మే 19న గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' | Gopichand Aaradugula Bullet Release Date May 19th | Sakshi

మే 19న గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'

Published Sat, Apr 29 2017 11:46 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

మే 19న గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'

మే 19న గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'

వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్స్తో ఉన్న గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'ఆరడుగుల బుల్లెట్' విడుదలకు రెడీ అవుతోంది.

వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్స్తో ఉన్న గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'ఆరడుగుల బుల్లెట్' విడుదలకు రెడీ అవుతోంది. సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలోజయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను మే 19న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. 'ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్, మాస్ ఆడియన్స్కు నచ్చే అంశాలు మేళవించి దర్శకులు బి.గోపాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు, బాల మురుగన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్స్గా నిలుస్తాయి. గోపీచంద్ కెరీర్ లోఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న 'ఆరడుగుల బుల్లెట్'ను మే 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement