట్స్పై కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్యం, నాకు చట్టం, న్యాయంపై నమ్మకముంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కేరళ పట్ల నాకున్న ప్రేమ నిజమైందన్నారు. నన్ను ఇంతకు ముందు కూడా ఇలానే బెదిరించారు.. నేను తప్పు చేస్తే క్షమాపణలు చెబుతా.. తప్పు చేయకపోతే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. కాగా.. ఇప్పటికే కమల్ హాసన్ రాబోయే చిత్రం 'థగ్ లైఫ్'ను కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిషేధించింది. Nadigarsangam Press Release:#kamalhaasan #NadigarSangam #ns #siaa@actornasser @VishalKOfficial @Karthi_Offl @PoochiMurugan @karunaasethu @johnsoncinepro pic.twitter.com/OhUYqzZIkY— nadigarsangam pr news (@siaaprnews) May 30, 2025 -
కమల్ హాసన్ కామెంట్స్.. కర్ణాటకలో థగ్ లైఫ్కు బిగ్ షాక్!
కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్పై వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే క్షమాపణ చెప్పాలని కమల్కు డెడ్లైన్ విధించిన కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమల్ కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఎఫ్సీసీ కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన గడువులోగా క్షమాపణలు చెప్పకపోతే నిషేధం అమల్లోకి వస్తుందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి సారా గోవిందు స్పష్టం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ అనుకూల సంస్థల డిమాండ్లకు కూడా తమ మద్దుతు ఉంటుందని ఆయన తెలిపారు.కాగా.. ఇటీవల బెంగళూరులో జరిగన థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది. ఆయన వ్యాఖ్యలపై కన్నడ భాష సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో కమల్ సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) 'థగ్ లైఫ్' సినిమాను కర్ణాటకలో నిషేధించింది. ఇప్పటికే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశారని కమల్ హాసన్పై కర్ణాటక రక్షణ వేదిక ఫిర్యాదు చేసింది. -
వైజాగ్పై కమల్ వ్యాఖ్యలు.. 'ఓజీ'లో శింబు పాట
‘థగ్ లైఫ్’ ఒక అద్భుతమైన సినిమా అని హీరో కమల్ హాసన్ అన్నారు. తాజాగా విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో చిత్ర యూనిట్ గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా కమల్హాసన్ మాట్లాడుతూ.. వైజాగ్ తనను ఎంతో ఆదరించిందన్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చిన తనకు ‘మరో చరిత్ర’చిత్రం తిరుగులేని అభిమానగణాన్ని అందించిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ‘ఏక్ దుజే కేలియే’ చిత్రం హిందీలో విజయం సాధించినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతోగానో ఆనందించారన్నారు. ‘సాగర సంగమం’, ‘ఏక్ దుజే కేలియే’, ‘శుభసంకల్పం’వంటి చిత్రాలు షూటింగ్లు ఇక్కడే జరిగాయని, ఇది తన సొంత ఇల్లు లాంటిదని ఆయన పేర్కొన్నారు. మంచి కళ ఎక్కడ కనిపించినా తాను సెల్యూట్ చేస్తానని, అందులో ఎన్నో విషయాలు నేర్చుకుంటానని కమల్ అన్నారు. తాను కొన్ని చెడు సినిమాలు కూడా చేశానని, వాటిని ప్రేక్షకులు మరిచిపోయి కేవలం మంచి చిత్రాలనే గుర్తు పెట్టుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మంచి సినిమాలు అందించడం తన బాధ్యత అని అన్నారు. తాను నటించిన 15 తెలుగు చిత్రాల్లో 13 విజయవంతం అయ్యాయని, ఆ విజయాలన్నీ ప్రేక్షకుల వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు. ప్లాప్లు మాత్రమే తన ఖాతాలో వేసుకుంటానన్నారు. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి ‘థగ్ లైఫ్’చిత్రాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ‘థగ్ లైఫ్’ చాలా గొప్ప చిత్రమని, శింబు అద్భుతమైన నటన కనబరిచారని, ఇది వరకు చూడని పాత్రలో ఆయన కనిపిస్తారని కొనియాడారు. అభిరామి కూడా అద్భుతంగా నటించారని, నాజర్తో తనది చాలా కాలం నుంచి ప్రయాణమన్నారు. త్రిష నటన ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని, తామంతా కలిసి ఒక గొప్ప సినిమా చేశామని నమ్ముతున్నట్లు చెప్పారు. జూన్ 5న తాము అనుకున్నది కరెక్టో కాదో ప్రేక్షకులు సినిమా చూసి చెప్పాలని కోరారు.ఓజీ సినిమాలో పాట పాడాను..హీరో శింబు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని, ఈ చిత్రం కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఓజీ’ సినిమాలో తాను ఒక పాట పాడానని, అది త్వరలోనే విడుదల కానుందని తెలిపారు. పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం కూడా త్వరలో విడుదల కానుందని, ఆ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ ‘వర్షం’ సినిమా విడుదలై 22 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. వైజాగ్ తనకెంతో ఇష్టమైన నగరమని, ‘థగ్ లైఫ్’సినిమాలో కమల్ హాసన్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తాను ఇంద్రాణి అనే పాత్ర పోషించానని, ఆ పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందన్నారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో సినిమా బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. -
వైజాగ్ లో గ్రాండ్గా ‘థగ్ లైఫ్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
కమల్ హాసన్కు స్ట్రాంగ్ వార్నింగ్.. క్షమాపణలు చెప్పకపోతే!
కమల్ హాసన్ చేసిన కామెంట్స్పై వివాదం మరింత ముదురుతోంది. ఆయన క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేయడంపై కన్నడ సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీ కర్ణాటకలో విడుదల కానివ్వని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కమల్ హాసన్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో థగ్ లైఫ్ రిలీజ్ను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలు కన్నడ సంఘాలు కమల్ హాసన్ కామెంట్స్పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కమల్ సినిమాను కర్ణాటకలో పూర్తిగా నిషేధించాలని కోరుతున్నాయి.కమల్ హసన్ కామెంట్స్పై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఘాటుగా స్పందించింది. ఈనెల 30లోగా ఆయన క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని విడుదల కానివ్వమని కేఎఫ్సీసీ స్పష్టం చేసింది. కమల్ హాసన్పై తమకు ఎలాంటి సానుభూతి లేదని.. కన్నడ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది. మరోవైపు రేపటిలోగా కమల్ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే.. థగ్ లైఫ్ సినిమాను విడుదల కానివ్వమని కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు వార్నింగ్ ఇచ్చారు.కర్ణాటక కేఎఫ్సీసీ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ..' కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాను నిషేధించాలని కన్నడ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే ఈ విషయంపై ఇప్పటికే సమావేశమై చర్చించాం. కమల్ తప్పు చేశారని నిర్ధారించాం. తన వ్యాఖ్యలపై కమల్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇదే అంశంపై ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం' అని అన్నారు. ఈ విషయాన్ని కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు వెల్లడించారు. కాగా.. ఇటీవల ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన అన్నారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్పై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై కన్నడ సంఘాలు పెద్దఎత్తున నిరసన చేపట్టాయి. అయితే ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పేది లేదని కమల్ హాసన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. -
'థగ్ లైఫ్' వేదికపై అదిరిపోయే సాంగ్ పాడిన శ్రుతి హాసన్
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'థగ్ లైఫ్'.. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా చెన్నైలో ఆడియో రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కమల్ కుమార్తె నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) పాల్గొన్నారు. వేదికపై ఒక పాట పాడి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆ సాంగ్ నెట్టింట ట్రెండింగ్లో ఉంది. థగ్ లైఫ్ నుంచి 'విన్వెళి నాయగ' (Vinveli Nayaga) అనే తమిళ వర్షన్ పాటను వేదికపై ఆమె ఆలపించారు. సినిమాలో కూడా సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్తో కలిసి ఆమె ఆలపించారు. ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. -
'థగ్ లైఫ్' సాంగ్స్.. దుమ్మురేపిన టాప్ సింగర్స్
నాయకుడు (1987) సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న 'థగ్ లైఫ్'.. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా తెలుగు వర్షన్ సాంగ్స్ అన్ని ఒకే వీడియోతో షేర్ చేశారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. విక్రమ్ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. కమల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా థగ్ లైఫ్ నిలుస్తుందని దర్శకుడు మణిరత్నం అన్నారు. ప్రస్తుతం విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అయితే, టాప్ సింగర్ చిన్మయి ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్ను పాడారు. ట్రాక్ మూడో వరుసలో ఉన్న 'ముద్దు వాన' సాంగ్ను ఆమె పాడారు. సింగర్ మంగ్లీ కూడా ఈ చిత్రంలో సూపర్ హిట్ పాటను ఆలపించారు. థగ్ లైఫ్ పాటల ప్రారంభంలోనే 'జింగుచ్చా' అంటూ ఆమె దుమ్మురేపారు. ఈ సినిమా కోసం ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాస్ కుమారుడు విజయ్ ఒక పాట, ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ ఒక పాటతో మెప్పించారు. -
‘థగ్ లైఫ్’ మూవీ ప్రెస్మీట్లో మెరిసిన నటి త్రిష (ఫొటోలు)
-
హైదరాబాద్లో ‘థగ్ లైఫ్’ చిత్రం మీడియా మీట్ (ఫొటోలు)
-
నేను ద్రోణాచార్య కాదు.. విద్యార్థినే: కమల్హాసన్
‘‘నేను మనసు పెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ‘థగ్ లైఫ్’ కూడా మనసుపెట్టి చేసిన సినిమా. అద్భుతమైన టీమ్తో పని చేశాను. గొప్పగా సెలబ్రేట్ చేసుకునే ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. మణిరత్నంగారు, నా కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ చిత్రం కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద విజయం సాధిస్తుంది... ఇది నాప్రామిస్’’ అని కమల్హాసన్ చెప్పారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలుపోషించారు.రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా మీట్లో కమల్హాసన్ మాట్లాడుతూ– ‘‘నన్ను ద్రోణాచార్యతోపోల్చారు. కానీ, కాదు... ఇప్పటికీ విద్యార్థినే. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మణిరత్నంగారి సినిమాలో నేను యాక్ట్ చేయను... జస్ట్ బిహేవ్ చేస్తాను. మేమంతా సినిమా అభిమానులం.సినిమాని ఎప్పుడు కూడా భుజాలపై మోస్తాం. నేను తెలుగులోనే స్టార్గా ఎదిగాను. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. మణిరత్నం మాట్లాడుతూ– ‘‘నాయకుడు’ తర్వాత ఇన్నేళ్లకు కమల్గారితో ‘థగ్ లైఫ్’ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. దర్శకుడికి సపోర్ట్ చేసే హీరో ఆయన’’ అని తెలిపారు. ‘‘నేను ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది.‘థగ్ లైఫ్’ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నటి సుహాసినీ మణిరత్నం పేర్కొన్నారు. ‘‘మణిరత్నంగారి క్రమశిక్షణ, టైమింగ్ అద్భుతం. కమల్గారితో వర్క్ చేయడం గొప్ప అనుభూతి’’ అన్నారు శింబు. ‘‘మణిరత్నం, కమల్హాసన్గార్లతో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అని త్రిష చెప్పారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత కమల్ సార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అన్నారు. -
ముంబైలో 'థగ్ లైఫ్' టీమ్.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)
-
హీరోయిన్తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్పై విమర్శలు
కోలీవుడ్ స్టార్ హీరో హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. సోషల్మీడియాలో ట్రైలర్పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్, అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై తెలుగులో విడుదల చేస్తున్నారు.ముద్దు సీనుతో వైరల్‘థగ్ లైఫ్’ ట్రైలర్లో కమల్ హాసన్(70), అభిరామి (41) మధ్య లిప్లాక్ సీన్ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వయసు 30ఏళ్లు గ్యాప్ ఉంది. దీంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆపై త్రిషతో కమల్ చెప్పిన డైలాగ్ కూడా చాలా బోల్డ్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కమల్కు భార్యగా అభిరామి నటించింది. ఇద్దరి మద్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం ఆపై రొమాంటిక్ సీన్ తెరకెక్కించడంతో ట్రైలర్పై మిశ్రమ స్పందన వస్తుంది.అయితే, కమల్ అభిమానులు కూడా వాటిని తిప్పికొడుతున్నారు. మొత్తం ట్రైలర్లో కేవలం ముద్దు సన్నివేశాలు,సన్నిహిత సన్నివేశాలను తీసుకొని వాటిపై దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సినిమాల్లో ఇవన్నీ చాలా కామన్గానే ఉంటాయి. వాటిపైన దృష్టి పెట్టడం మానేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు.., తన వయసులో దాదాపు సగం వయసున్న హీరోయిన్లతో అలాంటి సన్నివేశాలు చేయడం సాధారణ విషయం కాదని, వాటిని ఎలా సమర్ధిస్తారని కౌంటర్ ఇస్తున్నారు.అభిరామి ఎవరు..?కేరళకు చెందిన అభిరామి తెలుగులో 'చెప్పవే చిరుగాలి'(2004) సినిమాలో నటించింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని, మహారాజ, సరిపోదా శనివారం, భలే ఉన్నాడే, వెట్టైయన్ వంటి సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా తర్వాత 2004లో ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లిన ఆమె 2013లో తిరిగి వచ్చింది. 'విశ్వరూపం', 'విశ్వరూపం 2' సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్కు తమిళ వెర్షన్లో డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మళ్లీ కమల్ సరసన అభిరామి ఛాన్స్ కొట్టేసింది. -
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి పనిచేశాడు. అదే 'థగ్ లైఫ్' సినిమా. జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టగా.. తాజాగా తెలుగు, తమిళ ట్రైలర్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) ట్రైలర్ బట్టి చూస్తే ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా అని క్లారిటీ వచ్చేసింది. కమల్ హాసన్ గ్యాంగ్ స్టర్ కాగా.. అతడి దగ్గర శింబు పెరిగి పెద్దవాడవుతాడు. కానీ పెద్దయ్యాక కమల్-శింబు మధ్య గ్యాప్ వస్తుంది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన కమల్.. తిరిగొస్తే ఏం జరిగింది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఇందులో కమల్ హాసన్ కి జోడీగా అభిరామి, త్రిష నటించారు. శింబు సరసన సన్య మల్హోత్రా చేసింది. వీళ్లు కాకుండా ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ట్రైలర్ చూస్తే మంచి రిచ్ గా ఉంది. చూస్తుంటే 'విక్రమ్'లా కమల్ మరో హిట్ కొడతాడనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: 'సీతారామం' నటి కారులో భారీ చోరీ) -
థగ్ లైఫ్ ట్రైలర్ రెడీ
హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై తెలుగులో విడుదల చేస్తున్నారు.కాగా ఈ సినిమా ప్రమోషనల్ ప్లాన్ను విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 17న ట్రైలర్ను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 24న హైదరాబాద్లో గ్రాండ్గా ఆడియో లాంచ్, 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ–రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ రెండు ప్రమోషనల్ ఈవెంట్స్కు ముందు చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో ఈ చిత్రం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్తో, ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ ఈవెంట్ జరపనున్నట్లు మేకర్స్ తెలిపారు.అలాగే పాన్ ఇండియా స్థాయిలో ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్స్ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఇదిలా ఉంటే... ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 38 సంవత్సరాల తర్వాత రానున్న ‘థగ్ లైఫ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. -
ఇది వేడుకలకు సమయం కాదు: కమల్హాసన్
కమల్హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో విడుదల వేడుక వాయిదా పడింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్ తదితరులు ఇతర ప్రధానపాత్రలు పోషించారు. కమల్హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 5నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ నెల 16న ‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల వేడుకని ఘనంగా నిర్వహించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ వేడుక వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలియజేసింది. ఈ మేరకు ‘ఆర్ట్ కెన్ వెయిట్–ఇండియా కమ్స్ ఫస్ట్’ అంటూ కమల్హాసన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మన దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 16న నిర్వహించాల్సిన ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం.మన దేశాన్ని రక్షించడంలో మన సైనికులు అప్రతిహత ధైర్యంతో ముందుండిపోరాడుతున్న వేళ వేడుకలకు సమయం కాదని భావిస్తున్నాం. ఇది సంఘీభావానికి సమయం అని నమ్ముతున్నాను. ఈ సమయంలో మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైనికుల గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలి. ఆడియో రిలీజ్ కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని కమల్హాసన్ పేర్కొన్నారు. -
'థగ్ లైఫ్' ఈవెంట్ వాయిదా.. ఇది వేడుకల సమయం కాదు: కమల్
కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. మే 16న ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరగాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో భారత పౌరలకు ఇబ్బంది కలిగించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.'ఆర్ట్ కెన్ వెయిట్.. ఇండియా కమ్స్ ఫస్ట్' అనే శీర్షికతో కమల్ హాసన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'మన దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మే 16న జరగాల్సిన 'థగ్ లైఫ్' ఆడియో విడుదలను వాయిదా వేస్తున్నాం. తిరిగి షెడ్యూల్ వివరాలను తెలుపుతాము. మన సైనికులు మన మాతృభూమి రక్షణలో అచంచలమైన ధైర్యంతో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. ఇది నిశ్శబ్ద సంఘీభావం కోసం నిర్ణయం తీసుకున్నాం. వేడుకలకు ఇదీ సరైన సమయం కాదని నేను నమ్ముతున్నాను. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం' అని ఆయన పంచుకున్నారు.‘నాయగన్’ (1987) వంటి హిట్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకు మళ్లీ కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో ‘థగ్ లైఫ్’ సినిమా వస్తుంది. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడిగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. Statement from Kamal Haasan#Thuglife #ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR @ikamalhaasan #ManiRatnam @arrahman @SilambarasanTR_ #Mahendran @bagapath @trishtrashers @AishuL_ @AshokSelvan @abhiramiact @C_I_N_E_M_A_A #Nasser @manjrekarmahesh @TanikellaBharni… pic.twitter.com/jkMiXDBNG0— Raaj Kamal Films International (@RKFI) May 9, 2025 -
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
నిస్సందేహంగా మన దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్(Kamal Haasan) ఒకరు. నటనాపరంగా ఆయన పోషించని పాత్రల గురించి వెదుక్కోవాల్సిందే. నిజజీవితంలోనూ ఆయన భిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా నటీమణులతో ఆయన సంబంధాలు, ఆయన పెళ్లిళ్లు, విడాకులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. ఎందుకంటే అత్యాధునిక తరం అని చెప్పుకునే ఈ తరం నటులు ఫాలో అవుతన్న లివ్ ఇన్ రిలేషన్ షిప్స్, పెళ్లి కాకుండా పిల్లలు వగైరాలన్నీ దాదాపు 2, 3 దశాబ్ధాల క్రితమే కమల్ చేసేశాడు..ఒక్కసారి కమల్ అనుబంధాలను పరిశీలిస్తే... 1975లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్ చిత్రంలో కమల్ తనతో కలిసి నటించిన తర్వాత 1978లో డ్యాన్సర్ వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. ఒక దశాబ్దం తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, కమల్ హాసన్ సహ నటి సారికతో సహజీవనం చేశాడు. ఆ అనుబంధం వల్ల వారికి 1986లో తమ మొదటి సంతానం శ్రుతి హాసన్ (ప్రస్తుతం టాప్ హీరోయిన్) జన్మించింది. ఆ తర్వాత వారు 1988లో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత 1991లో వారికి రెండవ కుమార్తె అక్షర హాసన్ పుట్టింది. ఈ అనుబంధం మరో పదేళ్లు పైనే కొనసాగి 2002లో, వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు, అది 2004లో మంజూరు అయ్యాయి. ఆ తర్వాత 2005 నుంచి 2016 వరకు నటి గౌతమితో కమల్ సహజీవనం చేశాడు. అందుకే తమ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాను వివాహానికి సరిపోతానని తాను భావించడం లేదని ఇంటర్వ్యూలలో తరచుగా కమల్ చెబుతుంటాడు. ప్రస్తుతం 7 పదుల వయస్సులో కూడా కమల్ పెళ్లిళ్లు ప్రస్తావనకు నోచుకుంటున్నాయంటే... అందుకు ఆయన గత చరిత్రలో ఉన్న మలుపులే కారణం.ఈ నేపధ్యంలో సీనియర్ స్టార్ కమల్ హాసన్, నటి త్రిష కృష్ణన్(Trisha), సిలంబరసన్ టిఆర్, శింబులు నటించిన, మణిరత్నం చిత్రం థగ్ లైఫ్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో నటీనటులంతా బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ సందర్భంగా మరోసారి కమల్ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది.ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా ఓ యాంకర్ పెళ్లి గురించి నటీనటులను వారి అభిప్రాయాలను అడిగారు. దీనికి 3 పదుల వయసు దాటినా, ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా సినిమాల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న త్రిష....బదులిస్తూ..‘‘ పెళ్లిపై తనకు నమ్మకం లేదు’’ అంటూ స్పష్టం చేసింది. ‘‘తనకు పెళ్లి జరిగే పరిస్థితి ఉండి అది జరిగినా ఓకే’’ అని అలా కాకుండా పెళ్లి జరగకపోయినా సరే తనకు ఓకే అని త్రిష సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి విషయమై కమల్ను ప్రశ్నించగా.. దశాబ్దం క్రితం ఎంపీ జాన్ బ్రిటాస్కు తనకు జరిగిన ఓ సంభాషణను ఆయన వివరించాడు.‘‘ఇది 10–15 ఏళ్ల క్రితం జరిగింది. ఎంపీ బ్రిటాస్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ముందు నన్ను ‘‘ నువ్వు మంచి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడివి, మరి రెండు పెళ్లిళ్లు ఎలా చేసుకున్నావు? అని ప్రశ్నించాడు. దానికి మంచి కుటుంబం నుంచి రావడానికి పెళ్లికి సంబంధం ఏంటి? అని నేను ఎదురు ప్రశ్నించా. అది కాదు నువ్వు రాముడిని పూజిస్తావు అంటే ఆయన్ను అనుసరించాలి కదా అని అడిగాడు. దానికి నేనేం చెప్పానంటే..నేను ఏ దేవుడ్నీ పూజించను. అంతేకాదు నేను రాముడి జీవనశైలిని అనుసరించను. బహుశా నేను అతని తండ్రి (దశరథ) మార్గాన్ని (ముగ్గురు భార్యలు కలిగి ఉన్న) మార్గాన్ని అనుసరిస్తాను’’ అంటూ కమల్ హాసన్ బదులిచ్చాడు. విక్రమ్ సినిమా సూపర్ హిట్తో మరోసారి ఊపందుకుంది కమల్ హాసన్ కెరీర్... తదుపరి చిత్రం, థగ్ లైఫ్, జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది.