remuneration
-
అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగనివ్వను: సమంత
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. చివరగా 'ఖుషి' చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీ చేస్తోంది. అలాగే నెట్ఫ్లిక్స్లో రక్త్ బ్రహ్మాండ్ అనే ప్రాజెక్ట్లోనూ భాగమైంది. ఇవి కాకుండా శుభం అనే సినిమా నిర్మిస్తోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆమె నటీనటుల మధ్య పారితోషికం వ్యత్యాసంపై పెదవి విప్పింది.రెమ్యునరేషన్ వ్యత్యాసాలుసమంత మాట్లాడుతూ.. నేను చాలా సినిమాల్లో హీరోతో పాటు సమాన పనిదినాల్లో వర్క్ చేశాను. కానీ మాకిచ్చే రెమ్యునరేషన్ మాత్రం ఒకేలా ఉండేది కాదు. కొన్ని పెద్ద సినిమాల్లో హీరో పాత్ర కీలకంగా ఉంటుంది. పైగా తనే జనాల్ని థియేటర్కు రప్పించగలడు... అలాంటివాటిని నేను అర్థం చేసుకోగలను. అలాంటి సినిమాల్లో ఇద్దరి మధ్య బేధం చూపించినా నేను తప్పుపట్టను.సమానత్వం కనిపించదుకానీ కొన్ని చిత్రాల్లో హీరోహీరోయిన్కు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. పారితోషికం దగ్గర మాత్రం ఆ సమానత్వం కనిపించదు. అదెందుకో ఇప్పటికీ అర్థం కాదు. నా విషయానికి వస్తే.. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో నేను చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇప్పుడు సడన్గా అన్నీ మార్చలేనేమో కానీ భవిష్యత్తు గురించి మాత్రం ఏదో ఒకటి చేయగలను. అయినా నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎక్కడైతే నిందలు, బాధలు పడ్డామో అక్కడే పరిష్కారం వెతుక్కోవాలి. నేను ఈ సిద్ధాంతాన్నే నమ్ముతాను అని సమంత చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: కారులో బాంబు పెట్టి లేపేస్తాం.. సల్మాన్కు వార్నింగ్ -
తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?
ప్రస్తుతం చాలామంది హీరోయిన్ల కెరీర్ మహా అయితే రెండు మూడేళ్లు అన్నట్లే సాగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) మాత్రం దాదాపు 20 ఏళ్లకు పైనే ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పటికీ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చేస్తూ ట్రెండ్ ఫాలో అవుతోంది.కొన్నాళ్ల ముందు వరకు తమన్నా అంటే హీరోయిన్ మాత్రమే. కానీ రీసెంట్ టైంలో అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. దానికి తోడు ఈమె చేస్తున్న పాటలు యూట్యాబ్ లో తెగ వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ) గతేడాది 'స్త్రీ 2' మూవీలో 'ఆజ్ కీ రాత్' పాట అయితే ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు 'నషా'(Nasha Song) అనే మరో సాంగ్ తో వచ్చేసింది. రైడ్ 2 సినిమాలోనిది ఈ గీతం. హీరోయిన్ గా చేస్తే రూ.4-5 కోట్లు తీసుకునే తమన్నా.. ఐటమ్ సాంగ్ కి కూడా రూ.1 కోటికి పైనే పారితోషికం(Remuneration) అందుకుంటోందట. నషా పాటకు కూడా అలానే తీసుకుందని టాక్.ఏదేమైనా హీరోయిన్ గా చేస్తూ మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూ 35 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. ఇకపోతే ఈమె ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 అనే తెలుగు సినిమా.. ఈ నెల 18న థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో శివశక్తిగా కనిపించనుండటం విశేషం.(ఇదీ చదవండి: కోట్ల రూపాయలు వదులుకున్న సమంత.. ఎందుకంటే?) -
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
సినిమా రెమ్యునరేషన్ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది కానీ దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం... ఇప్పుడు రెమ్యునరేషన్స్ విషయంలో సినిమా దర్శకులు హీరోలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కొందరు దర్శకులైతే టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకుల పారితోషికాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.నెం.1 ప్లేస్లో జక్కన్నప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీపరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది.. డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్ అని నిరూపించుకుంటోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్ మెగా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) నెం1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి 1, 2లతో పాటు RRRల ద్వారా వందలు, వేల కోట్ల కలెక్షన్లతో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్... దాదాపుగా రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. దశాబ్ధానికిపైగా హిట్స్ ఇస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే... మిగిలిన టాప్ 5లో కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాకడం గమనార్హం.రెండో ప్లేస్ కూడా మనదే..అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగుదర్శకుడైన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఉండడం విశేషం. తెలుగు అర్జున్రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్కి ఎదిగిపోయిన సందీప్... అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్ సినిమాలతో రూ.100 నుంచి రూ.150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లాడు. ఏకంగా నెం. 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. కేవలం మూడే సినిమాలతో ఆయన ఈ ఘనత సాధించడం చెప్పుకోదగ్గది. అదే రకంగా దేశం అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ది సైతం అనూహ్యమైన విజయయాత్రే. 100% సక్సెస్ రేటుఈ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ (Atlee Kumar) కేవలం ఆరు చిత్రాలతో 100 శాతం సక్సెస్ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. తమిళ చిత్రాలైన మెర్సల్, బిగిల్లతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వంటి బ్లాక్ బస్టర్లతో అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం తాత్కాలిక టైటిల్ ఎఎ22ఎక్స్ఎ6 పేరుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అట్లీని అమాంతం 3వస్థానంలోకి చేర్చింది. 233% రెమ్యునరేషన్ పెంచిన డైరెక్టర్జవాన్ కోసం రూ. 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి రూ. 100 కోట్లకు అంటే.. దాదాపుగా 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్గా అట్లీని మూడవ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత రూ.80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్కుమార్ హిరానీ, రూ.75 కోట్లతో 5వస్థానంలో సుకుమార్, రూ. 55–65 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు.చదవండి: ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్ -
డేటాఎంట్రీ చేయించారు.. బిల్లులు మరిచారు!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీ య, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఆన్లైన్ చేసిన ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లకు పారితోషికం ఇంకా అందలేదు. వీరితోపాటు సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు కూడా బిల్లులు చెల్లించలేదు. రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిన విష యం తెలిసిందే. మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, సీఓలు, గ్రామాల్లో పంచాయతీ కార్య దర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఎంఆర్సీ సిబ్బంది ఎన్యూమరేటర్లుగా వ్యవహరించారు. వారు సేకరించిన వివరాలను వెబ్సైట్లో నమోదు చేసేందుకు డేటాఎంట్రీ ఆపరేటర్లను నియమించారు.» ఒక్కో దరఖాస్తుకు రూ.30 చెల్లిస్తామని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఆపరేటర్లతో పని చేయించారు. గత ఏడాది డిసెంబర్ 15 నాటికి ఎంట్రీ పూర్తి కాగా, బిల్లులు అడిగితే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. అప్పటి నుంచి వారు కార్యాలయాలకు వచ్చి వెళుతున్నా ఫలితం కానరావడం లేదు.» సర్వేలో పాల్గొన్న సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకూ బిల్లులు అందించలేదు. సర్వేను పర్యవేక్షించిన సూపర్వైజర్కు రూ.12 వేలు, ఎన్యూమరేటర్కు రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది. ఒక్క మండలంలోనే రూ.6.86 లక్షలు ఖమ్మం జిల్లా వైరా మండలంలోని 22 జీపీలు, మరో మూడు శివారు గ్రామాల్లో 12,566 కుటుంబాలు, మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 10,333 కుటుంబాలను ఎన్యూమరేటర్లు సర్వే చేశారు. ఆపై ఇరవై రోజులపాటు 117 మంది ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేయగా, గ్రామాల పరిధిలో దరఖాస్తుకు రూ.30 చొప్పున రూ.3,76,980, మున్సిపాలిటీ పరిధిలో 47 మంది ఆపరేటర్లకు రూ.3,09,990 చెల్లించాల్సి ఉంది. కేవలం వైరా మండలం, మున్సిపాలిటీలోనే 164 మంది ఆపరేటర్లకు రూ.6,86,970 నగదు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్క రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. రూ.కోట్లలో ఉంటుంది.రూ.15 వేలు రావాలిఎంటెక్ పూర్తి చేసిన నేను 500 సమగ్ర కుటుంబ సర్వే ఫారాల ను వైరా మున్సిపల్ కార్యాల యంలో ఆన్లైన్ చేశా. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి బిల్లు వచ్చాక.. ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. నాకు రూ.15వేలు రావాలి. ఎప్పుడు మున్సిపాలిటీకి వెళ్లినా ఇంకా నిధులు విడుదల కాలేదన్నారు.– మల్లు నర్మద, సుందరయ్యనగర్, వైరాభోజనం, ఇంటర్నెట్ కూడా మావే.. ఆన్లైన్ చేస్తున్నప్పుడు 2 నెలల్లో డబ్బులు వస్తాయని చెప్పారు. డేటాఎంట్రీ చేస్తే భోజనం, నెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పి, ఆ తర్వాత పట్టించుకోలేదు. పని ముగిశాక డబ్బు అడిగితే పైనుంచి రాలేదని ఓసారి.. కలెక్టరేట్కు వెళ్లండని ఇంకోసారి దాటే స్తున్నారు. – తడికమళ్ల యశస్విని, పల్లిపాడు, కొణిజర్ల మండలం -
అంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేవు.. బోరున ఏడ్చేసిన నటి
కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందులోనూ ఏళ్లతరబడి కష్టపడుతున్నా దానికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం లేకపోతే ఆ బాధ తట్టుకోలేం. ఒకప్పుడు నటి తిలోత్తమ షోమ్ (Tillotama Shome) పరిస్థితి కూడా ఇదే! ఈ బెంగాలీ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలవుతోంది. బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్లో అనేక సినిమాలు చేసిన ఆమె ఇటీవలే షాడోబాక్స్ చిత్రంతో అలరించింది. తాజాగా ఈమె తన అనుభవాలను చెప్తూ బోరున ఏడ్చేసింది.పారితోషికంతో కారు కొంటా..తిలోత్తమ మాట్లాడుతూ.. నేను నటించిన సినిమాకు ఓ డైరెక్టర్ చాలా తక్కువ పారితోషికం ఇచ్చాడు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక జరిగిన పార్టీలో అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. నువ్వు దేనిపై అయినా మనసు పారేసుకున్నావా? అని అడిగారు. అందుకు నేను అవును, ఫలానా కారు అంటే నాకిష్టం. ఆ కారు రేటుకు తగ్గట్లుగా నాకు పారితోషికం వచ్చినప్పుడు కచ్చితంగా దాన్ని కొంటాను అని చెప్పాను.అంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేవ్ఇంతలో ఆ డైరెక్టర్ మధ్యలో కలగజేసుకుని.. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు.. కానీ ఎప్పటికీ నువ్వు ఊహించినంత డబ్బు సంపాదించలేవు అన్నాడు. ఇదెంత అన్యాయం కదా..! కానీ ఇండస్ట్రీలో ఇలాగే ఉంటుంది. దురదృష్టవశాత్తూ.. మనకెంత టాలెంట్ ఉన్నా సరే దానికి తగ్గట్లు రెమ్యునరేషన్ ఇవ్వరు. ఇప్పటికీ ఆ దర్శకుడు అన్న మాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.రెట్టింపు తీసుకున్నా..అయితే అతడి మాటలు నాలో కసిని పెంచాయి. నేను ఎలాగైనా చెప్పినంత సంపాదించి తీరాలనుకున్నాను. తర్వాత నాకో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను అడిగినంత ఇవ్వాలన్నాను. నాలుగు నెలల తర్వాత మా చర్చలు సఫలమయ్యాయి. నేను కలగన్నదానికంటే రెట్టింపు పారితోషికం తీసుకున్నాను. ఆ సినిమా పేరు చెప్పలేను అంటూ నటి కన్నీళ్లు పెట్టుకుంది. తిలోత్తమ.. సర్, ద నైట్ మేనేజర్, మాన్సూన్ వెడ్డింగ్, ఢిల్లీ క్రైమ్, లస్ట్ స్టోరీస్ 2, పాతాళ్ లోక్ 2 వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులకు దగ్గరైంది.చదవండి: నేను నివసించని ఇంటికి రూ.1 లక్ష కరెంట్ బిల్లు.. కంగనా షాక్ -
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) 'ఆషిఖి 3' (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజైన ఫస్ట్లుక్ టీజర్లో వీరి కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. మీ జోడీ బాగుందని మెచ్చుకున్నారు. పైగా బయట కూడా తరచూ జంటగానే కనిపించడంతో ఆఫ్స్క్రీన్లోనూ ప్రేమాయణం నడిపిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.నేను సింగిల్తాజాగా ఈ రూమర్పై కార్తీక్ క్లారిటీ ఇచ్చాడు. ఫిలింఫేర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతూ.. నేను సింగిల్గా ఉన్నాను. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్లో లేను. గతంలోనూ నేను పలువురితో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. అందులో కొన్ని నిజాలు కాగా మరికొన్ని ఉట్టి అబద్ధాలు మాత్రమే!నేర్చుకున్నా..అప్పుడీ గాసిప్స్ గురించి నేనంతగా పట్టించుకునేవాడిని కాదు. నేను ఎవరినైనా కలిసినా కూడా ఏవేవో కథనాలు అల్లుకునేవారు. ఒకరకంగా చెప్పాలంటే నా గురించి నాకే తెలియని వార్తలు వచ్చేవి. అవి చూసి నేను కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాను. పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా కార్తీక్.. జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్య పాండే వంటి పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి.రూ.50 కోట్లు.. నేనొక్కడినే తీసుకుంటున్నానా?కార్తీక్ ఒక్కో సినిమాకుగానూ రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపైనా స్పందించాడు. ఇండస్ట్రీలో నేనొక్కడినే అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నానా? మిగతావాళ్ల గురించి రాయరు కానీ నాగురించి మాత్రం నొక్కి చెప్తుంటారు అని అసహనం వ్యక్తి చేశాడు. కార్తీక్- శ్రీలీలల సినిమా విషయానికి వస్తే.. అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: అల్లు అర్జున్ బర్త్డే: 'ఎదురు నీకు లేదులే.. అడ్డు నీకు రాదులే' -
వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?
తెలుగులో ఇప్పటివరకు చాలా సీరియల్స్ వచ్చాయి. కానీ గత కొన్నేళ్లలో మాత్రం 'కార్తీకదీపం' హిట్ అయినట్లు మరేది క్లిక్ అవ్వలేదని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇందులో హీరోయిన్ వంటలక్కగా చేసిన ప్రేమి విశ్వనాథ్.. తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా మారిపోయింది.స్వతహాగా మలయాళ నటి అయిన ప్రేమి విశ్వనాథ్.. 2014 నుంచి సీరియల్స్ చేస్తోంది. తొలుత సొంత భాషలో చేసింది. 2017 నుంచి మాత్రం తెలుగులో కార్తీకదీపం చేస్తోంది. 2023 వరకు కొనసాగిన ఈ సీరియల్.. అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఫేమ్ నటుడు దర్శన్ అరెస్ట్!)ప్రస్తుతం రెండో సీజన్ అని నడిపిస్తున్నారు. 300కి పైగా ఎపిసోడ్లు ప్రసారం చేశారు గానీ తొలి పార్ట్ అంత బజ్ సొంతం చేసుకోలేకపోయింది. సీరియల్ గురించి పక్కనబెడితే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈమె రోజుకి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తోందట. నెలలో దాదాపు 20-25 రోజుల పాటు ప్రేమి విశ్వనాథ్ షూటింగ్ లో పాల్గొంటుంది. తద్వారా లక్షల్లోనే పారితోషికం అందుకుంటోంది. రెమ్యునరేషన్ విషయంలో వంటలక్క తర్వాత సుజిత, కస్తూరి లాంటి ఆర్టిస్టులు ఉన్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఏళ్లు గడుస్తున్నా వంటలక్క క్రేజ్ మాత్రం తగ్గట్లేదుగా!(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
చిరు సినిమా: అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక పారితోషికం!
అనిల్ రావిపూడి(Anil Ravipudi ).. టాలీవుడ్లో హిట్ సినిమాకు ఈ పేరు కేరాఫ్గా మారింది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి బాక్సాఫీస్ని షేక్ చేస్తాడు. రీసెంట్గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో విక్టరీ వెంకటేశ్కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న MEGA157(వర్కింగ్ టైటిల్) మూవీ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ కంటే ముందే ప్రమోషనల్ వీడియోని వదిలాడు అనిల్. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీమ్ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని క్రియేట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ తన ఫోకస్ అంతా చిరు సినిమాపైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భారీగానే పారితోషికం పుచ్చకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు రూ.10-12 కోట్లు తీసుకున్న అనిల్.. ఈ చిత్రం భారీ హిట్ కావడంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. మెగాస్టార్ సినిమాకు అత్యధికంగా రూ.20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. కెరీర్ ప్రారంభంలో పటాస్ చిత్రానికి అనిల్ రూ.50 లక్షలు మాత్రమే తీసున్నాడు. ఇప్పుడు రూ. 20 కోట్లకు ఎగబాకాడు. సూపర్ హిట్ ఇచ్చి భారీగా వసూళ్లను రాబట్టే సత్తా ఉండడంతో రూ.20 కోట్లే కాదు అంతకంటే కాస్త ఎక్కువ అయినా ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. -
Vaishnavi Chaitanya: ఒక్క హిట్...తెలుగమ్మాయికి భారీ రెమ్యునరేషన్
తారల తలరాతలు మార్చడానికి ఒకే ఒక్క సినిమా చాలు. హిట్ పడ్డాక ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆ హిట్ కోసం తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) చాలా కాలమే ఎదురు చూసింది. కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్వేర్ డెవలపర్' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి... అటు తర్వాత 'అల వైకుంఠపురములో' 'వరుడు కావలెను' వంటి క్రేజీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమాల్లో చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ వాటితో కూడా యూత్ ను మెప్పించారు.అందువల్ల 'బేబీ' సినిమాలో వైష్ణవికి మెయిన్ హీరోయిన్ ఛాన్స్ వరించింది.ఆ ఒక్క చిత్రమే ఈ తెలుగమ్మాయి జీవితాన్ని మార్చేసింది.ఆ చిత్రంలో యూత్ లోనే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు వైష్ణవి. ఇప్పుడు ఆమె నటిస్తున్న 'జాక్' సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆమె ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' బ్యానర్ పై అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు '90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించనున్నారు వైష్ణవి. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇలా 2 పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్ గా చేస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లు, డిమాండ్ ఉన్న హీరోయిన్లు బాగా తక్కువగానే ఉన్నారు. మొన్నటి వరకు ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఫామ్లో లేరు. ఇలాంటి టైంలో దర్సకనిర్మాతలకి వైష్ణవి చైతన్య వైపు మొగ్గు చూపుతున్నారు.ఇది ఆమెకి కలిసొచ్చినట్టు అయ్యింది. దీంతో వైష్ణవి పారితోషికం కూడా పెరిగినట్టు సమాచారం. ఇటీవల ఓ కొత్త సినిమా కోసం వైష్ణవి చైతన్యకి కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట ఓ యువ నిర్మాత, దర్శకుడు. వైష్ణవికి యూత్లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు అంత మొత్తం ఇచ్చేందుకు ఈ దర్శకనిర్మాతలు సిద్దమైనట్టు సమాచారం.ఇలా తన అప్ కమింగ్ సినిమాకి గాను వైష్ణవి పారితోషికం కోటి రూపాయల మార్క్ టచ్ అయినట్టు స్పష్టమవుతోంది. -
వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా?
ఒకప్పుడు రెమ్యునరేషన్ల విషయానికి వస్తే.. కేవలం హీరోలకు ఇచ్చే భారీ పారితోషికాలే చర్చకు వచ్చేవి. ఇప్పటికీ రెమ్యునరేషన్స్ తీసుకునే విషయంలో హీరోలదే పై చేయి ఉన్నప్పటికీ... హీరోయిన్లు, దర్శకులు కూడా వారితో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకవేళ సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాత, పంపిణీదారులు మాత్రమే నష్టపోతుండగా, భారీ పారితోషికాలు అందుకుంటున్న హీరోలు, దర్శకులు మాత్రం సేఫ్గానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో హీరోలు, దర్శకులు కూడా రెమ్యునరేషన్( Remuneration) కు బదులు లాభాల్లో వాటాలు పొందాలనే చర్చ మొదలైంది.తాజాగా గేమ్ ఛేంజర్ ద్వారా భారీ నష్టాల్ని చవిచూసి, సంక్రాంతికి వస్తున్నాం ద్వారా కొంత ఉపశమనం పొందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో ఈ ఆసక్తికర చర్చకు తెర లేపారు. మలయాళ చిత్రం ఎల్2: ఎంపురాన్ (L2: Empuraan)ను తెలుగు రాష్ట్రాలకు తీసుకువస్తున్న దిల్ రాజు(Dil Raju) ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... మోహన్లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ ల సెన్సేషనల్ చిత్రం ఎల్2: ఎంపురాన్ కోసం తమ రెమ్యునరేషన్ను మాఫీ చేశారని, బదులుగా లాభాన్ని పంచుకునే మోడల్ను ఎంచుకున్నారని ఆయన వెల్లడించారు.అలాంటి మోడల్ టాలీవుడ్లో కూడా పనిచేయగలదా అని అడిగిన ప్రశ్నకు, దిల్ రాజు స్పందిస్తూ, ‘‘రాజమౌళి తన చిత్రాలకు ముందస్తుగా పారితోషికం వసూలు చేయరనీ, తన సినిమాలకు లాభాలను పంచుకునే పద్ధతిని అనుసరిస్తాడనీ వెల్లడించారు. అదే విధంగా కెజిఎఫ్, సలార్ల చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు అదే పంధాలో పని చేస్తున్నాడు. ఈ మోడల్ త్వరలో తెలుగు సినిమాలో మరింత పుంజుకుంటుందని, సాధారణమైన విషయంగా మారుతుంది’’ అంటూ ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తాను మొదట గేమ్ ఛేంజర్ సినిమా సందర్భంగా దీన్ని అమలు చేయాలనే ప్రయత్నం చేశానని, అయితే, సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో, శంకర్, రామ్ చరణ్ లు తమ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారనీ వివరించారు.అయితే, ఈ విధానం టాలీవుడ్లో ఓ సంప్రదాయంగా మారడంపై పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘మన పెద్ద స్టార్లు, దర్శకులు భారీ చెల్లింపులు అడ్వాన్స్లకు అలవాటు పడ్డారు, లాభాల భాగస్వామ్య వ్యవస్థను అమలు చేయడం సినిమా లావాదేవీలను కష్టతరం చేస్తుంది. సూపర్స్టార్లు సినిమాకు75–125 కోట్లు వసూలు చేయడం దర్శకులు రూ.25–50 కోట్లు వసూలు చేయడం వల్ల లాభాలను పంచుకోవడం పనికిరావచ్చు, అయితే నష్టాలు వచ్చినట్లయితే డబ్బును పూర్తిగా వదులుకోవాలనే ఆలోచనను అంగీకరించడం అసంభవం’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజమౌళి నమూనా ఆయన వరకూ విజయవంతం అయినప్పటికీ, టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులు, హీరోలు స్థిరమైన చెల్లింపులను కాదనుకుని విజయంలో భాగస్వామ్య వాటాలకు మారడాన్ని స్వీకరిస్తారా? అనేది సందేహాస్పదమే. -
యాడ్కి, సినిమాకి ఒకే రెమ్యునరేషన్..సుహాస్ ఏమన్నారంటే..?
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న హీరో సుహాస్. ఒకవైపు సహాయక నటుడి పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు హీరోగాను రాణిస్తున్నాడు. జూనియర్ ఆర్టాస్ట్గా కేరీర్ ఆరంభించి..ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్లో ఎదిగినట్లుగానే తన రెమ్యునరేషన్ని కూడా పెంచేశాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ ఒక్కో సినిమాకు రూ. 2.5 నుంచి రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే రెమ్యునరేషన్ గురించి మీడియా అడిగిన ప్రతిసారి హాస్యాస్పదంగా స్పందిస్తూ తప్పించుకుంటున్నాడు. అయినా కూడా మీడియా ప్రతినిధులు మాత్రం సుహాస్ రెమ్యునరేషన్ గురించి ప్రతి ప్రెస్మీట్లోనూ అడుగుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి సుహాస్కు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురవ్వగా.. ‘ఏం టార్చర్ ఇది.. యాక్టింగ్ గురించి మానేసి నా రెమ్యూనరేషన్ గురించి ఎందుకు,’ అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు.సుహాస్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామ'.తాజాగా ఈ మూవీ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘యాడ్కి, సినిమాకే ఒకే రకమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట కదా?’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దానికి సుహాస్ సమాధానం చెబుతూ.. ‘ప్రతిసారి నా రెమ్యునరేషన్ గురించే అడుగున్నారు? ఏం టార్చర్ అయిపోయింది ఇది.. జీవితమో..(నవ్వుతూ..). మీరు అనుకున్నంత కాదు కాని మంచిగానే ఇచ్చారు. ఇదేంటో.. యాక్టింగ్ బాగా చేస్తాననేది వదిలేసి..రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటున్నారనేదే ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు’అని సుహాస్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తున్న వార్తలో నిజం లేదని, తనకు ఇప్పటివరకు ఆ మూవీ టీమ్ నుంచి కాల్ రాలేదని స్పష్టం చేశాడు.ఇక ‘ఓ భామ అయ్యో రామ’ విషయానికొస్తే.. సుహాస్ నటిస్తున్న తొలి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. -
రెమ్యునరేషన్పై హీరోకు ప్రశ్న.. నాకు ఇదేం టార్చర్ రా బాబు!
సరికొత్త సినిమాలతో టాలీవుడ్ ప్రియులను అలరిస్తోన్న యంగ్ హీరో సుహాస్(Suhas). తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుహాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామా'(O Bhama Ayyo Rama). ఆ మూవీలో మాళవిక మనోజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సుహాస్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు యాడ్లకు ఎంత తీసుకుంటారో.. అలాగే సినిమాకు అంతే రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ ఉంది.. దీనిపై మీరేమంటారు అని సుహాస్ను ప్రశ్నించారు. దీనిపై సుహాస్ కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.సుహాస్ మాట్లాడుతూ..' ఇదేంటీ నాకు టార్చర్. నేను అనుకున్నంత నంబర్ అయితే లేదు. అయినా కూడా నా యాక్టింగ్ బాగుందో లేదో చూడాలి కానీ.. ఈ రెమ్యునరేషన్ గోల ఏంది? అన్నారు. అలాగే ప్రభాస్ స్పిరిట్లో నటిస్తున్నారా? అని ప్రశ్నించగా..అదేం లేదు అని సుహాస్ సమాధానమిచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిత హస్సానందాని, అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
మనీ తీసుకోకుండా మూవీ
-
బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?
'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) సినిమాని మీలో చాలామంది చూసే ఉంటారు. అందులో బుల్లిరాజు (Bulliraju) పాత్ర కాస్త ఎక్కువగానే ఫేమస్ అయింది. ఇంతకు ముందు ఏ సినిమాల్లో నటించనప్పటికీ.. సూపర్ కామెడీ టైమింగ్ తో ఈ పిల్లాడు అదరగొట్టేశాడు. తాజాగా ఇతడి రెమ్యునరేషన్ కి సంబంధించిన రూమర్స్ కొన్ని వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. ఫోటోలు వైరల్)ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. 5వ తరగతి చదువుతున్నాడు. ఓ వీడియో వల్ల వైరల్ అయిన ఇతడిని చూసిన అనిల్ రావిపూడి సినిమాలోకి తీసుకున్నాడు. సినిమా రిలీజ్ తర్వాత బుల్లిరాజుగా హీరో వెంకటేశ్ కంటే ఎక్కువ వైరల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్టు డిమాండ్ మామూలుగా లేదు.'సంక్రాంతి వస్తున్నాం' రిలీజైన దగ్గర నుంచి చాలా కథలు వింటున్నాడట. అదే టైంలో రోజుకి రూ.లక్ష రూపాయల రెమ్యునరేషన్(Remuneration) కూడా డిమాండ్ చేస్తున్నాడట. ఇంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఓకే అంటున్నారని సమాచారం. మరోవైపు అనిల్ రావిపూడి.. త్వరలో చిరంజీవితో తీయబోయే మూవీలోనూ బుల్లిరాజ్ అలియాస్ రేవంత్ ఉంటాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: స్కూటర్ కి దెయ్యం పడితే.. ఫన్నీగా 'టుక్ టుక్' ట్రైలర్) -
రాబిన్హుడ్లో డేవిడ్ వార్నర్.. లక్షల్లో కాదు కోట్లల్లో పారితోషికం!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner).. మైదానంలో ఎంత ఫేమస్సో, సోషల్ మీడియాలోనూ అంతే ఫేమస్.. టాలీవుడ్ చిత్రాల డైలాగులతో రీల్స్ చేస్తూ తెలుగువారి మనసు గెలుచుకున్నాడు. ఈసారి ఏకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. నితిన్ హీరోగా నటించిన రాబిన్హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించాడు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.కోట్ల పారితోషికం?అందులో వార్నర్.. షార్ట్ హెయిర్, కూల్ ఎక్స్ప్రెషన్స్తో వావ్ అనిపించాడు. ఇక పోస్టర్ రిలీజైనప్పటినుంచి ఈ దిగ్గజ క్రికెటర్ రాబిన్హుడ్ (Robinhood Movie)కు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. సినిమాలో నటించినందుకుగానూ రూ.3 కోట్లు తీసుకున్నాడట. ప్రమోషన్స్లో పాల్గొనేందుకు మరో రూ.1 కోటి అదనంగా అడిగాడట! ఇది విన్న అభిమానులు.. స్టార్ క్రికెటర్ అంటే ఆమాత్రం ఇచ్చుకోవాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: రైతు అంటేనే ఛీ అనేలా చేసిన వెధవ.. ఈ దొంగ రైతుబిడ్డ: అన్వేష్ ఫైర్)అప్పుడలా.. ఇప్పుడిలా.. గతంలోనూ వార్నర్ పారితోషికం (David Warner Remuneration for Robinhood) గురించి కొన్ని వార్తలు వెలువడ్డాయి. కేవలం సరదా కోసమే ఆయన ఈ పాత్ర ఎంచుకున్నారని, డబ్బు గురించి ఆలోచించలేదని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాతలు రూ.50 లక్షలను అతడికి అందించినట్లుగా ప్రస్తావించారు. ఇప్పుడేమో ఏకంగా రూ.4 కోట్లు తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. వార్నర్ స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు!సినిమారాబిన్హుడ్ సినిమా విషయానికి వస్తే.. భీష్మ వంటి హిట్ మూవీ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. శ్రీలీల కథానాయికగా నటించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు -
పారితోషికం 10 కోట్లు.. బడ్జెట్ 25 కోట్లు.. యంగ్ హీరో కండిషన్!
సినిమా బడ్జెట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. చిన్న సినిమా అయినా సరే ఐదారు కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇక కొంచెం పేరున్న నటీనటులతో సినిమా చేయాలంటే పది కొట్లకు పైనే అవుతుంది. ఒక్క హిట్ పడితే చాలు.. ఆ హీరోలో సినిమా చేయాలంటే తక్కువలో తక్కువ 20 కోట్లు ఉండాల్సిందేనట. టాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా నడుస్తోంది. చాలా మంది హీరోలు కథలు వినడం కంటే ముందే.. తన రెమ్యునరేషన్, సినిమా బడ్జెట్ ఎంతో చెప్పమని అడుగుతున్నారట. తక్కువ బడ్జెట్ సినిమాలు చేయమని ముఖంపైనే చెప్పేస్తున్నారు. టాలీవుడ్కి చెందిన ఓ యంగ్ హీరో అయితే తనతో సినిమా చేయాలంటే పాతిక కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాల్సిందేనని కండీషన్ పెట్టాడట.తాజాగా ఓ యంగ్ డైరెక్టర్, నిర్మాత మంచి కాన్సెప్ట్తో సదరు హీరోని సంప్రదించారట. కథ మొత్తం విన్నాక.. బడ్జెట్ ఎంత అని అడిగాడట. 10-15 కోట్లతో తీయ్యొచ్చని చెబితే..మినిమం 25 కోట్ల బడ్జెట్ పెడితేనే సినిమా చేస్తానని చెప్పాడట. తన రెమ్యునరేషన్గా రూ.10 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేశారట. అయితే ఆ హీరోకి ఇటీవల ఒక్క హిట్ కూడా లేకపోవడం గమనార్హం. పైగా ఆయన నటించిన ఓ హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయినా కూడా తన రెమ్యునరేషన్ని ఏమాత్రం తగ్గించలేదట. ఆ హీరో మార్కెట్ వ్యాల్యూ కూడా అంతగా లేదు. దీంతో సదరు నిర్మాత అంత బడ్జెట్ పెట్టలేనని చెప్పి బయటకు వచ్చాడట. వరుసగా ఫ్లాపులు వచ్చాయి కదా..తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడని ఆ హీరోని సంప్రదిస్తే.. ఆయన పెట్టిన కండీషన్ చూసి సదరు నిర్మాత షాకయ్యారట. ఇలా చాలా మంది యంగ్ హీరోలు ఒక్క హిట్ పడగానే రెమ్యునరేషన్ పెంచడంతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతున్నారని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. -
పారితోషికం భారీగా పెంచేసిన సాయి పల్లవి, సమంత..ఎంతంటే?
ఒకప్పుడు సినిమాల్లో నటించడానికి హీరో లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటే.. హీరోయిన్లు వేలల్లో తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. చిన్న హీరో సైతం కోట్ల రూపాయాల పారితోషికం పుచ్చుకుంటున్నాడు. ఒక్క హిట్ పడితే చాలు రెమ్యునరేషన్ని డబుల్ చేస్తున్నారు. అయితే హీరోలో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువే. కానీ కొంతమంది నటీమణులు మాత్రం హీరోకి సమానంగా...ఇంకా చెప్పాలంటే రూపాయి ఎక్కువే కానీ తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. మార్కెట్లో వాళ్లకు ఉన్న డిమాండ్ని బట్టి నిర్మాతలే వాళ్లకు అంతలా పెంచేస్తున్నారు.మొన్నటి వరకు ఓక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకునే సాయి పల్లవి(Sai Pallavi).. తండేల్కి రూ.5 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకుందట. హీరో నాగచైతన్య రెమ్యునరేషన్ కూడా ఇంచు మించు అంతే ఉంటుంది. ఇక ఇప్పుడు సాయి పల్లవి ఓ సినిమా కోసం తన పారితోషికాన్ని అమాంతం నాలుగు రెట్లు పెంచేసింది. బాలీవుడ్లో ఆమె నటిస్తున్న తొలి సినిమా ‘రామాయణ’ కోసం ఆమె దాదాపు రూ. 20 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఆ రెండింటికి కలిపి రూ.20 కోట్లు ఆఫర్ చేశారట నిర్మాతలు.మరోవైపు సమంత(Samantha) కూడా తన రెమ్యునరేషన్ని పెంచేసింది. ఖుషీ వరకు రూ.3 కోట్లు తీసుకున్న సామ్.. సిటాడెల్ హనీ బన్నీకి ఏకంగా రూ.8 కోట్లు పారితోషికంగా తీసుకుందట. ఇక ఇప్పుడు ఆమె నటిస్తోందన్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ.10 కోట్లు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. సూపర్హిట్ సిరీస్లతో ఆకట్టుకునే దర్శకద్వయం రాజ్, డీకే (Raj and DK) ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆదిత్యరాయ్ కపూర్, సమంతతో పాటు కీలకపాత్రలో అలీ ఫజల్ కూడా నటిస్తున్నారు. -
‘రాబిన్హుడ్’లో డేవిడ్ వార్నర్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner)లో ఓ మంచి నటుడు ఉన్నాడు. యాక్టింగ్ అంటే అతనికి పిచ్చి. లాక్డౌన్ సమయంలో ఎన్నో టిక్టాక్ వీడియోలు చేసి అలరించాడు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పులేస్తూ దక్షిణాది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్హుడ్’( Robinhood Movie). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడట. ఈ విషయాన్ని ఇన్నాళ్లు గోప్యంగా ఉంచిన మేకర్స్.. తాజాగా ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారనే విషయం తెలియగానే..అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు సీనీ లవర్స్ కూడా ‘రాబిన్హుడ్’లో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అసలు ఆ పాత్రలో నటించడానికి వార్నర్ ఎంత తీసుకున్నాడు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. వార్నర్కి రూ.50 లక్షలను రెమ్యునరేషన్గా అందించారట నిర్మాతలు. అయితే వార్నర్ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి డిమాండ్ చేయలేదట . సరదా కోసమే ఆ పాత్రను చేస్తానని అంగీకరించాట. కానీ నిర్మాతలే ఆయనకు ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకొని చిన్న పాత్రలో నటించినా.. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందించారట. ఇక రాబిన్హుడ్ విషయానికొస్తే.. ‘భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ ఇది. హానీ సింగ్ అనే పాత్రలో నితిన్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘అఖండ 2’ నుంచే కారు గిఫ్ట్.. బాలయ్య రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇటీవల సంగీత దర్శకుడు తమన్కి హీరో బాలకృష్ణ(Balakrishna ) ఓ కారు గిఫ్ట్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ధర దాదాపు కోటీన్నర వరకు ఉంటుంది. బాలయ్య నుంచి అంతపెద్ద బహుమతి రావడం తమన్తో పాటు టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా బహుమతిగానే ఇచ్చాడా? లేదంటే దీని వెనుక ఏదైనా మతలబు ఉందా? అని నెటిజన్స్ చర్చిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తమన్ ఫ్రీగా ఫండ్ రైజింగ్ ప్రొగ్రాం చేశాడు. దానికి ప్రతిఫలంగా బాలయ్య ఈ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు కూడా నెట్టింట వినిపించాయి. (చదవండి: సినీతారలకు ముద్దులూ, రొమాన్స్ నేర్పేది వీరే...)అయితే ఇక్కడ వాస్తవం ఏంటనేది ఎవరికీ తెలియదు. గిఫ్ట్గా ఇచ్చానని బాలయ్య చెప్పడం..అభిమానంతో ఇచ్చాడని తమన్ మురిసిపోవడం మాత్రమే అందరికి తెలుసు. అయితే టాలీవుడ్లో ఇలా ఒకరు మరొకరి గిఫ్ట్ ఇచ్చారంటే.. ఏదో ఆశించి ఇచ్చినట్టేననే టాక్ అయితే ఉంది. అది సినమాల పరంగానా లేదా పర్సనల్గానా అనేది తెలియదు కానీ బహుమతి వెనుక బహుళ ప్రయోజనాలే ఉంటాయి.ఇటీవల బాలయ్య నటించిన చిత్రాలన్నింటికి తమనే సంగీతం అందిస్తున్నాడు. ‘డిక్టేటర్’, ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ ‘డాకు మహారాజ్’ ఇవన్నీ మ్యూజిక్ పరంగా మంచి విజయం సాధించాయి. అందుకే తమన్ బాలయ్యకు క్లోజ్ అయ్యాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’(Akhanda 2 Movie) కి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. అయితే బాలయ్య కెరీర్కి బిగ్గెస్ట్ విజయాలు అందించిన బోయపాటిని కాదని తమన్కు బహుమతి ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గిఫ్ట్కి అఖండ 2 నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట డబ్బులు ఇచ్చారట. తన రెమ్యునరేషన్లో డబ్బులు కట్ చేసి కారు కొనివ్వమని బాలయ్య చెప్పడంతో నిర్మాతలు ఆ పని చేశారట. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆఖండ 2కి బాలయ్య అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. రూ.35 కోట్ల వరకు పారితోషికంగా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా వాయిదాల ప్రకారం బాలయ్య చేతికి చేరుతుంది. డాకు మహారాజ్కి రూ.28 కోట్లు తీసుకున్న బాలయ్య..తదుపరి చిత్రానికి ఏకంగా 7 కోట్లను పెంచేశాడు. అయితే ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే మాత్రం బాలయ్య తీసుకునేది తక్కువే అని ఇండస్ట్రీ టాక్. -
హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
హీరోలు కోట్లు సంపాదిస్తారు.. వారి కింద పనిచేసే బాడీగార్డులు కూడా లక్షలు వెనకేస్తుంటారు! స్టార్ హీరోల బాడీగార్డుల సంపాదన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. షేరా అలియాస్ గుర్మీత్ సింగ్.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు రెండు దశాబ్దాలుగా బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఇతడికికి టైగర్ అని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కూడా ఉంది. బాడీగార్డు ఉంటేనే అడుగు బయటకురవి సింగ్ విషయానికి వస్తే.. ఇతడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు వ్యక్తిగత అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూసుఫ్ ఇబ్రహీం.. ఆలియా భట్, వరుణ్ ధావన్ వంటి పలువురు హీరోహీరోయిన్లకు బాడీగార్డుగా సేవలందిస్తున్నాడు. వీరు సెలబ్రిటీలు ఇల్లు దాటి బయటకు వెళ్లినప్పుడు వారికి రక్షణగా నిలుస్తారు. ఈవెంట్లకు వెళ్లినా, ఎక్కడికైనా ప్రయాణించినా సదరు నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.బాడీగార్డులకు కోట్లల్లో ఆదాయం?సెలబ్రిటీటల పట్ల అంకితభావంతో పనిచేసే వీరు బాగానే డబ్బు కూడబెడతారని ఫిల్మీదునియాలో ఓ టాక్ ఉంది. దీనిపై హీరోయిన్ ఆలియా భట్ బాడీగార్డ్ యూసఫ్ ఇబ్రహీం(Bollywood bodyguard Yusuf Ibrahim) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా షారూఖ్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. చూడండి.. ఎవరెంత సంపాదిస్తున్నారనేది మాకు తెలియదు. ఒకరి ఆదాయం మరొకరికి తెలియదు. తెలిసే అవకాశమే లేదు అన్నాడు. మీకు తెలియకుండా ఉంటుందా? అని యాంకర్ అడిగినప్పటికీ అతడు తెలీదనే అడ్డంగా తలూపాడు. మరి సల్మాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడంటున్నారు.. ఇది నిజమేనా? అన్న రెండో ప్రశ్న ఎదురైంది.(చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు, ఎందుకంటే?)నెలకు రూ.10 లక్షలు ఈజీగా..దీనికి ఇబ్రహీం స్పందిస్తూ.. షేరాకు సొంత బిజినెస్ ఉంది. అతడికంటూ ప్రత్యేకంగా సెక్యురిటీ కంపెనీ ఉంది. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు. అక్షయ్ కుమార్ అంగరక్షకుడు శ్రేసయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు.. అతడి వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. అయినా నెలకు రూ.10-12 లక్షల ఆదాయం వేసుకున్నా ఏడాదికి రూ.1 కోటి ఈజీగా దాటుతుంది.కొన్నిసార్లు లెక్క మారుతుందికానీ కొన్నిసార్లు అంత డబ్బు రాకపోవచ్చు. ఎందుకంటే కొందరు షూటింగ్కు, ఈవెంట్స్కు, ప్రమోషన్స్కు వేర్వేరుగా డబ్బు లెక్కగడుతుంటారు. దాన్ని బట్టి సెలబ్రిటీలు ఎలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్తున్నారో దాని ఆధారంగానే డబ్బిస్తారు. పైగా ఆయా సెలబ్రిటీ నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నాడనేదానిపై కూడా మా జీతం ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ ఎవరికి నచ్చినట్లు వారు లెక్కలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నామని ఫిక్సయిపోయారు. కానీ సాధారణ బాడీగార్డులైతే నెలకు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది అని ఇబ్రహీం చెప్పుకొచ్చాడు.చదవండి: చికెన్గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
15 కోట్లు రెమ్యునరేషన్.. పెంచేసిన సౌత్ హీరోయిన్
-
Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!
ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే యంగ్ హీరోల్లో రామ్ చరణ్(Ram Charan) ముందు వరుసలో ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్.. తనదైన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ రేంజ్కు చేరాడు. ఆయన నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చినా.. చరణ్లో మాత్రం కించిత్తు అహం కూడా పెరగలేదు. ఆయనపై వచ్చిన రూమర్స్ కూడా చాలా తక్కువే. నిర్మాతలతో పాటు అందరితోనూ చాలా అనోన్యంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తోటి నటీనటులు చెబుతుంటారు. తాజాగా వినిపిస్తున్న ఓ వార్త రామ్ చరణ్లో మంచితనం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తుంది. గేమ్ ఛేంజర్ కోసం తన రెమ్యునరేషన్ను భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తుంది.(చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. కేవలం పాటలకే అన్ని కోట్లా?)పెరిగిన బడ్జెట్ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత సినిమా బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్ల అనుకున్నారట. అందులో రామ్ చరణ్ రెమ్యునరేషన్నే దాదాపు 100 కోట్లు అని ప్రచారం జరిగింది. చరణ్ కూడా ముందే అంతే స్థాయిలో తీసుకుంటానని చెప్పారట. కానీ బడ్జెట్ పెరగడంతో రెమ్యునరేషన్ తగ్గించారట. ఈ సినిమాకు మొత్తంగా రూ. 500 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడంతోనే బడ్జెట్ పెరిగింది.చరణ్తో పాటు శంకర్ కూడారామ్ చరణ్కు మొదటి నుంచి ఒక అలవాటు ఉందట. సినిమా ఒప్పుకున్న వెంటనే రెమ్యునరేషన్ తీసుకోడట. షూటింగ్ మొత్తం పూర్తయిన చెప్పిన అమౌంట్ తీసుకుంటాడు. గేమ్ ఛేంజర్ విషయంలోనూ రామ్ చరణ్ అదే ఫాలో అయ్యాడు. తొలుత రూ. 100 కోట్లు తీసుకుంటానని చెప్పాడు. కానీ బడ్జెట్ పెరగడంతో చరణ్ తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.35 కోట్లను తగ్గించి రూ. 65 కోట్లను మాత్రమే పారితోషికంగా పుచ్చుకున్నారట. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన ఈ చిత్రానికి అది చాలా తక్కువ రెమ్యునరేషనే. శంకర్ కూడా తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించి రూ. 35 కోట్లతో సరిపెట్టుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. చరణ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో మనసు చాలా మంచిది..తక్కువే తీసుకొని ఉంటాడని అంటున్నారు. -
గతంలో కంటే రెట్టింపు పారితోషికం, అవేవీ ఎపిసోడ్లో వేయలేదు: గౌతమ్
అశ్వత్థామకు చావు లేదన్నది అందరికీ తెలుసు. కానీ ఈ అశ్వత్థామకు తిరుగులేదని నిరూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో తనకు తాను అశ్వత్థామ అన్న బిరుదు ఇచ్చుకున్నాడు. అప్పుడు తనపై సెటైర్లు వేసినవాళ్లే.. ఎనిమిదో సీజన్కు వచ్చేసరికి చప్పట్లు కొట్టారు. గౌతమ్ మాట తీరు, ఆటతీరుకు ఫిదా అయ్యారు. ఈ సీజన్ రన్నరప్గా నిలిచిన్నప్పటికీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న గౌతమ్ తాజాగా సాక్షి.కామ్తో ముచ్చటించాడు. ఆ విశేషాలు చూసేయండి..ట్రోలింగ్పై మీ అభిప్రాయం?గౌతమ్: గత సీజన్లో నేను కొన్ని పొరపాట్లు చేశాను. అందుకు నాపై ట్రోలింగ్ జరిగింది. తర్వాత నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుని ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టాను. మొదటివారం ఎలిమినేషన్ అంచున నిలబడినప్పుడు బాధపడ్డాను. కానీ నాకు ఒక అవకాశం వచ్చిందన్నప్పుడు ధృడంగా నిలబడ్డాను, గట్టిగా ఆడాను. అశ్వత్థామ అంటే ట్రోల్ చేసినవారే మళ్లీ అదే పేరుతో పొగిడారు. నాకెంతో పాజటివిటీ దొరికింది. ఈ జర్నీని నేనెప్పటికీ మర్చిపోలేను.ఫినాలే వరకు రావడానికి మణికంఠ కారణమని భావిస్తున్నారా?గౌతమ్: లేదు. ఒక్క వారం మణికంఠ వల్ల సేవ్ అయ్యాను. కానీ ఫినాలే వరకు నా స్వయంకృషితో వచ్చాను.చిరంజీవి సతీమణి సురేఖగారిని ఎప్పుడు కలుస్తారు?గౌతమ్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని త్వరలోనే కలుస్తాను.గత సీజన్లో నాగార్జున గ్రూప్ గేమ్స్ తప్పన్నారు. ఈ సీజన్లో మాత్రం గ్రూప్ గేమ్స్ తప్పేం కాదని వెనకేసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?గౌతమ్: నేనూ చాలా మీమ్స్లో చూశాను. ఫ్రెండ్స్గా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడటం తప్పు కాదు. కానీ గ్రూప్గా ఉంటూ వేరేవాళ్లను టార్గెట్ చేయడం తప్పు. అది నాకు నచ్చలేదు.విన్నర్ అయినందుకు నిఖిల్ను అభినందించారా?గౌతమ్: ఫినాలే స్టేజీపై వెంటనే కంగ్రాట్స్ చెప్పాను. కానీ ఎపిసోడ్లో వేయలేదు. అలాగే నాగార్జునగారు కూడా నేను చరిత్ర సృష్టిస్తానని మెచ్చుకున్నారు. అది కూడా ఎపిసోడ్లో వేయలేదు.రెమ్యునరేషన్ సంతృప్తికరంగా ఉందా?గౌతమ్: గత సీజన్ కంటే రెట్టింపు పారితోషికం ఇచ్చారు.చదవండి: ప్రెగ్నెంట్ అని తెలియగానే షాకయ్యా..: రాధికా ఆప్టే -
బిగ్బాస్: మూడు రోజులకే రూ.2.5 కోట్లు! ఎవరికో తెలుసా?
రియాలిటీ షోలకు బాస్.. బిగ్బాస్. ఈ షోను ఆదరించేవాళ్లు ఎంతోమంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో విజయవంతంగా రన్ అవుతోంది. షో గెలిచినవారికి కళ్లు చెదిరే ప్రైజ్మనీ ఇస్తుంటారు. తెలుగులో విజేతకు రూ.50 లక్షలు ఇస్తుండగా హిందీలో మొదట్లో రూ.1 కోటి ఇచ్చేవారు. ఆరో సీజన్ నుంచి మాత్రం అది తగ్గుతూ వచ్చింది. కోట్లల్లో రెమ్యునరేషన్మధ్యలో రూ.30 లక్షలదాకా వెళ్లిన ప్రైజ్మనీ ప్రస్తుత సీజన్లో మాత్రం రూ.50 లక్షలుగా ఉంది. అయితే వీటితో సంబంధం లేకుండా కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ కూడా ఇస్తుంటారు. కొందరు ఈ పారితోషికం రూపంలోనే లక్షలు, కోట్లు సంపాదించారు. అలా బిగ్బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్నది ఎవరో తెలుసా? కెనడియన్ నటి పమేలా ఆండర్సన్. ఈమె హిందీ బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. సెకండ్ ప్లేస్లో ఎవరంటే?ముచ్చటగా మూడు రోజులు హౌస్లో ఉండి వెళ్లిపోయింది. అందుకుగానూ రూ.2.5 కోట్ల పారితోషికం తీసుకుందట! కాగా పమేలా.. స్కూబీ డూ,స్నేరీ మూవీ 3, స్నాప్డ్రాగన్ చిత్రాలతో పాటు బేవాచ్ యాక్షన్ సిరీస్లోనూ నటించింది. చివరగా ద లాస్ట్ షోగర్ల్ అనే సినిమాతో మెప్పించింది. ఈ బ్యూటీ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న కంటెస్టెంట్ గ్రేట్ ఖాలి అని తెలుస్తోంది. ఇతడు వారానికి రూ.50 లక్షలవరకు తీసుకున్నాడట! తర్వాతిస్థానంలో కరణ్వీర్ బొహ్ర రూ.20 లక్షలు అందుకున్నట్లు భోగట్టా!చదవండి: ఆస్కార్లో నిరాశ.. లాపతా లేడీస్ను సెలక్ట్ చేయడమే తప్పంటున్న డైరెక్టర్ -
భాష మారింది.. కీర్తి సురేశ్ రెమ్యునరేషన్ డబుల్?
'మహానటి' కీర్తి సురేశ్ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోయింది. పేరుకే మలయాళీ గానీ టాలీవుడ్లోనే స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసింది. రీసెంట్గా ఆంటోని తట్టిళ్ అనే బిజినెస్మ్యాన్ పెళ్లి చేసుకుంది. మరోవైపు ఈమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'.. వచ్చే వారం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈ మూవీ కోసం డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందనే టాక్ నడుస్తోంది.ప్రముఖ నిర్మాత సురేశ్, ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేశ్.. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ ఏడాది రిలీజైన ప్రభాస్ 'కల్కి'లో కారుకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈమె నటించిన 'బేబీ జాన్' అనే హిందీ మూవీలో నటించింది. తమిళ సినిమా 'తెరి' రీమేక్గా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త)ఒరిజినల్ సినిమాలో సమంత కనిపించిన పాత్రలో ఇప్పుడు కీర్తి సురేశ్ నటించింది. సౌత్లో నటిస్తే రూ.2 కోట్లు ఈమెకు ఇస్తారు. కానీ 'బేబీ జాన్'లో నటించినందుకుగానూ రూ.4 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట. బహుశా అందుకేనేమో గ్లామర్ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లు పాటల్లో కనిపించింది!ఇదే సినిమాలో నటించిన మిగతా నటీనటులు రెమ్యునరేషన్ విషయానికొస్తే హీరో వరుణ్ ధావన్కి రూ.15 కోట్లు పైనే ఇచ్చారట. విలన్గా చేసిన జాకీ ష్రాఫ్కి కోటిన్నర, మరో హీరోయిన్గా చేసిన వామికా గబ్బికి కోటి రూపాయలు, కీలక పాత్ర చేసిన సన్యా మల్హోత్రాకు రూ.40 లక్షల పారితోషికం ఇచ్చారట. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇతడి శిష్యుడు కలీస్ దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
బిగ్బాస్ విన్నర్గా నిఖిల్.. ప్రైజ్మనీతోపాటు ఏం సాధించాడంటే?
సరైనోడు, దమ్మున్నోడు, జెంటిల్మెన్.. ఇలాంటి ట్యాగులన్నీ నిఖిల్కు సరిగ్గా సరిపోతాయి. ఎంత కోపం వచ్చినా అది క్షణకాలం మాత్రమే! వంద రోజుల జర్నీలో అతడు కంట్రోల్ తప్పిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టుకోవచ్చు. ఎవరెన్ని నిందలు వేసినా తనలో తను బాధపడ్డాడే తప్ప తిరిగి ఒక్కమాట కూడా అనలేదు. ఫిజికల్ టాస్కుల విషయానికి వస్తే అతడిని ఢీ కొట్టేవాడే లేడన్నంతగా రెచ్చిపోయాడు. నిందలు పడ్డ చోటే నిలబడ్డాడునిఖిల్ ఆటలో అడుగుపెడితే వార్ వన్సైడ్ అయిపోద్ది అన్న లెవల్లో ఆడాడు. ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలినా లెక్కచేయలేదు. కంటెస్టెంట్ల సూటిపోటి మాటల వల్ల హౌస్ను వీడాలనుకున్నాడు. కానీ తనను ప్రేమించిన ప్రేక్షకుల కోసం మాటలు పడ్డ చోటే నిలబడాలనుకున్నాడు. ఆటతోనే సమాధానం చెప్పాడు. వేలెత్తి చూపించినవారితోనే చప్పట్లు కొట్టేలా చేశాడు. (Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)సంపాదన ఎంత?సీరియల్ యాక్టర్గా పేరు గడించిన నిఖిల్ బిగ్బాస్ ప్రియుల మనసు గెలుచుకుని ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. రూ.55 లక్షల ప్రైజ్మనీ అందుకున్నాడు. దీనితోపాటు మారుతి డిజైర్ కారు అదనపు బహుమతిగా లభించనుంది. ఇకపోతే నిఖిల్ వారానికి రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు వెనకేశాడు. చదవండి: కోరిక మిగిలిపోయిందన్న తేజ.. నాగార్జున బంపరాఫర్ -
ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?
ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి, వేలెత్తిచూపించినవారే తలదించుకునేలా చేయాలి.. తిట్టినవారితోనే పొగిడించుకోవాలి.. ఇవన్నీ చేసి చూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అతడు ఏం కోల్పోయాడో దాన్ని ఈ సీజన్లో తిరిగి సంపాదించాడు. అప్పుడు మూటగట్టుకున్న నెగెటివిటినీ తన మాటతీరుతో, ఆటతీరుతో కడిగిపారేశాడు.(Bigg Boss 8: నబీల్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నప్పుడు నవ్వినవాళ్లే ఈడు మగాడ్రా బుజ్జి అంటున్నారు! బిగ్బాస్ 8లో వైల్డ్కార్డ్గా వచ్చి వైల్డ్ ఫైర్లా మారాడు. టైటిల్ రేసులో ఉన్న నిఖిల్కు గట్టి పోటీనిచ్చాడు. గతంలో ఫైనల్స్కు రాకుండానే వెనుదిరిగిన గౌతమ్ ఇప్పుడేకంగా టాప్ 2లో చోటు దక్కించుకున్నాడు. వారానికి రూ.1.75 లక్షల చొప్పున సంపాదించాడు. అంటే బిగ్బాస్ హౌస్లో పారితోషికం రూపేణా పది వారాలకుగానూ దాదాపు రూ.17,50,000 వెనకేసినట్లు తెలుస్తోంది.(చదవండి: బిగ్బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?) -
బిగ్బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?
అందాల రాక్షసి.. బిగ్బాస్ ప్రేరణకు అంకితమిచ్చిన ట్యాగ్లైన్ ఇది. ఈ అందాల భామకు ముక్కు మీద కోపం. ఎవరైనా ఒక్క మాటంటే దానికి పది మాటలు తిప్పి కొడుతుంది. తనను చులకన చేస్తే బుసకొట్టిన పాములా లేస్తుంది. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడుతుంది. మగవాళ్లకు బలమైన పోటీ ఇస్తుంది. బుద్ధిబలం కూడా మెండు.విపరీతమైన నెగెటివిటీకానీ నోటిదురుసే ఎక్కువ! సిగ్గు లేదా? క్యారెక్టర్లెస్? ఆ ముఖం చూడు.. ఇలాంటి మాటలన్నీ తన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలే! మెగా చీఫ్ అయ్యాక నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించింది. తిండి దగ్గర కూడా ఆంక్షలు పెట్టి అభాసుపాలైంది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. పారితోషికం ఎంతంటే?కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో వెంటనే తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అందుకే టాప్ 5లో నిలబడిన ఏకైక మహిళగా నిలిచింది. తనకు సూట్కేస్ ఆఫర్ చేసినా నిర్మొహమాటంగా నో చెప్పింది. ప్రేక్షకులు తనను ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్తానని నిలబడింది. నాలుగో స్థానంలో వీడ్కోలు తీసుకుంది. ప్రేరణ వారానికి రూ.2 లక్షల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.30 లక్షలు వెనకేసిందట!చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం.. -
విన్నర్ ప్రైజ్మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!
బిగ్బాస్ షో ప్రారంభమైన ప్రతిసారి జనాల్లో మెదిలే ప్రశ్న.. ఈసారైనా లేడీ కంటెస్టెంట్ గెలుస్తారా? అని! ఈ సీజన్లోనూ ఆ చర్చ జరిగింది. భారీ ఫ్యాన్ బేస్తో హౌస్లో అడుగుపెట్టిన విష్ణుప్రియకు ట్రోఫీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉండేది. కానీ తన ఆటను చెడగొట్టుకోవడానికి ఎవరూ అక్కర్లేదు, తాను చాలు అన్నట్లే ప్రవర్తించింది.స్వచ్ఛతకు మారుపేరు విష్ణుగేమ్పై కాకుండా పృథ్వీపై ఫోకస్ చేసింది. తనకంట కూడా అతడే ఎక్కువ అని బాహాటంగానే ప్రకటించింది. భూతద్దం వేసి వెతికినా ఎక్కడా తనలో గెలవాలన్న కసి కనిపించలేదు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాక ఆటలో యాక్టివ్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఆమె నిర్మొహమాటంగా, నిజాయితీగా వ్యవహరించే తీరు మాత్రం జనాలకు బాగా నచ్చేసింది.విన్నర్ కంటే ఎక్కువ సంపాదనకానీ టైటిల్ గెలవాలంటే ఆ ఒక్కటే ఉంటే సరిపోదు కదా! లేడీ విన్నర్ అవాలనుందన్న విష్ణు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఫలితంగా పద్నాలుగోవారం ఎలిమినేట్ అయింది. అయితే విన్నర్ కంటే ఎక్కువ సంపాదించేసింది. వారానికి సుమారు రూ.4 లక్షల చొప్పున పారితోషికం తీసుకుంటున్న ఈమె పద్నాలుగువారాలకు గానూ రూ.56 లక్షలు వెనకేసిందట! అంటే విన్నర్ ప్రైజ్మనీ కంటే కూడా విష్ణు ఎక్కువే సంపాదించింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?
బిగ్బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో షో ముగిసిపోనున్న దృష్ట్యా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇందులో భాగంగా రోహిణిని శనివారం బయటకు పంపేశారు. ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ మంచి గుర్తింపుతో పాటు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇంతకీ రోహిణి ఎన్ని వారాలు ఉంది? ఎన్ని లక్షలు సంపాదించింది?వచ్చేవారమంతా ఫినాలే వీక్ కాబట్టి.. టాప్-5ని మాత్రమే పంపించాలి కాబట్టి ఇప్పుడు రోహిణిని పంపించారు. ఆదివారం ఎపిసోడ్లో విష్ణుప్రియని ఎలిమినేట్ చేయబోతున్నారు. కాసేపు విష్ణుప్రియ గురించి పక్కనబెడితే రోహిణి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. అప్పటివరకు నీరసంగా ఉన్న షోని కాస్త అవినాష్తో కలిసి ఎంటర్టైన్ చేస్తూ కాస్త రేటింగ్స్ వచ్చేలా చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ')రోహిణిని అయితే పృథ్వీ, విష్ణుప్రియ లాంటి వాళ్లు అసలు నువ్వు కామెడీ చేయడానికి తప్పితే ఎందుకు పనికిరావ్ అని నానా మాటలు అన్నారు. దీంతో తను కేవలం కామెడీకి మాత్రమే కాదని, గేమ్స్ కూడా ఆడగలనని నిరూపించింది. తనని మాటలన్నా పృథ్వీపైనే గెలిచి అదరగొట్టేసింది. అయితే టాప్-5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్లో దాదాపు 9 వారాల పాటు ఉంది. హౌసులోకి వచ్చేముందు వారానికి రూ.2లక్షల చొప్పున ఈమె అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.18 లక్షల వరకు పారితోషికం సొంతం చేసుకున్నట్లే. గతంలో ఈమె బిగ్బాస్లో పాల్గొన్న ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈసారి మాత్రం అటు డబ్బు, ఇటు మరింత గుర్తింపు రోహిణికి దక్కడం విశేషం.(ఇదీ చదవండి: రోహిణితో పాటు విష్ణుప్రియ అవుట్.. ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్!) -
'పుష్ప 2' రెమ్యునరేషన్.. ఎవరికెంత ఇచ్చారు?
మరికొన్ని గంటల్లో 'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. హైప్ అయితే గట్టిగానే ఉంది. మరోవైపు టికెట్ రేట్ల గురించి కాస్తంత విమర్శలు వచ్చాయి గానీ ఆ ప్రభావం, బుకింగ్స్పై మాత్రం కనిపించట్లేదు. తొలి భాగం తీసేటప్పుడు ఓ తెలుగు సినిమాగానే రిలీజ్ చేశారు. కానీ తర్వాత తర్వాత నార్త్లోనూ దుమ్మురేపింది. దీంతో అంచనాలు, బడ్జెట్, మూవీ స్కేల్ అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు నటీనటులు పారితోషికాలు కూడా గట్టిగానే ఉన్నాయండోయ్. ఇంతకీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు?'పుష్ప' తొలి పార్ట్ రిలీజ్ ముందు వరకు బన్నీ అంటే తెలుగు రాష్ట్రాలు, మహా అయితే కేరళ వరకు తెలుసేమో! కానీ ఇది సృష్టించిన ప్రభంజనం దెబ్బకు ఉత్తరాదిలోనూ బన్నీ పేరు గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత 'పుష్ప' మూవీకిగానూ జాతీయ అవార్డ్.. ఇలా రేంజ్ పెరుగుతూనే పోయింది. దీంతో సీక్వెల్ విషయంలో రెమ్యునరేషన్ బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడు. కట్ చేస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటేసింది. అలా రూ.270-80 కోట్ల మొత్తం బన్నీ పారితోషికంగా అందుకున్నాడట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)బన్నీ తర్వాత డైరెక్టర్ సుకుమార్ది హయ్యస్ట్. తొలి పార్ట్ కోసం కేవలం దర్శకుడిగా పనిచేసిన ఇతడు.. సీక్వెల్కి వచ్చేసరికి తన సుకుమార్ రైటింగ్స్ సంస్థతో నిర్మాణంలోనూ భాగమయ్యాడు. అలా డైరెక్టర్ కమ్ నిర్మాతగా రూ.100 కోట్ల పైనే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. మిగిలిన నటీనటుల విషయానికొస్తే హీరోయిన్ రష్మికకు రూ.10 కోట్లు, ఫహాద్ ఫాజిల్కి రూ.8 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్కి రూ.5 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట.వీళ్లు కాకుండా సినిమాలోని ఇతర కీలక పాత్రలు చేసిన జగపతిబాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే రూ.600 కోట్ల మేర మూవీకి బడ్జెట్ అయిందని అంటున్నారు. కానీ ఇందులో సగం బడ్జెట్, పారితోషికాలకే సరిపోయాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే అంతమంది స్టార్స్ పనిచేశారు మరి!(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్) -
'కిస్సిక్' కోసం భారీ రెమ్యునరేషన్.. స్పందించిన శ్రీలీల
ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసిన ‘పుష్ప 2’ మూవీ గురించే మాట్లాతున్నారు. ఇక ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ అయితే యూట్యూబ్లో దుమ్ము దులిపేస్తుంది. ఈ పాటకు అల్లు అర్జున్, శ్రీలీల వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో పాటు ఈ పాటపై మరో ఆసక్తికర గాసిప్ కూడా నెట్టింట హల్చల్ చేస్తుంది. అదే శ్రీలీల రెమ్యునరేషన్. ఈ ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ పాటకు అంతే మొత్తంలో డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా శ్రీలీల అడిగినంత డబ్బు ఇచ్చారని నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకారుపై శ్రీలీలతో పాటు నిర్మాతలు స్పందించారు.వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్- శ్రీలీల జంటగా రాబిన్హుడ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాబిన్హుడ్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నితిన్, శ్రీలీలతో పాటు దర్శకుడు వెంకీ, నిర్మాత రవి, నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప ఐటమ్ సాంగ్ రెమ్యునరేషన్పై శ్రీలీలకు ప్రశ్న ఎదురైంది. ‘కిస్సిక్’ సాంగ్ కోసం సినిమా స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారట కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అసలు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ మ్యాటరే మా మధ్య జరగలేదని అటు శ్రీలీల, ఇటు నిర్మాతలు చెప్పుకొచ్చారు. ‘అంత ఇంత అని ఏమి అనుకోలేదు. అవకాశం వచ్చింది చేసేశా. ఇంకా డబ్బుల గురించి మాట్లాడలేదు’అని శ్రీలీల అన్నారు. నిర్మాతలు, నవీన్ మాట్లాడుతూ..‘రెమ్యునరేషన్ టాపికే శ్రీలీల తీయలేదు. మీరు అనుకున్నంత రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు’అని క్లారిటీ ఇచ్చారు.ఇక పుష్ప 2 విషయానికొస్తే.. అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కి సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
స్ట్రాంగ్ ఉమెన్.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్!
యష్మి గౌడ.. స్ట్రాంగ్ ఉమెన్, టాప్ 5 కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్లో ఉండేది యష్మి ఆట. తను టాస్క్లో దిగితే ఎలాగైనా గెలవాల్సిందే అన్నంత కసిగా ఆడేది. ఆడపులి అన్న సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకున్న సోనియాకే చుక్కలు చూపించింది. తనలో ఫైర్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కానీ తర్వాతి వారాల్లో యష్మి ఆట గాడితప్పింది.సంచాలక్గా వరస్ట్ప్లేయర్గా బెస్ట్ అనిపించుకున్నా సంచాలక్గా వరస్ట్ గేమ్స్ ఆడింది. ఎప్పుడైతే నిఖిల్పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టిందో అప్పటినుంచి తన డౌన్ఫాల్ మొదలైంది. అతడిని ఎవరైనా నామినేట్ చేసినా ఈవిడే తెగ ఫీలైపోయేది. అతడితో డ్యాన్స్ చేయడం కోసం విష్ణుప్రియతో విపరీతంగా గొడవపడింది.నిఖిల్ చుట్టూ గేమ్తన కోసం గేమ్ ఆడటం మానేసి ఎవరికోసమో పాకరిల్లడమేంటని ఫ్యాన్స్ సైతం హర్టయ్యారు. ఫ్రెండ్లా అయినా ఉండరా అంటూ అతడి వెంట పడ్డ యష్మి ఈ వారం నామినేషన్లో మాత్రం అతడిపై ఏ ఫీలింగ్స్ లేవని ప్లేటు తిప్పేయడం మరింత షాక్కు గురిచేసింది. ఇలా మాట మార్చడాల వల్ల ఆమె తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. పారితోషికం ఎంత?చివరకు తన ఏడుపు కూడా ఫేక్ అని జనాలు ముద్ర వేసే స్థాయికి దిగజారిపోయింది. ఫైనల్గా ఈ వారం ఎలిమినేట్ అయింది. ఇకపోతే యష్మి.. ఒక్కవారానికిగానూ రూ.2.50 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. 12 వారాలకుగానూ ఆమె రూ.30 లక్షలు వెనకేసిందన్నమాట!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రెమ్యునరేషన్ పెంపు.. అంత పిచ్చోడిని కాదన్న హీరో!
సినిమా హిట్టయిందంటే చాలు చాలామంది రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అలాంటిది బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావు రూ.50 కోట్లు పెట్టి తీసిన స్త్రీ 2 సినిమాతో రూ.700 కోట్లు సాధించాడు. ఇంతటి ఘన విజయం తర్వాత ఆ హీరో కూడా రేటు పెంచేశాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందుకుంటున్న పారితోషికానికి అదనంగా మరో రూ.5 కోట్లు అడుగుతున్నాడట! అంత తెలివితక్కువవాడిని కాదుఈ పుకార్లపై రాజ్కుమార్ స్పందించాడు. నా నిర్మాతలను కాల్చుకుతినేంత తెలివితక్కువవాడిని కాదు. బ్లాక్బస్టర్ సినిమా చేసినంతమాత్రాన నేనేమీ మారిపోను. డబ్బు కన్నా నాకు ప్యాషనే ముఖ్యం. ఛాలెంజ్, సర్ప్రైజింగ్ రోల్స్ చేస్తూ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే స్త్రీ 2 సినిమాకుగానూ రాజ్కుమార్ రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమా..స్త్రీ 2 విషయానికి వస్తే.. రాజ్కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన హిట్ మూవీ స్త్రీకి ఇది సీక్వెల్గా తెరకెక్కింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రం ఆగస్టు 15న విడుదలవగా.. ప్రపంచవ్యాప్తంగా వందలకోట్లు వసూలు చేసింది. స్త్రీ 2 అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. చదవండి: వైల్డ్కార్డ్ విన్నరేంటి? ఇది అధర్మం కాదా?: అభయ్ నవీన్ -
పుష్ప-2 లో శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
-
బాలీవుడ్ ఖాన్స్ రెమ్యునరేషన్ కలిపినా ప్రభాస్ రెమ్యునరేషన్ కి సరిపోదు
-
అందులో నిజం లేదు!
‘‘జుడ్వా 2’, ‘డంకీ’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించినందుకు పెద్ద మొత్తంలో నేను పారితోషికం అందుకున్నానని చాలామంది భావిస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు’’ అంటున్నారు హీరోయిన్ తాప్సీ. బాలీవుడ్లోని స్టార్ హీరోయిన్లలో తాప్సీ ఒకరు. ఓ వైపు హీరోలకి జోడీగా వాణిజ్య చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ హీరో, హీరోయిన్ల మధ్య పారితోషికం వ్యత్యాసంపై స్పందించారు. ‘‘వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆలోచిస్తాను. పారితోషికం విషయంలో నటీనటుల మధ్య వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలుసు.‘జుడ్వా 2’, ‘డంకీ’ సినిమాలకు నేను భారీగా పారితోషికం అందుకున్నానని పలువురు భావిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నప్పుడు కొందరు నిర్మాతలు ఏదో మాపై దయ చూపుతున్నట్లు వ్యవహరిస్తారు. మా సినిమాలో పెద్ద హీరో ఉన్నాడు. వేరే వాళ్లను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది.. మరికొంతమంది ‘మేము మంచి ప్రాజెక్టులు ఇచ్చి మీ కెరీర్ ఉన్నతి కోసం సాయం చేస్తున్నాం.. డబ్బుదేముంది’ అన్నట్లు మాట్లాడతారు. ఇలాంటి మాటలపై నేను ప్రతిరోజూ పోరాటం చేస్తున్నాను. పెద్ద ప్రొడక్షన్స్లో హీరోయిన్ల పాత్రలపై చిన్నచూపు ఉంటుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్గా మారాయి. -
బిగ్బాస్: నయని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ వైల్డ్కార్డులు వచ్చాకే అంతో ఇంత ఆసక్తికరంగా మారింది. అయితే వాళ్లు వచ్చిన మొదటివారం తప్ప తర్వాత వాళ్లే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. మొదట మెహబూబ్ ఎలిమినేట్ అవగా ఇప్పుడు నయని పావని అవుట్ అయింది. ఆటపై కసి ఉన్నా ఎమోషన్స్పై కంట్రోల్ లేకపోవడంతో గేమ్ బోల్తా కొట్టింది. ఎంత సంపాదించిందంటే?పదేపదే ఏడుస్తూ ఉంటే చూడటానికి ప్రేక్షకులకు చిరాకు వేసింది. అలా తొమ్మిదోవారం ఎలిమినేట్ అయింది. వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హౌస్లో నాలుగు వారాలు ఉంది. వారానికి రూ.1,50,000 చొప్పున మొత్తం రూ.6 లక్షల మేర సంపాదించినట్లు తెలుస్తోంది.అప్పుడు వారమే.. ఈసారి నెల!కాగా నయని గత సీజన్లోనూ వైల్డ్కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు కేవలం వారం మాత్రమే ఉండి వెళ్లిపోయింది. ఈ సీజన్లో ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలనుకుంది. ఆటపై బాగానే ఫోకస్ పెట్టింది. కానీ ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఏడవడం ఆమెకు మైనస్ అయింది. పైగా ఆటలో గెలిచింది లేదు కానీ గొడవల్లో మాత్రం ముందు ఉందన్న పేరు సంపాదించుకుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఇండియన్ తొలి హీరో ఎవరు.. ఏ సినిమాకు? (ఫోటోలు)
-
CJI DY Chandrachud: జూనియర్లకు సరైన వేతనాలివ్వండి
న్యూఢిల్లీ: ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి’’ అని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు. న్యాయవాద వృత్తి చాలా సంక్లిష్టమైందని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలే యువ న్యాయవాదులను ముందుకు నడిపిస్తాయని, అవి వారికి జీవితాంతం తోడ్పడుతాయని తెలిపారు. పునాది బలంగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉంటాయని, ప్రారంభంలో వేతనాలు ఎక్కువగా ఉండకపోవచ్చని వెల్లడించారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు కష్టపడి పనిచేయాలని, నిజాయతీగా ఉండాలని పేర్కొన్నారు. యువ లాయర్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. జూనియర్లకు సీనియర్ లాయర్లు గురువులుగా కొత్త విషయాలు నేరి్పస్తూనే సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పనిచేశానని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు. శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన తన తల్లి తనను ముంబైలోని ఆలిండియా రేడియో స్టూడియోకు తీసుకెళ్తూ ఉండేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వచ్చాక ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్ కార్యక్రమాలు నిర్వహించానని వివరించారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లి‹Ù, సంస్కృత కార్యక్రమాలు విన్నానని తెలిపారు. దేవకి నందన్ పాండే, పమేలా సింగ్, లోతికా రత్నం గొంతులకు తాను అభిమానినని చెప్పారు. -
బిగ్బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?
బిగ్బాస్ షో నాకు ఎంత ముఖ్యమో మీకు తెలియదు, నా పెళ్లాంబిడ్డలు తిరిగి రావాలన్నా, అత్తామామ దగ్గర గౌరవం దక్కాలన్నా ఈ షో గెలవాలి అని నాగమణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరైనా నామినేట్ చేస్తే చాలు ఆ వారమంతా తెగ టెన్షన్ పడిపోయేవాడు. తను హౌస్లో ఉండాలని తపించిపోయాడు. ప్రతి గేమ్లో తానే ఉండాలనుకున్నాడు. కానీ ఈ వారం సీన్ మారిపోయింది. హౌస్లో ఉండలేనన్నాడు. ఇంటికి వెళ్లిపోతానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మైండ్ పని చేయట్లేదన్నాడు.పారితోషికం..శరీరం కూడా సహకరించలేదన్నాడు. దీంతో డాక్టర్ దగ్గరకు కూడా పంపించగా వాళ్లు బాగానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయినా సరే మణి హౌస్లో సర్దుకోలేకపోయాడు. అతడు కోరుకున్నట్లుగానే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. అతడి పారితోషికం విషయానికి వస్తే.. వారానికి రూ.1.20 లక్షల చొప్పున మేర సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఏడువారాలకుగానూ రూ.8.40 లక్షలు వెనకేసినట్లు సమాచారం. -
బిగ్బాస్ 8: కిర్రాక్ సీత పారితోషికం ఎంతంటే?
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో కిర్రాక్ సీత ఎలిమినేట్ అయింది. పోయిన వారం నైనిక, ఈ వారం సీత బిగ్బాస్ ఇంటిని వీడి వెళ్లిపోయారు. చూస్తుంటే పవర్ ఆఫ్ గర్ల్స్ గ్యాంగ్లో ఒక్కొక్కరూ వరుసగా ఎలిమినేట్ అవుతున్నట్లున్నారు. ఈ గ్యాంగ్లో ఉన్నదే ముగ్గురు. సీత, నైనిక, విష్ణు.. ఇప్పటికే ఇద్దరు వెళ్లిపోయారు. విష్ణు కంటే నయంగేమ్ను సీరియస్గా తీసుకోకుండా చిల్ అవుతున్న విష్ణును వచ్చేవారం పంపించాలని పలువురూ అభిప్రాయపడుతున్నారు. నిజానికి విష్ణు కన్నా సీతకు ఇంట్లో ఉండేందుకు ఎక్కువ అర్హత ఉంది. కానీ ఫ్యాన్ బేస్లో వెనకబడి ఉండటంతో తనకు ఓట్లు తక్కువగా వచ్చాయి. పైగా తనకు పీఆర్ టీమ్ కూడా లేనట్లుంది.నెగెటివిటీ..దీంతో ప్రచారంలోనూ ఓ అడుగు వెనకే ఉంది. వీటికి తోడు తన ప్రవర్తన కూడా ఆమెపై నెగెటివిటీ పెంచింది. కసిగా ఆడినప్పటికీ తను వేసిన తప్పటడుగులు ఎగ్జిట్ గేట్కు దారి చూపాయి. ఈమె రెమ్యునరేషన్ విషయానికి వస్తే వారానికి రూ.2 లక్షలు వెనకేసిందట.. ఈ లెక్కన ఆరువారాలకుగానూ దాదాపు రూ.12 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss: నైనిక ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?
బిగ్బాస్ షోలో ఆట ఎప్పుడు ఎటు మలుపు తిరుగుందో చెప్పలేం. అందుకు నైనిక పెద్ద ఉదాహరణ. షో ప్రారంభమైన కొత్తలో టాస్కుల్లో శివంగిలా ఆడి గెలిచింది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక కంటెస్టెంట్లా కనిపించింది. వయసులో చిన్నదైనా క్లాన్ (టీమ్) లీడర్గా ఎదిగింది. తన గ్రాఫ్ ఏ రేంజ్లో అయితే పైకి జుయ్మని ఎగబాకిందో అదే స్పీడులో కిందకు పడిపోయింది.చిచ్చుబుడ్డిలా వెలిగి చివరకు..క్లాన్ చీఫ్గా పెద్దగా పవర్ చూపించలేకపోయింది. ఆటలో డల్ అయిపోయింది. ఫ్రెండ్స్తో ముచ్చట్లు తప్పితే హౌస్లో పెద్దగా కనిపించకుండా పోయింది. నైనిక నీ గేమ్ ఎటు పోయింది? నీలో ఫైర్ ఏమైపోయింది? అని నాగార్జున సైతం ఆమె ముఖం పట్టుకుని అడిగాడు. అయినా లాభం లేకుండా పోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఐదో వారం ఎలిమినేట్..ప్రేక్షకులు ఈమెను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకునే స్థాయి నుంచి హౌస్లో ఉంచాల్సిన అవసరం లేదనుకునే స్థాయికి వచ్చేసింది. దీంతో ఐదో వారం ఎలిమినేట్ అయింది. ఆమె రెమ్యునరేషన్ విషయానికి వస్తే ప్రతి వారం రూ.2.20 లక్షలు అందుకుందట! ఈ లెక్కన ఐదు వారాలకుగానూ 11 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ ద్వారా ఆదిత్య ఎంత సంపాదించాడంటే?
బిగ్బాస్ ఎనిమిదవ సీజన్లో ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు కానీ హౌస్మేట్ల గిల్లికజ్జాలు, సోదిముచ్చట్లు చూస్తుంటే ప్రేక్షకులకు కూడా అసహనం, చిరాకు అన్లిమిటెడ్గానే వస్తోంది. నెల రోజుల్లోనే మొహం మొత్తేస్తే కష్టమని భావించిన బిగ్బాస్ టీమ్ వైల్డ్కార్డ్ ఎంట్రీలను దింపుతోంది. ఎనిమిది మందిని హౌస్లోకి ఒకేసారి పంపించనుంది.ఆదిత్య ఓం అవుట్ఇందుకోసం పెద్దగా కంటెంట్ ఇవ్వని కంటెస్టెంట్లను డబుల్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్న మంచి మనిషి ఆదిత్య ఓంను వారం మధ్యలోనే ఎలిమినేట్ చేసేశారు. ఈయన నాలుగున్నర వారాలపాటు హౌస్లో ఉన్నాడు.ఎంత సంపాదించాడంటే?హీరోగా జనాలకు సుపరిచితుడైన ఆదిత్యను ఈ షోకి తీసుకువచ్చేందుకు భారీగానే ఆఫర్ చేశారట! వారానికి రూ.3 లక్షల పారితోషికం ఇచ్చారట! ఈ లెక్కన నాలుగున్నర వారాలకుగానూ దాదాపు రూ.14 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన బేబక్క, బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల కంటే కూడా ఆదిత్యే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు భోగట్టా!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ తప్పే సోనియా కొంప ముంచింది! పారితోషికం లెక్కలివే!
తానే గొప్ప.. ఎదుటివాళ్లు తనముందు పిల్లబచ్చాలు.. అని విర్రవీగితే మొదటికే మోసం వస్తుంది. హౌస్లో చాలామందిని బయటకు పంపించేయాలని ఎదురుచూసింది ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల. కానీ నాలుగోవారానికే ఎలిమినేట్ అయ్యింది. అందుకుగల కారణాలు చాలానే ఉన్నాయి.గ్రూప్ గేమ్ఈ సీజన్లో కెప్టెన్సీకి బదులుగా చీఫ్స్ ఉంటారని బిగ్బాస్ ముందే వెల్లడించాడు. షో మొదలైన రెండు రోజుల్లోనే ఎవరి సత్తా ఏంటో తెలుసుకోవడం కష్టం కాబట్టి నిఖిల్.. తన ఫ్రెండ్ యష్మిని చీఫ్గా సెలక్ట్ చేశాడు. అందుకు సోనియా పెద్ద రాద్దాంతమే చేసింది. గ్రూప్ గేమ్ అంటూ నింద వేసింది.. కట్ చేస్తే వారానికే నిఖిల్ను అతడి గ్రూపులో నుంచి వెలేసి తనతో కొత్త టీమ్ ఏర్పాటు చేసుకుంది.విష్ణుతో వైరంచిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ, నిఖిల్తోనే ఎక్కువ ముచ్చట్లు పెడుతూ సోఫాలో సెటిలైపోయింది. వారితో ఆమె ప్రవర్తించిన తీరుకు జనాలు తలకు జండూభామ్ రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిఖిల్తో స్నేహం ఎలా కుదిరింది? అని విష్ణుప్రియ క్యాజువల్గా అడిగిన పాపానికి అడల్ట్రేటెడ్ కామెడీ అంటూ ఆమెను నిందించింది.మితిమీరిన హగ్గులుకట్ చేస్తే నిఖిల్తో మితిమీరిన హగ్గులు, అతడిని అభ్యంతరకరంగా టచ్ చేయడం చూసి జనాలు చీదరించుకున్నారు. పైగా నిఖిల్ను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పడం కూడా జనాలకు మింగుడుపడలేదు. ఈమె తన గేమ్ పాడుచేసుకోవడమే కాక నిఖిల్ గేమ్ కూడా చెడగొడుతోందని పేరు తెచ్చుకుంది. గేమ్లో వెనుకంజపైగా యష్మిని. ఎంతసేపూ నిఖిల్, పృథ్వీనే చూస్తే ఎలా అని సెటైర్లు వేసిన ఈమె మరి ఎంతసేపూ ఆ ఇద్దరినే వెంటేసుకుని తిరుగుతే జనాలేమనుకుంటారోనని కాస్తైనా ఆలోచించకపోవడం గమనార్హం. టాస్కుల్లోనూ పెద్దగా ఆడింది లేదు, కానీ ఆడినంత బిల్డప్ ఇచ్చింది.పారితోషికం ఎంతంటే?ఆడపులి అన్న ట్యాగ్కు కాస్తయినా న్యాయం చేయలేదు. వెరసి నాలుగోవారమే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ నాలుగు వారాలకుగానూ సోనియా దాదాపు రూ.6 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
దేవర' కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న కొరటాల..!
-
రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తున్న హరీశ్ శంకర్!
మిస్టర్ బచ్చన్.. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. పాత రవితేజను చూస్తారంటూ ఊదరగొట్టిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు కేవలం రూ.12.6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫ్లాప్ దిశగా పయనిస్తోంది.దీంతో హరీశ్ శంకర్ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడట! తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగిచ్చేయాలని ఫిక్స్ అయ్యాన్నాడంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్గా మారింది. మిస్టర్ బచ్చన్ పరాజయానికి బాధ్యత వహిస్తూ తనకు ఇచ్చిన రూ.15 కోట్లను నిర్మాతకు తిరిగిచ్చేస్తాడట! మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.సినిమా విషయానికి వస్తే.. ఉత్తర భారతదేశంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. -
తమన్నా ‘స్పెషల్’ : ఐదు నిమిషాలు.. కోటి రూపాయలు?
ఏ సినిమాకు అయినా పాటలు ప్రత్యేక ఆకర్షణ. కథ, కథనం మాములుగా ఉన్నా.. పాటలతోనే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక స్పెషల్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాకు హైప్ తీసుకురావడంతో అవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే టాలీవుడ్తో పాటు బాలీవుడ్ దర్శకులు సైతం స్పెషల్ సాంగ్పై స్పెషల్ కేర్ తీసుకుంటారు. (చదవండి: సమంత సర్ప్రైజ్.. మొత్తానికి అదేంటో రివీల్ చేసింది!)స్టార్ హీరోయిన్లతో స్టెప్పులేయిస్తే.. కాసుల వర్షం కురుస్తుందని భావిస్తారు. అయితే నిజంగానే కొన్ని సినిమాలకు స్పెషల్ సాంగ్ బాగా కలిసొస్తుంది. అలా ఇటీవల స్పెషల్ సాంగ్తో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా స్త్రీ 2. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ హారర్ ఫిల్మ్ ఆగస్ట్ 15న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తుంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది.(చదవండి: డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్.. నటి హేమ వైరల్ వీడియో) ‘ఆజ్ కి రాత్’ అంటూ సాగే ఈ పాటకి తమన్నా వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. సినిమాకు హైప్ తీసుకొచ్చిన అంశాల్లో ఈ పాట కూడా ఒకటి. అయితే స్పెషల్ సాంగ్ కోసం తమన్నా భారీగానే పారితోషికం తీసుకుందట. కేలవం 5 నిమిషాల నిడివి గల ఈ పాటకి రూ. కోటి తీసుకున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే తీసుకున్న పారితోషికానికి తమన్నా న్యాయం చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆమె కారణంగానే ఆ స్పెషల్ సాంగ్కి హైప్ వచ్చిందని..అది సినిమాకు బాగా ప్లస్ అయిందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సాంగ్ నోరా ఫతేహీ చేయాల్సింది. స్త్రీ పార్ట్ 1లో ఆమే ఐటమ్ సాంగ్ చేసింది. పార్ట్ 2 లో నోరానే చేయాల్సింది కానీ.. చివరి నిమిషంలో తమన్నాను సంప్రదించారట మేకర్స్. వాళ్లు తీసుకున్న నిర్ణయం సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. -
రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. ‘సిటాడెల్’ కోసం అన్ని కోట్లా?
సాధారణంగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. స్టార్ హీరోయిన్లు అయితే రూ. 2-3 కోట్ల వరకు తీసుకుంటారు. ఇక నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల వరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ స్టార్ హీరోయిన్ సమంత ఆ రికార్డులు బద్దలు కొడుతూ.. రూ. 10 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.తొలి హీరోయిన్గా రికార్డు!టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్లో సమంత ఇప్పటికీ ముందు వరుసలో ఉంటుంది. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమె కోసం చాలా మంది దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో తాను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడింది సామ్. (చదవండి: వివాదంలో చిక్కుకున్న యాంకర్ సుమ.. ఏమైందంటే?)ఇక ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్-హనీ బన్నీ త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన లభించింది. సామ్ యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది. అయితే ఈ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. తన కష్టానికి తగ్గట్టే రెమ్యునరేషన్ని కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ. 10 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుందట. సౌత్ హీరోయిన్లలో ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇంత మొత్తంలో తీసుకోలేదు.సమంతకు కొత్తేమి కాదు..రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం సమంతకు కొత్తేమి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన అతితక్కువ రోజుల్లోనే తన పారితోషికాన్ని రూ. కోటికి పెంచేసింది. స్టార్ హీరోయిన్లు అంతా రూ. కోటి తీసుకుంటున్న సమయంలో.. సామ్ 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. అలాగే ఐటమ్ సాంగ్స్కి కూడా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి సమంతనే. (చదవండి: ప్రముఖ నటికి ఇదేం బుద్ధి? మరీ ఇంత మోసమా!)ఇప్పుడు ఓటీటీ రంగంలో కూడా తన మార్క్ చూపించబోతుంది. ఓ వెబ్ సిరీస్కి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న సౌత్ హీరోయిన్ సమంతనే అని చెప్పొచ్చు. అయితే పారితోషికం తగ్గట్టే నటన పరంగా కూడా సామ్ ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తుంది. ఇక సీటాడెల్లో ఆమె లుక్, యాక్షన్ అదిరిపోయింది. నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. -
తారాస్థాయికి చేరిన ప్రభాస్ రేంజ్
-
రకుల్ భర్త జాకీ భగ్నానికి అండగా నిలిచిన అక్షయ్ కుమార్
అక్షయ్కుమార్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బడేమియా ఛోటేమియా’. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీగానే నష్టాలు మిగిలాయి. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఇందులో మానుషి చిల్లర్, అలయా ఎఫ్ ,ఇమ్రాన్ హష్మి, పృథ్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఇందులో నటించారు.‘బడేమియా ఛోటేమియా’ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ సంస్థపై రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, ఆయన తండ్రి వాసు భగ్నానీ అనేక చిత్రాలను నిర్మించారు. కానీ, ‘బడేమియా ఛోటేమియా’ చిత్రం కోసం రూ. 350 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ కావడంతో వారికి కేవలం రూ. 110 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ నిర్మాణ సంస్థకు కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులకు కూడా పూర్తి చెల్లింపులు చేయలేకపోయింది. బాలీవుడ్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది.ఇలాంటి సమయంలో అక్షయ్ కుమార్ పెద్ద మనుసు చేసుకొని తమకు అండగా నిలిచారని ఆ చిత్ర నిర్మాత కుమారుడు జాకీ భగ్నాని తాజాగా తెలిపారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వమని అక్షయ్ కోరారని ఆయన అన్నారు. అందరికంటే ఎక్కువ మొత్తం కూడా అక్షయ్ కుమార్కే ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయినా సరే తనను నమ్మి సినిమా తీసిన నిర్మాణ సంస్థ ఇబ్బందులో పడకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో వారి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ముందకు వచ్చారట.ఈ క్లిష్ట సమయంలో తన సహాయాన్ని అందించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్కు జాకీ భగ్నాని కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ్ కుమార్ తనని ఇటీవల కలిశారని పరిస్థితి గురించి తెలియజేసిన తర్వాత ఆయన సాయం చేసేందుకు ముందుకు వచ్చారని జాకీ తెలిపాడు. 'అక్షయ్ సర్ .. కష్ట సమయంలో మా వెంట నిలబడ్డారు. మా పట్ల ఆయన చూపించిన ప్రేమకు మేము చాలా కృతజ్ఞులం' అని జాకీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. -
Kalki 2898 AD: అర్జునుడుగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898’మూవీ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. హాలీవుడ్ ప్రముఖులే సినిమాను ప్రశంసిస్తున్నారంటే.. నాగ్ అశ్విన్ మేకింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచు. ఈ మూవీలో ప్రభాస్తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు దర్శకధీరుడు రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఫరియా అబ్దుల్లాతో పాటు మరికొంత మంది టాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్లో మెరిశారు.(చదవండి: ఒరిజినల్ మాస్ హీరో అమితాబ్.. వెయ్యి కోట్లు పక్కా అంటున్న స్టార్స్) అయితే వీరిలో బాగా హైలైట్ అయింది మాత్రం విజయ దేవరకొండ పాత్ర అనే చెప్పాలి. అర్జునుడి పాత్రలో రౌడీ హీరో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సినిమా చివరిలో ఐదు నిమిషాల పాటు కనిపిస్తాడు విజయ్. నిడివి తక్కువే అయినా ఆ సీన్స్ హైలెట్గా నిలిచాయి. అయితే ఈ సినిమా కోసం విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్పై నెట్టింట చర్చ జరుగుతుంది. (చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట విజయ్. స్నేహితుడు నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పేశాడట. పార్ట్ 2లోనూ విజయ్ పాత్ర కనిపించబోతుంది. విజయ్ ఒక్కడే కాదు గెస్ట్ రోల్గా నటించిన చాలా మంది రెమ్యునరేషన్ తీసుకోలేదట. కేలవం నాగ్ అశ్విన్, వైయంజతీ మూవీస్ బ్యానర్పై ఉన్న గౌరవంతో ఈ సినిమాలో నటించారట. -
అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. హీరోకు రూ.165 కోట్ల పారితోషికం!
భారీ బడ్జెట్ సినిమాలు క్లిక్కయితే లాభాల వరద పారుతుంది.. తేడా వచ్చిందంటే మాత్రం రక్తకన్నీరు కారుతుంది. చాలా సినిమాల విషయంలో ఇది రుజువైంది కూడా! బాలీవుడ్ బ్యానర్ పూజా ఎంటర్టైన్మెంట్కు ఇలాంటి బాధాకరమైన పరిస్థితి ఎదురైంది. రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, తన తండ్రి వాసు భగ్నానీతో కలిసి ఈ నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు.రూ.250 కోట్ల అప్పు.. అయినా..ఈ బ్యానర్లో ఇటీవల బడే మియా చోటే మియా, గణపత్ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేకపోయాయి. ఇదిలా ఉంటే ఈ నిర్మాణ సంస్థ రూ.250 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ బ్యానర్లో అక్షయ్ కుమార్ నటించిన నాలుగు సినిమాలకుగానూ అతడికి రూ.165 కోట్లు చెల్లించారని ప్రచారం జరుగుతోంది. అది కూడా కంపెనీపై అధిక భారానికి కారణమైందన్నది చర్చ! తాజాగా దీనిపై నిర్మాత సునీల్ దర్శన్ స్పందించాడు.అప్పట్లో సక్సెస్..మీరు అనుకుంటున్న మొత్తానికి కాస్త అటూఇటుగా హీరో టైగర్ ష్రాప్కు రెమ్యునరేషన్ చెల్లించాం. అయితే అదెంత అనేది బయటకు చెప్పలేను. కానీ ఓ విషయం చెప్పాలి.. 1990'స్లో వాసు భగ్నానీ.. డేవిడ్ దావణ్తో కలిసి అర డజను సినిమాలు చేసి సక్సెస్ రుచి చూశాడు. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి! ఇప్పుడు వారి స్ట్రాటజీలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు. అక్షయ్కు ఎంత ఇచ్చారన్నది మాత్రం బయటపెట్టలేదు. ఇకపోతే పూజా బ్యానర్లో అక్షయ్ కుమార్.. బడే మియా చోటే మియా, బెల్ బాటమ్, మిషన్ రాణిగంజ్, కట్పుత్లి సినిమాలు చేశాడు.చదవండి: -
ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?
'కల్కి' రిలీజ్కి మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ ఓ రేంజ్లో కాకపోయిన ఓ మాదిరి హైప్ ఉంది. ఇప్పటికే రిలీజైన రెండు ట్రైలర్స్ సూపర్గా ఉన్నాయి. కానీ మూవీ టీమ్ ప్రమోషన్స్ మాత్రం కాస్త తక్కువగానే చేస్తోందనేది నెటిజన్ల నుంచి వినిపిస్తున్న మాట. ఎవరెమనుకున్నా సరే ఒక్కసారి సినిమా క్లిక్ అయితే జనాలు ఇవేవి పట్టించుకోరు. సరే ఇదంతా వదిలేస్తే ఇప్పుడు 'కల్కి' రెమ్యునరేషన్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అలా 'కల్కి'ని ఏకంగా రూ.700 కోట్ల బడ్జెట్తో తీశారనే టాక్ నడుస్తోంది. ట్రైలర్లో విజువల్స్ చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)అయితే మొత్తం బడ్జెట్ అంతా సినిమా కోసమే ఖర్చు చేయరు కదా! ఇందులో రెమ్యునరేషన్స్ కూడా ఉంటాయి. అలా హీరోగా చేసిన ప్రభాస్కి రూ.150 కోట్ల వరకు ఇచ్చారట. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన అమితాబ్, కమల్కి తలో రూ.20 కోట్లు ఇచ్చారని సమాచారం. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కలిసి మరో రూ.60 కోట్ల వరకు ఖర్చయిందట.దీనిబట్టి చూస్తే మొత్తం బడ్జెట్లో రూ.250 కోట్ల వరకు పారితోషికాలకే అయిపోయినట్లు అనిపిస్తుంది. అంటే మిగిలిన రూ.450 కోట్ల బడ్జెట్తో మూవీ తీశారనమాట. ఏదేమైనా సంక్రాంతి తర్వాత భాక్సాఫీస్ డల్లుగా ఉంది. 'కల్కి' గనక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్స్ మోత మోగిపోవడం గ్యారంటీ. మరి మీలో ఎంతమంది 'కల్కి' కోసం వెయిట్ చేస్తున్నారు?(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!) -
'పుష్ప' విలన్ మామూలోడు కాదు.. రెమ్యునరేషన్ వింత కండీషన్స్!
హీరో మరీ కమర్షియల్ అయిపోయారు. ఎంతలా అంటే హిట్ పడటమే లేటు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మిడ్ రేంజ్ హీరోలు కూడా తామేం తక్కువ అని కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలా అంత ఫేమ్ లేని హీరోలే కోట్లు తీసుకుంటుండగా, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు మాత్రం తన రెమ్యునరేషన్తో షాకిస్తున్నాడు.(ఇదీ చదవండి: హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో)మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ సినిమాల చూస్తే కచ్చితంగా అతడికి ఫ్యాన్ అయిపోతారు. ఎందుకంటే మంచి మూవీస్ చేయడమే కాదు చాలా వేగంగా వాటిని పూర్తి చేస్తాడు. ప్రతి మూడు నాలుగు నెలలకు పహాద్ మూవీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ పక్కనబెడితే 'పుష్ప 2'లో నటిస్తున్నందుకు గానూ రెమ్యునరేషన్ రోజువారీగా తీసుకుంటున్నారు. దీనికి కొన్ని వింత కండీషన్స్ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఎందుకంటే రోజుకి రూ.12 లక్షల్ని రెమ్యునరేషన్గా ఫిక్స్ చేసిన ఫహాద్.. ఒకవేళ తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్ రద్దయితే మాత్రం అదనంగా మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకి రూ.14 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందట. షూట్ క్యాన్సిల్స్ చేయకుండా కచ్చితంగా ముందు జాగ్రత్తగా ఉంటారని బహుశా ఫహాద్.. 'పుష్ప' నిర్మాతలకు ఈ కండీషన్ పెట్టి ఉండొచ్చని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఏదేమైనా మనోడి ఇంత ప్లానింగ్తో ఉన్నాడు కాబట్టే వరస మూవీస్ చేస్తూ హిట్ కొడుతున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!) -
రూ.1 కోటి నుంచి రూ.40 కోట్లు తీసుకునే స్థాయికి.. హీరో ఏమన్నాడంటే?
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 2011లో 'ప్యార్ కా పంచనామా' సినిమాతో హీరోగా కెరీర్ ఆరంభించాడు. ఇప్పటివరకు సుమారు 16 చిత్రాల్లో నటించాడు. డిఫరెంట్ స్క్రిప్టులు ఎంచుకుంటూ తనకంటూ ఓ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. కేవలం ఐదేళ్లలోనే రూ.1 కోటి తీసుకునే స్థాయి నుంచి ఏకంగా రూ.40 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగాడని బీటౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఫస్ట్ సినిమాకు ఎంతంటే?తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన కార్తీక్కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీని గురించి హీరో మాట్లాడుతూ.. నా ఫస్ట్ మూవీ ప్యార్ కా పంచనామాకు నేను కోటి రూపాయలు తీసుకోలేదు. నా పారితోషికం కనీసం లక్షల్లో కూడా లేదు. కేవలం రూ.70 వేలు మాత్రమే. పైగా అందులో టీడీఎస్ కట్ చేసుకుని రూ.63,000 ఇచ్చారు అని బదులిచ్చాడు. ఆ సినిమా తర్వాతే..పోనీ.. 2018లో వచ్చిన సోనూకీ టిటు కి స్వీటీ సినిమాకు రూ.1 కోటి అందుకున్నావా? అని యాంకర్ రాజ్ శమానీ అడగ్గా.. ఆ చిత్రానికి కూడా అంత పెద్ద మొత్తం తీసుకోలేదని తెలిపాడు. సోనూ.. సినిమా తర్వాతే కాస్త ఎక్కువ పారితోషికం అందుకుంటున్నాను. కానీ ఈ ట్యాక్స్లు నాకు రావాల్సిన డబ్బును కొంత హరిస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ చేతిలో చందూ చాంపియన్, భూల్ భులయ్యా 3 సినిమాలున్నాయి.చదవండి: డైరెక్టర్తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్ -
డబ్బు తీసుకోలేదు.. చాలామంది ఇలాగే.. దీనిగురించి ఎవరూ మాట్లాడరు!
కొందరు హీరోలు పైసా తక్కువైతే చాలు ప్రాణం పోయినట్లు ఫీలవుతారు. మరికొందరు నిర్మాతల పరిస్థితిని, సినిమా రిజల్ట్ను బట్టి రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు లేదంటే ఒక్క రూపాయి కూడా తీసుకోరు. హీరో కార్తీక్ ఆర్యన్ రెండో రకానికి చెందినవాడు. స్టార్ సెలబ్రిటీలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల సదరు సినిమాకు పని చేసే టెక్నీషియన్స్కు ఇతర నటీనటులకు సరైన డబ్బు అందడం లేదని ఈ మధ్య బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. తడిసి మోపెడవుతున్న బడ్జెట్హీరోల పారితోషికానికి తోడు.. వారి మేకప్మెన్కు, హెయిర్ డ్రెస్సర్కు, స్టైలిస్ట్కు.. ఇలా తన దగ్గర పనిచేసే అందరికీ జీతాలివ్వాలని సరికొత్త డిమాండ్లు పెడుతుండటంతో బడ్జెట్ మితిమీరిపోతోందన్నది ప్రధాన అంశం. తాజాగా దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ.. ఈ చర్చ జరగకముందు నేను షెహజాదా సినిమా చేశాను. చిత్ర నిర్మాతల దగ్గర సరిపడా బడ్జెట్ లేకపోవడంతో నా ఫీజు వదిలేసుకున్నాను. రెమ్యునరేషన్ తీసుకోలేదని సినిమా నిర్మాతల్లో నేనూ ఒకడినని క్రెడిట్ ఇచ్చారు. ఇలాంటివి ఎవరూ రాయరు.హీరోల త్యాగం చూడరే!నేనే కాదు, చాలామంది స్టార్స్ నిర్మాతల కోసం ఆలోచించి చాలా సాయం చేస్తుంటారు. వారికి తోడుగా ఉంటారు. దర్శకుడు, యాక్టర్స్, నిర్మాతలు.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికే ఆలోచిస్తారు. ఎవరూ దాన్ని సాగదీయాలని చూడరు. సినిమా ఉంటే ఏంటి, పోతే ఏంటి? నాకైతే నా డబ్బులు నాకు ముట్టాల్సిందే అని ఎవరూ మాట్లాడరు అని చెప్పుకొచ్చాడు.అల వైకుంఠపురములో రీమేక్కాగా అల వైకుంఠపురములో సినిమాకు రీమేక్గా షెహజాదా తెరకెక్కింది. ఇందులో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, అల్లు అరవింద్, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.చదవండి: సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ -
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేటు పెంచేశాడు. తాను ఇప్పటివరకు తీసుకుంటున్న పారితోషికం ఒకెత్తయితే తర్వాత చేయబోయే మూవీ కోసం మాత్రం ఊహించని మొత్తం అందుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ చరణ్ రెమ్యునరేషన్ ఎంత పెంచాడు? ఏంటి సంగతి? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: బాలకృష్ణ చీప్ బిహేవియర్.. హీరోయిన్ ని తోసేసి, మద్యం తాాగుతూ)'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. దీని తర్వాత చేస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. దాదాపు మూడేళ్ల నుంచి సెట్స్పైనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది అస్సలు అర్థం కాలేదు. అయితే ఈ ఏడాది అక్టోబరులోనే ఉండొచ్చని దిల్ రాజు కూతురు తాజాగా రివీల్ చేసింది. ఇకపోతే ఈ మూవీలో చేస్తున్నందుకు గానూ రూ.90 కోట్ల పారితోషికం చరణ్ అందుకుంటున్నాడట.దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడు. 'RC16' వర్కింగ్ టైటిల్. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ కోసం చరణ్కి ఏకంగా రూ.125 కోట్ల మేర పారితోషికం ఇవ్వబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లలో చరణ్ ఒకడు అవుతాడు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో 'సలార్'తో హిట్ కొట్టాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. దీని తర్వాత 'రాజా సాబ్', 'సలార్ 2'కి రెడీ అవుతున్నాడు. సరిగ్గా ఈ టైంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. రూపాయి కూడా తీసుకోకుండా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడని టాక్ అయితే వచ్చింది. ఏంటి సంగతి? ఆ సినిమా ఏది?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)పైన చెప్పిన సినిమాలతో పాటే ప్రభాస్.. మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ విషయం చాలారోజుల క్రితమే బయటకొచ్చింది. అయితే ప్రభాస్, శివుడిగా కనిపించబోతున్నాడని టాక్ వచ్చింది కానీ పరశురాముడి పాత్ర చేస్తున్నాడని లేటెస్ట్ సమాచారం. ఇందులో నటిస్తున్నందుకు గానూ పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేశాడట.ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప'లో అక్షయ్ కుమార్ (హిందీ), శివరాజ్ కుమార్ (కన్నడ), మోహన్ లాల్ (మలయాళం) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా పాన్ ఇండియా అప్పీల్తో సినిమా తీస్తున్నారు. ఈనెల 20న క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'కన్నప్ప' టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనిబట్టి సినిమాపై ఓ అంచనాకు రావొచ్చు.(ఇదీ చదవండి: రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?) -
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్లో ఈ భారీ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
Coolie: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని వందల కోట్లా?
కాయకష్టం చేసుకుని బతుకును భారంగా ఈడ్చే వ్యక్తినే కూలీ అంటారు. అంతే కాకుండా డబ్బు కోసం ఎలాంటి పని చేసేవారినైనా కూలీనే అంటారు. వీటిలో నటుడు రజనీకాంత్ ఏ కోవకు చెందుతారో తెలియదు గానీ, ఇప్పుడు కూలీ పేరు మాత్రం నలుమూలలా మారుమ్రోగుతోంది. సినీ పరిశ్రమలో కూలీ టైటిల్ సక్సెస్కు అడ్రస్ అనుకుంటా. హిందీలో అమితాబచ్చన్ ఇదే పేరుతో చిత్రం చేసి సక్సెస్ అయ్యారు. ఇక తెలుగులో వెంకటేశ్ నటించిన కూలీ నెంబర్ 1 చిత్రం కూడా సూపర్హిట్ అయ్యింది. అలాగే తమిళంలోనూ నటుడు శరత్కుమార్ కూలీ పేరుతో చిత్రం చేశారు.తాజాగా ఇదే టైటిల్తో సూపర్స్టార్ రంగప్రవేశం చేస్తున్నారు. అవును ఈయన కథానాయకుడిగా నటిస్తున్న 171వ చిత్రానికి కూలీ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. స్టార్ దర్శకుడు లోకేకనకాజ్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత నటి శోభన రజనీకాంత్ సరసన నటించబోతున్నారని, మరో ముఖ్యపాత్రలో క్రేజీ నటి శృతిహాసన్, బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్సింగ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇది వరకే విడుదల చేయగా అందులో రజనీకాంత్ గెటప్ను చూసి ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సమీప కాలంలో చిత్ర టైటిల్తోపాటు టీజర్ను విడుదల చేశారు. కూలీ టైటిల్, టీజర్లను చూస్తుంటే సరికొత్త రజనీకాంత్ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరపై ఆవిష్కరించనున్నారనేది సుస్పష్టం అవుతోంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ కూలీ ప్రకంపనలు సృష్టిస్తోంది.లోకేష్ కనకరాజ్కు తన చిత్రాల షూటింగ్ ప్రారంభానికి ముందే టీజర్ను విడుదల చేసి, సెన్సేషనల్ క్రియేట్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆ మధ్య కమలహాసన్ హీరోగా చేసిన విక్రమ్ చిత్రం టీజర్లో ఆరంబిక్కలామా అనే డైలాగ్తో టీజర్ను రూపొందించి ఎగ్జైటింగ్కు గురి చేశారు. ఆ తరువాత విజయ్తో చేసిన లియో చిత్ర టీజర్లో బ్లడీ స్వీట్ అంటూ చిత్రంపై అంచనాలను పెంచేశారు.తాజాగా రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ చిత్ర టీజర్లో ఏది తప్పు? ఏది ఒప్పు అనే డైలాగ్ చోటు చేసుకుంటుంది. అంతే కాకుండా కూలీ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని, ఇందులో రజనీకాంత్ మరోసారి స్మగ్లర్గా నటిస్తున్నారని అర్థం అవుతోంది. ఇకపోతే ఇది కాస్ట్లీ చిత్రం అనడానికి మరో కారణం ఈ చిత్రం కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు, అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూ.60 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే గనుక నిజం అయితే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు లోకేష్కనకరాజ్నే అవుతారు. కాగా కూలీ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్ర టైటిల్ను ప్రకటించగానే నటుడు ధనుష్ తన ఎక్స్ మీడియాలో మాస్ అని పేర్కొనడం మరో విశేషం. -
నిమిషానికి రూ.1 కోటి సంపాదిస్తున్న బ్యూటీ.. త్రిష, నయనతార కాదండోయ్ (ఫోటోలు)
-
రామాయణ...సాయి పల్లవికి రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్..
-
'ఫ్యామిలీ స్టార్' కోసం విజయ్కి భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే..?
‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడడంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఒకపక్క దిల్ రాజు, మరోపక్క విజయ్..ఇద్దరు సినిమా ప్రచారంలో బీజీ అయ్యారు. విజయ్కి ఈ సినిమా విజయం చాలా అవసరం. అందుకే ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. తన తోటి హీరోలా సహాయం కూడా తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 2న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా రాబోతున్నట్లు సమాచారం. అలాగే మీడియా ఫ్యామిలీస్తో కలిసి ఓ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు. ఇలా విభిన్నమైన పద్దతుల్లో ప్రచారం నిర్వహించి, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రూ. 50 కోట్ల బడ్జెట్ విజయ్ దేవరకొండ కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో గీతగోవిందం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మూవీ తర్వాతనే అటు పరశురాం, ఇటు విజయ్ కెరీర్ ఊపందుకుంది. మళ్లీ చాలా కాలం తర్వాత వీరిద్దరి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ఫ్యామిలీ స్టార్’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓవరాల్గా ఈ సినిమాకు రూ. 50 కోట్ల బడ్జెట్ అయిందని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. వర్కింగ్ డేస్ ఎక్కువ అవ్వడం వల్ల బడ్జెట్ పెరిగిందట. ‘ఖుషీ’ కంటే ఎక్కువే ఈ సినిమాకుగాను విజయ్ దేవరకొండ భారీగానే పారితోషికాన్ని పుచ్చుకున్నాడట. మొత్తంగా రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది గత చిత్రం ఖుషీ కంటే ఎక్కువ. ఖుషీ చిత్రానికి విజయ్ రూ.12 కోట్లు తీసుకున్నాడు. అయితే ఆ చిత్రం ఓ మోస్తరు విజయం మాత్రమే అందుకుంది. అంతకు ముందు వచ్చిన లైగర్ భారీ డిజాస్టర్ అయింది. అయినా కూడా విజయ్ మార్కెట్ పడిపోలేదు. అందుకే రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు వెనుకాడలేదట దిల్ రాజు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే.. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యకాలంలో సోలోగా రిలీజ్ అవుతున్న ఏకైక పెద్ద సినిమా ఇదే అని చెప్పొచ్చు. తొలుత తెలుగు, తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాల తర్వాత హిందీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం ప్రిరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే అయింది. అన్ని ఏరియాల్లో కలిసి రూ. 45 కోట్ల మేర బిజినెస్ చేసిందట. గీతగోవిందం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన కారణంగానే విజయ్ ఫ్లాప్స్లో ఉన్నా.. భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ అయింది. -
రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. నయనతార కంటే ఎక్కువే!
తమిళసినిమా: నటి త్రిష తన స్నేహితురాలు, లేడీ సూపర్స్టార్ నయనతారను దాటేసి నంబర్వన్ స్థానానికి చేరుకున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంతకుముందు వరకూ దక్షిణాదిలోనే నంబర్వన్ కథానాయకిగా నయనతార వెలుగొందారు. ఇప్పుటికీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు. అయితే నటి త్రిష క్రేజ్ మాత్రమే బాగా పెరిగింది. అంతా దర్శకుడు మణిరత్నం పుణ్యమే అని చెప్పకతప్పదు. నటి త్రిష కెరీర్ పొన్నియిన్సెల్వన్ చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పాలి. ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాలు వరుసగా అపజయం కావడంతో గ్రాఫ్ పడిపోయింది. ఒక టైమ్లో చేతిలో చిత్రాలే లేకుండా పోయాయి. అలాంటి సమయంలో మణిరత్నం కరుణించడంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కందవై పాత్రలో నటించే అవకాశం వరించింది. అందులో నటి ఐశ్వర్యరాయ్ కూడా నటించారు. నిజం చెప్పాలంటే ఆమెను త్రిష డామినేట్ చేశారు. రాజసం ఒలకబోసిన త్రిష నటన అందరిని ఆకట్టుకుంది. ఆ చిత్రం సూపర్హిట్ అయ్యింది. అంతే త్రిష సెకండ్ ఇన్నింగ్కు ఆ చిత్రంతోనే బీజం పడింది. ఆ తరువాత విజయ్కు జంటగా లియో చిత్రంలో నటించారు. ప్రస్తుతం అజిత్కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్స్ లైఫ్, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్లాల్కు జంటగా రామ్, నివిన్బాలీ సరసన ఐడెంటిట్టీ అంటూ స్టార్స్ సరసన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్లో కూడా ఒక ప్రత్యేక పాట, కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. కాగా లియో చిత్రంలో నటించడానికి రూ.6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష, ఇప్పుడు కమలహాసన్ సరసన నటిస్తున్న థగ్స్ లైఫ్ చిత్రం కోసం ఏకంగా రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇంత మొత్తంలో పారితోషికాన్ని నయనతార కూడా ఇప్పటి వరకూ పొందలేదు. దీంతో ఆమెను అధిగమించిన త్రిష ఇప్పుడు నంబర్వన్ స్థానానికి ఎగబాకారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్బస్టర్ మూవీ యానిమల్లో విలన్గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే? -
ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్.. పారితోషికం పెంచేసిన బ్యూటీ!
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఈ తరం తారలు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. మలయాళ భామ మమితా బైజు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఈ 22 ఏళ్ల బ్యూటీ క్రేజ్ దక్షిణాది మొత్తం వ్యాపిస్తోంది. 2017లో నటిగా రంగప్రవేశం చేయగా.. ఈమె నటించిన కోకో, సూపర్ శరణ్య వంటి మలయాళ చిత్రాలు విజయం సాధించాయి. ఇటీవల ఈ అమ్మడు నటించిన ప్రేమలు మూవీ మలయాళంలోనే కాకుండా, తమిళం, తెలుగు భాషల్లోనూ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఆ సినిమా నుంచి అవుట్ కాగా ఆ మధ్య బాలా దర్శకత్వంలో సూర్యకు జంటగా వణంగాన్ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యింది. అయితే అనివార్య కారణాల వల్ల సూర్య ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తర్వాత మమితా బైజు కూడా ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేసింది. దర్శకుడు బాలా తనను కొట్టారని, చాలా సార్లు తిట్టారని ఆరోపణలు చేసింది. ఈ సంఘటన కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇది తన కెరీర్పై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని భయపడిందో ఏమోకానీ వెంటనే మాట మార్చేసింది. దర్శకుడు బాలా ఎప్పుడూ కొట్టలేదని, ఆయన దర్శకత్వంలో నటించిన సమయంలో చాలా నేర్చుకున్నానని, ఇతర చిత్రాల కారణంగా వణంగాన్ చిత్రం నుంచి తప్పుకోవలసి వచ్చిందని కవర్ చేసింది. క్రేజీ హీరోయిన్గా.. ప్రస్తుతం ఈమె జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా రెబల్ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అవుతోంది. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శుక్రవారం తెరపైకి రానుంది. తదుపరి నటుడు విష్ణువిశాల్కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రేమలు మూవీ తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. దీంతో మమితా బైజు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా మారనున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకుంటోంది బ్యూటీ. మరిన్ని అవకాశాలు వస్తుండటంతో ఈ అమ్మడు తన పారితోషికాన్ని పెంచేసినట్లు టాక్. ఇప్పటివరకు ఒక్క సినిమాకు రూ. 30 లక్షలు పుచ్చుకుందట. దాన్ని కాస్తా రూ.50 లక్షలు చేసిందని ప్రచారం నడుస్తోంది. చదవండి: తమన్నా..పెళ్లెప్పుడో? -
రెమ్యునరేషన్ డబుల్ చేసిన సమంత.. వామ్మో అన్ని కోట్లా?
కొన్నేళ్ల ముందు మయోసైటిస్ వ్యాధికి గురైన సమంత.. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అలా అని కొత్త సినిమాలేం చేయట్లేదు. ప్రస్తుతం యాడ్స్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. మరోవైపు ఈమె అప్పుడెప్పుడో నటించిన ఓ వెబ్ సిరీస్.. త్వరలో రిలీజ్ కానుంది. సరే ఇదంతా పక్కనబెడితే సమంత రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు మరోసారి టాపిక్ వచ్చింది. ఏకంగా డబుల్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. (ఇదీ చదవండి: 'నేను అందంగా లేనని తెలుసు'.. సమంత షాకింగ్ కామెంట్స్!) పదేళ్లకు పైగానే ఇండస్ట్రీలో ఉన్న సమంత.. దక్షిణాదిలో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్లోనూ విలన్ తరహా పాత్రతో అందరికీ షాకిచ్చింది. ఆ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డీకే తీసిన 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్లోనూ సమంత లీడ్ రోల్ చేసింది. అయితే ఇందులో చేసినందుకు గానూ ఏకంగా రూ.10 కోట్ల వరకు తీసుకుందట. సమంత ఇప్పుడు సినిమాలేం చేయనప్పటికీ.. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకుగానూ ఒక్కో దానికి రూ.6 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అలానే ఒక్కో యాడ్కి రూ.1.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోందట. మరి వీటిలో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా సమంత నిలుస్తుంది. (ఇదీ చదవండి: సమంత జనాల్ని పిచ్చోళ్లను చేస్తోంది... డాక్టర్ ఫైర్) -
Remuneration Details: ఈ టాలీవుడ్ భామల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
-
ప్రైవేట్ జెట్, రూ.100 కోట్ల లగ్జరీ బంగ్లా, యాడ్స్తో కోట్లు, ఎవరీ ‘తార’
ఇతర రంగాలతో పోలిస్తే చిత్ర పరిశ్రమలో పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. తెరమీద ఎలివేషన్లు, బీజీఏంలు హీరోల కున్నంతగా హీరోయిన్లకు ఉండవు. ఇక రెమ్యునరేషన్ల సంగతి సరే సరి. అయితే ఈ అడ్డుగోడల్ని బద్దలుకొట్టి చాలా కొద్దిమంది అయినా కథానాయకలుగా, డైరెక్టరులుగా తమ సత్తాచాటుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, బాక్సాఫీసు వసూళ్లతో మేమూ సూపర్ స్టార్లమే అని నిరూపించుకుంటున్నారు. డైరెక్టర్లు, నిర్మాతల ఫేవరెట్స్గా అవత రిస్తున్నారు. అలాంటి వారిలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ లేడి సూపర్ స్టార్గా పాపులర్ అయిన నయనతార ఒకరు. పార్ట్ టైమ్ మోడల్గా మొదలై, టెలివిజన్ ప్రెజెంటర్నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తార నయనతార. స్టార్ హీరోలని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్, అంతకుమించిన క్రేజ్తో నయనతారనా మజాకానా అనిపించుకుంటోంది. కరియర్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా డిజాస్టర్స్ వెక్కిరించినా వరుస సినిమాలతో ప్రేక్షకులను మదిలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. తాజాగా నయన్ 50 సెకన్ల యాడ్కు రూ. 5 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిందన్న వార్త హాట్ టాపిక్గా నిలిచింది. పలు మీడియా కథనాల ప్రకారం నయనతార 50 సెకన్ల ఒక కార్పొరేట్ ప్రకటన కోసం ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిందట. అంతేకాదు నయనతార ప్రతీ మూవీకి రూ. 10 కోట్లు వసూలు చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు ముంబైలో లగ్జరీ బంగ్లాతో సహా 4 విలాసవంతమైన ఇళ్లున్నాయి. రూ 100 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో భర్త విఘ్నేష్తో, ఇద్దరు ప్లిలలతో నివస్తోంది. ఇంకా ఖరీదైన కార్ల కలెక్షన్, లగ్జరీ ప్రైవేట్ జెట్స్కూడా నయన్, విఘ్నేష్ సొంతం. ఇటీవల ఇద్దరూ విడిపో బోతున్నారన్న వార్తలను కూడా ఖండించారు ఈ స్వీట్ కపుల్. కాగా గత ఏడాది అట్లీ దర్శకత్వంలో వచ్చి జవాన్ మూవీతో షారుఖ్తో కలిసి బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. యాక్షన్-ప్యాక్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేసింది. అయితే ఆమె నటించిన అన్నపూరణి చిత్రం మాత్రం వివాదంలోచిక్కుకుంది. ఈ వివాదంపై క్షమాపణలు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆరేళ్లు తీసిన సినిమా.. స్టార్ హీరోకి నో రెమ్యునరేషన్.. కారణమదే
ఒకప్పటితో పోలిస్తే తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. రొటీన్ కమర్షియల్ కథల్ని చాలావరకు పక్కనబెట్టి సమ్థింగ్ డిఫరెంట్ ఉండే మూవీస్ తీస్తున్నారు. అలా యంగ్ హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమా 'గామి'. దాదాపు ఆరేళ్ల పాటు ఈ మూవీ కోసం పనిచేసిన విశ్వక్.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అందుకు కారణమేంటనేది కూడా చెప్పాడు. విశ్వక్ సేన్.. అఘోరా పాత్రలో నటించిన సినిమా 'గామి'. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. హాలీవుడ్ సినిమాల రేంజులో ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) విశ్వక్ సేన్ ఇంకా హీరోగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని టైంలో అంటే 2018లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. క్రౌడ్ ఫండింగ్ విధానంలో కేవలం రూ.25 లక్షల పెట్టుబడితో మాత్రమే ఈ మూవీ తీయాలనేది ప్లాన్. కానీ దాదాపు ఆరేళ్ల పాటు అడపాదడపా షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే పనిచేసినందుకు డబ్బులు తీసుకుంటే.. మూవీ బడ్జెట్ పెరిగిపోద్ది అనే ఉద్దేశంతోనే తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని విశ్వక్ సేన్ తాజాగా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే 'గామి' కోసం రెమ్యునరేషన్ తీసుకోనప్పటికీ.. రిలీజ్ తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటాడని సగటు ప్రేక్షకుడు మాట్లాడుకుంటున్నాడు. ఏదేమైనా ఆరేళ్ల పాటు ఓ సినిమా కోసం కష్టపడి పారితోషికం తీసుకోకపోవడమనేది ఆసక్తకర విషయమే. మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. (ఇదీ చదవండి: సీక్రెట్గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) -
హనుమాన్ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ పెంచేసిన తేజ సజ్జ!
చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలతో అలరించిన తేజా సజ్జా..ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా అందుకున్నాడు తేజ. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే ‘హను-మాన్’ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ ‘హను-మాన్’ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.. రికార్డు సృష్టించింది. ఇక హను-మాన్ మూవీ ఊహించిదాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో అటు ప్రశాంత్ వర్మ.. ఇటు తేజ సజ్జ ఫుల్ జోష్లో ఉన్నారు. పలువురు బడా నిర్మాతలు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నారు. పారితోషికం కూడా భారీగా ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా తేజ సజ్జ కూడా తన రెమ్యునరేషన్ని పెంచేశాడట. పారితోషికం అమాంతం పెంచేసిన తేజ సాధారణంగా హిట్ రాగానే హీరోలు తమ పారితోషికాన్ని కొంచెం కొంచెం పెంచేస్తారు. ఇక హను-మాన్ లాంటి భారీ హిట్ వస్తే మాత్రం దాన్ని డబుల్ చేస్తారు. ఇప్పుడు తేజ సజ్జ అదే చేశాడట. హను-మాన్ రిలీజ్ తర్వాత తేజతో సినిమా చేయడానికి పలువురు బడా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది అడ్వాన్స్లు కూడా ఇచ్చారట. హిందీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో తేజ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడట. హను-మాన్ కోసం రూ. కోటి రెమ్యునరేషన్గా తీసుకున్న తేజ.. ఇప్పుడు రూ. 5 కోట్ల డిమాండ్ చేస్తున్నాడట. మరో హిట్ వస్తేనే.. హను-మాన్తో తేజ సజ్జ స్థాయి పెరిగింది.అందులో అనుమానమే లేదు. అయితే ఈ చిత్రం ద్వారా తేజ కంటే ఎక్కువగా ప్రశాంత్ వర్మకు పేరొచ్చింది. అతని పని తీరు పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కథను అద్భుతంగా తీర్చి దిద్దాడని మెచ్చుకున్నారు. ఈ చిత్రం అతని కెరీర్కు బాగా ప్లస్ అయింది. తేజ సజ్జని ఈ మూవీ పాన్ ఇండియా స్టార్గా మార్చింది. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా తన తదుపరి సినిమాలపై ఉంటుంది. అతని నుంచి వచ్చే సినిమాలో ఏదో వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా తేజ సజ్జ కథలను ఎంచుకోకపోతే కెరీర్కే ముప్పు వస్తుంది. రాబోయే సినిమా హిట్ అయితే తేజ సజ్జ కెరీర్కు కొన్నాళ్ల పాటు ఢోకా ఉండదు. ప్రస్తుతం తేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బెజవాడ ప్రసన్న-నక్కిన త్రినాధరావు కాంబినేషన్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. -
ప్రభాస్ డూప్కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?
పాన్ ఇండియా హీరో అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు ప్రభాస్. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి చేస్తే.. హీరోగా చేసిన ప్రభాస్ అంతకు మించిన పాపులారిటీ సంపాదించాడు. మొన్నీమధ్యే 'సలార్'తో సక్సెస్ అందుకున్న డార్లింగ్.. త్వరలో 'కల్కి' మూవీతో రాబోతున్నాడు. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా మాట్లాడుకుంటున్న టైంలో ప్రభాస్ డూప్కి ఇచ్చే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరికీ బాడీ డబుల్ లేదా డూప్ ఉంటారు. అంటే ఫైట్ సీన్స్లో కొన్నిచోట్ల హీరోల కనిపిస్తే.. వెనక నుంచి, సైడ్ నుంచి కనిపించే కొన్ని షాట్స్లో హీరోల పోలిన వ్యక్తులని పెట్టి మేనేజ్ చేస్తారు. అలా ప్రభాస్కి కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్గా చేస్తుంటాడు. 'బాహుబలి' సినిమా తర్వాత కిరణ్ రాజ్ కాస్తంత పాపులరాటీ తెచ్చుకున్నాడు. కొన్ని ఇంటర్వ్యూల్లోనూ కనిపించాడు. (ఇదీ చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ) అయితే మిగతా హీరోల డూప్స్కి సదరు సినిమాల నిర్మాతలే రెమ్యునరేషన్ ఇస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం తన సిబ్బందితో సహా ప్రతి ఒక్కరికి తానే జీతాలు చెల్లిస్తాడు. రీసెంట్గానే ఈ విషయం బయటకొచ్చింది. అలానే డూప్గా నటించే కిరణ్ రాజ్కి ఒక్కో చిత్రానికి గానూ దాదాపు రూ.30 లక్షలు పైనే ప్రభాస్ చెల్లిస్తాడట. కొన్నిసార్లు దీనకంటే ఎక్కువే ఇవ్వొచ్చని కూడా అంటున్నారు. అయితే డూప్కి రూ.30 లక్షలు ఇస్తున్నారనే రూమర్ అనేది ఒకవేళ నిజమైతే మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది చోటామోటా హీరోలకు కూడా ఇంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవచ్చు. అలా ఇప్పుడు ప్రభాస్ డూప్కి ఇస్తున్న రెమ్యునరేషన్ ఇదేనంటూ వైరల్ అవుతున్న ఓ విషయం.. ఇప్పుడు నెటిజన్స్ షాకయ్యేలా చేస్తోంది. (ఇదీ చదవండి: Anupama Remuneration: టిల్లు కోసం రెమ్యునరేషన్ పెంచేసిన అనుపమ..) -
'టిల్లు 2'లో అనుపమ గ్లామర్ షో..
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు చెప్పగానే క్లాస్ లుక్స్, పద్ధతిగా ఉండే పాత్రలు గుర్తొస్తాయి. కానీ అదంతా మొన్నటివరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా 'డీజే టిల్లు 2' ట్రైలర్ రిలీజైన తర్వాత అందరికీ ఒక్క నిమిషం మతి పోయింది. ఎందుకంటే హీరో సిద్ధుతో ఓ సీన్లో ఘాటైన ముద్దు సీన్లో కనిపించింది. అలానే లుక్స్ అన్నీ కూడా హాట్గానే ఉన్నాయి. చూస్తుంటే అస్సలు తగ్గినట్లు కనిపించట్లేదు. అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటోందట. కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్ అయిపోయింది. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. కానీ ఎక్కడా గీత దాటినట్లయితే కనిపించలేదు. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్తో ముద్దు సన్నివేశాలు చేసి షాకిచ్చింది. దీని తర్వాత మళ్లీ కార్తికేయ 2, 18 పేజీస్ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్గా కనిపించింది. ఇప్పుడు 'డీజే టిల్లు 2' పూర్తిగా రెచ్చిపోయింది. హాట్గా కనిపించడం, ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమకు తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనుపమ.. 'టిల్లు స్వ్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట. గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయిందట. మార్చి 29న 'డీజే టిల్లు 2' థియేటర్లలోకి రాబోతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
రష్మిక రెమ్యునరేషన్పై క్రేజీ రూమర్.. స్పందించిన నేషనల్ క్రష్!
ఇండియన్ క్రష్ నటి రష్మిక మందన్న. నటిగా ఏడేళ్లలోనే కథానాయకిగా అనూహ్య స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ 2016లో ఓ కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ బెంగళూరు భామ ఆ తరువాత మలయాళం, తెలుగు, తమిళం అంటూ బహుభాషల్లో అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఈమెను మోసేశారు. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ హీరోయిన్గా ఎదిగిపోయారు. పుష్ప చిత్రం విజయం ఈమె కెరీర్ను మార్చేసింది. దెబ్బతో బాలీవుడ్ దృష్టిలో పడింది. అక్కడ తొలి చిత్రం గుడ్బై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఇటీవల విడుదలైన యానిమల్ చిత్రం విమర్శలను మూటకట్టుకున్నా, భారీ వసూళ్లను రాబట్టుకుంది. దీంతో రష్మిక మందన క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సాధారణంగా ఒక్క హిట్ వస్తేనే తారలు తమ పారి తోషికాన్ని పెంచేస్తారు. అలాంటిది ఈ ఇండియా క్రష్ బ్యూటీ, సక్సెస్ఫుల్ కథానాయకి పారితోషికాన్ని పెంచకుండా ఉంటారా? ఏకంగా రూ.4 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నిజమా, కాదా అన్నది పక్కన పెడితే రష్మిక మాత్రం అంగీకరించడం లేదు. పైగా ఈ వార్త నిజమైతే బాగుండు అంటూ సైటెర్లు వేస్తోంది. ఏదేమైనా నిప్పు లేనిదే పొగరాదుగా అంటూ నెటిజన్లు ఆమైపె ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తం మీద రష్మికపై ఈ టాపిక్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్మిక మందన్న నటిస్తున్న పుష్ప–2 , ద్విభాషా చిత్రం రెయిన్బో చిత్రాలపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. Says who I wonder 🤦🏻♀️.. after seeing all of this I think I should actually consider it.. and if my producers ask why.. then I’ll just say ‘media out there is saying this sir.. and I think I should live up to their words.. what do I do?’ 🤣🤦🏻♀️ — Rashmika Mandanna (@iamRashmika) February 6, 2024 -
Kalki 2898 AD: దీపికకు భారీ రెమ్యునరేషన్.. కెరీర్లోనే తొలిసారి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బీజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పటికే ఈ బ్యూటీ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఈ మధ్యే ఫైటర్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె ‘కల్కి 2898 AD’ సినిమాలో నటిస్తున్నారు.ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైంటిఫిక్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ఇది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికాతో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నటించేందుకు దీపికా భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ కోసం దీపికాకు రూ.20 కోట్ల పోరితోషికం అప్పజెప్పారట మేకర్స్. దీపికా కెరీర్లో ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అట. గతంలో ఒక్కో సినిమాకు రూ. 12-15 కోట్ల వరకు పారితోషికం తీసుకునేదట. ఈ చిత్రాకి ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సి రావడంతో రూ.20 కోట్ల అడిగిందట. కీలక పాత్ర కావడంతో నిర్మాతలు కూడా దీపికా డిమాండ్కి ఓకే చెప్పారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న విడుదల కానుంది. -
రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. తెలుగులో ఈమెనే టాప్?
ప్రస్తుతం తెలుగులో వన్ ఆఫ్ ది ట్రెండింగ్ హీరోయిన్ రష్మిక. మంచో చెడో పక్కనబెడితే ఈమె గురించి జనాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఫన్నీ ట్రోల్స్ లాంటివి కూడా చేస్తుంటారు. మొన్నీ మధ్య ఈమె పెళ్లి గురించి వార్తలు రాగా అవి కేవలం రూమర్లే అని తేలిపోయాయి. ఇప్పుడు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ గురించి ఓ విషయం బయటపడింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయిపోయింది. కన్నడ బ్యూటీ రష్మిక.. 'ఛలో' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిడ్ రేంజ్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ 'పుష్ప' రిలీజ్ తర్వాత మాత్రం ఈమెకు పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే దక్షిణాదితోపాటు హిందీలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) రష్మిక ప్రస్తుతం తెలుగులో 'పుష్ప 2'తో పాటు 'గర్ల్ ఫ్రెండ్' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. అయితే వీటిలో చేస్తున్నందుకు గానూ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. కానీ కొత్తగా అంగీకరించిన ఓ మూవీ కోసం మాత్రం రూ.4 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు సమంత, అనుష్క, పూజాహెగ్డే తదితరులు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ వరకు వచ్చారు కానీ అంతకు మించి వెళ్లలేకపోయారు. కానీ రష్మిక మాత్రం అటు సినిమాలు, ఇటు రెమ్యునరేషన్ విషయంలో జోరు చూపిస్తోంది. మరో రెండు మూడు హిట్లు పడితే రష్మిక పారితోషికం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందేమోనని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ప్రభాస్ విచిత్రమైన రికార్డ్.. సెకనుకు రూ.80 లక్షల రెమ్యునరేషన్?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' మూవీతో హిట్ కొట్టాడు. డిసెంబరులో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఈ మధ్యే ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇక్కడ కూడా ట్రెండింగ్లో ఉంటూ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. అయితే థియేటర్లలో 'సలార్' చూస్తున్నప్పుడు గమనించని చాలా విషయాలు.. ఓటీటీలోకి వచ్చాక బయటపడ్డాయి. అలా ఇప్పుడు ప్రభాస్ సెట్ చేసిన ఓ విచిత్రమైన రికార్డ్ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో) 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. 'సాహో' మూవీ కొంతలో కొంత పర్వాలేదనిపించింది కానీ 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఫ్లాప్స్గా నిలిచాయి. దీంతో అందరూ 'సలార్' మీదే ఆశలు పెట్టుకున్నారు. అలా గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా నెట్ఫ్లిక్స్లో రిలీజై ఇక్కడ కూడా రచ్చ లేపుతోంది. అయితే 'సలార్'లో ప్రభాస్ ఫైట్స్ అదరగొట్టినప్పటికీ.. సినిమా మొత్తం కలిపి కేవలం 2 నిమిషాల 35 సెకన్లు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు. మరోవైపు ఈ చిత్రంలో నటించినందుకు గానూ రూ.125 కోట్ల పారితోషికం తీసుకున్నాడని టాక్ వినిపించింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి చూస్తే మాత్రం డార్లింగ్ హీరో.. సెకనుకు రూ.80, 64,516 సంపాదించినట్లే. అంటే నిమిషానికి పదులు కోట్లు అందుకున్నట్లే. మనదేశంలో ఇలా సెకనుకు లక్షలు.. నిమిషానికి కోట్లు సంపాదించిన రికార్డు ప్రభాస్దే. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) Prabhas Dialogue time in Salaar (sped up) Roughly 4 minutes with dialogue gaps and 2:35 min without gaps... https://t.co/aHPhd30Mp5 pic.twitter.com/bxTclXjMcA — Lok (@TeluguOchu) January 21, 2024 -
రూపాయి తీసుకోకుండా సినిమా చేయనున్న మహేశ్! కారణం అదేనా?
సూపర్స్టార్ మహేశ్ బాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. అవును మీరు సరిగానే విన్నారు. ఇప్పటివరకు ప్రతి సినిమాకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఈ హీరో.. రాజమౌళితో చేయబోయే మూవీ కోసం మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? కారణమేంటి? మహేశ్-రాజమౌళి సినిమా చేయబోతున్నారు. ఇది అందరికీ తెలుసు. 'ఆర్ఆర్ఆర్' మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే రాజమౌళి, ఈ ప్రాజెక్ట్ని ప్రకటించాడు. భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజులో ఇది ఉండదని ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయినట్లు రైటప్ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఉగాదికి సినిమాని లాంఛనంగా ప్రారంభించే అవకాశముండొచ్చు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) ఈ ఏడాది మొదలు కావడమైతే పక్కా కానీ ఎప్పుడనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాని దాదాపు రూ.1000 కోట్ల బడ్డెట్తో నిర్మించనున్నారనే రూమర్స్ గట్టిగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో క్రేజీ విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కోసం మహేశ్.. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాడట. అలా అని ఫ్రీగా చేస్తాడని కాదు. రిలీజ్ తర్వాత లాభాల్లో షేర్ ఉంటుందట. రీసెంట్గా 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల్ని పలకరించిన మహేశ్.. ఒక్కో సినిమాకు రూ.60-70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడని టాక్. రాజమౌళితో మూవీ కోసం రూ.110 కోట్లు రెమ్యునరేషన్ అని అప్పట్లో టాక్ నడిచింది. ఇప్పుడు ప్లాన్ మారిపోయిందని.. రాజమౌళి-మహేశ్ ఇద్దరూ కూడా లాభాల్లో వాటా తీసుకుంటారని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిపోయిన తమన్నా.. అందుకే ఇలా కనిపించిందా?) -
ఒక్కో హీరో కోట్లు తీసుకుంటున్నాడు, మాకు పెంచమని అడిగితే..
కథలో దమ్మున్నా సినిమా క్వాలిటీగా రావాలంటే నిర్మాతలు డబ్బులు ధారపోయాల్సిందే! అయితే సినిమా తీయడానికంటే అందులో నటించినవారి కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఆ రేంజులో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ పెరిగిపోయింది. హిట్టు పడ్డేకొద్దీ వారు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తూ పోతున్నారు. సినిమా ఫలితాలను బట్టి కొందరు పారితోషికం వెనక్కు ఇచ్చేస్తారు, లేదంటే కొంత కోతలు పెడుతుంటారు. మరికొందరు మాత్రం రిజల్ట్ ఎలా ఉన్నా పూర్తి మొత్తం ముట్టాల్సిందేనని కరాఖండిగా చెప్తారు. ఎంత తీసుకుంటారు? తాను మాత్రం అలా చేయనంటున్నాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడు బాలీవుడ్లో నటీనటులు, చిన్నపాటి హీరోలు అందుకుంటున్న పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ నటులు సుమారు ఎంత పారితోషికం తీసుకుంటారు? అన్న ప్రశ్నకు నవాజుద్దీన్ స్పందిస్తూ.. చాలా ఎక్కువగా తీసుకుంటారని చెప్పాడు. పది కోట్ల పైనే ఉండొచ్చా? అని యాంకర్ అడగ్గా.. పదికోట్లకు అటుఇటుగా తీసుకుంటారని బదులిచ్చాడు. ఎక్కువ అడిగామంటే అంతే.. రెమ్యునరేషన్ విషయంలో బేరాలడతారా? అన్న ప్రశ్నకు తానైతే అలా చేయనని చెప్పాడు. ఇక్కడ నటుల టాలెంట్ను బట్టి వారికి ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇస్తారు. లేదు, మాకింకా ఎక్కువ కావాలని అడిగితే.. ఏంటి? మేము చెప్పిన అమౌంట్ కన్నా ఎక్కువ తీసుకునే అర్హత నీకుందా? అని మొహం మీదే అనేస్తారు. అందుకే నేను ఎక్కువగా డిమాండ్ చేయను, ఇచ్చిందే తీసుకుంటాను. కొన్ని సినిమాలు డబ్బుల కోసమే చేశాను. మరికొన్ని పైసా తీసుకోకుండా ఫ్రీగా చేశాను. రూ.25 కోట్లు ఇచ్చినా చేయను నేను చిన్నాచితకా పాత్రలు చేయడం మానేశాను. నాకు రూ.25 కోట్లు ఇస్తామన్నా సరే అటువంటి పాత్రలు చేయను. ఇప్పటికే నా కెరీర్లో చాలా సినిమాల్లో చిన్న రోల్స్ చేశాను. ఇక చాలు. ఇకమీదట అలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ సిద్ధిఖి ఇటీవలే సైంధవ్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సెక్షన్ 108 సినిమా చేస్తున్నాడు. చదవండి: ఫలించిన నిరీక్షణ.. డైహార్ట్ ఫ్యాన్కు క్షమాపణ చెప్పిన కీర్తీసురేష్ విడాకులపై నిహారిక కామెంట్లు.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త చైతన్య -
అరుంధతి @15 ఏళ్లు.. అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అయితే సంక్రాంతి హంగామా నడుస్తోంది. దాదాపు ప్రతిఒక్కరూ ఫుల్ జోష్లో ఉన్నారు. ఇదే టైంలో నాలుగు సినిమాలు కూడా రిలీజయ్యాయి. వీటిలో 'హను-మాన్'కు పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వచ్చింది. సరే దీని గురించి కాసేపు పక్కనబెడితే ఈ పండగ టైంలో వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన మూవీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'అరుంధతి'నే. ఇప్పుడు ఈ చిత్రం 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు లీడ్ యాక్టర్స్ రెమ్యునరేషన్ సంగతి కూడా చూసేద్దాం. సంక్రాంతి పండక్కి సాధారణంగా ఫ్యామిలీ స్టోరీలతో తీసిన సినిమాల్నే రిలీజ్ చేస్తుంటారు. ఇవి కాదంటే యాక్షన్ ఎంటర్టైనర్, కామెడీ సినిమాల్ని థియేటర్లలోకి తీసుకొస్తుంటారు. అయితే ఈ పండగ హడావుడిలో చాలా అంటే చాలా అరుదుగా హారర్ మూవీస్ వస్తుంటాయి. అలా వచ్చిన చిత్రమే 'అరుంధతి'. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన ఈ చిత్రం విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులు కైవసం చేసుకున్న 'అరుంధతి'.. టాలీవుడ్లోనే సరికొత్త రికార్డులు సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఇటుగా రూ.13 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీస్తే ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయట. ప్రధాన పాత్రల్లో నటించిన అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. సినిమా తీసే టైంలో అనుష్క కేవలం ఓ హీరోయిన్ అంతే. దీంతో ఈమెని రూ.కోటి లోపే పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. మరోవైపు విలన్ పశుపతిగా చేసిన సోనూసూద్కి అయితే తొలుత రూ.18 లక్షలే అనుకున్నారు. కానీ ఎక్కువ రోజులు వర్క్ చేయడంతో రూ.45 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని టాక్. దీనిబట్టి చూస్తే మరీ రూ.కోటిన్నరలోపే ఇద్దరు లీడ్ యాక్టర్స్ పారితోషికం అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) One and only Lady Super Star of South India cinema @MsAnushkaShetty ❤️🔥 Oka horror film tho max andhari hero la highest lepina legendary actress anushka !💥💥#15YearsForAnushkaArundhati pic.twitter.com/3XI8TGfR9O — Manjula Reddy (@Manju_Anushka) January 15, 2024 -
టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైపోయింది. 'హను-మాన్', 'గుంటూరు కారం' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. రెండింటిని పోల్చి చూసుకుంటే చాలామంది 'హను-మాన్' వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రెమ్యునరేషన్ టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ 'హను-మాన్' టీంలో ఎవరికెంత ఇచ్చారు? 'హను-మాన్' టాక్ ఏంటి? ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. వీటిలో చాలామంది మహేశ్ 'గుంటూరు కారం' హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ దీనికంటే బెటర్ రివ్యూస్ ఇప్పుడు 'హను-మాన్' మూవీకి వస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్, ఆంజనేయుడి సెంటిమెంట్తోపాటు కంటెంట్ కూడా భలే క్లిక్ అయింది. గురువారం సాయంత్రం ప్రీమియర్స్ పూర్తవగానే.. అందరూ 'జై హనుమాన్' నామజపం చేస్తున్నారు. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) అదే టైంలో దర్శకుడు ప్రశాంత్ వర్మని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కేవలం రూ.55 కోట్ల బడ్జెట్తో ఈ రేంజు సినిమా తీశాడంటే.. మరికాస్త బడ్జెట్ ఇచ్చుంటే వేరే లెవల్ మూవీ తీసేవాడని అనుకుంటున్నారు. సరే ఇది పక్కనబెడితే ఈ మూవీకి నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్.. రూ.10 కోట్లు కూడా దాటలేదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. 'హను-మాన్' సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా.. సెటిల్డ్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి గానూ ఇతడికి రూ.2 కోట్లు ఇచ్చారట. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. రూ.70 లక్షల నుంచి రూ.కోటి మధ్య పారితోషికం అందుకున్నాడట. మిగతా నటీనటుల్లో హీరోయిన్ అమృత అయ్యర్-రూ 1.5 కోట్లు, వరలక్ష్మీ శరత్ కుమార్ రూ. కోటి, వినయ్ రాయ్ రూ.65 లక్షలు, వెన్నెల కిశోర్ రూ.55 లక్షలు, గెటప్ శీను రూ.35 లక్షలు అనే టాక్ వినిపిస్తుంది. మిగతా నటీనటులకు కాస్తోకూస్తే ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే రూ.10 కోట్ల లోపే రెమ్యునరేషన్ తేల్చేశారనమాట. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) -
ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?
సినీ ప్రేక్షకులు ఇప్పుడంతా ఎక్కువగా ఓటీటీలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు ఎప్పటికప్పుడు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లో చూసేందుకే అభిమానులు మొగ్గు చూపుతున్నారు. దీంతో థియేటర్ ఆడియెన్స్తో పాటు నెటిజన్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు సైతం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే నాగచైతన్య సైతం దూత అనే వెబ్ సిరీస్లో ఎంట్రీ ఇచ్చేశారు. కాగా.. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, తమన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సోనాక్షి సిన్హా, సమంత, రాశీఖన్నా, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ సైతం ఓటీటీ వేదికలపై మెరిశారు. అయితే ఓటీటీల్లో నటించేందుకు అగ్రతారలు పారితోషికం గట్టిగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఏ పాత్రలోనైనా సరే నటించడానికి రెడీ అంటున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్ ఓటీటీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 2022లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ప్రసారమైన క్రైమ్ థ్రిల్లర్ షో 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్'తో అజయ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటీటీల్లో నటించిన స్టార్స్ పరంగా చూస్తే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు అజయ్ దేవగన్ అని లేటెస్ట్. 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' 7 ఎపిసోడ్ల కోసం దాదాపు రూ.125 కోట్లు పారితోషికం తీసుకున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన ఒక్క ఎపిసోడ్కు రూ. 18 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలా ఓటీటీలో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న భారతీయ నటుడిగా అజయ్ నిలిచారు. ఆ తర్వాత మరో నటుడు మనోజ్ భాజ్పేయి నిలిచారు. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్' క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో ఆయన నటించారు. ఈ సిరీస్ రెండవ సీజన్లో మనోజ్ ఏకంగా రూ. 10 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. -
టాప్ హీరో హీరోయిన్లకు చెక్! ఆ విషయంలో కష్టమే!
కాలంతో పాటు సినిమా రూపాంతరం చెందుతోందనడంలో ఎటువంటి సందేహం ఉండదు. జయాపయజాలను బట్టి చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం స్థాయి మారుతూ వస్తోంది. ముఖ్యంగా ఒక చిత్రం హిట్ అయితే అందులో నటించిన హీరో హీరోయిన్లు ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేస్తారన్నది తెలిసిన విషయమే. అయితే దీనికి చెక్ పెట్టే పరిస్థితి రానున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు చాలామటుకు సినిమాను కార్పొరేట్ సంస్థలే ఏలుతున్నాయి. దీంతో పలు పాత చిత్ర నిర్మాణ సంస్థలు తెరమరుగు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలు స్టార్ హీరో హీరోయిన్లకు చెక్ పెట్టనున్నట్లు సమాచారం. రెమ్యునరేషన్ డిమాండ్.. సాధారణంగా స్టార్ హీరో హీరోయిన్లు నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధిస్తాయి. దీంతో అలాంటి నటీనటులను బాక్సాఫీస్ గాడ్స్గా భావిస్తుంటారు. నిజానిజాల మాట అటు ఉంచితే ఇటీవల ఒక హీరో నటించిన చిత్రం వసూళ్లు రూ.500 కోట్లు దాటినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలతో అలాంటి స్టార్స్కు క్రేజ్ మరింత పెరుగుతుంది. బాక్సాఫీస్ కలెక్షన్స్ను బట్టి హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ను పెంచుకుంటూ పోతున్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ సంస్థలే! ఆ డబ్బుతోనే ఎక్కువ చెల్లిస్తున్నారు! సాటిలైట్, ఓటీటీ సంస్థలు ఇచ్చే డబ్బుతోనే నిర్మాతలు హీరో హీరోయిన్లకు పారితోషికం పెంచేస్తున్నారు. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్గా వెలుగొందుతున్న నటి నయనతార కూడా రూ.10 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈమె తన చిత్రాలకు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది లేదనే పలు కండిషన్లు పెడుతున్నారు. అయినా కానీ ఆమె మార్కెట్ తగ్గడం లేదు. ఇలాంటి వారికి తాజాగా కార్పొరేట్ సంస్థలు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 20 శాటిలైట్ హక్కులను, ఓటిటీ స్ట్రీమింగ్ హక్కులను ఇకపై అధిక ధరకు చెల్లించరాదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో స్టార్ హీరో హీరోయిన్ల పారితోషికం తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: బెంజ్ కారు కొనేసిన మానస్.. ఫొటోలు వైరల్ -
'సలార్' బడ్జెట్ అన్ని కోట్లు.. ఇక రెమ్యునరేషన్స్ ఎవరెవరికి ఎంతంటే?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' దెబ్బకు బాక్సాఫీస్ పునాదులు కదలడం గ్యారంటీ! మాస్ మూవీ, అందున ప్రశాంత్ నీల్ తీయడం దీనికి చాలా ప్లస్ కాబోతున్నాయి. దీంతో తొలిరోజు వసూళ్లు దద్దరిల్లిపోవడం పక్కా. సరే సినిమా టాక్ ఏంటి అనేది పక్కనబెడితే 'సలార్' కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: 'సలార్' సీక్వెల్కి అదిరిపోయే టైటిల్.. అసలు కథంతా ఇందులోనే!) 'కేజీఎఫ్' లాంటి సినిమాతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్తో ఊరమాస్ సినిమా తీశాడు. అదే 'సలార్'. అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై హైప్ మాములుగా లేదు. మధ్యలో వాయిదాల వల్ల ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయిన మాట నిజమే. కానీ ఇప్పుడు థియేటర్లలోకి మూవీ వచ్చేసిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. ప్రభాస్-మాస్ సీన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. తన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేశాడు. 'సలార్' మూవీకి కూడా అలా రూ.100 కోట్ల వరకు పారితోషికం, అలానే లాభాల్లో 10 శాతం షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి దాదాపు రూ.50 కోట్లు, శృతి హాసన్కి రూ.8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్-జగపతిబాబు తలో రూ.4 కోట్ల పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. మొత్తం మూవీ బడ్జెట్ రూ 400 కోట్ల వరకు ఉంటుందని టాక్. అంటే ఓవరాల్ బడ్జెట్లో సగం రెమ్యునరేషన్స్కే నిర్మాతలు ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది! (ఇదీ చదవండి: 'సలార్' సినిమాలో దాన్ని కావాలనే మిస్ చేశారా? లేదంటే..?) -
బీటెక్ కుర్రాడు.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?
ప్రతి సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఒకరుంటారు. అలా ఈ సీజన్లో అమర్దీప్ ఉన్నాడు. షో ప్రారంభంలో తడబడ్డా తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాడు. అయితే కొన్ని సార్లు తన మాటలతో పాటు ఆటల్లో తెలిసీతెలియక చేసిన తప్పుల వల్ల నలుగురిలో నవ్వులపాలయ్యాడు. అంతేకాకుండా శత్రువులు ఎక్కడో ఉండరు.. మన పక్కనే ఉంటారన్నది అమర్ విషయంలో నిజమైంది. మెంటల్ టార్చర్ను చిరునవ్వుతో భరించాడు కొన్నిసార్లు స్నేహితులు సైతం తనను పట్టించుకోలేదు. గురువుగా భావించే శివాజీ అయితే అమర్ను అనరాని మాటలన్నాడు.. మెంటల్ టార్చర్ పెట్టాడు. అయినా అన్నింటినీ చిరునవ్వుతో భరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఏనాడూ బయటకు చెప్పుకోలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల టాస్కులు ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే భావించాడే కానీ అనారోగ్యాన్ని సాకుగా చెప్పలేదు. విజయానికి అడుగు దూరంలో ఆగిపోయిన అమర్ రన్నరప్గా నిలిచాడు. వారానికి రూ.2.5 లక్షలు మరి ఈ అనంతపురం కుర్రాడు ఎంత సంపాదించాడో తెలుసా? షోలోకి రావడానికి ముందే సీరియల్స్ ద్వారా బోలెడంత గుర్తింపు ఉంది. కనుక అమర్దీప్కు భారీగానే డబ్బులు ఆఫర్ చేశారు. వారానికి రూ.2.5 లక్షలు ఇచ్చారట! ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ట్యాక్స్లు, జీఎస్టీల రూపంలో దాదాపు సగం ప్రభుత్వమే లాగేసుకుంటుంది. చదవండి: బిగ్బాస్ 7 విజేతగా ప్రశాంత్.. ప్రైజ్మనీ ఎంతంటే? -
బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?
బిగ్బాస్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్.. ప్రతి మనిషిలోనూ లోటుపాట్లు ఉంటాయి. అలాగే ఇతడిలోనూ ఉన్నాయి. నామినేషన్స్ అప్పుడు ఒకలా.. సాధారణ సమయాల్లో మరోలా ప్రవరిస్తూ అపరిచితుడిగా ముద్ర వేయించుకున్నాడు. నామినేషన్స్లో ఇతడు చేసే ఓవరాక్షన్ చూసి జనాలకు చిరాకు పుట్టింది. అయితే నామినేషన్స్లో ఎలా ఉన్నా మిగతా సమయాల్లో మాత్రం సామాన్యుడిగా, అతి మామూలుగా ఉండేవాడు. రానూరానూ తన తప్పులు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకున్నాడు. ఎవరెంత రెచ్చగొట్టినా ఒదిగి ఉన్నాడే తప్ప అతిగా ఆవేశపడలేదు. బిగ్బాస్ 7 ట్రోఫీ అందుకున్న ప్రశాంత్ తన ఫోకస్ అంతా టాస్కుల మీదే పెట్టాడు. తన సత్తా మాటల్లో కాకుండా ఆటలో చూపించాడు. తన ఆటతోనే ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అయితే ఎంతో టాలెంట్ ఉన్న ప్రశాంత్ చిన్నచిన్న విషయాలకు సైతం కుంగిపోయేవాడు. ఓటమిని తీసుకోలేకపోయేవాడు, కన్నీళ్లు పెట్టుకునేవాడు. మొదట్లో ఇదంతా సింపతీ గేమ్ అనుకున్నారు. కానీ తర్వాత అది అతడి సున్నిత మనసుకు నిదర్శనం అని అర్థం చేసుకున్నారు. ఎవరి మాటల్ని లెక్క చేయక గెలుపు మీదే దృష్టి పెట్టిన ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. ఏ స్టూడియో ముందైతే అదే పనిగా తచ్చాడాడో అదే స్టూడియోలో కరతాళ ధ్వనుల మధ్య బిగ్బాస్ 7 ట్రోఫీ అందుకున్నాడు. ప్రైజ్మనీలో కోత బిగ్బాస్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. పారితోషికం తక్కువే కానీ.. ఇక ప్రశాంత్కు ఇచ్చిన పారితోషికం తక్కువగానే ఉంది. రోజుకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారానికి లక్ష పైచిలుకు కాగా 15 వారాలకు కలిపి రూ.15,75,000 వెనకేసినట్లు భోగట్టా. అయితే తను అందుకున్న పారితోషికంలోనూ ట్యాక్స్ కటింగ్స్ ఉంటాయట. ఆ కటింగ్స్ పోనూ దాదాపు రూ.8 లక్షల పైచిలుకు తన చేతికి రానున్నట్లు కనిపిస్తోంది. అంటే పారితోషికం(రూ.15,75,000)+ ప్రైజ్మనీ(రూ.35 లక్షలు) మొత్తం కలిపి రూ.50 లక్షలపైనే తనకు రావాల్సి ఉన్నా ఈ ట్యాక్స్లు అన్ని పోనూ దాదాపు రూ.25- 27 లక్షలే చేతికి వచ్చేట్లు కనిపిస్తోంది. దీనితో పాటు అదనంగా ఖరీదైన మారుతి బ్రెజా కారు, రూ.15 లక్షల విలువ చేసే వజ్రాభరణాన్ని సొంతం చేసుకున్నాడు. చదవండి: ఆ ఒక్క విషయంలో ప్రియాంక సూపర్.. మొత్తం సంపాదన ఎంతంటే? అర్జున్ ఎలిమినేట్.. కేవలం 10 వారాల్లోనే అంత సంపాదించాడా? -
Bigg Boss 7: అర్జున్ అంత సంపాదించాడా? 10 వారాల్లోనే..
బిగ్బాస్ షోలో నామినేషన్స్- ఎలిమినేషన్స్కు విడదీయలేని సంబంధం ఉంది. ఎందుకంటే నామినేట్ అయినవారు ఎలిమినేట్ అవకా తప్పదు. ఎలిమినేట్ చేయడం కోసం అవతలివారిని నామినేట్ చేయకా తప్పదు. ఈ సీజన్పై ఎక్కువగా ఆసక్తిని క్రియేట్ చేసింది నామినేషన్సే! ఈ నామినేషన్స్లో ఎన్ని ఎక్కువసార్లు ఉంటే అంత పుంజుకోవచ్చన్నది కొందరి వాదన. నామినేషన్స్కు భయపడి దూరంగా ఉంటే మాత్రం ఇక అంతే సంగతులు. లేకలేక ఒక్కవారం నామినేషన్లోకి వచ్చి ఇట్టే ఎలిమినేట్ అయిపోయాడు సందీప్. అదే మైనస్.. బిగ్బాస్ ప్రారంభమైన నెల రోజుల తర్వాత హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు అర్జున్. ఇతడు మాట్లాడే మాటలకు అవతలి వారి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! అంత సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడతాడు అర్జున్. కానీ నెల రోజులు ఆలస్యంగా హౌస్లోకి రావడంతో జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయాడు. టాస్కుల్లో బాహుబలిలా ఆడాడు. ఎవరి అండదండలు లేకపోయినా సొంతంగా ఆడుతూ చివరి వరకు వచ్చాడు. కానీ మొదటి నుంచీ లేకపోవడంతో ఓసారి నామినేషన్స్లోకి వచ్చి ఎలిమినేట్ అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఫినాలే అస్త్ర సాయంతో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కి నేరుగా ఫినాలేలో అడుగుపెట్టాడు. టాప్ 6లో ఉండగా ఎలిమినేట్.. జనాదరణ పొందడంలో వెనకబడిన ఇతడు ఆరో స్థానంలో ఉండగానే షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీరియల్ నటుడిగా గొప్ప పేరున్న ఇతడు రోజుకు దాదాపు రూ.50 వేల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే వారానికి రూ.3,50,000 తీసుకున్నాడన్నమాట! ఈ లెక్కన 10 వారాలకుగానూ అర్జున్ రూ.35,00,000 వెనకేశాడు. లేటుగా హౌస్లోకి వచ్చినప్పటికీ చాలామందికంటే ఎక్కువగానే సంపాదించాడు అర్జున్. కానీ ఇందులో దాదాపు సగం వరకు ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపంలో అప్పజెప్పాల్సి ఉంటుంది. చదవండి: పీకల్లోతు అప్పుల్లో యావర్.. ప్రైజ్మనీ కూడా సరిపోదన్న ప్రిన్స్ సోదరుడు -
‘పుష్ప 2’లో వాటా కోరిన బన్నీ.. రజనీకాంత్ కంటే ఎక్కువే!
తెలుగు సినిమా మార్కెట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. బాహుబలి తర్వాత వరుసగా ఇక్కడి నుంచి పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. కొన్ని చిత్రాలు అయితే.. సౌత్లో కంటే నార్త్లోనే ఎక్కువగా ఆడుతున్నాయి. అందుకే మన దర్శకనిర్మాతలు ఒక్కో సినిమాకి వందల కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు. (చదవండి: 2023 లో చిన్న చిత్రాల హవా.. బడ్జెట్కు మించి ఎన్నో రేట్ల లాభాలు!) అయితే సినిమా కలెక్షన్స్ పెరగడంతో..స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్స్ని కూడా పెంచేశారు. ఓ పాతికేళ్ల క్రితం స్టార్ హీరోకి రూ. కోటి ఇస్తే..అదే అతి పెద్ద పారితోషికం. కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులే రూ. కోటికి పైగా తీసుకుంటున్నారు. ఇక హీరోల రెమ్యునరేషన్ అయితే అమాంతం పెరిగిపోయింది. కొంతమంది స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం పుచ్చుకుంటున్నారు. (చదవండి: స్టార్ కమెడియన్ మరణంతో అనాథగా మారిన ప్రియుడు.. చివరకు..) సౌత్లో సూపర్ స్టార్ రజనీకాంత్ అత్యధికంగా రూ. 200 కోట్లను రెమ్యునరేషన్గా తీసుకుంటున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఇక తాజాగా బన్నీ రెమ్యునరేషన్పై క్రేజీ రూమర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పుష్ప-2 కోసం అల్లు అర్జున్.. రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. వాటా కోరిన బన్ని సుకుమార్-బన్నీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ ది రైజ్. 2021 చివరల్లో విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాపీస్ని షేక్ చేసింది. అంతేకాదు బన్నీకి జాతీయ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్గా పుష్ప-2 తెరకెక్కుతుంది. వచ్చే ఏడాదిలో విడుదలయ్యే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప చిత్రానికి రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న బన్నీ.. పార్ట్ 2కి మాత్రం పారితోషికాన్ని ఒక ఫిగర్ లాగా కాకుండా వచ్చే రెవిన్యూలో పర్సెంటెజ్ లాగా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడనే వార్త టాలీవుడ్లో వినిపిస్తుంది. పుష్ప-2కి అయ్యే మొత్తం బిజినెస్లో 30 శాతం తనకు ఇచ్చేలా బన్నీ ఒప్పందం కుదుర్చుకున్నాడట. 300 కోట్లకు పైనే.. పుష్ప : రి రైజ్ హిట్ కావడంతో దానికి సీక్వెల్గా వస్తున్న పుష్ప: ది రూల్పై భారీ హైప్ క్రియేట్ అయింది. సుకుమార్ కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఉన్న బజ్ బట్టి చూస్తే.. ఓవరాల్ బిజినెస్ రూ. 1000 కోట్లు అయ్యే చాన్స్ ఉందని సినీ పండితులు చెబుతున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే.. ఇందులో బన్నీ వాటాగా దాదాపు రూ. 300 కోట్లు వెళ్తుంది. సౌత్ నుంచి ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోలేదు. భారీ కలెక్షన్స్ వస్తాయనే ధీమాతో మైత్రీ మూవీ మేకర్స్ కూడా బన్నీ ఒప్పందానికి సై అన్నారేమో! -
Big Boss 7: ఎలిమినేట్ అయిన భోలె.. ఎంత సంపాదించాడో తెలుసా?
బిగ్బాస్ 7లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టం. ఆదివారం ఎపిసోడ్తో పదోవారం ముగిసింది. గత తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది హౌస్ నుంచి బయటకెళ్లిపోగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ నడిచింది. అయితే అందరూ రతిక ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ అనుహ్యంగా భోలె ఎలిమినేట్ అయిపోయాడు. పాడ పాడుతూ, నవ్వుకుంటూ హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. భోలె ఎలిమినేట్ ఈ వారం ఎలిమినేషన్.. రాజమాతలు అనే కాన్సెప్ట్ ప్రకారం జరిగింది. దీంతో అమ్మాయిలందరూ రాజమాతల్లా ఉండి ఎవరూ నామినేట్ కావాలనేది డిసైడ్ చేశారు. అలా శివాజీ, గౌతమ్, యవర్, భోలె, రతిక.. ఎలిమినేషన్స్లో నిలిచారు. ఇందులో ఎప్పటిలానే శివాజీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో యవర్, గౌతమ్ నిలిచారు. చివరి రెండు స్థానాల్లో రతిక-భోలె మధ్య కాస్త నడిచింది. కానీ భోలెపై వేటు పడింది. మరో ఛాన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: లవ్స్టోరీ అంతా బయటపెట్టిన శోభా.. ఈ సీజన్ టాప్-5 వాళ్లే!?) సంపాదన గట్టిగానే వైల్డ్కార్డ్ కోటాలో పాటబిడ్డ అనే ట్యాగుతో హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన భోలె.. ఆట కంటే పాటతో బాగా ఫేమస్ అయ్యాడు. కానీ గేమ్ విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయాడు. శివాజీ బ్యాచులో ఉండటం, కాస్త ఎంటర్టైన్ చేయడంతో దాదాపు ఐదు వారాలు ఎలాగోలా బండి లాక్కుంటూ వచ్చేశాడు. అలానే అమ్మాయిలతో గొడవ, బూతులు మాట్లాడటం లాంటివి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. ఈసారి ఎలిమినేషన్స్లోనూ అందరూ మనోడి కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండేసరికి భోలెపై వేటు తప్పలేదు. ఇకపోతే భోలె.. రోజుకు రూ.35 వేల చొప్పున అంటే వారానికి దాదాపు రూ.2.5 లక్షల లెక్క రెమ్యునరేషన్ అందుకున్నాడట. అలా లెక్కేసుకుంటే ఐదు వారాలకుగానూ రూ.12 లక్షల వరకు సంపాదించాడని తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ఇప్పటివరకు భోలెనే కాస్త ఎక్కువ మొత్తంలో అందుకున్నట్లు లెక్క. ఏదైతేనేం మనోడు వచ్చిన తొలివారంలో చెప్పినట్లు ఉన్నన్ని రోజులు మంచిగా ఉన్నాడు. మంచిగా సంపాదించి, కాస్త పేరు తెచ్చుకుని హౌస్ నుంచి వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్బాస్' కంటెస్టెంట్) -
బిగ్బాస్ 7: తొమ్మిది వారాలకు తేజ ఎంత సంపాదించాడంటే?
టేస్టీ తేజ.. పేరుకు తగ్గట్లే భోజన ప్రియుడు.. కాదు కాదు, భోజన ప్రియుడు కాబట్టే ఆ పేరు పెట్టుకున్నాడు. బిగ్బాస్ హౌస్లోనూ తన పేరుకు న్యాయం చేస్తూ గుడ్లు దొంగతనం చేస్తూ, స్ప్రైట్ల కోసం కక్కుర్తి పడేవాడు. ఈ పోరాటం ఏదో ఆటలో కూడా చూపిస్తే ఇంకొన్నాళ్లు ఉండేవాడు. కానీ, అన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయే తేజను చూసి జనాలు కూడా లైట్ తీసుకున్నారు. అందుకే ఈవారం అతడిని బిగ్బాస్ ఇంటి నుంచి బయటకు పంపించారు. గొప్పగా ఆడకపోవచ్చు. కానీ.. నిజానికి తేజ మరీ తొమ్మిది వారాలదాకా ఉంటానని అనుకోలేదట. ఏదో నాలుగువారాలు ఉండిపోదాంలే అనుకున్నాడట. కానీ తొమ్మిదివారాల దాకా ప్రేక్షకులు తనను హౌస్లో ఉంచడంతో తనను తనే నమ్మలేకపోతున్నాడు. నిజంగానే తేజ గొప్పగా ఆడకపోవచ్చు. కానీ కడుపుబ్బా నవ్వించాడు. అందరితోనూ కలుపుగోలుగా ఉన్నాడు. చిన్నపాటి గొడవలు జరిగినా సర్దుకుపోయే మనస్తత్వం తనది. అదే సమయంలో పుల్లలు పెట్టి అందరి మధ్య చిచ్చు పెట్టే నారదుడు కూడా! భలే సేఫ్గా ఆడేవాడు.. ఒకరి మాటను మరొకరికి చెప్పి వాళ్ల మధ్య అగ్గి రాజేసేవాడు. కొన్నిసార్లు అవతలి వారు ఏమీ అనకపోయినా నిన్నిలా అన్నారు, ఆ మాటన్నారు.. అని లేనిపోనివి చెప్పి కారాలు, మిరియాలు నూరేవాడు. కొన్నిసార్లు అడ్డంగా బుక్కయ్యాడు కూడా! నామినేషన్స్లోనూ భలే సేఫ్గా ఆడేవాడు. ఎదుటివారిని నొప్పించకుండా తను డేంజర్ జోన్లోకి రాకుండా విశ్వప్రయత్నాలు చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను నామినేషన్స్లోకి పంపించేవాడు. రెమ్యునరేషన్ ఎంతంటే? అలా అతడు నామినేట్ చేసినవాళ్లు కొందరు ఎలిమినేట్ అయ్యారు కూడా!. కానీ ఈ వారం తేజ ఎలిమినేషన్ కత్తికి బలైపోయాడు. తొమ్మిది వారాలు హౌస్లో ఉన్న అతడు బాగానే వెనకేశాడు. వారానికి దాదాపు రూ.1.75 లక్షల మేర తీసుకున్నాడట. ఈ లెక్కన తొమ్మిది వారాలకుగానూ రూ.15 లక్షల పైనే వెనకేసినట్లు తెలుస్తోంది. -
హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!
శ్రీదేవి ఆ పేరు వింటే చాలు. తనదైన అందంతో వెండితెరపై అలరించింది. అటు బాలీవుడ్.. ఇటు దక్షిణాది సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడిన శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అప్పట్లోనే తన స్టార్ డమ్తో సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకుంది. కేవలం ఆమెను తెరపై చూడటానికి మాత్రమే అభిమానులు థియేటర్లకు వచ్చేవారట. నటిగా అత్యంత అభిమానుల ఆదరణ దక్కించుకున్న నటి అనూహ్యంగా 2018 ఫిబ్రవరిలో దుబాయ్లోని ఓ హోటల్ గదిలో మరణించింది. (ఇది చదవండి: ప్రభాస్ బర్త్డే నాడు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా..?) హీరోల కంటే ఎక్కువ పారితోషికం శ్రీదేవి నటించే రోజుల్లో బాలీవుడ్లో మహిళా నటీనటుల పారితోషికం.. పురుషుడి కంటే చాలా తక్కువ ఉండేది. కానీ శ్రీదేవి మాత్రం చాలా మంది స్టార్ నటుల కంటే ఎక్కువ రుసుము వసూలు చేసే నటిగా నిలిచింది. అప్పట్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోనే ఒక చిత్రానికి కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి నటిగా పేరు సంపాదించింది. అప్పట్లో కొంతమంది మేల్ ఆర్టిస్టులు కూడా అంత డబ్బు సంపాదించేవారు కాదట. అప్పట్లో శ్రీదేవిని ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అని కూడా పిలిచేవారట. అంతే కాదు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలకు ఆమె సంతకం ఇంటి వద్దే వరుసలో ఉండేవారట. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్స్టార్ కూడా శ్రీదేవితో పనిచేయడానికి భయపడేవారని సమాచారం. అయితే సల్మాన్ ఖాన్, శ్రీదేవి జంటగా 'చంద్రముఖి', 'చంద్ కా తుక్డా' అనే రెండు చిత్రాలలో నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఐదు దశాబ్దాల తన సినీ కెరీర్లో శ్రీదేవి అలాంటి ఎన్నో పాత్రలు పోషించారు. కాగా.. ఆమె చివరిసారిగా 'మామ్' చిత్రంలో తెరపై కనిపించింది. (ఇది చదవండి: బూతులు బిగ్ బాస్లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ) -
‘భగవంత్ కేసరి’ కోసం శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.. కాజల్ కంటే ఎక్కువే!
ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల హవా కొనసాగుతుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు హీరోయిన్గా అలరించిన శ్రీలీల.. ఈ చిత్రంలో కూతురు పాత్ర పోషించి మెప్పించింది. సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. ప్రతి ఒక్కరు శ్రీలీల నటనను మాత్రం పొగిడేస్తున్నారు. డ్యాన్స్ మాత్రమే కాదు యాక్షన్ కూడా ఇరగదీసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీలీల ప్రయోగం ఫలించింది శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్లో బిజియెస్ట్ హీరోయిన్. ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. డేట్స్ కుదరక చాలా సినిమాలు వదులుకుంది కూడా. అలాంటి శ్రీలీల భగవంత్ కేసరి లాంటి చిత్రం ఒప్పుకొని పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే హీరోయిన్గా రాణిస్తున్న తరుణంలో కూతురు లాంటి క్యారెక్టర్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ శ్రీలీల ఆ ప్రయోగం చేసి సక్సెస్ సాధించింది. భగవంత్ కేసరిలో బాలయ్య తరువాత శ్రీలీల అభినయమే హైలెట్ అని పలు వెబ్సైట్లు తమ రివ్యూల్లో రాసుకొచ్చాయి. విజ్జీ పాప పాత్రలో ఆమె ఒదిగిపోయిందని, శ్రీలీలలోని రెండో కోణం ఈ సినిమా ద్వారా బయటకు వచ్చిందని అంటున్నారు. భారీ రెమ్యునరేషన్ భగవంత్ కేసరి కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషనే పుచ్చుకుందంట. హీరోయిన్గా నటించిన కాజల్ కంటే ఎక్కువ పారితోషికం వసూలు చేసిందని టాక్ నడుస్తోంది. పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడంతో కాజల్ తన రెమ్యునరేషన్ని భారీగా తగ్గించిందట. భగవంత్ కేసరి కోసం రూ. 1.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల మాత్రం రూ. 1.8 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నట్లు సమాచారం. కెరీర్ ప్రారంభంలో కేవలం ఐదు లక్షల రూపాలయలు మాత్రమే తీసుకున్న శ్రీలీల..ఇప్పుడు కోటిన్నరకు పైగా తీసుకుంటుందంటే ఈ అమ్మడు క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: భగవంత్ కేసరి మూవీ రివ్యూ) -
జవాన్కు రూ.10 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్, ఇప్పుడేకంగా..
తన వయసు నాలుగు పదులు.. అయినా ఎక్కడా తగ్గేదేలే అంటోంది నయనతార. ఇంతకుముందు వివాదాలకు ఇప్పుడు సంచలనాలకు కేంద్రం ఈ బ్యూటీ. సినిమాల్లో నటిస్తూనే ఇతర వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతోంది. మరో పక్క దర్శకుడు విఘ్నేశ్ శివన్ను పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లి కూడా అయింది. అయినప్పటికీ లేడీ సూపర్స్టార్ పట్టం చేజారకుండా చూసుకుంటోంది. బాలీవుడ్లోనూ నయన్కు క్రేజ్ అగ్ర కథానాయికగా ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఇటీవల బాలీవుడ్లో తన లక్ పరీక్షించుకుంది. అక్కడ షారుక్ ఖాన్తో జత కట్టిన జవాన్ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచి రికార్డులను బ్రేక్ చేయడంతో ఈ అమ్మడి క్రేజ్ అక్కడ కూడా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు నయనతార తలుపు తడుతున్నాయని సమాచారం. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్లీలా భన్సాలి తాజా చిత్రంలో నయనతార ఒక ముఖ్యపాత్రలో నటింపజేయడానికి సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న హీరోయిన్ కాగా జవాన్ చిత్రానికి రూ.10 కోట్లు పుచ్చుకున్న నయనతార ఈ చిత్రానికి ఏకంగా రూ.13 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అలా ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటూ ముందుకు పోతోందన్నమాట. ప్రస్తుతం ఈమె తమిళంలో తన 75వ చిత్రంతోపాటు, క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న టెస్ట్, మన్నాంగట్టిసిన్స్ 1960 చిత్రాల్లో నటిస్తోంది. నటుడు జయం రవి సరసన మరోసారి తనీ ఒరువన్–2 చిత్రంలో నయనతార నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. చదవండి: మేము విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ట్వీట్.. నెట్టింట వైరల్ -
'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?
ఈ శుక్రవారం తెలుగులో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో బాలయ్య 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' కంటే విజయ్ 'లియో'కే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే హైప్, టికెట్ బుకింగ్స్ అవుతున్నాయి. మరోవైపు టైటిల్ మూలాన 'లియో' మూవీ తెలుగులో చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా లేదా అని మరో టెన్షన్. ఇలా 'లియో' విషయంలో విడుదలకు సరిగ్గా రెండు రోజుల ముందు కాస్త హడావుడి ఎక్కువైంది. అయితే చాలామంది తెలుగు ఆడియెన్స్.. ఈ చిత్రాన్ని విజయ్ కోసం కాదు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కోసం చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 'విక్రమ్'తో మెస్మరైజ్ చేసిన ఇతడు.. 'లియో'తో ఏం మ్యాజిక్ చేయబోతున్నాడనేది ఇక్కడ ప్రశ్న. (ఇదీ చదవండి: ‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ) ఇకపోతే బడ్జెట్ పరంగా రూ.300 కోట్ల వరకు 'లియో' కోసం పెట్టారు. అయితే ఇందులో సగం బడ్జెట్ చిత్రబృందం రెమ్యునరేషన్ కోసం ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హీరో విజయ్ రూ.120 కోట్ల పారితోషికం అందుకున్నాడట. ఇతడి తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్-రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ రూ.10 కోట్లు, సంజయ్ దత్ రూ.8 కోట్లు, త్రిష రూ.5 కోట్లు, అర్జున్ రూ.కోటి, ప్రియా ఆనంద్ రూ.50 లక్షలు తీసుకున్నారట. సహాయ పాత్రల్లో నటించిన గౌతమ్ మేనన్, మిస్కిన్ తదితరులు రూ.30-50 లక్షల మధ్య రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. కొన్నాళ్ల ముందు వరకు వేరే లెవల్ హైప్తో వార్తల్లో 'లియో' సినిమాకు ట్రైలర్ వచ్చిన తర్వాత కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అయితే థియేటర్లలో సినిమా హిట్ అయితే మాత్రం ఈ సంగతులన్నీ ఫ్యాన్స్ మర్చిపోతారు. తెలుగు రిలీజ్ అక్టోబరు 19. అంటే మరో రోజు మాత్రమే గ్యాప్ ఉంది. మరి 'లియో' ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
బిగ్బాస్ హౌస్లోకి భార్యాభర్తలు.. ఆమెకే ఎక్కువ రెమ్యునరేషన్
బిగ్బాస్ షో.. ఈ రియాలిటీ షోలోకి ఒక్కసారైనా వెళ్లిరావాలనుకునేవారు కొందరైతే.. మాకొద్దురా బాబూ అని తూర్పు తిరిగి దండం పెట్టేసేవాళ్లు మరికొందరు. అటు ప్రేక్షకుల్లోనూ బిగ్బాస్ను ఆరాధించేవాళ్లున్నారు, తిట్టిపోసేవాళ్లూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే తిడుతూనే బిగ్బాస్ షోను చూసే జనాల సంఖ్యా ఎక్కువే! బిగ్బాస్కు వస్తున్న ఆదరణను బట్టే అన్ని చోట్లా ప్రతి ఏడాది కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఏడో సీజన్ నడుస్తుండగా తాజాగా హిందీలోనూ కొత్త సీజన్ షురూ అయింది. అక్టోబర్ 15న హిందీ బిగ్బాస్ 17వ సీజన్ ప్రారంభమైంది. ఈ షోలోకి 17 మంది సెలబ్రిటీలు అడుగుపెట్టారు. అందులో హీరోయిన్ మన్నారా చోప్రా, కమెడియన్ మునావర్ ఫరూఖి, క్రిమినల్ లాయర్ సనా రేస్ ఖాన్తో పాటు రెండు జంటలు కూడా ఉన్నాయి. నీల్ భట్-ఐశ్వర్య శర్మ, అంకితా లోఖండే-విక్కీ జైన్ దంపతులున్నారు. ఈ సీజన్లో అందరి కళ్లు అంకిత- విక్కీ దంపతుల మీదే ఉంది. ఈ రియాలిటీ షో కోసం అంకితా లోఖండే భారీ ఎత్తున షాపింగ్ కూడా చేసింది. ఇకపోతే ఈ సీజన్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్నవారిలో అంకిత లోఖండే మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్కుగానూ ఆమె వారానికి రూ.10-12 లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు భోగట్టా! ఆమె భర్త విక్కీ జైన్ మాత్రం వారానికి ఐదు లక్షలతో సరిపెట్టుకుంటున్నాడట! ఏమైనా అంకితా లోఖండే బుల్లితెరమీదే కాదు బిగ్బాస్ షోలోనూ తన డామినేషన్ చూపిస్తోంది! చదవండి: సిద్దార్థ్ చిన్నా మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే! -
బిగ్బాస్ 7 ఎలిమినేషన్.. నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్బాస్ 7వ సీజన్ నుంచి ఆరోవారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో భాగంగా హౌసులోకి అడుగుపెట్టిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని.. వచ్చిన వారంలో తన ఆటతో ఆకట్టుకుంది. కానీ అనుకోని విధంగా బయటకొచ్చేసింది. మరీ వారంలో ఆమె ఎంత సంపాదించిందో తెలుసా? బిగ్బాస్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేం. నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్స్ వరకు కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలా ఈ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. రెండు రోజులు ముందు వరకు ఓటింగ్ పరంగా చూసుకుంటే శోభాశెట్టి, పూజామూర్తి, నయని పావని చివరి స్థానాల్లో ఉన్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్బాస్' రతిక) వీళ్లలో చాలామంది శోభాశెట్టి లేదా పూజామూర్తి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ వీళ్లిద్దరూ కాకుండా నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. అయితే గేమ్, టాస్కుల పరంగా ఈమెకి బలం ఉంది. ఇంకో రెండు-మూడు వారాలు ఉండుంటే రేసులో ఉండేదేమో. కానీ పరిస్థితులు అనుకూలించక.. వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఇకపోతే వారానికి రూ.2 లక్షలకు నయని పావని అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే వచ్చిన వారం మాత్రమే ఉంది కాబట్టి కేవలం రూ.2 లక్షలు తీసుకునే ఇంటికి వెళ్లిపోనుంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్) -
లిప్లాక్ సీన్లతో రెచ్చిపోయిన రష్మిక.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం యానిమల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవలే సినిమా టీజర్ను, ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇక సాంగ్ వీడియోలో రణ్బీర్, రష్మిక కెమిస్ట్రీకి హద్దులేకుండా పోయింది. ఇద్దరూ రొమాన్స్లో చెలరేగిపోయారు. అయితే ఈ లిప్లాక్ సీన్ల కోసం రష్మిక గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో లిప్లాక్ సీన్ కోసం రూ.20 లక్షలు ఛార్జ్ చేసిందట. ఎన్ని ముద్దు సన్నివేశాలు ఉంటే అన్ని రూ.20 లక్షలు ఎక్స్ట్రా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా రష్మిక ఒక్క సినిమాకు రూ.4 కోట్లు తీసుకుంటోంది. అయితే లిప్లాక్కు అదనంగా రూ.20 లక్షలు తీసుకుంటుందన్న విషయం తెలిసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే భూషణ్కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని నిర్మించిన యానిమల్ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. చదవండి: ఒకరు క్యాన్సర్కు బలి.. మరొకరు స్టార్ హీరోయిన్గా -
బిగ్బాస్: సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్బాస్ షో.. ఎన్ని సీజన్లు వచ్చినా జనాలు ఆదరిస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఈ రియాలిటీ షో సైతం కొత్తగా ముస్తాబవుతూనే ఉంటుంది. తెలుగులో ఇంకా ఏడో సీజనే నడుస్తోంది కానీ హిందీలో ఏకంగా 16 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నెల 15న బిగ్బాస్ 17వ సీజన్ షురూ కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తవగా ఈసారి కూడా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. రెమ్యునరేషన్ ఎంతంటే? మరి ఈసారి షో కోసం సల్మాన్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా? ఒక్క ఎపిసోడ్కు రూ.6 కోట్ల మేర పుచ్చుకుంటున్నాడట. వారానికి రెండు ఎపిసోడ్లు(శని, ఆది)లో కనిపించే సల్లూ భాయ్ ఒక్క వారానికే రూ.12 కోట్ల దాకా వెనకేసుకుంటున్నాడన్నమాట! కాగా బిగ్బాస్ షోకి హోస్ట్గా వ్యవహరించిన కొత్తలో అంటే 2010వ సంవత్సరంలో సల్మాన్ వారానికిగానూ రూ.2.5 కోట్లు తీసుకునేవాడు. ఆ తర్వాతి సీజన్కు కూడా ఇంచుమించు అంతే తీసుకున్నాడు. బిగ్బాస్ ఏడో సీజన్ వచ్చేసరికి ఈ రెమ్యునరేషన్ను రెట్టింపు చేశాడు. ప్రతి సీజన్కూ పెంచుకుంటూ పోతున్న సల్మాన్ ఎనిమిదవ సీజన్లో రూ.5.5 కోట్లు, తొమ్మిదో సీజన్లో రూ. 7 కోట్లు, 10వ సీజన్లో రూ.8 కోట్లు తీసుకున్నాడు. 11వ సీజన్ నుంచి దాన్ని మరింత పెంచుకుంటూ పోయాడు. ఇప్పుడు 17వ సీజన్కు వచ్చేసరికి ఏకంగా వారానికి రూ.12 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే సీజన్ మొత్తానికి గానూ రూ.150 కోట్ల పైచిలుకు తీసుకోనున్నట్లు కనిపిస్తోంది. చదవండి: హీరోతో యాడ్.. రాత్రికి వస్తేనే ఛాన్స్.. నటికి చేదు అనుభవం -
ఆమెపై సామూహిక అత్యాచారం.. బిగ్బాస్ చరిత్రలోనే రికార్డ్ రెమ్యునరేషన్!
తెలుగుతో పాటు అన్ని భాషల్లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న ఏకైక షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సీజన్-7 విజయవంతంగా నడుస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త పోకడలతో అభిమానులను అలరిస్తోంది. ఇంతలా ఆదరణ పొందిన రియాలిటీ షో పాల్గొనే కంటెస్టెంట్స్కు సైతం మంచి గుర్తింపు దక్కుతోంది. ఈ షో ద్వారానే కొందరు సినీరంగంలో ఫేమస్ అవుతున్నారు. అయితే ఈ షోలో పాల్గొనే వారికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు అన్న విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. (ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశారు: శుభ శ్రీ) మన తెలుగు బిగ్బాస్ షో అయితే కంటెస్టెంట్స్ పారితోషికాల గురించి మనం లక్షల్లోనే వింటుంటాం. అంతే కాదు.. ఎలిమినేట్ అయినవారు సైతం తమ రెమ్యునరేషన్ గురించి ఇంటర్వ్యూల్లోనూ ప్రస్తావించారు. అయితే లక్షల్లో మాత్రమే పారితోషికం అందుకున్న కంటెస్టెంట్స్ చాలామందే ఉన్నారు. మరీ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న వారు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అబ్బే.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు కోట్లలో ఇస్తారా? అని అంటారా?.. కానీ కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న వారు కూడా ఉన్నారు. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ కేవలం 3 రోజులకే రూ. 2 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఇంతకీ ఎవరో తెలుసుకుందాం. హిందీలో బిగ్బాస్ షో హోస్ట్గా సల్మాన్ ఖాన్ వ్యవహిరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్బాస్ సీజన్-4లో హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించింది. కేవలం మూడు రోజులు మాత్రమే అతిథిగా ఇంట్లో ఉండిపోయింది. ఈ షోలో పాల్గొన్నందుకు ఆమెకు దాదాపు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సీజన్తోనే సల్మాన్ ఖాన్ మొదటిసారిగా హోస్ట్గా వ్యవహరించారు. ఆమె తర్వాత అత్యధికంగా బిగ్ బాస్ -15 విజేత తేజస్వి ప్రకాశ్కు 1.7 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించారు. కాగా.. పమేలా ఆండర్సన్ కెనడియన్-అమెరికన్ నటిగా, మోడల్గా గుర్తింపు దక్కించుకుంది. ప్లేబాయ్ మ్యాగజైన్లో తన మోడలింగ్లో గుర్తింపు తెచ్చుకుంది. టీవీ సిరీస్ బేవాచ్లో సీజే పార్కర్ పాత్రతో ఆమె ఫేమస్ అయింది. (ఇది చదవండి: అమర్దీప్కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?) అయితే పమేలా తన బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. 2014లో ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 6 నుంచి 10 వయస్సులో ఓ మహిళ తనను వేధించిందని.. ఆ తర్వాత 12 ఏళ్లకే 25 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడని వివరించింది. అంతే కాదు.. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని పేర్కొంది. ఆమెకు 14 ఏళ్ల వయసులో తన ప్రియుడితో పాటు, అతని ఫ్రెండ్స్ ఆరుగురు అత్యాచారం చేశారని వెల్లడించింది. -
ఎలిమినేట్ అయిన బ్యూటీ.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రియాలిటీ షో నుంచి ఇప్పటి వరకు ఐదు వారాలు పూర్తి కాగా.. వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం విశేషం. ఐదోవారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించినప్పటికీ చివరికీ శుభ శ్రీ రాయగురు హోస్కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. మరో కంటెస్టెంట్ గౌతమ్ను మాత్రం సీక్రెట్ రూమ్లోకి పంపించేశారు బిగ్ బాస్. అయితే ఇప్పటికీ ఐదుగురు హౌస్ నుంచి బయటికి రాగా.. కొత్తగా మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అంబటి అర్జున్, పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయని పావని, భోలే షావలి ఉన్నారు. (ఇది చదవండి: బిగ్బాస్లో ఎంట్రీ.. అప్పుడే రెండు చిత్రాలకు ఓకే!) అయితే ఐదోవారంలో ఎలిమినేట్ అయిన శుభ శ్రీ రాయగురు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. హౌస్లో తన అందం, అభినయంతో ఆడియన్స్ను ఆకట్టుకున్న శుభశ్రీ హౌస్ నుంచి బయటకొచ్చింది. ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా శుభశ్రీకి తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే రెమ్యునరేషన్ విషయానికొస్తే వారానికి దాదాపు రూ.2 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు వారాల్లో దాదాపు రూ.10 లక్షలు సంపాదించి ఉంటుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
సూపర్ హిట్ మూవీ.. శివాజీ గణేశన్కు రజినీ కళ్లు చెదిరే గిఫ్ట్!
సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పాదయప్ప'. తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ తండ్రిగా శివాజీ గణేశన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో రజినీకాంత్, శివాజీకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి చాలా చిత్రాల్లో కనిపించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రమే పాదయప్ప. అయితే ఈ సినిమాకు అప్పట్లో రెమ్యునరేషన్ విషయాకొస్తే కేవలం లక్షల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడైతే కోట్లలోనే చూస్తున్నాం. (ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లండి'.. ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన అఖిల్!) అంతకుముందు సినిమాల వరకు శివాజీ గణేశన్ పారితోషికం రూ.20 లక్షల వరకు తీసుకునేవారట. అయితే పాదయప్ప చిత్రానికి దాదాపు రూ.30 లక్షల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. కానీ రజినీకాంత్ శివాజీ గణేశన్కు జీవితాంతం గుర్తుండిపోయేలా రెమ్యునరేషన్ వచ్చేలా చేశారట. పాదయప్ప సినిమాకు ఏకంగా రూ.1.5 కోట్ల పారితోషికం ఇప్పించాడట. దీంతో వీరిద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పదో అర్థమవుతోంది. అయితే ఆ సమయంలో కోటిన్నర రెమ్యునరేషన్ అంటే చాలా ఎక్కువే. శివాజీ గణేశన్ తీసుకున్న అత్యధిక పారితోషికం కూడా అదేనట. అయితే 1999లో ఈ సినిమా రిలీజ్ కాగా.. శివాజీ గణేశన్ 2001లో కన్నుమూశారు. -
మ్యూజిక్ ఇస్తే రూ.10 కోట్లు.. పాడితే మాత్రం పూర్తిగా ఫ్రీ
సినిమా హిట్ కావాలంటే హీరోలుండాలనేది పాత మాట. అనిరుధ్ కూడా ఉండాలనేది కొత్త మాట. ఎందుకంటే సాదాసీదా మూవీస్ని కూడా తన మ్యూజిక్తో బ్లాక్బస్టర్స్ చేస్తున్నాడు. అతడి పేరే అనిరుధ్ రవిచందర్. రీసెంట్గా రిలీజైన జైలర్, జవాన్ సినిమాలతో మనోడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఒక్కో సినిమా కోసం రూ.10 కోట్ల వరకు తీసుకునే అనిరుధ్.. అస్సలు డబ్బులు తీసుకోకుండా పాడతాడని మీలో ఎంతమందికి తెలుసు? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) అవును మీరు కరెక్ట్గానే విన్నారు. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన అనిరుధ్.. ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్లు వరకు తీసుకుంటున్నాడని సమాచారం. తన సినిమాల్లో కాకుండా ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన పాటలు కూడా పాడుతుంటాడు. ఇలా పాడుతున్నందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోడు. ఈ విషయాన్ని స్వయంగా అనిరుధ్ బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ సంగతి రివీల్ చేశాడు. పాడటం తన ప్రొఫెషన్ కాదని కానీ దాన్ని ఎంజాయ్ చేస్తానని, అందుకే వేరే సంగీత దర్శకులు ఎవరైనా వచ్చి అడిగితే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్లకోసం పాట పాడుతానని అనిరుధ్ చెప్పాడు. ఇలా చేయడం వల్ల వాళ్ల కంపోజింగ్ స్టైల్ తెలుస్తుందని, అది తన మ్యూజిక్ స్టైల్ని అప్డేట్ చేసుకునే విషయంలో ఉపయోగపడుతుందని అన్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ ఇస్తే కోట్లు తీసుకునే ఓ మ్యూజిక్ డైరెక్టర్.. సింగర్గా ఫ్రీగా పాడతాడంటే విశేషమే కదా! (ఇదీ చదవండి: 'బిగ్బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) -
రతిక ఎలిమినేట్.. 'బిగ్బాస్'లో రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే!
బిగ్బాస్ 7 సీజన్ చూస్తున్న వాళ్లకు ఇది నిజంగా షాక్. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ అనుకున్న రతిక ఎలిమినేట్ అయిపోయింది. ఓట్లు తక్కువగా రావడంతో నాలుగో వారమే హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే వస్తున్న క్రమంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. దీన్నిబట్టి హౌస్లో ఉండాలని ఆమె ఎంతగా అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ బయటకు రాక తప్పలేదు. ఊహించని ట్విస్ట్ అయితే తొలి వారం నుంచి కెమెరాలు అన్నీ తనపై ఫోకస్ అయ్యేలా చేసుకున్న రతిక.. ఈ విషయంలో సక్సెస్ అయింది. కానీ గేమ్స్, టాస్కుల విషయానికి వచ్చేసరికి తేలిపోయింది. ఎందులోనూ విజయం సాధించలేకపోయింది. ఇక రెండో వారం రతిక.. సొంత టీమ్ సభ్యులనే బఫూన్స్ అనడం చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' నుంచి రతిక ఎలిమినేట్.. ఆ తప్పుల వల్లే ఇలా?) లవ్ ట్రాక్స్ నో వర్కౌట్ ఇక బిగ్బాస్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్తో క్లోజ్ అయింది. వీళ్లిద్దరూ ప్రేమ పక్షులు అనే రేంజులో రెచ్చిపోయారు. తీరా రెండో వారానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. యవర్తో ప్రేమ లాంటి వ్యవహారం కూడా బెడిసికొట్టింది. ప్రశాంత్, యవర్తో క్లోజ్గా ఉంటూనే వాళ్లకు వెన్నుపోటు పొడిచింది. ఇది ఆమెకు గేమ్ ప్లాన్లా అనిపించొచ్చు కానీ ప్రేక్షకులకు నచ్చలేదు. ఆమెని ఎలిమినేట్ చేసేశారు. రెమ్యునరేషన్ గట్టిగానే నాలుగో వారం ఎలిమినేట్ అయిన రతిక.. ప్రతివారం రూ.2 లక్షలు చొప్పున అంటే నాలుగు వారాలకు కలిపి రూ.8 లక్షలు సొంతం చేసుకుందని సమాచారం. దీన్నిబట్టి చూసుకుంటే నెల రోజులు హౌసులో ఉండి, ఇంత మొత్తం కూడబెట్టుకుంది. టైటిల్ ఫేవరెట్ అనుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఇంత త్వరగా ఎలిమినేట్ అయినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం బాగానే అందుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
‘చంద్రముఖి- 2’ కోసం లారెన్స్ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే స్ట్రాటజీని పక్కాగా ఫాలో అవుతున్నాడు రాఘవ లారెన్స్. పలువురు దర్శక నిర్మాతలు అతన్ని హీరోగా పెట్టి సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండడంతో తన సొంత సినిమాలను పక్కన పెట్టేశాడు. ముందుగా బయట సినిమాలు తీసి.. అవకాశాలు రానప్పుడు సొంత కథలను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఫలితాలలో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. (చదవండి: ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు.. నయనతార ఆస్తుల విలువెంతో తెలుసా?) తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'చంద్రముఖి'కి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టకలేకపోయింది. అయితే విడుదలకు ముందే మంచి బిజినెస్ చేయడంతో నిర్మాతలకు పెద్దగా నష్టమేమి జరగలేదు. ఇవన్నీ పక్కకు పెడితే.. హీరో లారెన్స్కు మాత్రం చంద్రముఖి 2 చాలా స్పెషల్ అనే చెప్పాలి. గత సినిమాలతో పోలిస్తే చంద్రముఖి 2కి చాలా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ చిత్రం కోసం లారెన్స్కి లైకా నిర్మాణ సంస్థ దాదాపు రూ. 25 కోట్లను పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం లారెన్స్కి ఇదే తొలిశారట. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సినిమా హిట్ కాకపోయినా.. లారెన్స్కి మాత్రం మంచి లాభమే తెచ్చిపెటిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: పేద వృద్ధురాలు పట్ల సితార తీరు.. నెటిజన్స్ ఫిదా!) -
ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు.. నయనతార ఆస్తుల విలువెంతో తెలుసా?
తమిళ సినిమా: ఇప్పుడు నయనతారను చూస్తుంటే ఆరంభంలో అవకాశాల కోసం బస్సులో కొచ్చి నుంచి చెన్నైకి వచ్చిన నటేనా అని ఆశ్చర్యం కలిగించకమానదు. కేరళా రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన నయనతార ఇప్పుడు కోట్లకు పడగెత్తి చెన్నైలో అధునాతనమైన భవనంలో సుఖ జీవితాన్ని అనుభవిస్తున్నారు. అదీ లక్ అంటే. కెరీర్ మొదట్లో సినీ రంగంలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్న నయనతార నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత కూడా వ్యక్తిగత జీవితంలో పలుమార్లు చేదు అనుభవాలను చవి చూశారు. కాలం అన్నింటినీ అధిగమిస్తుందంటారు. అలా తన జీవితం నేర్పిన గుణపాఠాలతో రాటుదేలిన నయనతార అవరోధాలు, అవమానాలకు అందనంత ఉన్నత స్థాయి ఎదిగిపోయారు. ఎంతగా అంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం డిమాండ్ చేసేంత స్థాయికి. ఈ లేడీ సూపర్ స్టార్ ఒక్కో చిత్రానికి రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చిన నయనతార ఈ చిత్రానికి అక్షరాలా రూ.10 కోట్లు పారితోషికం అందుకున్నట్లు సినీ వర్గాల భోగట్టా. కాగా స్టార్ హీరోయిన్ అంతస్తుకు చేరుకున్న తర్వాత కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి దూరంగా ఉన్న నయనతార వివాహానంతరం ఆ ఆదాయానికి కూడా గేట్లు తెరిచేశారు. అందుకే అంటారు డబ్బెవరికి చేదు అని. ప్రస్తుతం నయనతార పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇటీవల ఒక 50 సెకన్ల వాణిజ్య ప్రకటనలో నటించడానికి రూ.5 కోట్లు తీసుకుంటున్నారట. ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆమె ఇప్పటి వరకు కూడబెట్టిన ఆస్తులు ఎంతో తెలుసా? రూ. 300 కోట్లకు పై చిలుకేనని సమాచారం. నయనతార నటన, చిత్ర నిర్మాణం వంటి వాటితో పాటు ఇతర రంగాల్లోనూ వ్యాపారాలు చేస్తున్నారు. -
'బిగ్బాస్ 7' కోసం నాగార్జునకి అన్ని కోట్ల రెమ్యునరేషన్!?
తెలుగు 'బిగ్బాస్' రియాలిటీ షో ఏడో సీజన్ నడుస్తోంది. ఈ మధ్యనే మూడో వారాలు పూర్తి కాగా, వారానికొకరు చొప్పున ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు హౌసులో ఉన్నోళ్లు గొడవలతో ప్రేక్షకుల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. వేరే లెవల్ మొత్తం బిగ్బాస్లో ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్ మారుతున్నారు. కానీ మూడో సీజన్ నుంచి హోస్ట్గా నాగార్జున ఫిక్స్ అయిపోయాడు. గతంలో మంచి జోష్ అండ్ ఎనర్జీతో హోస్టింగ్ చేసిన నాగార్జున ప్రస్తుత సీజన్లో ఇంప్రెస్ చేసే విషయంలో కాస్త తడబడుతున్నాడు. కానీ రెమ్యునరేషన్ మాత్రం కళ్లు చెదిరిపోయే రేంజులో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ) అన్ని కోట్లు రెమ్యునరేషన్? హోస్ట్ నాగార్జున.. 'బిగ్బాస్' మూడో సీజన్ కోసం రూ.5-8 కోట్లు, నాలుగో సీజన్ కోసం రూ.8-10 కోట్లు, ఐదో సీజన్ కోసం రూ.12 కోట్లు, ఆరో సీజన్ కోసం రూ.16 కోట్లు తీసుకున్నారుట. అయితే ఏడో సీజన్కి వచ్చేసరికి నంబర్ కాస్త పెరిగినట్లు టాక్ వినిపిస్తుంది. ఎపిసోడ్కి రూ.15 లక్షల వరకు తీసుకుంటున్నారని.. అలా సీజన్ మొత్తానికి కలిపి రూ.20 కోట్ల వరకు ఆ మొత్తం ఉంటుందని అంటున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న లెక్కలే అని మీరు గుర్తుంచుకోవాలి! షో ఎలా నడుస్తోంది? ప్రస్తుత సీజన్నే తీసుకుంటే తొలి రెండు వారాలు కాస్త డల్గానే సాగింది. మూడో వారానికి వచ్చేసరికి కాస్త ఊపు వచ్చినట్లు అనిపించింది. కానీ మళ్లీ నార్మల్ అయిపోయింది. ప్రస్తుతం హౌసులో 11 మంది ఉన్నారు. తొలి మూడు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయిపోయి బిగ్బాస్ నుంచి బయటకెళ్లిపోయారు. ఈ వారం నామినేషన్స్లో ఏడుగురు ఉండగా రతిక లేదా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) -
బిగ్బాస్: మూడు వారాలకు దామిని ఎంత సంపాదించిందో తెలుసా?
అతిగా ఆవేశపడేవాళ్లు, అనవసరంగా వాదిస్తూ సాగదీసేవాళ్లు, తమ డప్పు తామే కొట్టుకునేవాళ్లు, కేవలం డైలాగులకే పరిమితమయ్యేవాళ్లు, వెనకాల గోతులు తవ్వేవాళ్లు, కిచెన్కే పరిమితమై ఆడటమే మర్చిపోయేవాళ్లు.. ఇలా ప్రతిసీజన్లోనూ ఇలాంటి వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఈ సీజన్లో అలాంటివారున్నారు. అయితే మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా కిచెన్కే పరిమితమైనవాళ్లు మాత్రం హౌస్లో ఎక్కువ వారాలు ఉన్న దాఖలాలు లేవు. వంటలక్క.. అందరికీ వండిపెట్టడం మంచిదే కానీ, వంట మాత్రమే చేస్తే కష్టం. దామిని విషయంలోనూ అదే జరిగింది. ఎప్పుడు చూసినా వంటగదిలోనే పనులు చేసుకుంటూ పోయింది. కిచెన్లో ఏమాత్రం తేడా వచ్చినా, ఎవరు పనిచేయకపోయినా నోరేసుకుని పడిపోయేది. అందుకే ఆమెకు వంటలక్క, వార్డెన్ అన్న పేర్లు కూడా ఇచ్చేశారు నెటిజన్లు. కేవలం కిచెన్కే పరిమితమై ఆటకు దూరమవడమే తన ఎలిమినేషన్కు ప్రధాన కారణం. కొన్నిసార్లు తన మాటలకు, వైఖరికి అసలు పొంతన ఉండేది కాదు. బూతులు నచ్చవంటూనే బూతులు మాట్లాడితే నచ్చదని చిరాకుపడ్డ దామిని తాను మాత్రం ఇంగ్లీష్లో తెగ బూతులు మాట్లాడింది. ఇక్కడ ఆమెపై విమర్శలు వచ్చాయి. పాటలతో మెప్పించిన సింగర్ ఆటలో, మాటలో మెప్పించలేకపోయింది. ఓ టాస్క్లో అయితే ప్రిన్స్ను వీర లెవల్లో టార్చర్ పెట్టింది. పేడ ముఖాన కొట్టడమే కాకుండా, తన నోటిలో కూడా వేసింది. ఇది టాస్కే అయినప్పటికీ గ్యాప్ ఇవ్వకుండా నోటిలో పేడ కొట్టడం అస్సలు కరెక్ట్ కాదన్న కామెంట్లు వినిపించాయి. దామిని పారితోషికం ఎంతంటే? ఏదేమైనా ఇంకొన్ని వారాలు ఉంటాననుకున్న దామిని ఆలోచనను పటాపంచలు చేస్తూ బిగ్బాస్ తనను మూడోవారంలోనే ఎలిమినేట్ చేశాడు. ఇన్నివారాలకుగానూ ఆమెకు ఎంత పారితోషికం ముట్టిందనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ బాహుబలి సింగర్ వారానికి రూ.2 లక్షల మేర పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మూడు వారాలకుగానూ రూ.6 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. చదవండి: నామినేషన్స్లో మాజీ ప్రియుడి గురించి ప్రస్తావన.. రతికకు ఇచ్చిపడేసిన శుభశ్రీ -
షకీలా 2 వరాల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
-
షకీల పారితోషికం ఎంతో తెలుసా? హౌస్లో అందరికంటే ఎక్కువ!
బిగ్బాస్ షో.. ఇక్కడికి కొందరు పేరు కోసం వస్తారు. మరికొందరు డబ్బు కోసం వస్తారు. కానీ కొందరే మంచి పేరుతో బయటకు వెళ్తుంటారు. మిగతావాళ్లంతా అప్పటివరకు ఉన్న పేరును కూడా చెడగొట్టుకుంటారు. తమ ప్రవర్తనతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుని అప్రతిష్టపాలవుతారు. అందుకే బిగ్బాస్ ఆఫర్ వచ్చినప్పటికీ ఎంతోమంది దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అతికొద్ది మంది మాత్రమే ట్రై చేస్తే పోలా అని హౌస్లో అడుగుపెడతారు. అలా ఈ సీజన్లోనూ ఓ కంటెస్టెంట్ హౌస్లో అడుగుపెట్టింది. ఆవిడే షకీలా. కేవలం తనకు పిలుపు వచ్చింది కదా అని ఏడో సీజన్లో ఎంట్రీ ఇచ్చింది షకీలా. ఒక రకంగా ఆమె ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల మంచే జరిగింది. శృంగార తారగా అప్పటివరకు గుర్తింపు ఉన్న ఆమె.. బిగ్బాస్ పుణ్యమా అని షకీలా అమ్మగా మారింది. పద్ధతిగా రెడీ అవుతూ, అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ, కుటుంబ పెద్దగా ఎంతో హుందాగా వ్యవహరించింది. అయితే నామినేషన్స్ అంటే చాలు బెంబేలెత్తిపోయేది షకీలా. చివరకు రెండో వారం నామినేషన్స్లో ఉన్న ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. మరి బిగ్బాస్ నుంచి షకీలా ఎంత డబ్బు తీసుకుందనుకుంటున్నారు? అక్షరాలా మూడు లక్షల 75 వేలు. ఇది రెండు వారాలకు అనుకునేరు, కాదు! ఆమె ఒక్క వారానికే మూడున్నర లక్షల పై చిలుకు పారితోషికం తీసుకుంది. ఈ లెక్కన ఆమె రెండు వారాలకుగానూ దాదాపు రూ.7 లక్షల పైనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: గీతూ సూటి ప్రశ్నలు.. నువ్వేంటి నన్ను అడిగేదని షకీలా ఫైర్.. రతికా గురించి ఏం చెప్పిందంటే? షకీలా ఎలిమినేట్.. కొన్నాళ్లు ఈమెని ఉంచాల్సింది! -
ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!
MasterCard Chairman Rajnish Kumar: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ మాస్టర్కార్డ్ ఇండియన్ యూనిట్కు కుమార్ను చైర్మన్గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సంపాదన ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. దేశీయ అతిపెద్ద బ్యాంకు అధికారిగా ఉన్నప్పడు సంపాదించిన దానికంటే మూడు రెట్టు ఎక్కువ సంపాదిస్తున్నారట. వివిధ లిస్టెడ్ సంస్థలలో డైరెక్టర్గా మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. సీఎన్బీసీ నివేదిక ప్రకారం రజనీష్ కుమార్ FY 2023లో హీరో మోటోకార్ప్ ద్వారా రూ.38 లక్షలు, LTIMindtree ద్వారా రూ. 33.2 లక్షలు, అంబుజా సిమెంట్స్ నుంచి 17.8 లక్షలు, మొత్తంగా రూ. 89 లక్షల వేతనం పొందారు. దీనికి తోడు ఇటీవల ఎల్ అండ్ టీ, బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ బోర్డులకు నియమితులయ్యారు. బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ FY 2023 వార్షిక నివేదిక ప్రకారం, ప్రతి స్వతంత్ర డైరెక్టర్కు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరు కావడానికి సిట్టింగ్ ఫీజులు, కమీషన్తో కలిపి సంవత్సరానికి సుమారు రూ.51 లక్షల దాకా చెల్లిస్తుంది. 2023 మార్చి 30న బోర్డులో నియమితులైన రజనీష్ కుమార్ తప్ప మిగిలిన వారికి మేనేజర్ బోర్డు సమావేశానికి హాజరైనందుకు లక్ష సిట్టింగ్ ఫీజు చెల్లింస్తోంది. ఎల్ అండ్ టీ బోర్టులో మే 10, 2023 నుండి మే 9, 2028 వరకు స్వతంత్ర డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు బోర్డ్ ప్రతి సమావేశానికి కంపెనీ అతనికి సిట్టింగ్ ఫీజుగా రూ.1 లక్ష చెల్లించింది.ఎస్బీఐ 2021 ఆర్థిక సంవత్సరంలో కుమార్ మొత్తం రూ. 30.34 లక్షల పరిహారాన్ని అందుకున్నారు. అలాగే 2020లో అతని జీతం రూ.31.26 లక్షలు. అయితే SBIలో ఉన్నంత కాలం విలాసవంతమైన వసతి, ఉచిత రవాణా ప్రయాణ ప్రోత్సాహకాలు తదితర అదనపు ప్రోత్సాహకాలను పొందారు. 2020 అక్టోబరు వరకు 40 సంవత్సరాలుగా ఎస్బీఐ వివిధ హోదాల్లో సేవలందించిన రజనీష్ కుమార్ స్టార్టప్ భారత్పైకి ఛైర్మన్గా ఉన్నారు. కాగా కంపెనీల చట్టం 2013 ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకే సమయంలో ఇరవై కంటే ఎక్కువ కంపెనీలలో ఏదైనా ప్రత్యామ్నాయ డైరెక్టర్షిప్తో సహా డైరెక్టర్గా పదవిని కలిగి ఉండకూడదు. అయితే 10 పబ్లిక్ కంపెనీలకు మించకుండా డైరెక్టర్గా ఉండవచ్చు. -
బిగ్బాస్ 7: వారం రోజులకే అన్ని లక్షలు సంపాదించిందా?
కిరణ్ రాథోడ్.. ఈమెను ఎందుకు తీసుకొచ్చారో, ఎందుకు పంపించేశారో అర్థం కాని అయోమయంలో ఉన్నారు ప్రేక్షకులు. తనకు తెలుగురాదని తెలిసి కూడా తీసుకురావడం బిగ్బాస్ తప్పయితే.. కిరణ్ స్వయం తప్పిదాలు కూడా ఉన్నాయి. ఫలితంగా వారం రోజుల్లోనే కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మరి వారం రోజులకు ఆమెకు ఎంత డబ్బు ముట్టింది? తన ఎలిమినేషన్కు గల కారణాలేంటో ఓసారి చూసేద్దాం.. రీఎంట్రీ కోసం బిగ్బాస్ షో.. కిరణ్ రాథోడ్ కొందరికి తెలుసు.. మరికొందరికి ఎక్కడో చూసిన అమ్మాయిలా అనిపిస్తుంది. తెలుగులో 'అందరూ దొంగలే దొరికితే..', 'భాగ్యలక్ష్మి బంపర్డ్రా', 'హై స్కూల్', 'కెవ్వు కేక' సినిమాలు చేసింది. 2016లో తమిళంలో ఓ సినిమా చేయగా అది తెలుగులో 'భాజా భజంత్రీలు' పేరిట విడుదలైంది. ఆ తర్వాత సినిమాలకు దూరమవడంతో ప్రేక్షకులూ ఆమెను మర్చిపోయారు. ఇన్నాళ్లకు రీఎంట్రీకి రెడీ అయిన ఆమె బిగ్బాస్ షోను అందుకు వాడుకోవాలని చూసింది. తెలుగు రాకపోవడమే పెద్ద మైనస్ అలా బిగ్బాస్ ఏడో సీజన్లో అడుగుపెట్టింది. కానీ తెలుగు రాకపోవడమే ఆమెకు పెద్ద శాపంగా మారింది. తెలుగు రాదనే వంకతో హౌస్మేట్స్ ఆమెను నామినేట్ చేశారు. తను కూడా హౌస్లో తెలుగులో తప్ప మిగతా భాషల్లోనే మాట్లాడింది. అందరితోనూ పెద్దగా కలవలేకపోయింది. అసలు షోలో ఉందా? లేదా? అన్నట్లుగానే ఉంది. కుస్తీ పోటీలో మాత్రం కాస్త యాక్టివ్గా కనిపించింది. పెద్దగా టాస్కులు జరగలేవు కాబట్టి తన బలాన్ని, టాలెంట్ను ప్రేక్షకులకు చూపించే అవకాశం లేకపోయింది. నిరూపించుకునే ఛాన్స్ ఇస్తేగా? తెలుగు రాని కిరణ్ జనాలకు పెద్దగా కనెక్ట్ అవకపోవడంతో ఓట్లు కూడా పడలేదు. అందరికంటే తక్కువ ఓట్లు పడటంతో కిరణ్ ఎలిమినేట్ అయింది. అయితే ఇక్కడ కిరణ్కు తనను తాను నిరూపించుకునే అవకాశం బిగ్బాస్ కూడా ఇవ్వలేదు. మొదటి వారం ఎలిమినేషన్ ఎత్తేసుంటే కిరణ్ తన ఆట చూపించేదేమోనని, కానీ బిగ్బాస్ ఆ ఛాన్సే ఇవ్వలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వారం రోజులకే అంత ముట్టిందా? మరోవైపు సోషల్ మీడియాలో కిరణ్ టీమ్ తన అసభ్య వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ మరింత కంటెంట్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోమని ప్రచారం చేసింది. ఇది కూడా ఆమెకు నెగెటివ్గా మారింది. ఉన్నది వారం రోజులే అయినప్పటికీ తనకు డబ్బులు మాత్రం భారీగానే ముట్టినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీకి రోజుకు రూ.45 వేల చొప్పున పారితోషికం ఫిక్స్ చేశారట! ఈ లెక్కన ఒక్క వారానికిగానూ కిరణ్ రాథోడ్ రూ.3 లక్షల పైచిలుకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: అనుకున్నదే జరిగినా.. ఆ ట్విస్ట్ ఊహించలే! -
‘ఖుషి’ రెమ్యునరేషన్.. మా అమ్మే ఆశ్చర్యపోయింది: డైరెక్టర్
టక్ జగదీష్ మూవీ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ.. ‘ఖుషి’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. (చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ మూవీ.. కానీ అదే ట్విస్ట్!) ఆ మధ్య చిత్రబృందం నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్తో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. అదే సమయంలో ఈ సినిమాపై రకరకాల పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా రెమ్యునరేషన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ చిత్రానికి గాను హీరోహీరోయిన్లతో పాటు డైరెక్టర్ శివనిర్వాణ కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఈ వార్త సారాంశం. విజయ్ రూ. 23 కోట్లు, సమంత రూ.4.5 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నారట. ఇక డైరెక్టర్ శివనిర్వాణ అయితే ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అమ్మే ఆశ్చర్యపోయింది అయితే తన రెమ్యునరేషన్పై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పారితోషికంపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ‘నాకు రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. అది చూసి నేనే షాకయ్యాను. నా స్నేహితులు అయితే ఫోన్ చేసి మరీ అడిగారు. ‘చూస్తే సైలెంట్గా ఉంటావు..బానే పుచ్చుకున్నావ్గా’అని సెటైర్లు వేశారు. అంతెందుకు మా అమ్మ కూడా నా రెమ్యునరేషన్ గురించి తెలిసి ఆశ్చర్యపోయింది. ఫోన్ చేసి మరీ అడిగింది. అంత రెమ్యునరేషన్ నాకు ఇస్తే సినిమాలు ఎలా తీస్తారండి?. నాతో పాటు హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ కలిపితేనే రూ.50 కోట్లు అయితే.. ఇక సినిమాకు ఎంత ఖర్చు అవ్వాలి? నాలాంటి డైరెక్టర్ అంత బారీ మొత్తంలో ఏ నిర్మాతలు ఇవ్వలేరు’ అని శివ నిర్వాణ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా కోసం తాను రాసిన పాటలకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించాడు. అయితే రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు కానీ, రూ.5 కోట్ల వరకు తీసుకునే చాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. -
మితిమీరిన పారితోషికాలు.. లెక్కలు సరిగ్గా చూపుతున్నారా?
విస్తృత ప్రజాదరణ, ప్రాచుర్యం ఉన్న క్రికెట్, సినిమా ఈ దేశంలో మతాన్ని మించినవని అంటారు. జాతీయ గుర్తింపును తీర్చిదిద్ది, భారతదేశపు ‘సాఫ్ట్పవర్’కు ప్రతీకగా నిలిచే ఈ రెంటి గురించి ఎవరి అభిప్రాయం వారిదే! పబ్లిక్లోకి వచ్చాక... వీటిపై మాట్లాడద్దని ఎవరన్నా అంటే అది అజ్ఞానం, అర్థరహితం. సినీ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి, మితిమీరిన పారితోషికాలు, అదుపు తప్పిన చిత్ర నిర్మాణవ్యయం, అందుకుంటున్న పారితోషికాలకు తారలు లెక్కలు సరిగ్గా చూపుతున్నారా, ప్రభుత్వానికి పన్ను కడుతున్నారా, ఆడని సినిమాలకు సైతం శత – ద్విశతదినోత్సవ ‘వీర’ రికార్డులు లాంటి అనేక అంశాలపై ఇటీవల జరుగుతున్న చర్చను ఈ దృష్టితో చూడాలి. పార్లమెంట్లో వచ్చిన పారితోషికాల ప్రస్తావనను ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అంటూ అగ్రతార చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర ద్విశత దినోత్సవ వేదికపై నుంచి చేసిన వ్యాఖ్యలు రచ్చను పెంచాయి. (చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్ల కంటే మైనస్లే ఎక్కువ!) ‘భోళా శంకర్’ చిత్రం రిలీజ్కు కొద్దిరోజుల వ్యవధి ఉండగా, ప్రత్యేక ఆహ్వానితులతో ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల విజయోత్సవ వేడుక జరిగింది. ఆ వేదికపై ఆయన ఆచితూచి తన తమ్ముడు పవన్ కల్యాణ్ పేరెత్తకుండానే తారల వివాదాస్పద పారితోషికాల అంశాన్ని ప్రస్తావించారు. సినిమా వాళ్ళకు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తున్నారనే అంశం పార్లమెంట్లో చర్చించాల్సిన విషయం కాదనీ, వరుసగా సినిమాలు చేస్తున్నది పరిశ్రమలోని వారికి ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే అనీ అన్నారు. పాత రాజకీయ వాసనలు పోని చిరంజీవి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ – ఉపాధి అవకాశాలపై రాజకీయ నేతలు దృష్టి సారించాలనీ సలహా ఇచ్చారు. పారితోషికాల విషయాన్ని పెద్దది చేసి దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయద్దనీ అభ్యర్థించారు. గమనిస్తే – ‘ఆచార్య’ చిత్ర సమయంలో జరిగిన పరిణామాలు, ఆ చిత్రానికి ఆరంభ వసూళ్ళు సైతం ఆశించినంతగా రాని పరిస్థితితో అక్కడ నుంచి చిరు కొత్త ధోరణిలోకి దిగారు. కారణాలు ఏమైనా ఆ తరువాత నుంచి తన ప్రతి కొత్త సినిమా రిలీజు ముందు అనివార్యంగా అన్నయ్య నోట తమ్ముడి మాట వినిపిస్తోంది. ఇది కేవలం యాదృచ్ఛికమే అనుకోగ లమా? ఇదీ విశ్లేషకుల ప్రశ్న. దానికి జవాబు లోతైన వేరే చర్చ. (చదవండి: సీఎం పాదాలకు మొక్కిన తలైవా.. మండిపడుతున్న నెటిజన్స్!) అది అటుంచితే... పరిశ్రమ బాగు కోసమే సినిమాలు చేస్తున్నామని పైకి ఎవరు ఎంతగా చెబుతున్నా, అసలు చిత్ర నిర్మాణ వ్యయంలో అత్యధిక భాగం అగ్రతారలు, అగ్ర టెక్నీషియన్ల జేబులోకే చేరుతుందనేది నిష్ఠుర సత్యం. తారల ఈ భారీ పారితోషికాల వ్యవహారంపై చర్చ ఇవాళ కొత్తది కాదు. ఆ మాటకొస్తే తీసుకొనే రెమ్యూనరేషన్లో మనమే జాతీయ స్థాయిలో ఘనులమంటూ, ‘బిగ్గర్ దేన్ (అమితాబ్) బచ్చన్’ అని జాతీయ ఆంగ్లపత్రికల్లో సైతం మన హీరోలే రాయించుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే, అంతకంతకూ సినిమాల సక్సెస్ శాతం తగ్గి, భారీ నష్టాలు పెరుగుతున్నందున... పారితోషికాల లాంటి అనుత్పాదక వ్యయం తగ్గాలనీ, సినిమా మేకింగ్ కోసం పెట్టే ఉత్పాదక వ్యయం పెరగాలనీ సాక్షాత్తూ పరిశ్రమలో పెద్దలే ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. ఇవాళ తెలుగులో పెద్ద సినిమాల బడ్టెట్లో సగటున మూడింట రెండొంతులు, మరోమాటలో 65 నుంచి 70 శాతం దాకా రెమ్యూనరేషన్లకే పోతోంది. అదేమంటే మార్కెట్లో ఉన్న డిమాండ్, సినిమాకు జరిగే వ్యాపారాన్ని బట్టే అంతంత పారితోషికాలు ఇస్తున్నారని వాదిస్తున్నారు. సమర్థించుకోవాలని చూస్తున్నారు. కానీ, ఈ ధోరణి పరిశ్రమ దీర్ఘకాలిక ప్రయోజనాలకూ, పైకి చెబుతున్న సోకాల్డ్ కార్మిక ఉపాధికీ పనికొచ్చేదైతే కానేకాదు. (చదవండి: రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్తోపాటు..) అసలు ఇంతంత పారితోషికాలకూ ఓ కథ ఉంది. పైరసీ సినిమా చూడడం రక్తపుకూడు లాంటిదని మన స్టార్లు డైలా గులు చెబుతారు. కానీ, కొత్త సినిమా రిలీజంటే అధికారికంగా, అనధికారికంగా టికెట్ రేట్లు పెంచుకొని, పబ్లిక్ బ్లాక్మార్కెటింగ్ చేసే ధోరణిని ఆరంభించినదే మన మెగా తారలు. పైగా ఆ అధిక రేట్లతో సహజంగానే వచ్చే వసూళ్ళ లెక్క వేరు, ప్రభుత్వానికి చూపి పన్నుకట్టే లెక్క వేరు! ప్రభుత్వ ఖజానాకు వేస్తున్న ఈ కన్నానికి తోడు... బలుపు కాక వాపు అయిన ఆ ఓపెనింగ్ కలెక్షన్లే గీటురాయిగా టాప్స్టార్స్ పారితోషికాలను పెంచేస్తూ... నిర్మాతల జేబుకు పెడుతున్న చిల్లు అదనం. వెరసి... పైరసీ పెరగడానికీ, థియేటర్లలో సినిమా ఆడే రోజులు తగ్గి అన్ని సెక్టార్లలో పరిశ్రమ ఇక్కట్లలో పడడానికీ పరోక్షంగా కారణమయ్యారు. అధిక టికెట్ రేట్లకూ, పారితోషికాలకూ జరుగుతున్న ఆ పన్నుల ఎగవేత మాట అటుంచుదాం. ఇటీవల 100 – 200 రోజులు బలవంతాన లాగించి ఆడిస్తున్న అగ్రతారల సినిమాలకు ప్రభుత్వానికి జీఎస్టీ కూడా దక్కట్లేదు. ఆశ్చర్యపరిచే ఈ లోగుట్టు ఇన్ని పెద్ద కబుర్లు చెబుతున్నవారికి తెలుసా? చాలామందికి తెలియనిదేమిటంటే... వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షల లోపుంటే, జీఎస్టీ కట్టనక్కర్లేదని చట్టం. ఈ లొసుగును అడ్డం పెట్టుకొంటూ... సినిమాలు రిలీజయ్యే చిన్న సెంటర్లలోని పలు నాన్–ఏసీ థియేటర్లు తమ వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షల లోపేనని బొంకుతున్నాయి. అలా అవి తాము ప్రదర్శించే సిన్మాలకు ప్రభుత్వానికి దఖలు పరచాల్సిన ‘డైలీ కలెక్షన్ రిపోర్ట్’ (డీసీఆర్) రాయనక్కర్లేదు, జీఎస్టీ కట్టనూ అక్కర్లేదు. జీఎస్టీ లేని ఆ థియేటర్లను వాటంగా చేసుకొని, ఆడని సినిమాకు సైతం శత, ద్విశత దినోత్సవాలు చేసే సంస్కృతికి పలువురు హీరోలు, వారి భజన బృందాల వారు తెర తీశారు. ఇటీవల జరుగుతున్న పెద్ద హీరోల సినిమాల విజయోత్సవాల తెర వెనుక భాగోతం ఇదే! అలాంటి వేదికపై నిల్చొని చిరు సుద్దులు చెప్పడం పెను చోద్యం! పిచ్చుక లాంటి పరిశ్రమపై బ్రహ్మాస్త్రం వేస్తున్నారనడం విడ్డూరం. జీఎస్టీ చట్టాన్ని సందు చేసుకొని... స్టార్ హీరోల సినిమాకు దొంగ రికార్డుల వీరతాళ్ళు వేసేందుకు ఈ నాన్–జీఎస్టీ సినీ థియేటర్లు భలే అక్కరకొస్తున్నాయి. ఇన్ని రోజులకు ఇంత అని ఫ్యాన్స్ దగ్గర ఎంతో కొంత మొత్తం గుత్తగా మాట్లాడుకొంటూ, ఆ హాళ్ళు అయినకాడికి సొమ్ము చేసుకుంటున్నాయి. వెరసి, మూసేసిన చాలా థియేటర్లకు బయట మాత్రం వాల్పోస్టర్లు ప్రదర్శిస్తూ, ఆడని సినిమాను సైతం శతదినోత్సవ విజయంగా ప్రకటిస్తున్నారు. కొద్దికాలంగా ఇద్దరు, ముగ్గురు అగ్ర హీరోల సినిమాలకు ఎక్కువగా జరుగుతున్నది ఇదే! గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఒక సూపర్తార అభిమానులు ఆయన ఫ్లాప్ సినిమాలన్నిటికీ ఇలానే శతదినోత్సవాలు చేస్తుంటారు. ఇక, ఒక దివంగత నటుడి సినిమా చిత్తూరు జిల్లా అరగొండలో ఆడింది ఒక్కరోజు ఒకే ఒక్క ఆట అయినా, 100 రోజులు గడిచాక ఈ ఏడాది శతదినోత్సవం చేయడం ఈ పెడ ధోరణికి తాజా పరాకాష్ఠ. అంతెందుకు... ఈ ఏడాదే సంక్రాంతికి రిలీజైన అగ్రతారల చిత్రాలూ తాజాగా ఇదే పద్ధతిలో 200 రోజులంటూ హంగామాగా షీల్డులు అందుకున్నవే! ఒకరు కర్నూలు జిల్లా ఆలూరులో చేస్తే, మరొకరు కృష్ణాజిల్లా అవనిగడ్డలో చేశారు. సెంటర్లు తేడానే తప్ప, మిగతాదంతా సేమ్ టు సేమ్! నిజానికి, కింది సెంటర్ల నాన్–జీఎస్టీ థియేటర్లు సైతం ప్రతి పెద్ద సినిమానూ దాదాపు రూ. 3 – 4 లక్షల డబ్బు పెడుతూ ప్రదర్శిస్తున్నాయి. ఏటా కనీసం అలాంటి ఆరేడు సినిమాలు ఆడుతూ, 20 లక్షల నాన్–జీఎస్టీ టర్నోవర్ పరిధి దాటి మరీ వార్షిక లాభాలూ గడిస్తున్నాయి. పైకి మాత్రం జీఎస్టీ పరిధిలో లేమంటూ పన్ను ఎగవేస్తున్నాయనేది చిదంబర రహస్యం. చిరు దుకాణాలకు ఊరటగా ప్రభుత్వమిచ్చిన ఈ 20 లక్షల నాన్– జీఎస్టీ రూల్ను సినిమా హాళ్ళు మోసానికి వాడుకోవడం దుర దృష్టకరం. నిజానికి, ట్యాక్స్ లేని హాళ్ళలో డీసీఆర్ ఉండదు గనక, అక్కడ సినిమా ఆడినా సరే బాక్సాఫీస్ పరిధిలో ఆడనట్టే లెక్క. ఇవాళ ప్రముఖులు ఇళ్ళల్లోనే క్యూబ్ కనెక్షన్లు పెట్టుకొని కొత్త సినిమాలు చూసుకుంటున్న ప్రదర్శనలతో అదీ ఒక రకంగా సమానం. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి, ఒకపక్క అభిమాన హీరోకు లేని రికార్డ్ తేవాలనే వెర్రి ప్రేమతో సామాన్య ఫ్యాన్స్ జేబులో సొమ్ము పోగొట్టుకుంటుంటే... మరోపక్క ప్రభుత్వానికి సినిమాహాళ్ళ పన్ను ఎగవేత సాక్షిగా హీరోలు విజయోత్సవ వేలంవెర్రిలో సాగడం విచారకరం. తెలిసో తెలియకో ఈ తప్పులో భాగమవుతున్న మన పెద్ద హీరోలు ముందు కళ్ళు తెరవాలి. ఈ అవాంఛనీయ వైఖరిని ఇకనైనా సరిచేసుకోవాలి. చాలామంది గ్రహించని మరొక్క సంగతి – ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500కు పైగా థియేటర్లుంటే, ఇవాళ వాటిలో ఏడాదంతా సినిమాలు ప్రదర్శిస్తున్న హాళ్ళు రెండొంతులే! సుమారు 500కు పైగా హాళ్ళు ఏటా కొన్ని నెలలు మూసివేసే ఉంటున్నాయి. ఇటు సక్సెస్ఫుల్ సినిమాలూ, అటు కరోనా అనంతర కాలంలో హాళ్ళకు ప్రేక్షకులు రావడమూ తగ్గిపోయాక అదీ వర్తమాన సినీ పరిశ్రమ దుఃస్థితి. అందుకే, అడ్డగోలు పారితోషికాలు, అవసరం లేని రికార్డులతో బంగారు బాతును ఒకేసారి కోసుకుతినాలని చూస్తే అది యావత్ సినీ పరిశ్రమకే మెగా కష్టం. ఇది పిచ్చుకలు తమ గూటిపై తామే వేస్తున్న బ్రహ్మాస్త్రం. ప్రభుత్వానికి పన్ను ఎగవేతతో లేని హైప్ సృష్టిస్తూ, ఏకంగా పరిశ్రమ నెత్తిన పెడుతున్న భస్మాసుర హస్తం! – రెంటాల జయదేవ -
మూడేళ్ల గ్యాప్, అయినా తగ్గేదేలే.. రెమ్యునరేషన్ డబుల్..
టాలీవుడ్లో టాప్ హీరోయిన్ అనుష్క ఈ మధ్య సినిమాల స్పీడు తగ్గించేసింది. 2019లో చిరంజీవి సైరా సినిమాతో వెండితెరపై మెరిసింది స్వీటి. 2020లో నిశ్శబ్ధం అనే సినిమా చేసినా ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంటే అనుష్క సిల్వర్ స్క్రీన్పై కనిపించి మూడేళ్లవుతోంది. చాలాకాలం తర్వాత ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. రెమ్యునరేషన్ డబుల్ గతంలో అనుష్క సినిమాకు మూడు కోట్ల మేర పారితోషికం తీసుకుంది. అయితే అది అప్పటి ముచ్చట అని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె తన రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు తెలుస్తోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి చిత్రానికిగాను ఆమె ఆరు కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎంత సంపాదించమన్నది కాదు ముఖ్యం.. సినీ పరిశ్రమలో ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నామన్నదే ప్రధానం అనే మాటను నమ్ముతుంది స్వీటీ. డబ్బు కన్నా మనుషులే ముఖ్యం గతంలో ఈ పారితోషికం గురించి అనుష్క మాట్లాడుతూ.. 'ఒక నటి 100 చిత్రాల్లో నటించడం, కోట్లు సంపాదించడం, చాలా ఏళ్లు కథానాయకిగా పరిశ్రమలో నిలదొక్కుకోవడం లాంటివి పెద్ద విషయాలు కావు.. కానీ ఎంతమంది ఫ్రెండ్స్కు సంపాదించుకున్నదే ముఖ్యం. డబ్బు ఆర్జించడం కంటే మంచి మనుషుల్ని సంపాదించడం గొప్ప విషయం. నాకు పారితోషికం ప్రధానం కాదు. మంచి కథా పాత్రలో నటించాలన్నదే నా కోరిక' అని పేర్కొంది. చదవండి: గ్లామర్ క్వీన్ మాలశ్రీ కూతుర్ని చూశారా? అందంలో అమ్మను మించిపోయేలా ఉందిగా! -
నాగార్జున పారితోషికం రూ.200 కోట్లా? ఏంటి.. బిగ్బాస్ కోసమే!
మరో పదిహేను రోజుల్లో బిగ్బాస్ సందడి షురూ కానుంది. సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారమైతే సెప్టెంబర్ 3కి బిగ్బాస్ 7 ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కంటెస్టెంట్ల లెక్క ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికి కూడా సంప్రదింపులు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్ లిస్ట్ తయారయ్యేందుకు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. కంటెస్టెంట్లు ఎవరన్నది పక్కనపెడితే హోస్ట్ మాత్రం కింగ్ నాగార్జుననే ఉండబోతున్నాడు. వరుసగా నాలుగు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆయన ఐదో సీజన్కు కూడా తనే హోస్టింగ్ చేయనున్నాడు. ఇకపోతే ఆయన నాలుగో సీజన్ నుంచి బిగ్బాస్ షోలో కొనసాగుతున్నాడు. నాలుగో సీజన్కు ఆయన రూ.8-10 కోట్లు అందుకున్నాడని, ఐదో సీజన్కు రూ.12 కోట్ల పైచిలుకు, ఆరో సీజన్కు రూ.16 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఏడో సీజన్కు కనివనీ ఎరుగని రీతిలో రూ.200 కోట్లు తీసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే అది పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది. అసలే ఆరో సీజన్ పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోగా అట్టర్ ఫ్లాప్ అన్న ట్యాగ్ మూటగట్టుకుంది. ఈ సమయంలో నాగ్ ఇంత భారీ మొత్తం డిమాండ్ చేసే ఛాన్సే లేదు. ఈ సీజన్కు అతడు రూ.20 కోట్ల మేర మాత్రమే తీసుకునే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. అనవసరంగా నాగ్ గురించి లేని పోని రూమర్ సృష్టిస్తున్నారని హర్ట్ అవుతున్నారు కింగ్ ఫ్యాన్స్. చదవండి: జైలర్ సినిమాలో మెగాస్టార్ ఉండాల్సిందట.. రజనీకాంతే వద్దని ఫోన్ చేసి -
‘దేవర’ స్టార్ యాక్టర్ నెట్వర్త్, లగ్జరీ కార్లు: తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ప్యాన్ ఇండియాస్టార్ జూ.ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ దేవర మూవీలో విలన్ అలరించబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్. బర్త్డే సందర్భంగా సైఫ్ ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న సైఫ్ భారీ బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీసు వద్ద భారీ హిట్ల లిస్ట్ పెద్దదే. మంచి నటుడిగా, ఫిట్నెస్ ఫ్రీక్గా అంతకుమించి బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ భర్తగా మంచి మార్కులే కొట్టేశాడు.ఆ క్రమంలో సైల్ అలీ ఖాన్ ఆస్తిఎంత? సినిమాకు ఎంత తీసుకుంటాడు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) పర్సనల్ లైఫ్, రాయల్ ఫ్యామిలీ 1970, ఆగస్టు 16న నటుడు, ప్రముఖ క్రికెటర్ , భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ ల కుమారుడే సైఫ్ అలీ ఖాన్. సైఫ్ పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు. ఇతని ముత్తాత ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడిలు నవాబులుగా చలామణి అయ్యారు. సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అనే ఇద్దరు చెల్లెళ్లున్నారు. 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్తో వివాహ జరిగింది. వీరికి సారా అలీ ఖాన్ ,ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరు సంతానం.. అయితే 13 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత 2004 లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012, అక్టోబర్ 16న బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు తైమూర్ అలీ ఖాన్ , జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. దశాబ్దాల సినీ కరియర్ 1993లో సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన దగ్గరనుంచీ ఐకానిక్ క్యారెక్టర్స్తో వెనుదిరిగి చూసింది లేదు. ఓంకార, లవ్ ఆజ్ కల్, కల్ హో నా హో, హమ్ తుమ్, దిల్ చాహ్తా హై, తన్హాజీ: ది అన్సంగ్ వారియర్, లాల్ కప్తాన్, మెయిన్ ఖిలాడి తూ అనారీ, పరిణీత, సలామ్ నమస్తే, రేస్ ఆదిపురుష్ , బంటీ ఔర్ బబ్లీ-2తదితర చిత్రాలలో సైఫ్ గుర్తుండిపోయే పాత్రలు చాలా ఉన్నాయి. సైఫ్ అలీఖాన్ కోట్ల విలువైన ఆస్తులు మీడియా నివేదిక ప్రకారం, సైఫ్ అలీ ఖాన్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెట్టుబడి పెట్టాడు. ముంబైలోని ప్రసిద్ధ ఫార్చ్యూన్ హైట్స్ భవనంలో విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. దీని విలువ దాదాపు రూ. 4.2 కోట్లు. దీంతోపాటు సైఫ్ తమ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది దీన్ని అద్దెకిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ముంబైలో 6 కోట్లు విలువ చేసే మరో లగ్జరీ బంగ్లా కూడా ఉంది. జిస్టాడ్లో సైఫ్ అలీ ఖాన్ చాలెట్ విలువ రూ. 33 కోట్లు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కి ఫారిన్ లొకేషన్స్ అంటే చాలా ఇష్టం. ఫ్యామిలీతో కలిసి విదేశాలలో కొత్త ప్రదేశాల్లో చక్కర్లు కొట్టి వస్తుంటాడు. స్విట్జర్లాండ్లో జిస్టాడ్లో చాలెట్( ఫాంహౌస్ లాంటిది) ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని రూ. రూ. 33 కోట్లు. భార్య కరీనా, పిల్లలు తైమూర్ , జహంగీర్ అలీ ఖాన్లతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు. సైఫ్ అలీ ఖాన్ పూర్వీకుల ఇల్లు, పటౌడీ ప్యాలెస్ ముంబైలో సైఫ్ అలీ ఖాన్ కలిగి ఉన్న అన్ని అత్యంత ఖరీదైన ఆస్తులతో పాటు, హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ చాలా ప్రత్యేకమైన ఆస్తిగా చెప్పుకోవచ్చు. సైఫ్ వారసత్వ సంపద విలువ రూ. 5000 కోట్లు. చివరి పాలక నవాబ్ ఇఫ్తికార్ ఖాన్, దివంగత మన్సూర్ అలీ ఖాన్ వారసత్వ ఆస్తిలో ముఖ్యమైంది. పటౌడీ ప్యాలెస్ 'ఇబ్రహీం కోఠి' పేరుతో కూడా పిలుస్తారు.150 గదులు, ఏడు బెడ్రూమ్లు, పలు డ్రాయింగ్ రూమ్లు, ఏడు బిలియర్డ్ రూమ్లులాంటి ఫీచర్లతో హర్యానాలో 10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. బహుళ నివేదికల ప్రకారం, సైఫ్ అలీ ఖాన్కు చెందిన పటౌడీ ప్యాలెస్ విలువ రూ. 800 కోట్లు. అలాగే భోపాల్లోని పటౌడీ ప్యాలెస్ రూ. 4,200 కోట్లు. లగ్జరీ కార్లు రాయల్ ఇమేజ్, డాషింగ్ యాక్టర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూపర్ కార్లు అతని గ్యారేజీలోఉన్నాయి. లగ్జరీ కార్ కలెక్షన్లో ఫోర్డ్ మస్టాంగ్ జిటి (రూ. 74 లక్షల నుండి రూ. 76 లక్షలు), రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2.39 కోట్ల నుండి 4.17 కోట్లు), ల్యాండ్ రోవర్ డిఫెండర్ (రూ. 93 లక్షలు) , లెక్సస్ 470 (రూ. 35 లక్షల నుండి రూ. 38 లక్షలు), BMW 7 సిరీస్ (రూ. 1.70 కోట్లు), బెంజ్ ఎస్- క్లాస్ (రూ. 1.71 కోట్ల నుండి 1.80 కోట్లు), ఆడి R8 (రూ. 2.72 కోట్లు) . డైమండ్ రోలెక్స్ వాచ్ ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. బ్రూనై సుల్తాన్ కుమార్తె నుండి తనకు లభించిన బహుమతి అని సైఫ్ ఒక సందర్భంలో వెల్లడించాడు. అంతేకాదు కోటి రూపాయల విలువైన లగ్జరీ వాచ్ను ఒకానొక సందర్బంగా విక్రయించాలని చూశాననీ, ఆ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తన భార్య కరీనా కపూర్కి ఇచ్చినట్టు తెలిపాడు. రెమ్యూనరేషన్, నెట్వర్త్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్లో ‘రావణ్’ పాత్రకోసం 12 కోట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని రెమ్యూనరేషన్ రూ. ఒక్కో సినిమాకు 10-15 కోట్లుగా అంచనా. దీంతోపాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ఓటీటా ప్రాజెక్ట్లలో కూడా చాలా యాక్టివ్. అలా వార్షిక ఆదాయంరూ. 28 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు పైమాటే. సో సుదీర్ఘకాలంగా బాలీవుడ్లో కొనసాగుతున్న సైఫ్ అలీ ఖాన్ నికర విలువ సుమారు రూ. 1,180 కోట్లుగా ఉంటుందని అంచనా. -
తమన్నా ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు, ఎక్కడా తగ్గట్లేదుగా!
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మారుమోగుతున్న పేరు తమన్నా భాటియా. రజనీకాంత్ కథానాయకుడిగా నటింన జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా అనే ఒక్క పాటతో రిలీజ్కు ముందే ఆ చిత్రానికి వీరలెవల్లో పబ్లిసిటీ తెచ్చి పెట్టింది. 2005లో వెండితెరపై రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ గత 17 ఏళ్లుగా పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. తమిళంలో ఈమె నటించిన తొలి సినిమా కేడి. ఈ మూవీ నిరాశపర్చినప్పటికీ ఆ తర్వాత నటించిన కల్లూరి చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఏడాదికి రూ.12 కోట్ల పైచిలుకు సంపాదన ఆ తర్వాత వరుసగా కోలీవుడ్ ధనుష్, విజయ్, అజిత్.. తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ నటించి అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా జైలర్ చిత్రంలో ఒక పాట, రెండు మూడు సన్నివేశాల్లో మాత్రమే నటించినప్పటికీ సినిమా సక్సెస్లో క్రెడిట్ కొట్టేసింది. ఐటమ్ సాంగ్స్లోను నటించడానికి వెనుకాడని తమన్నా కళ్లు చెదిరే ఆస్తులను కూడబెట్టిందంటూ తాజాగా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఈ మిల్కీబ్యూటీ ఏడాదికి రూ.12 కోట్ల పైచిలుకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఈమె ఒక్క సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా ఐటెం సాంగ్ కోసం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా డిమాండ్ చేస్తున్నట్లు టాక్. సినిమాలతో పాటు ఇతర వాణిజ్య సంస్థలకు అంబాసిడర్గా ఉంటూ మరిన్ని కోట్లు పోగేస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 10 నిమిషాల పాటు తళుక్కుమని మెరిసినందుకుగానూ రూ.50 లక్షల దాకా డబ్బు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తమన్నా ముంబైలో నివసిస్తున్న అపార్డుమెంట్ ఖరీదు రూ.16 కోట్లు అని సమాచారం. అదేవిధంగా లేడ్రోవర్ డిస్కవరీ స్పోర్ట్, బీఎండబ్యూ సహా నాలుగు ఖరీదైన కార్లను తమన్నా వాడుతోంది. అంతేకాకుండా ఈమె సొంతంగా ఒక బంగారు నగల షాపును నిర్వహిస్తోంది. మొత్తం మీద తమన్నా ప్రస్తుతం రూ.120 కోట్లకు అధిపతి అని ప్రచారం జరుగుతోంది.. చదవండి: చెప్పులేసుకుని జెండా ఎగరేసిన హీరోయిన్.. బుద్ధుండక్కర్లా? అంటూ ట్రోలింగ్.. -
రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయలతో రూపొందించిట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్పై కూడా అంతేస్థాయిలో చర్చ నడుస్తోంది. రజినీకాంత్తో పాటు మోహన్ లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా పారితోషికంపై ఎంతన్న విషయమైన పెద్దఎత్తున కోలీవుడ్లో చర్చ మొదలైంది. భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) ఓ ప్రముఖ సంస్థ నివేదికల ప్రకారం.. రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మోహన్లాల్, శివరాజ్కుమార్ కూడా పెద్దమొత్తంలోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్లాల్కు రూ.8 కోట్లు, శివరాజ్కుమార్కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ. కోటి రూపాయలు చెల్లించినట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఇప్పటికే బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!) -
రజినీ కంటే ఆ హీరోయిన్కి డబుల్ రెమ్యునరేషన్.. ఎవరో తెలుసా?
సూపర్స్టార్ రజినీకాంత్ మంచి జోష్ మీదున్నారు. ఆగస్టు 10న 'జైలర్' రాబోతుంది. ట్రైలర్ అవి చూస్తుంటే హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. అయితే ఈ హిట్ రజినీకి చాలా అవసరం. ఎందుకంటే గత కొన్నేళ్లలో సినిమాలైతే చేస్తున్నారు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో 'జైలర్'పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇదంతా పక్కనబెడితే ఓ సినిమా కోసం సూపర్స్టార్ కంటే హీరోయిన్కే పారితోషికం ఎక్కువిచ్చారు. ఇంతకీ ఆమె ఎవరు? అది ఏ మూవీనే తెలుసా? ఏ సినిమా? మీరు ఏ మూవీ తీసుకున్నా దాదాపుగా హీరోయిన్ కంటే హీరోకే పారితోషికం ఎక్కువ ఇస్తుంటారు. ఇక సూపర్స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్లకైతే ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. అయితే కెరీర్ ప్రారంభంలో అంటే 1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో 'మూండ్రు ముడిచ్చు' అనే సినిమా చేశారు. అంతకు మూడేళ్ల ముందు తెలుగులో వచ్చిన 'ఓ సీత' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో నటించినందుకుగానూ రజినీకి రూ.2000 మాత్రమే ఇచ్చారు. (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) హీరోయిన్కే ఎక్కువ ఇదే సినిమాలో హీరోయిన్గా చేసిన శ్రీదేవికి మాత్రం రూ.5000 రెమ్యునరేషన్ ఇచ్చారు. ప్రధాన పాత్రలో నటించిన కమల్ హాసన్కి మాత్రం రూ.30 వేలు ఇచ్చారు. అప్పటికే కమల్ ఫేమస్ కావడం వల్ల ఇంత మొత్తం ఇచ్చారని శ్రీదేవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏదేమైనా అప్పట్లో రజినీకాంత్ కంటే శ్రీదేవి డబుల్ రెమ్యునరేషన్ తీసుకోవడం ఆశ్చర్యపరిచే విషయం కదా! వీళ్లిద్దరూ కలిసి దాదాపు 18 సినిమాల్లో నటించడం విశేషం. 'జైలర్' సంగతేంటి? నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన 'జైలర్' సినిమాలో.. రజినీకాంత్, రిటైర్డ్ పోలీస్ అధికారిగా నటించారు. కుటుంబంతో కలిసి వాళ్లు చెప్పినట్లు పనులు చేస్తూ ఉండే ఈయన లైఫ్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. దీంతో సౌమ్యంగా ఉండే రజినీ కాస్త యాక్షన్లోకి దిగుతాడు. మరి చివరకు ఏమైంది? అసలు రజినీ రెచ్చిపోవడానికి కారణమేంటి? అనేదే 'జైలర్' స్టోరీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు సమంతకు ఉన్న తేడా అదే!) -
నీ రెమ్యూనరేషన్ ఎంత పవన్? : మంత్రి అంబటి
సాక్షి, రాజమహేంద్రవరం: విప్లవ నాయకుడు చేగువేరా వారసుడినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో చెప్పలేడా? అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పవన్ నటించిన బ్రో సినిమా ఫ్లాప్ అయ్యిందన్నారు. సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో చెప్పలేనివాడు రాజకీయాల్లో పారదర్శకత ఎలా చూపిస్తాడని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు ఆధ్వర్యాన టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేయడం అమానుషమన్నారు. పోలీసులకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు యాత్ర కొనసాగించి ఉంటే ఎలాంటి ఘటనలు చోటుచేసుకుని ఉండేవి కావన్నారు. కావాలనే చంద్రబాబు ముందు ఇచ్చిన షెడ్యూల్కు విరుద్ధంగా వెళ్లి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని చెప్పారు. పైగా తాను సింహాన్ని అని చంద్రబాబు ప్రకటించుకుంటున్నారని, నక్క.. సింహం ఎలా అవుతుందని అంబటి ప్రశ్నించారు. -
రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? బడ్జెట్లో సగం సూపర్స్టార్కే!
తలైవా రజనీకాంత్ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఏడు పదుల వయసులోనూ అభిమానులను అలరించేందుకు సినిమాలు చేస్తున్నాడీ సూపర్ స్టార్. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన చిత్రం జైలర్. బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్, నటి రమ్యకృష్ణ, హీరోయిన్ తమన్నా ముఖ్యపాత్రలు పోషించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించాడు. ఆగస్టు 10న రిలీజవుతున్న ఈ సినిమా రూ.225 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది. సినిమా పాటలు, ట్రైలర్ కూడా బాగానే క్లిక్కయింది. బడ్జెట్లో సగం సూపర్స్టార్కే తాజాగా ఈ సినిమాలో నటీనటుల పారితోషికం ఎంతనే విషయం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. జైలర్ సినిమాకు గానూ రజనీకాంత్ ఏకంగా రూ.100- 110 కోట్లు తీసుకున్నాడట! అంటే సినిమా బడ్జెట్లో దాదాపు సగం ఆయన పారితోషికానికే ఖర్చయినట్లు తెలుస్తోంది. సినిమాలో దాదాపు 15 నిమిషాల నిడివి మాత్రమే ఉన్న మోహన్లాల్ అందుకోసం రూ.8 కోట్లు తీసుకున్నాడట! ఇతర నటులు జాకీ ష్రాఫ్ రూ.4 కోట్లు, శివరాజ్ కుమార్ రూ.4 కోట్లు తీసుకున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. అలాగే హీరోయిన్ తమన్నా రూ.3 కోట్లు, రమ్యకృష్ణ రూ.80 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. నెక్స్ట్ మూవీ ఆయన డైరెక్షన్లోనే ఇకపోతే రజనీకాంత్ తన తర్వాతి చిత్రం 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్తో ఉండనున్నట్లు ఎప్పటినుంచో ఓ పుకారు షికారు చేస్తోంది. ఇందులో రజినీతోపాటు అమితాబ్ బచ్చన్(హిందీ), ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్(మలయాళం), నాని (తెలుగు) కూడా కీలకపాత్రల్లో నటించబోతున్నట్లు రూమర్స్ గుప్పుమంటున్నాయి. అధికారిక ప్రకటన వస్తేకానీ ఇది నిజమా? కాదా? అనేది స్పష్టత రానుంది. చదవండి: లలిత్ మోదీతో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన సుష్మిత సేన్ -
భోళా శంకర్ కోసం ఒక్క రూపాయి తీసుకోని చిరంజీవి!
ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదే హిట్ను కొనసాగించాలన్న జోష్లో ఉన్నాడు చిరు. అందుకే ఈసారి కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళం చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం అతడు వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెగాస్టార్తో తమన్నా జోడీ కట్టగా ఆయన చెల్లెలిగా కీర్తి సురేశ్ నటించింది. సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, ‘వెన్నెల’ కిషోర్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెహర్ రమేశ్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించాడు. తాజాగా రిలీజైన ట్రైలర్కు వస్తున్న స్పందన కూడా అదిరిపోయింది. రోజురోజుకూ చిరంజీవిలో ఎనర్జీ పెరిగిపోతోందన్న కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట! మంచి పారితోషికం ముట్టజెప్తామన్నా సరే తీసుకోవడానికి నిరాకరించాడట. అందుకు కారణం లేకపోలేదు. భోళా శంకర్ సినిమాపై బోలెడంత నమ్మకం పెట్టుకున్న చిరు అందులో వాటా కావాలని కోరాడట! ఇప్పటికే సినిమా థియేట్రికల్, ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. కాబట్టి సినిమా రిలీజయ్యాక వచ్చే లాభాల్లో చిరంజీవి అడిగినంత మొత్తాన్ని ఇచ్చేందుకు మేకర్స్ అంగీకరించారంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
సినీ కార్మి కుల కష్టాన్ని గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సినీ కార్మికుల కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కథానాయకులు రూ.కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారని, కార్మి కుల వేతనాలు మాత్రం అంతంతగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికుల కష్టానికి తగ్గ ఫలం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి అనురాగ్ ఠాకూర్కు విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, 2023పై ఆయన మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా కార్మి కులు పనిచేస్తున్నారని తెలిపారు. చిత్ర నిర్మాణ వ్యయంలో మూడోవంతు పైగా భాగం కథానాయకుల పారితోషికాలకే సరిపోగా.. మిగిలిన మొత్తంతో చిత్రనిర్మాణం పూర్తి చేయాల్సి వస్తోందన్నారు. సెన్సార్ బోర్డ్ సరి్టఫికెట్ పొందిన చిత్ర నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని కోరారు. రైల్వే అప్రెంటీస్లకు న్యాయం చేయండి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) చేసిన తప్పిదం కారణంగా వందలాది కోర్సు కంప్లీటెడ్ అప్రెంటిస్ అభ్యర్థులకు రైల్వే నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్సీవీటీ పరీక్షకు హాజరు కాలేదన్న సాకుతో వారి నియామకాన్ని రైల్వే పెండింగ్లో పెట్టిందన్నారు. మానవతా దృక్పథంతో ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పైరసీ సైట్ల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి:ఎంపీ నిరంజన్రెడ్డి విచ్చలవిడిగా పెరిగిపోతున్న పైరసీ సైట్ల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భారతీయ సినిమా ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. పైరసీ సైట్లు సుమారు రూ.20 వేల కోట్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయన్నారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై నిరంజన్రెడ్డి మాట్లాడారు. ఆయా సైట్లను బ్లాక్చేయడం ద్వారా భారతీయ సినిమాను రక్షించొచ్చన్నారు -
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన ‘కీర్తి సురేష్’.. ఎన్ని కోట్లో తెలుసా?
పాత్రల కోసం మేకోవర్ అయ్యే నటిమణుల్లో కీర్తి సురేష్ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కేరళా బ్యూటీ ఆరంభ దశలోనే తెలుగులో ‘మహానటి’ చిత్రంలో దివంగత మహా నటి సావిత్రి నిజజీవిత పాత్రతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. తన అద్భుతమైన అభినయానికి గానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. వాటిలో కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు, స్టార్స్తో జత కట్టిన చిత్రాలు కూడా ఉన్నాయి. కాగా ఆ మధ్య సరైన సక్సెస్ లేక కీర్తీసురేష్ కొంత వెనుకబడ్డారు. దీంతో తెలుగులో అవకాశాలు కొరవడ్డాయి. అయితే తమిళంలో ఇప్పుడు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదే విధంగా ఫ్లాపులతో సతమతమవుతున్న కీర్తి సురేష్కు ఇటీవల నాని సరసన నటించిన దసరా మంచి విజయాన్ని సాధించి సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇక తమిళంలో సమీపకాలంలో ఉదయనిధి స్టాలిన్కు జంటగా నటించిన మామనిదన్ చిత్రం సక్సెస్ అయ్యింది . హిట్స్ ఉత్సాహాన్నే కాదు పారితోషికాన్నీ పెంచుతాయి. కీర్తిసురేష్ ఇందుకు అతీతం కాదు. తన పారితోషికాన్ని ఇప్పుడు భారీగా పెంచేసిందని సమాచారం. ఇంతకు ముందు చిత్రానికి రూ.2 కోట్లు తీసుకుంటున్న ఈ భామ ఇప్పుడు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈమె తమిళంలో తాజాగా కన్నివెడి అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇవి కాక తఘుతాత, సైరన్ తదితర చిత్రాలు ఈమె చేతిలో ఉన్నాయి. (చదవండి: ఎట్టకేలకు బాలీవుడ్లో అడుగుపెట్టనున్న కీర్తి సురేశ్!) -
'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Baby Heroine Remuneration:'బేబీ' సినిమా హిట్ అయింది. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. అయితేనేం రెండో రోజే లాభాల్లోకి వెళ్లిపోయింది. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె పాత్రని తెగ తిట్టుకుంటున్నారు. ఆమె నటనకి కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నారు. మరి వైష్ణవి ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. టాలీవుడ్ లో ప్రస్తుతం 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే సినిమాలోని పాత్రలో జీవించేసింది. లిప్ లాక్, బోల్డ్ సీన్స్ ఇలా ఏ విషయం తీసుకున్నా సరే ఎఫర్ట్ మొత్తం పెట్టింది. దీంతో ఈమెని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అప్పుడెప్పుడో డబ్ స్మాష్ నుంచి టిక్ టాక్ ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తో ఒక్కో స్టెప్ ఎదుగుతూ ఇక్కడి వరకు వచ్చింది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లు) యూట్యూబ్ సిరీస్ 'సాఫ్ట్వేర్ డెవలపర్'తో బోలెడంత ఫేమ్ తెచ్చకున్న వైష్ణవి చైతన్య.. 'అల వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలిగా నటించింది. అయితే తను తొలిసారి అందుకున్న పారితోషికం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయానా వైష్ణవినే బయటపెట్టింది. కేవలం రూ.700 మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చింది. 'ఓ ఈవెంట్ కోసం డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. రోజంతా కష్టపడి డ్యాన్స్ చేస్తే జస్ట్ రూ.700 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఎంత సంపాదించినా సరే నాకు మాత్రం ఆ ఏడొందలు చాలా స్పెషల్' అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. ఇకపోతే 'బేబీ' సినిమాకు ఎంత రెమ్యునరేషనే తీసుకుందనేది మాత్రం తెలియట్లేదు. బహుశా రూ.10 లక్షల లోపే ఇచ్చి ఉండొచ్చని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. #baby #massdance🔥✨💥💃😍#babymovie #ananddevarakonda #vaishnavichaitanya #devafilmstudio pic.twitter.com/71IWLH77rc — #devafilmstudio (@Devavinayaka) July 16, 2023 (ఇదీ చదవండి: రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!) -
Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!
మిగతా ఇండస్ట్రీల మాటేమిటో కానీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చలనచిత్రపరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు హీరో హీరోయిన్స్గా, దర్శకనిర్మాతలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగుతుంటారు. చాలామంది ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు కూడా!ఎవరో కొద్ది మంది మాత్రమే వారి సంతానాన్ని సినిమా దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. ఇకపోతే ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్బాబు ముద్దుల తనయ సితార ఓ యాడ్లో నటించి ఒక్కసారిగా వైరలయింది. ఇందుకోసం ఆమె కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 11 ఏళ్లకే యాడ్స్ మొదలుపెట్టిందంటే మరికొంతకాలానికి సినిమాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అటు మహేశ్ తనయుడు గౌతమ్ కూడా ఆరేడేళ్ల తర్వాత సినిమాల్లోకి వస్తాడని నమ్రత క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. భరతుడిగా నటించి సిల్వర్ స్క్రీన్పై రాజసాన్ని పండించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తాజాగా ఈ చిన్నారి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీ చిన్ననాటి పాత్రలో అర్హ నటించనుందట. వచ్చే నెలలో తను షూటింగ్లో పాల్గొననున్నట్లు భోగట్టా! ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలేనని, మేకర్స్ నిమిషానికి రూ.2 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన దేవర సినిమాకు ఆమె 20 లక్షల పారితోషికం తీసుకోనుందన్నమాట! మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. చదవండి: జవాన్ సినిమాకు నయనతార ఎంత పారితోషికం తీసుకుందంటే? -
ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం విడుదలై చాలా రోజులైంది. కనెక్ట్ చిత్రం తర్వాత నయనతార తెరపై కనిపించలేదు. ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో పారితోషికాన్ని పెంచుకుంటూనే పోతున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!) ఈ సంచలన భామ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన తొలి చిత్రం జవాన్. షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఇక క్రేజీ బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. కాగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అట్లీకి నటి నయనతార లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. ఈయన తొలి చిత్రం రాజారాణిలో నయనతారనే కథానాయకి. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా రూపొందించిన బిగిల్ చిత్రంలోని ఈమెనే హీరోయిన్. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా తన తొలి హిందీ చిత్రంలోను నయనతారనే కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమెకు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం ముట్ట జెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ హీరోయిన్లతో పోస్తే ఇది తక్కువే అయినా దక్షిణాది హీరోయిన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. కాగా జవాన్ తన తొలి హిందీ చిత్రం కావడంతో రిజల్ట్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు ) -
తొలి పారితోషికంపై సితార కామెంట్స్.. నెట్టింట ప్రశంసల జల్లు
మహేశ్బాబు- నమ్రతా శిరోద్కర్ల ముద్దుల తనయ సితార అప్పుడే తండ్రి గర్వించే స్థాయికి ఎదిగింది. సితార తొలిసారిగా న్యూయార్క్లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్పై మెరిసిన సంగతి తెలిసిందే కదా! పీఎంజే జ్యువెలరీ యాడ్లో సితార నటించగా, అందుకు సంబంధించిన ఫోటోలను బిల్బోర్డ్పై ప్రదర్శించారు. ఈ ప్రకటనలో నటించేందుకుగానూ సితార కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇకపోతే చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి అదుర్స్ అనిపించిన సితార మంచి డ్యాన్సర్ కూడా! అదిరిపోయే స్టెప్పులు వేసిన డ్యాన్స్ వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్రోజెన్ 2 సినిమా తెలుగు వర్షన్లో బేబీ ఎల్సా పాత్రకు కూడా తనే వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా పీఎంజే అనే జ్యువెలరీ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గానూ నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి పారితోషికంపై స్పందించింది. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ను చారిటీకి ఇచ్చానంది సితార. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శనీయంగా నిలిచిన మహేశ్బాబు అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: స్టార్ హీరోయిన్.. అయినా చెప్పులు మోసింది -
ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్!
హీరోలతో సమానమైన పారితోషికం మాకెక్కడిది? అని పెదవి విరిచే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. నిజమే, హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం హీరోయిన్లు తీసుకున్నంత పారితోషికాన్ని హీరోలు కూడా అందుకోలేరు.. అవును, సినిమా మొత్తానికి ఓ సాధారణ హీరో రూ.2 కోట్లు తీసుకున్నా అందులో ఐటం సాంగ్ చేసిన హీరోయిన్కు అంతకన్నా ఎక్కువే ముట్టజెపుతారు నిర్మాతలు. వారు అడిగినంత ఇచ్చేందుకు కూడా వెనుకాడరు. ఐటం సాంగ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిన ఊర్వశి రౌతేలా కెరీర్ ఇప్పుడు పీక్స్లో ఉంది. బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న ఈమె వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటం సాంగ్ బాస్ పార్టీలో తళుక్కుమని మెరిసింది. ఈ చిత్రానికి గానూ ఆమెకు రెండు కోట్లు ముట్టాయట. ఈ మూవీ, ఆ పాట రెండూ బ్లాక్బస్టర్ హిట్ కొట్టడంతో బ్యూటీకి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత ఏజెంట్లో వైల్డ్ సాలా పాటలో తన ఒంపుసొంపులను ప్రదర్శించింది. అలాగే పవన్ కల్యాణ్, సాయిధరమ్తేజ్ల బ్రో సినిమాలోనూ మై డియర్ మార్కండేయ అంటూ స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసింది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని స్కంధ సినిమాలో కూడా ఓ పాటలో మెరుపు తీగలా వచ్చిపోనుంది. అయితే ఈ చిత్రంలో మూడు నిమిషాల పాటకుగానూ మూడు కోట్లు డిమాండ్ చేసిందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ లెక్కన ఆమె నిమిషానికి కోటి రూపాయలు తీసుకుందన్నమాట! ఇదెంతవరకు నిజమో తెలియదు కానీ కాలం కలిసొచ్చినప్పుడే కోట్లు కూడబెట్టుకోవాలి అనే ఫార్ములాను ఊర్వశి గట్టిగానే ఫాలో అవుతోందంటున్నారు అభిమానులు. చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి రౌతేలా -
తమన్నా బోల్డ్ సీన్స్.. అందుకేనా అంతలా రెచ్చిపోయింది!
ఇటీవల ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న హీరోయిన్ పేరు తమన్న. 13వ వేటనే ఇండస్ట్రీలో ఎంట్రీ ముంబయి ముద్దుగుమ్మ 2005లో శ్రీ అనే తెలుగు చిత్రం ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కేడీ సినిమాతో కోలీవుడ్కు పరిచయం అయ్యింది. తన గ్లామర్తో అగ్ర కథానాయక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఈమె వయసు 33 ఏళ్లు కాగా.. నటిగా దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మోస్ట్ వాంటెడ్ బ్యాచ్లర్గా ఉన్న తమన్న ఇటీవలే విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. (ఇది చదవండి: 'సలార్' టీజర్ ఓకే.. కానీ డైరెక్టర్ని ఓ విషయంలో మెచ్చుకోవాలి!) అయితే నటిగా గ్లామర్ విషయంలో మాత్రం రోజు రోజుకు మరింత బోల్డ్గా తయారవుతోంది. ఎందుకంటే ఇటీవలే జీ కర్దా, లస్ట్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్ల్లో ఈమె శృంగార భరిత సీన్స్తో పీక్ స్టేజ్కు చేరుకుందనే చెప్పాలి. దీంతో పలువురు తమన్నకు ఏమైంది అంటూ ఘాటుగా విమర్శిస్తుంటే.. ఆవిడ మాత్రం ఈ సమాజానికి ఏమైంది అంటూ ప్రశ్నించడం మరో విశేషం. లస్ట్ స్టోరీస్– 2 వెబ్, జీ కర్దా సిరీస్లలో బెడ్ రూమ్ సన్నివేశాలను లిప్ లాక్ సన్నివేశాలలో విజృంభించి నటించిన తమన్నా తాను సినిమాలో నెక్ట్స్ లెవల్కు వెళ్లాలనుకుంటున్నానని అందుకే అలా నటిస్తున్నట్లు సమర్ధించుకుంది. అయితే తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్లో నటించడానికి ఏకంగా రూ.7 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. సాధారణంగా ఈమే తీసుకునేది నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల లోపే ఉంటుంది. కాగా లస్ట్ లవ్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్లో ఆమెకు హద్దులు మీరిన శృంగార భరిత సన్నివేశాలు 30 నిమిషాల వరకు ఉండడంతో తమన్నా నటించడానికి నిరాకరించరాదన్న కారణంగా నిర్మాతలు ఆమెకు రూ.7 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ గోల్డెన్ బ్యూటీ తమిళంలో రజినీకాంత్ సరసన నటిస్తున్న జైలర్ చిత్రం ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. మరోవైపు తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న భోళాశంకర్ చిత్రం ఆగస్టు 11వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. (ఇది చదవండి: వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు: హీరోయిన్ ఐశ్వర్య) -
జ్యువెల్లరీ యాడ్లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సూపర్స్టార్ మహేశ్బాబు సినిమాలతో బిజీగా ఉంటే.. కూతురు సితార మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. చిన్న వయసులో యాడ్ షూట్ లో పాల్గొన్న స్టార్ కిడ్ గా ఘనత సాధించింది. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ ఎక్కడికో వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది. చేసింది జ్యూవెల్లరీ యాడ్ అయితేనేం.. సితారకు పెద్ద మొత్తమే ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) సూపర్స్టార్ మహేశ్.. ఏడాది లేదా ఏడాదిన్నరకు ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. కానీ యాడ్స్, ప్రమోషన్స్ రూపంలో మరోవైపు నుంచి గట్టిగానే సంపాదిస్తున్నాడు. పాన్ మసాలా దగ్గర నుంచి సోప్ వరకు ప్రతిదానిలోనూ యాక్ట్ చేస్తుంటాడు. కోట్లకు కోట్లు ఆర్జిస్తుంటాడు. మహేశ్ ఫ్యామిలీ అంతా కలిసి గతంలో ఓ యాడ్ లో కనిపించారు. ఆ తర్వాత కూతురు సితారకు పలు ఆఫర్స్ వచ్చాయట. కానీ ఎందుకో మహేశ్ వాటిని ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం జ్యూవెల్లరీ యాడ్ లో సితార నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్నాళ్ల ముందు ఈ యాడ్ షూట్ జరగ్గా.. ఆ వీడియోని న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లో తాజాగా ప్రదర్శించారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేశ్.. కూతురు ఎదుగుదల చూసి తెగ ఆనందపడిపోయాడు. చాలా ఆఫర్లకు ఒప్పుకోని మహేశ్.. ఇలా ఈ యాడ్ కి ఎలా అంగీకరించాడా అని మీకు డౌట్ రావొచ్చు. అయితే ఇందులో సితార యాక్ట్ చేసినందుకు గానూ ఏకంగా రూ.కోటి ఇచ్చారట. బహుశా మహేశ్ కూడా తన తొలి యాడ్ కోసం కూడా ఇంత తీసుకుని ఉండడు. అందుకే సితార యాడ్ షూట్ కి ఒప్పుకున్నాడేమో? Lighting up the Times Square!! 💥💥💥 So so proud of you my fire cracker ♥️♥️♥️ Continue to dazzle and shine!! 😘😘😘 #SitaraGhattamaneni pic.twitter.com/3ALO0HGNMy — Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2023 (ఇదీ చదవండి: ఓ పక్క పెళ్లి.. మరో పక్క విడాకులు.. మెగా ఫ్యామిలీకి ఎందుకిలా?) -
ప్రాజెక్ట్ K కోసం కమల్ హాసన్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్
-
ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?
ఓ సినిమా హిట్ కావాలంటే ఏమేం ఉండాలి? అని అడగ్గానే.. హీరో, హీరోయిన్, మంచి కథ ఇలా చాలా చెబుతారు. వీటన్నింటితో పాటు మరో ముఖ్యమైనది ఒకటుంది. అదే సంగీతం. సినిమా ఎంత యావరేజ్ గా ఉన్నా ఓ హిట్ సాంగ్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పడితే చాలు ఆ మూవీ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సింగర్స్ కి ఇచ్చే రెమ్యునరేషన్ మాత్రం తక్కువే. అయితే మన దేశంలోనే ఓ సింగర్, ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు తీసుకుంటున్నాడని మీలో ఎంతమందికి తెలుసు! దక్షిణాదిలో ఇచ్చేది తక్కువే! ఏ సినిమా తీసుకున్నా సరే సినిమాలో పాటలు కీ రోల్ ప్లే చేస్తాయి. ఒకవేళ అవి లేకపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ సింగర్ అయిన సిద్ శ్రీరామ్.. ఒక్కో పాట కోసం రూ.4 లక్షల వరకు తీసుకుంటాడట. మిగతా సింగర్స్ చాలావరకు రూ.లక్ష లోపే రెమ్యురనేషన్ తీసుకుంటుంటారు. సౌత్ లో ఏమో గానీ బాలీవుడ్ లో మాత్రం సింగర్స్ కి లక్షల్లో ఇస్తుంటారు. ఈ జాబితా కూడా చాలా పెద్దదే. (ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!) పాటకు రూ.3 కోట్లు! ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సింగర్స్ లో ఏఆర్ రెహమాన్ కచ్చితంగా టాప్ లో ఉంటాడు. స్వతహాగా సంగీత దర్శకుడు అయినప్పటికీ.. అప్పుడప్పుడు సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాడు. అలా రెహమాన్ ఒక్కో పాట కోసం రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడట. కొన్నిసార్లు ఆ మొత్తం రూ.5 కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సింగర్స్ కూడా కాస్ట్లీ! ఏఆర్ రెహమాన్ తర్వాత చూసుకుంటే.. స్టార్ ఫిమేల్ సింగర్ శ్రేయా ఘోషల్ ఓ పాట కోసం రూ.25 లక్షల వరకు తీసుకుంటుందట. సునిధి చౌహాన్, అర్జిత్ సింగ్.. రూ.20-22 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. సోనూ నిగమ్, బాద్ షా అయితే రూ.18-20 లక్షల వరకు అందుకుంటారని టాక్. మిగతా వారిలో షాన్, నేహా కక్కర్, మికా సింగ్, హనీ సింగ్ తదితరులు రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: సినిమాల్లో స్టార్ కాంబోలు సరే.. మరి సక్సెస్ రేట్?) -
'ప్రాజెక్ట్ K'లో కమల్ హాసన్ ఫిక్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రభాస్ 'ఆదిపురుష్'ని ఫ్యాన్స్ నెమ్మదిగా మరిచిపోతున్నారు. 'సలార్' కోసం తెగ ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత 'ప్రాజెక్ట్ K' అనే మరో క్రేజీ సినిమా లైన్ లో ఉంది. ఇందులో కమల్ హాసన్ నటిస్తున్నారని నిర్మాతలు అధికారికంగా ప్రకటించి, ఓ వీడియోని రిలీజ్ చేశారు. కీలక పాత్రలో కనిపిస్తారని చెప్పుకొచ్చారు. అలానే ఆ రోల్ కోసం ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అలాంటి రోల్లో? 'విశ్వరూపం'తో ప్రేక్షకుల్ని అలరించిన కమల్ హాసన్.. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ కొట్టలేకపోయారు. 'విక్రమ్'తో మాత్రం కెరీర్ లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం 'ఇండియన్ 2' (భారతీయుడు 2) సినిమాతో బిజీగా ఉన్న కమల్.. ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'లోనూ నటిస్తున్నట్లు ఖరారైంది. ఇందులో ప్రభాస్ కి విలన్ గా ఈయన చేయబోతున్నారని సమాచారం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్హీరో మూవీ.. తెలుగులోనూ!) అన్ని కోట్లు రెమ్యునరేషన్? 'ప్రాజెక్ట్ K' కోసం హీరో ప్రభాస్ కి రూ.150 కోట్ల వరకు ఇస్తున్నారని టాక్. ఇప్పుడు ఇదే సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న కమల్ కి రూ.100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కెరీర్ లోనే కమల్ తీసుకోబోయే అత్యధిక పారితోషికం ఇదవుతుంది. ఇందులో నిజమెంతనేది స్పష్టత రావాల్సి ఉంది. 'ప్రాజెక్ట్ K' రిలీజ్ వాయిదా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్నాళ్ల ముందు ప్రకటించారు. ఇప్పుడు కమల్ ని కన్ఫర్మ్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం ఆ తేదీ లేదు. దీంతో విడుదల వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ కి అచ్చొచ్చిన మే 9న.. ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) -
సమంత లెవలే వేరు.. సిటాడెల్ కోసం ఎంత తీసుకుంటుందంటే?
ఏమాయ చేశావె చిత్రంతోనే కుర్రకారును బుట్టలో వేసుకునంది సమంత. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. సూపర్ డీలక్స్ చిత్రంలో ఏ నటి నటించడానికి సాహసించని పాత్రను పోషించి తన ప్రత్యేకతను చాటుకుంది. అదేవిధంగా ఫ్యామిలీ మెన్ 2 అనే హిందీ వెబ్సీరీస్లో యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసి ఆ సిరీస్ విజయానికి ముఖ్య కారణంగా నిలిచింది. అయితే కొంతకాలంగా సమంతకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చైతో విడాకులు.. మయోసైటిస్ అనే వింత వ్యాధి బారిన పడడం, భారీ బడ్జెట్తో తెరకెక్కిన శాకుంతలం చిత్రం డిజాస్టర్గా నిలవడం వంటి పలు బాధాకరమైన సంఘటనలు సమంతను చుట్టుముట్టాయి. అయితే అలాంటి వాటిని ఎదురొడ్డి నిలబడి తన సినీ కెరీర్ను మరింత హైలెవెల్కు తీసుకుపోతోందీ హీరోయిన్. సాధారణంగా పెళ్లయిన హీరోయిన్స్కు, అందులోనూ ఫ్లాపులను ఎదుర్కొంటున్న నటీమణులకు నూతన అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. కానీ సమంత విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంది. తనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో విజయదేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తూనే బాలీవుడ్లో సిటాడెల్ వెబ్సీరీస్ చేస్తోంది. ఈ వెబ్సీరీస్లో నటించడానికి సమంత అక్షరాల రూ.10 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అందుకే సమంత లెవలే వేరు అంటున్నారు అభిమానులు. మరో విషయం ఏంటంటే ఈ బ్యూటీ త్వరలో హాలీవుడ్లోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్ వైరల్ అవుతుంది. చదవండి: ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్కు ఎంత లాభం వచ్చిందంటే? -
Adipurush: ఓ రేంజులో 'ఆదిపురుష్' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత?
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. చాలారోజుల నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా ఇది. టీజర్ వల్ల విపరీతంగా ట్రోల్స్ వచ్చినప్పటికీ, రిలీజ్ కి ముందు మాత్రం హైప్ బాగానే ఏర్పడింది. ఈ ఊపులోనే కోట్లు కొల్లగొట్టేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటివరకు రామాయణం ఆధారంగా చాలా సినిమాలొచ్చాయి. వాటితో పోలిస్తే 'ఆదిపురుష్' చాలా డిఫరెంట్. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ తీశారు. తొలుత రూ.400 కోట్లే అనుకున్నారు. కానీ టీజర్ దెబ్బకు అందరూ తిట్టిన తిట్టకుండా తెగ తిట్టారు. దీంతో గ్రాఫిక్స్ కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' కోసం ప్రభాస్ ఫస్ట్ టైమ్ అలా!) సినిమా బడ్జెటే అన్ని వందల కోట్లు అంటే రెమ్యునరేషన్స్ కూడా గట్టిగానే ఇచ్చి ఉంటారని మీకు డౌట్ రావొచ్చు. అవును మీరు ఊహించింది నిజమే. రాముడిగా నటించినందుకు డార్లింగ్ ప్రభాస్ కి ఏకంగా రూ.150 కోట్ల వరకు ఇచ్చారని టాక్. దీంతో ఆలోవర్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మన డార్లింగ్ రికార్డ్ సృష్టించాడు! మిగతా నటీనటుల్లో రావణుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ కి రూ.12 కోట్ల వరకు అందినట్లు తెలుస్తోంది. టీజర్ లో రావణ్ గెటప్ ని చూపించారు. విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ లోనూ అతడిని దాచేశారు. రేపు సినిమాలోనైనా చూపిస్తారో లేదో? వీళ్లిద్దరి తర్వాత సీతగా యాక్ట్ చేసిన కృతిసనన్ కి రూ.3 కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లక్ష్మణుడిగా నటించిన సన్నీ సింగ్ కు అయితే రూ.1.5 కోట్లు ఇచ్చారని సమాచారం. ఇదే సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్ కి రూ.50 లక్షలు ఇచ్చారట. బహుశా ఈమె సూర్ఫనఖ పాత్ర చేసి ఉండొచ్చని అనిపిస్తోంది. హనుమాన్ గా చేసిన దేవదత్త నాగే, డైరెక్టర్ ఓం రౌత్ కు ఎంత ఇచ్చారనేది బయటకు రాలేదు. ఓవరాల్ గా చూసుకుంటే.. కేవలం పారితోషికాలకే రూ.170-200 కోట్లకు పైగా వరకు ఖర్చు చేశారంటే పెద్ద విశేషమే. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?) -
రోజుకు 2 కోట్లు అని పబ్లిక్గా చెప్పడం ఏంటి? పవన్కు కోటా చురకలు!
స్టార్ హీరోల రెమ్యునరేషన్, వాణిజ్య ప్రకటనలపై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో ఏ హీరో తన రెమ్యునరేషన్ అంతా, ఇంతా అని ఎక్కడా చెప్పేవాడు కాదని, ఇప్పటి హీరోలు మాత్రం నాకు రోజుకు 2 కోట్లు, 6 కోట్లు తీసుకుంటున్నానని పబ్లిక్గా చెబుతున్నారని విమర్శించాడు. అలా పబ్లిక్గా రెమ్యునరేషన్ గురించి హీరోలు చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకల్లో కోటా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అసలు ఇప్పుడు సినిమా అనేది లేదు. అంతా సర్కసే. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ లు చేస్తున్నారు’ అంటూ కోటా సెటైర్లు వేశారు. (చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ఆ పని చేయాలంటూ ఫ్యాన్స్కి చిరు విజ్ఞప్తి) అలాగే హీరోల వాణిజ్య ప్రకటనల గురించి మాట్లాడుతూ.. ‘ఈ రోజు సినీ ఆర్టిస్టులు రెండు పూటలా భోజనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా అసోసియేషన్ గుర్తించాలి. చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో అడ్వర్టైజ్మెంట్లో అయినా నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది? దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి చిన్న ఆర్టిస్టులను బతికించండి’ అని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశాడు. అయితే హీరోల రెమ్యునరేషన్ విషయంలో కోటా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పవన్ కల్యాణ్ను ఉద్దేశించినవే అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో తాను రోజుకి రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని తెలిపిన సంగతి తెలిసిందే. కోటా వ్యాఖ్యలను కొంతమంది నెటిజన్స్ సమర్థిస్తుంటే..పవన్ ఫ్యాన్స్ మాత్రం విమర్శిస్తున్నారు. -
పవిత్ర లోకేశ్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పవిత్ర లోకేశ్ ఇప్పటికే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది. కానీ నరేశ్తో ప్రేమ వ్యవహారం తర్వాతే ఈమెకు ఇక్కడ బాగా గుర్తింపు వచ్చింది. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని నరేశ్ బహిరంగంగా ప్రకటించాడు. ఇక వీరిద్దరు కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ నిన్న(మే 26)విడుదలైన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఎమ్మెస్ రాజు. నరేశ్ ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు.ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో నటించనందుకుగాను పవిత్ర భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుందట. (చదవండి: మళ్ళీ పెళ్లి మూవీ రివ్యూ) వాస్తవానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర లోకశ్ రోజుకు రూ.50 వేలు పారితోషికంగా తీసుకునేదట. అయితే నరేశ్ ప్రేమ వ్యవహారంతో పవిత్ర మరింత ఫేమస్ అయింది. దీంతో ఆమె తన రెమ్యునరేషన్ని కూడా పెంచేసిందట. ప్రస్తుతం రోజుకు లక్ష వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదట. ప్రస్తుతం పవిత్రకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తనపై వస్తున్న ట్రోల్స్ని పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. -
Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇది ఒక పేరు కాదు, బ్రాండ్. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ని సొంతం చేసుకున్న తారక్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 13ఏళ్లకి ‘బాల రామాయణం'లో బాల రాముడిగా పౌరాణిక పాత్రలో అద్భుతంగా నటించి తొలిసారి నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా నిరాశ పరిచినా నటుడిగా ఎన్టీఆర్కు మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నం.1’ ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది. ఈ సినిమాతో ఇక ఎన్టీఆర్ వెనుతిరిగి చూసుకోలేదు.ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం సహా మొన్నటి ఆర్ఆర్ఆర్ వరకు ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.అంతేకాకుండా ఒకానొక సమయంలో వరుస ఫ్లాపులు వెంటాడినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి తన పవర్ ఏంటో నిరూపించుకున్నాడు. చదవండి: ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి! యాక్టింగ్, డైలాగ్, డాన్స్..ఇలా అన్నింటిలోనూ మేటి అనిపించుకున్నాడు. ఎమోషన్స్ను పలికించడంలో, డైలాగ్స్ చెప్పడంలో సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ కెరీర్లో ముఖ్యంగా రాజమౌళితో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. స్డూడెంట్ నెం1, సింహాద్రి, యమదొంగ, మొన్నటి ఆర్ఆర్ఆర్ వరకు వీరిద్దరి కాంబినేషన్ ఓ సెన్సేషన్. ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం సుమారు రూ. 50-60 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న తారక్ అందుకున్న మొదటి రెమ్యునరేషన్ మూడున్నర లక్షల రూపాయలట. అంత మొత్తంలో డబ్బు చూసి ఏం చేయాలో తెలియక చాలారోజుల వరకు ఆ డబ్బును లెక్క పెడుతూ కూర్చున్నాడట. ఇప్పుడేమో కోట్లకు పైగా పారితోషికం అందుకుంటూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఆన్స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా తన టాలెంట్తో సెపరేటు ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్నాడు. నటుడిగా, సింగర్గా, డ్యాన్సర్గా, యాంకర్గా తనకు తానే సాటి అనిపించుకున్న తారక్కి మరోసారి హ్యాపీ బర్త్డే. చదవండి: NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్లుక్ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది! -
హీరోలకే ఎక్కువ పారితోషికం, ఎందుకీ వ్యత్యాసం?: రకుల్ ప్రీత్ సింగ్
సినిమా పారితోషికం విషయంలో తారతమ్యం గురించి హీరోయిన్లలో అసంతృప్తి చాలా కాలంగానే రగులుతోంది. ఈ విషయమై పలువురు ప్రముఖ కథానాయికలు తరచూ తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాము హీరోలకు ఏ మాత్రం తీసిపోమని, అయినా పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం ఉంటోందని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేరింది. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలోనే కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలిగింది. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటింనా పెద్దగా విజయాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్– 2 చిత్రంలో నటిస్తోంది. శివకార్తికేయన్ సరసన నటించిన అయిలాన్ విడుదలకు సిద్ధం అవుతోంది. ఏదేమైనా ప్రస్తుతం రకుల్ ప్రీతీ సింగ్ మార్కెట్ డౌన్ అయ్యిందని చెప్పక తప్పదు. అయినప్పటికీ పారితోషికం విషయంలో కొందరు హీరోయిన్లు పాడిన పాటనే ఈమె పాడుతోంది. ఇటీవల ఒక భేటీలో హీరోహీరోయిన్ల మధ్య పారితోషికం విషయంలో తారతమ్యాల గురించి స్పందిస్తూ.. హీరోల కంటే హీరోయిన్లకు పారితోషికం తక్కువగానే ఉంటోందని పేర్కొంది. నిజం చెప్పాలంటే హీరోహీరోయిన్ల ప్రతిభను బట్టే పారితోషికాన్ని నిర్ణయించాలంది. అలా కాకుండా హీరోలకే అధిక పారితోషికం ఇచ్చే పరిస్థితి మారాలని ఆకాంక్షించింది. సినిమా కోసం హీరోహీరోయిన్ ఒకే మాదిరి శ్రమిస్తారని, అయినా పారితోషికం విషయంలో వ్యత్యాసం చూపిస్తున్నారంది. ప్రేక్షకులను థియేటర్కు రప్పించే ప్రతిభ హీరోయిన్లకూ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమాలో కథా పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే అది సక్సెస్ అయినట్లేనని, అంతే తప్ప అందులో ఎవరు నటించారన్నది ముఖ్యం కాదని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. చదవండి: ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు -
రజనీకాంత్ సినిమాకు ఆ కండీషన్ పెట్టిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్
తమిళ సినిమా: తాజాగా కోలీవుడ్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే అది రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజు కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం గురించే అన్నది గమనార్హం. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోపక్క తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో రజినీకాంత్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. తదుపరి జై భీమ్ చిత్రం జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. తాజాగా రజనీకాంత్ 171వ చిత్రం గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. దీన్ని నిర్మించడానికి పలువురు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అందులో నటుడు కమలహాసన్కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా ఉండటం విశేషం. అయితే ఇప్పుడు సన్ పిక్చర్స్ సంస్థ ఈ అవకాశాన్ని తన్నుకుపోయినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మాతకు ఓ కండిషన్ పెట్టినట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనకు రూ. 40 కోట్లు పారితోషికం ఇస్తేనే రజిని చిత్రానికి దర్శకత్వం ఇస్తానని లోకేష్ కనకరాజ్ డిమాండ్ చేశారన్నదే ఆ టాక్. అయితే అంత మొత్తం ఇవ్వడానికి సన్ పిక్చర్స్ సంస్థ సుముఖంగా లేదని, దీంతో మరో దర్శకుడితో ఈ చిత్రాన్ని చేయాలని భావించినట్లు సమాచారం. కానీ తనకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ కావాలని రజనీకాంత్ పట్టుపట్టారని, దీంతో వేరే దారి లేక లోకేష్ కనకరాజ్ డిమాండ్కు తలొగ్గిన సన్ పిక్చర్స్ సంస్థ ఆయనకు రూ.40 కోట్లు పారితోషికం ఇవ్వడానికే సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. -
ఏపీలో పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ వేతనం పెంపు
-
AP: గుడ్న్యూస్.. టెన్త్ పరీక్షల సిబ్బందికి రెమ్యునరేషన్ ఎంత పెరిగిందంటే?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 26 కేటగిరీల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం ఉత్తర్వులు (జీవో 37) విడుదల చేశారు. పరీక్షల నిర్వహణతో పాటు స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం)లో పాల్గొనే వారందరి రెమ్యునరేషన్ను ప్రభుత్వం పెంచింది. ఎమ్మెల్సీ, వరీక్షల డైరెక్టర్ హర్షం ఉత్తర్వులు ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీ టి.కల్పలత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ డైరెక్టరేట్ తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు. 2016 తరువాత రెమ్యునరేషన్ ఇప్పుడే పెరిగిందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల వైఎస్సార్టీఎఫ్ నేత జాలిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ రోజు 48 మండలాల్లో.. -
‘దసరా’ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ పెంచేసిన నాని, ఎంతంటే..
‘దసరా’సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు నాని. పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30 విడుదలైన ఈ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లని సాధించి, నాని కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ‘దసరా’విజయంతో నాని కాన్పిడెన్స్ మరింత పెరిగింది. వైవిధ్యమైన సినిమాలు తీస్తే జనం తప్పకుండా ఆదరిస్తారని అర్థమైంది. అందుకే ఇకపై వైవిధ్యమైన కథలనే ఎంచుకోవాలని నాని డిసైడ్ అయ్యారట. అంతేకాదు దసరా సక్సెస్తో తన పారితోషికాన్ని కూడా పెంచేశారట. వాస్తవానికి దసరా చిత్రానికి ముందే నాని తన రెమ్యునరేషన్ని పెంచేశాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 20 నుంచి 22 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఇక ‘దసరా’ తో నాని మార్కెట్ వ్యాల్యూ పెరిగిపోయింది. దీంతో తన పారితోషికాన్ని కాస్త పెంచేశాడట. ఇకపై కమిట్ అయ్యే చిత్రాలకు రూ. 25 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. దసరా’ రిలీజ్కు ముందే కొత్త నిర్మాత మోహన్ చెరుకూరితో తన 30వ చిత్రాన్ని నాని ప్రకటించాడు. నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించబోతున్న మరో చిత్రంలో నటించడానికి కూడా నాని ఓకే చెప్పేశాడు. దీనికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నాడు. ఈ రెండు చిత్రాలు కాకుండా..ఇకపై కమిట్ అయ్యే సినిమాలకు నాని ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. అందుకునే నిర్మాతలు కూడా నాని రెమ్యునరేషన్ కు ఓకే చెప్తున్నారని టాక్ వినిపిస్తోంది. -
హీరోలకు సమానంగా రెమ్యునరేషన్, గౌరవం ఇవ్వాలి: రాధికా ఆప్టే
సంచలన నటీమణుల్లో రాధిక ఆప్టే ఒకరు. నటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ధోని చిత్రం ద్వారా రాధిక ఆప్తే కోలీవుడ్కు పరిచయం అయ్యింది. ఆ తరువాత రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన కబాలి, కార్తీ సరసన ఆల్ ఇన్ ఆల్ అళగురాజా వంటి చిత్రాలతో పాటు చిత్తిరం పేసుదడి –2, వెట్రిసెల్వన్ తదితర చిత్రాలలో నటించి తమిళ సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. అదే విధంగా కొన్ని చిత్రాలలో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని రాధికా ఆప్టే తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ సినిమా రంగంలో నటిస్తున్న హీరోయిన్లకు, ఇతర మహిళలకు పారితోషికం, పేరు, ఖ్యాతి ఇవన్నీ విషయాల్లోనూ హీరోలకు సమానంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఈ రంగంలో మహిళలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. ఇది అందరూ స్వాగతించాల్సిన విషయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా ప్రస్తుతం హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రాలూ వస్తున్నాయని అన్నారు. ఇది సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాలలోనూ ఆడ, మగ అనే భేదం లేదు అనే పరిస్థితి నెలకొందని, మహిళలు సమానత్వం కోసం పోరాడుతున్నారని రాధిక స్పష్టం చేశారు. -
'బ్రహ్మజీ గొప్ప మనసు.. డబ్బులు తీసుకోకుండానే చేశాడు'
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని వందల చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలతో నటించిన ప్రత్యేక పేరు సంపాదించారు. అలాగే ఆయన ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. అదే విహాన్ తెరకెక్కించిన 'హ్యాంగ్ మాన్' లో తలారి పాత్ర పోషించారు. ఉరిశిక్ష పడిన ఖైదీలను ఉరి తీసే వ్యక్తిని తలారి అంటారు. ఇది ఒక చిన్న సినిమా అయినా ఒక తలారి జీవితం ఎలా ఉంటుంది? అతను ఉరి తీసేటప్పుడు మానసికంగా ఎలా సిద్దమవుతాడు? అనే విషయాలను తెరకెక్కించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ తన కుమారునికి కొడుక్కి కూడా తలారి పని ఎలా చేస్తారో కూడా వివరిస్తుంటాడు. ఈ షార్ట్ ఫిల్మ్ను ఈమధ్య హైదరాబాద్లోని ప్రివ్యూ థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సినిమాలో బ్రహ్మజీ నటనకు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తలారి పాత్రను అద్భుతంగా చేసి అందులో ఇమిడిపోయాడు. ఇంకో ఆశ్చర్యకరం ఏంటి అంటే ఈ సినిమా కథ నచ్చి.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే నటించాడు. -
శ్రమను చూసి పారితోషికం ఇవ్వాలి.. యాచించాల్సిన అవసరం లేదు: సమంత
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది సమంత. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. త్వరలోనే ఈ బ్యూటీ నటించిన ‘శాకుంతలం’చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సామ్.. నటీ నటుల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కష్టాన్ని చూసి దానికి తగ్గట్టుగా పారితోషికం ఇస్తే బాగుంటుందని సమంత అభిప్రాయపడింది. ‘నా శ్రమ చూసి ‘మేము మీకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలనుకుంటున్నాం’అని నిర్మాతలే చెప్పాలి. అంతేకానీ నాకు ఇంత పారితోషికం ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదు. మన కృషి ఆధారంగా ఇది వస్తుందని నమ్ముతాను. మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలి’అని సమంత చెప్పుకొచ్చింది. ఇక శాకుంతలం సినిమా విషయానికొస్తే.. డైరెక్టర్ గుణ శేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైథిలాజికల్ మూవీగా రూపొందించిన ఈ శాకుంతలం సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. పాన్ ఇండియా మూవీ గా ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
జూనియర్ ఎన్టీఆర్ మూవీకి జాన్వీ అన్ని కోట్లు డిమాండ్ చేసిందా?
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఇదివరకే విడుదల చేశాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు జాన్వీ భారీ మొత్తంలో పారితోషికం పుచ్చుకుందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం జాన్వీ రూ. 5 కోట్లు చార్జ్ చేస్తుందట. వాస్తవానికి బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి జాన్వీ రూ. 3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు పారితోషికంగా తీసుకునేది. కానీ తెలుగులో లాంచ్ అవ్వడానికి మాత్రం ఒకేసారి కోటిన్నర పెంచేసింది. తొలి సినిమాకే ఇంత మొత్తం తీసుకుంటుండడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కాగా 'ప్రాజెక్టు K' మూవీ కోసం దీపికా పదుకొణె ఏకంగా రూ.10 కోట్లు తీసుకుంటోందట. ఆమె తర్వాత అత్యధిక మొత్తం చార్జ్ చేస్తున్న హీరోయిన్గా జాన్వీ కపూర్ నిలిచినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. -
రజనీకాంత్, విజయ్ రెమ్యునరేషన్పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళ సినిమా: ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు రూ.100 కోట్లు తీసుకునేవారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్లూ దాన్ని మించేశారు. తమిళనాడులోని రజనీకాంత్, విజయ్ వంటి నటులు రూ.120, 130 కోట్లకు పైగా పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఈ హీరోల గురించి నటి సునైనా సెటైర్లు వేసింది. ఈ పదహారణాల తెలుగు అమ్మాయి తమిళంలో కాదలిల్ విళిందేవ్ చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. అరుళ్నిధికి జంటగా నటించిన వంశం చిత్రంలో ఈమె నటనతో అందరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత నీర్ పార్వై, సమర్, మాసిలామణి, తెరి, సిలుక్కువార్పట్టి తదితర చిత్రాలతో కోలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పేర్కొంది. మీకు స్క్రిప్ట్ రాసి నటించే అవకాశం వస్తే ఏ నటుడిని ఎంపిక చేసుకుంటావు అన్న ప్రశ్నకు బదులిస్తూ నటుడు విజయ్, ఫాహత్ సాజిద్, విజయ్ సేతుపతిలలో ఒకరిని ఎంపిక చేసుకుంటానని చెప్పింది. ఇటీవల బాగా నచ్చిన చిత్రం విక్రమ్ అని చెప్పింది. ప్రస్తుతం ప్రముఖ నటులు రూ. 100 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు దీని గురించి కొందరు ఇంతకుముందే తన వద్ద ప్రస్తావించినట్లు చెప్పింది. అయినా అంత డబ్బు తీసుకుని ఏం చేస్తారబ్బా? అని సందేహం తనకు కలుగుతుందని చెప్పింది. తన తొలి చిత్రానికి రూ.15 వేలు తీసుకున్నట్లు చెప్పింది. తనకు సంబంధించిన వరకు ప్రేక్షకులు తన నటనను ఎలా ఆనందిస్తున్నారు అన్నదే ముఖ్యం అని పేర్కొంది. తాను కాదలిల్ విళిందేన్, సిలుక్కువార్పట్టి చిత్రాలను థియేటర్లలో ప్రేక్షకుల మధ్య చూశానని చెప్పింది. సిలుక్కువార్పట్టి చిత్రంలో నటుడు సముద్రఖనితో వాగ్వాదం చేసే సన్నివేశాలకు ప్రేక్షకులు ఈలలు వేస్తూ ఎంజాయ్ వేశారని చెప్పింది. అలాంటి తరుణాలే ముఖ్యమని, అందుకే తాను సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు నటి సునైనా పేర్కొంది.