
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’(Thug Life). కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, పంకజ్ త్రిపాఠి, సాన్య మల్హోత్రా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘నాయకుడు’ తర్వాత కమల్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది.
38 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో థగ్ లైఫ్పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే భారీ బడ్జెట్తో సినిమాను తెరకెక్కించారు. ప్రమోషన్స్కి కూడా భారీగానే ఖర్చు చేశారు. అయితే బడ్జెట్లో ఎక్కువ భాగం నటీనటుల రెమ్యునరేషన్కే వెళ్లిందట. ఈ చిత్రానికి కమల్ నిర్మాతగా వ్యవహరించాడు. మణిరత్నం కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వీరిద్దరు పారితోషికాలు తీసుకోకుండా లాభాల్లో వాటాలను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట.
ఇక ఈ సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్ శింబుకి ఇచ్చారట. ఈ చిత్రంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. దీంతో రూ. 40 కోట్ల పారితోషికం ఇచ్చి మరీ శింబుని ఆ పాత్రకు తీసుకున్నారట.ఇక హీరోయిన్గా నటించిన త్రిష కూడా భారీగానే తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించినందుకు గాను రూ. 12 కోట్ల పారితోషికం పుచ్చుకుందట. గత సినిమాతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.
అలాగే ఇతర కీలక పాత్రలో నటించిన అశోఖ్ సెల్వన్, బోజు జార్జ్ కోటి రూపాయల చొప్పున పారితోషికంగా తీసుకున్నారు. ఇక మరో కీలక పాత్రలో నటించిన అభిరామి రూ. 50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్లతో కలిపి మొత్తం ఈ సినిమాకు రూ. 300 కోట్ల బడ్జెట్ అయిందట. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.