Gopichand
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ 'విశ్వం'
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో గోపీచంద్ ఒకడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'విశ్వం'. అప్పట్లో కామెడీ చిత్రాలతో తనదైన ట్రెండ్ చేసిన శ్రీనువైట్ల.. దాదాపు ఆరేళ్ల తర్వాత చేసిన సినిమా ఇది. థియేటర్లలో రిలీజైన ఇరవై రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది.(ఇదీ చదవండి: సూర్య 'కంగువ'.. తెలుగులోనే ముందు!)గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ఈ సినిమాని ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్గా తీశారు. చెప్పడం అయితే కామెడీ అన్నారు గానీ రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీ అయ్యేసరికి జనాలు రిజెక్ట్ చేశారు. దీపావళి సందర్భంగా తొలుత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లోకి స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.'లౌక్యం' సినిమా వచ్చి పదేళ్లు దాటిపోయింది. ఈ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్.. ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు. కాకపోతే అవి వచ్చి వెళ్తున్నాయి తప్పితే ఒక్కటి గుర్తుంచుకోదగ్గ స్థాయిలో లేదు. మరోవైపు శ్రీనువైట్ల కూడా ఎంతో నమ్మకంతో ఈ సినిమా తీశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం వీళ్లిద్దరి చేతిలోనూ మరో ప్రాజెక్ట్ లేదు. (ఇదీ చదవండి: OTT Review: ఊహకందని థ్రిల్లింగ్ వెకేషన్)Feel every emotion in one film! Viswam is the perfect blend for your weekend watchlist.Watch #Gopichand and #kavyathapar starrer #viswam now on #aha@YoursGopichand @SreenuVaitla @KavyaThapar @vishwaprasadtg @peoplemediafcy @VenuDonepudi pic.twitter.com/Xyk9PPLV7y— ahavideoin (@ahavideoIN) November 2, 2024 -
ఓటీటీలో 'విశ్వం'.. అప్పుడే స్ట్రీమింగ్కు రానుందా..?
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. బాక్సాఫీస్ వద్ద కాస్త పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న చాలా సినిమాలు థియేటర్స్లో సందడి చేయనున్నాయి. దీంతో విశ్వం చిత్రాన్ని దాదాపు అన్ని స్క్రీన్స్ నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్లో ఉన్నారట. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.దసరా సందర్భంగా అక్టోబర్ 11న విడుదలైన 'విశ్వం' పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు నష్టాలు తప్పలేదని సమాచారం. ఇప్పుడు కాస్త త్వరగా ఓటీటీలో అయినా విడుదల చేస్తే కొంతైనా సేఫ్ కావచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నవంబర్ 1న 'విశ్వం' సినిమా అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయునున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కథ పెద్దగా ఆకట్టుకోకపోయినా కామెడీతో ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు. -
గోపీచంద్ 'విశ్వం'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘విశ్వం’ మూవీ రివ్యూ
టైటిల్: విశ్వంనటీనటులు: గోపీచంద్, కావ్యథాపర్, నరేశ్, సునీల్, వెన్నెల కిశోర్, సుమన్, ప్రగతి తదితరులునిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడిదర్శకత్వం: శ్రీనువైట్లసంగీతం: చైతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్విడుదల తేది: అక్టోబర్ 11, 2024శ్రీనివైట్లకు ఈ మధ్యకాలంలో సరైన హిట్ సినిమాలే లేదు. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ(2018)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ‘విశ్వం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కు మచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బారిగా చేయడంతో ‘విశ్వం’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? విజయదశమి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం శ్రీను వైట్లకు విజయం దక్కిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేటంటే..కేంద్ర మంత్రి సీతారామరాజు(సుమన్)కు హత్యకు గురవుతాడు. ఈ హత్యను దర్శన అనే బాలిక కళ్లారా చూస్తుంది. హంతకులు ఆ బాలికను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఓ రోజు దర్శన ప్యామిలి మొత్తం కొండగట్టుకు వెళ్ళ్తుండగా కొంతమది వారిపై అటాక్ చేస్తారు. గోపిరెడ్డి(గోపీచంద్) వచ్చి వారిని రక్షిస్తాడు. అనంతరం తాను బిల్డర్ బుల్ రెడ్డి కొడుకునని పరిచయం చేసుకొని దర్శన ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అసలు గోపిరెడ్డి ఎవరు? దర్శనను ఎందుకు కాపాడుతున్నాడు? కేంద్రమంత్రిని చంపిందెవరు? ఈ హత్యకు ఇండియాలో జరగబోయే ఉగ్రవాద చర్యలకు గల సంబంధం ఏంటి? ఇండియాలో సెటిలైన పాకిస్తాన్ ఉగ్రవాది ఖురేషి(జిష్షుసేన్ గుప్తా) చేస్తున్న కుట్ర ఏంటి? ఈ కథలో బాచిరాజు(సునీల్) పాత్ర ఏంటి? కాస్ట్యూమ్ డిజైనర్ సమైరా (కావ్యథాపర్)తో గోపిరెడ్డి ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి హిట్ కొట్టిన చరిత్ర శ్రీనువైట్లది. ఆయన సినిమాలో కామెడీతో పాటు కావాల్సినన్ని కమర్శియల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. అయితే గత కొన్నాళ్లుగా శ్రీనువైట్ల మ్యాజిక్ తెరపై పని చేయడం లేదు. అందుకే ఈ సారి తన పంథా మార్చుకొని ‘విశ్వం’ తెరకెక్కించానని ఓ ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల చెప్పారు. సినిమాలో కామెడీ కొత్తగా ఉంటుందని బలంగా చెప్పారు. మరి సినిమాలో నిజంగా కొత్త కామెడీ ఉందా? కొత్తకథను చెప్పాడా? అంటే లేదనే చెప్పాలి.శ్రీనువైట్ల గత సినిమాల మాదిరే విశ్వం కథనం సాగుతుంది. టెర్రరిస్ట్ బ్యాగ్డ్రాప్ స్టోరీకి చైల్డ్ సెంటిమెంట్ జోడించి, తనకు అచ్చొచ్చిన కామెడీ పంథాలోనే కథనం నడిపించాడు. పాయింట్ బాగున్నా.. తెరపై చూస్తే మాత్రం పాత సినిమాలే గుర్తొస్తుంటాయి. ఫస్టాఫ్లో జాలిరెడ్డి(పృథ్వి), మ్యాంగో శ్యామ్(నరేశ్) కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. హీరోయిన్లో ప్రేమాయణం, యాక్షన్ సీక్వెన్స్ రొటీన్గా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్లో హీరో ప్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. ట్రైన్ ఎపిసోడ్ కూడా ప్రమోషన్స్లో చెప్పినంత గొప్పగా ఏమీ ఉండదు కానీ..కొన్ని చోట్ల మాత్రం నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్ కామెడీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. విలనిజం బలంగా లేకపోవడం కూడా సినిమాకు మైనస్సే. క్లైమాక్స్లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. గోపిరెడ్డి పాత్రకి గోపిచంద్ పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటి మాదిరే యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. స్టెప్పులు కూడా బాగానే వేశాడు. ప్లాష్బ్యాక్ స్టోరీలో గోపీచంద్ నటన బాగుంటుంది. కావ్యథాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. నరేశ్, పృథ్వీల కాంబోలో వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్లస్ అయింది. సునీల్ పాత్ర ఇంపాక్ట్ సినిమాపై అంతగా ఏమి ఉండదనే చెప్పాలి. సుమన్, ప్రగతి, వెన్నెల కిశోర్తో పాటు మిలిగిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. భీమ్స్ కంపోజ్ చేసిన 'గుంగురూ గుంగురూ' పాట థియేటర్లో ఈళలు వేయిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో తొలగించాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. -రేటింగ్: 2.25/5 -
విశ్వం అన్ని వర్గాలను అలరిస్తుంది: నిర్మాత కామెంట్స్
హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం విశ్వం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వేణు దోనేపూడి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 11న విడుదలవుతోన్న ఈ మూవీ విశేషాలను చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మీడియాతో పంచుకున్నారు.నిర్మాత వేణు మాట్లాడుతూ.. విశ్వం ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి కమర్షియల్ అంశాలతో అందరినీ అలరిస్తోంది. శ్రీను వైట్ల స్క్రిప్ట్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా కథనాన్ని శ్రీను వైట్ల తన స్టైల్లో రూపొందించారని అన్నారు.అనంతరం మాట్లాడుతూ.. ఇటలీలోని మిలాన్లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్. ఇందులో గోపీచంద్ అద్భుతంగా నటించారు. అతని కామెడీ టైమింగ్,యాక్షన్కు ఆడియెన్స్ ఫిదా అవుతారు. అతని కెరీర్లోనే విశ్వం అద్భుతంగా ఉంటుంది. శ్రీను వైట్ల, గోపీచంద్లతో కలిసి ఎన్నో విషయాల గురించి నేర్చుకున్నా. సినిమాల మీదున్న ప్యాషన్తోనే విశ్వం సినిమాను నిర్మించాను. చిత్రాలయం స్టూడియోలో అద్భుతమైన కథలు, సంగీతంతో ఆకట్టుకునే చిత్రాలను నిర్మించడం నా లక్ష్యం అని అన్నారు. -
'విశ్వం' నుంచి మాస్ సాంగ్ రిలీజ్
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మాస్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్కు మంచి ఆదరణ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. -
నవ్వు ఆపుకోలేక.. చాలామంది ఆర్టిస్టులకి సారీ చెప్పా : గోపీచంద్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత 'విశ్వం' కథ లైన్ గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్ గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్ కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన ఏడు నెలలు సమయం తీసుకొని విశ్వం కథని ఫాం చేరు. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల గారి మార్క్ తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్ గా వున్నాయి. → లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ విశ్వంలో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్ కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్ గా వచ్చాయి.→ శ్రీను వైట్ల గారి వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఇందులో ఉంది. అయితే అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్ కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. టర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, వీటి గణేష్, నరేష్ గారు, ప్రగతి గారు.. ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ట్రైన్ సీక్వెన్స్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న టెన్షన్ కూడా రన్ అవుతుంది. అది చాలా బాగుంటుంది.→ బేసిక్ గా ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. పాపకి ఏడేళ్లు ఉంటాయి. కానీ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పెర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. ఆ పాప కూడా ఈ సినిమాకి చాలా ప్లస్.→ శ్రీను వైట్ల గారి సినిమాల్లో కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ అయి ఉంటుంది. ఆయన ఈ రెండిటిని పర్ఫెక్ట్ బ్లడ్ తో తీసుకొస్తారు. మనం చెప్పాలనుకున్న కథని ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ఆడియన్స్ చక్కగా రిసీవ్ చేసుకుంటారని ఆయన నమ్మకం. అలానే ఆయన సక్సెస్ అయ్యారు. విశ్వం కూడా అంత బాగుంటుందని మా నమ్మకం.→ శ్రీను వైట్ల గారిలో నేచురల్ గానే ఒక సెటైరికల్ కామెడీ ఉంటుంది. ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంటుంది. ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది, ఆయన ప్రతి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. షూటింగ్ చేసేటప్పుడు ఆయన టైమింగ్ పట్టుకోవడానికి ఫస్ట్ టుడేస్ నాకు కొంచెం కష్టం అనిపించింది.→ ఇందులో నా క్యారెక్టర్ పేరు విశ్వం. అయితే రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లగారికి చెప్పాను. అయితే ఈ సినిమాకి 'విశ్వం' టైటిల్ యాప్ట్ అని ఆయన చెప్పారు.→ స్టోరీ విన్నప్పుడు బోర్ కొట్టకూడదు. ఎంగేజింగ్ గా ఉండాలి. కథని నేను ఒక ఆడియన్ లాగే వింటాను. బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ అనిపించినప్పుడు అలాంటి స్క్రిప్ట్ చేయడానికి ఇష్టపడతాను.→ ప్రభాస్తో సినిమా చేయాలని నాక్కుడా ఉంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం. -
ప్రేక్షకులకు నవ్వు ఆగదు: గోపీచంద్
‘‘విశ్వం’ చిత్రం షూటింగ్లో ప్రతి సన్నివేశం చేసేటప్పుడు నవ్వుకుంటూనే ఉన్నాం. వినోదం, యాక్షన్ అద్భుతంగా వచ్చాయి. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు నవ్వు ఆగదు... చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్క మాట చెప్పగలను... శ్రీను వైట్లగారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్’’ అని గోపీచంద్ అన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘శ్రీను వైట్లగారి సినిమా లో ఎంత వినోదం ఆశిస్తారో... అంతకు మించి ఇవ్వడానికి ఆయన ‘విశ్వం’ స్క్రిప్ట్పై దాదాపు 7 నెలలు పని చేశారు. నేను చాలా సినిమాలు చేశాను. ఆయన వద్ద ఉండే సౌకర్యం ఎక్కడా ఫీల్ అవ్వలేదు. రాజీ పడకుండా ఈ సినిమా తీసిన విశ్వప్రసాద్, చక్రపాణిగార్లకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ–‘‘విశ్వం’ అందమైన ప్రయాణం. ఈ సినిమాని అనుకున్నట్లు తీయగలిగా. ఈ చిత్రం అందర్నీ నవ్విస్తుందని వంద శాతం నమ్మకం ఉంది’’అని చెప్పారు. ‘‘విశ్వం’ పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. అందరూ మా సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘మా కుటుంబం 86 ఏళ్ల నుంచి సినిమాల్లో ఇన్వాల్వ్ అయింది. ‘విశ్వం’ నాకు తొలి సినిమా. ఇది మా హీరో సినిమా అని గోపీచంద్ అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుంది’’ అని వేణు దోనేపూడి పేర్కొన్నారు. -
గోపీచంద్ ‘విశ్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యాక్షన్ సినిమా చేయాలని ఉంది:కావ్యా థాపర్
‘‘ఓ నటిగా నాకు యాక్షన్, సైకో కిల్లర్, డీ గ్లామరస్.. ఇలా విభిన్న తరహాపాత్రలు చేయాలని ఉంది. అయితే నాకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ వస్తున్నాయి. ‘విశ్వం’లో నాకు మంచి క్యారెక్టర్ దక్కింది’’ అని అన్నారు హీరోయిన్ కావ్యా థాపర్. గోపీచంద్, కావ్యా థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వంలో వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కావ్యా థాపర్ చెప్పిన విశేషాలు.⇒ ఈ సినిమాలో నేను కాస్ట్యూమ్ డిజైనర్ రోల్ చేశాను. మోడ్రన్గా ఉండే అమ్మాయి. కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నా క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్ కనిపిస్తుంది... ఫన్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో సీనియర్ నరేశ్, పవిత్రగార్లు నా తల్లిదండ్రులు. శ్రీను వైట్లగారు మంచి నటన రాబట్టుకున్నారు. మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఈ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్లో నా క్యారెక్టర్లో కూడా ఫన్ ఉంటుంది. ఈ సినిమాలో పదిహేను మంది హాస్యనటులు నటించారు. ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. కథలో ఎమోషన్, యాక్షన్ కూడా ఉన్నాయి.⇒ ‘విశ్వం’ సినిమాను మల్టిపుల్ లొకేషన్స్లో చిత్రీకరించాం. మైనస్ 15 డిగ్రీల వాతావరణంలో సినిమా టీమ్ అందరూపాల్గొన్నాం. విదేశాల్లోనూ షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను నటించిన ‘ఈగిల్’కి కూడా విశ్వప్రసాద్గారే నిర్మాత. ఓ రకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీని హోమ్ బ్యానర్గా భావిస్తుంటాను. ఇక నాకు తెలుగు భాష అర్థం అవుతుంది. ఓ టీచర్ను నియమించుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. మూడు కొత్త సినిమాలకు సైన్ చేశాను. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. -
గోపీచంద్ యాక్షన్కు శ్రీను వైట్ల మార్క్ డైరెక్షన్తో 'విశ్వం' ట్రైలర్
గోపీచంద్ హీరోగా రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి భారీ యాక్షన్ ట్రైలర్ విడుదలైంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ సీన్స్తో పాటు మంచి కామెడీ కూడా ట్రైలర్లో చూపించారు. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి ఈ మూవీని నిర్మించారు. 'హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘విశ్వం’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది.ట్రైలర్తోనే సినిమాపై అంచనాలు పెంచేశారని చెప్పవచ్చు. శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్కు గోపీచంద్ యాక్షన్, కామెడీతో ఈ సినిమా ఉండనుంది. గోపీచంద్ని ఒక విభిన్నమైన పాత్రలో దర్శకుడు చూపించారు. ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో నటించారు. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోయేలా ఉంది. -
విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల
‘‘దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కానీ నా గత సినిమాల సన్నివేశాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఆడియన్స్ సినిమాలను చూసే తీరు మారిపోయింది. నా కామెడీ, యాక్షన్ సన్నివేశాలను ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. కానీ నా థీమ్ వారిని అలరించడం లేదని తెలుసుకున్నాను. ఆ దిశగా మార్పులు చేసుకుని, కొత్త థీమ్తో నా స్టైల్ ఆఫ్ మేకింగ్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాను. ‘విశ్వం’లో నా మార్క్ యాక్షన్, ఎమోషన్, ఆడియన్స్కు నచ్చే కొత్త థీమ్ను మేళవించేందుకు స్ట్రగుల్ అయ్యాను. కానీ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనెపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘విశ్వం’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన విశేషాలు.∙విశ్వం అనే ఓ క్యారెక్టర్ చేసే జర్నీయే ఈ సినిమా కథ. ఈ విశ్వంలో ఎన్నో సీక్రెట్స్ ఉంటాయంటారు. అలానే మా సినిమాలోని విశ్వం క్యారెక్టర్లోనూ ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. అవి థియేటర్స్లో చూడండి. నా గత చిత్రాల్లో కామెడీ, యాక్షన్ బలంగా ఉంటాయి. ఈ అంశాలతోపాటు మంచి ఎమోషనల్ డెప్త్ కూడా ఈ చిత్రంలో ఉంది. ఇలాంటి ఎమోషనల్ డెప్త్ ఉన్న సినిమా నేను చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలోనిపాప సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాగే ఓ అంతర్జాతీయ సమస్యని ఈ సినిమాలో ప్రస్తావించడం జరిగింది. ∙‘విశ్వం’లో గోపీచంద్ అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్గా ఉంటుంది. నా గత చిత్రం ‘వెంకీ’లోని ట్రైన్ ఎపిసోడ్ సక్సెస్ అయ్యింది.ఇప్పటికీ ఆ ఎపిసోడ్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ‘విశ్వం’లో కథ ప్రకారమే ట్రైన్ ఎపిసోడ్ పెట్టాం. ఈ చిత్రంలో ఆర్గానిక్ కామెడీ మాత్రమే ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ రియలిస్ట్గా ఉంటాయి. డిఫరెంట్ లేయర్స్, వేరియేషన్స్ ఉన్న ‘విశ్వం’ తరహా సినిమాకు మ్యూజిక్ చేయడం కష్టం. చేతన్ భరద్వాజ్ మంచి సంగీతం ఇచ్చారు. ఆర్ఆర్ ఇంకా బాగా చేశారు. అలాగే నా పని తీరు తెలిసిన గోపీ మోహన్తో మళ్లీ ఈ సినిమాకు పని చేశాను. ∙‘అమర్ అక్బర్ ఆంటోని’ (2018) సినిమా వల్ల నిర్మాతలకు నష్టం లేదు. కానీ ఈ సినిమా థియేటర్స్లో సరిగా ఆడకపోవడంతో ఆ ఎఫెక్ట్ నాపై పడింది. సినిమా అంటే ఆడియన్స్కు నచ్చేలా కూడా తీయాలని నాకు మరింత అర్థమైంది. వీటన్నింటినీ సదిదిద్దుకుని ‘విశ్వం’ చేశానని నేను నమ్ముతున్నాను. మా టీమ్ కూడా నమ్ము తోంది. ప్రేక్షకులు కూడా నమ్మి, ‘విశ్వం’ను హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ‘ఢీ’ సీక్వెల్గా ‘ఢీ2’ ప్రకటించాం. కానీ శ్రీహరిగారిపాత్రకు రీప్లేస్మెంట్ కుదరడం లేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను. -
'వస్తాను వస్తానులే' అంటోన్న గోపిచంద్.. రొమాంటిక్ సాంగ్ చూశారా!
టాలీవుడ్ స్టార్ గోపిచంద్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ చిత్రంలో డబుల్ ఇస్మార్ట్ భామ కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: 'మీరు అదే పనిలో ఉండండి'.. పవన్ కల్యాణ్కు మరోసారి కౌంటర్!)ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 'మొరాకన్ మగువా' అంటూ సాగే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'వస్తాను వస్తానులే' అంటూ సాగే లవ్ అండ్ రొమాంటిక్ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించగా.. వెంగి లిరిక్స్ అందించారు. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్, ఎమోషన్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. ఈనెల 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో జిషు సేన్గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. -
Viswam Movie: హార్ట్ టచ్చింగ్గా ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్
గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వం. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా బ్యానర్స్పై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువా' కూడా మంచి హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్ ని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసే హార్ట్ టచ్చింగ్ నంబర్ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.(చదవండి: ఓటీటీలో 'దేవర'.. అన్ని రోజుల తర్వాతేనా?)'అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు. మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపిచంద్ కు వున్న బాండింగ్ ని రివిల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. -
చిన్నారి తల్లీ.. కలకు భయపడకు
గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’ అంటూ సాగేపాటని విడుదల చేసింది చిత్రయూనిట్.‘మొండి తల్లి పిల్ల నువ్వు.. అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి, కలకు భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈపాటని సాహితీ చాగంటిపాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందిన చిత్రం ‘విశ్వం’. ఇటీవల విడుదలైన తొలిపాట ‘మొరాకో మగువా..’ కి మంచి స్పందన వచ్చింది. ‘తల్లి, కూతురు నేపథ్యంలో వచ్చే ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’పాట కథలోని భావోద్వేగాల లోతును తెలియజేస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్. -
గోపిచంద్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో గోపిచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: 'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ)ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మొరాకన్ మగువా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇప్పటికే విశ్వం టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్, ఎమోషన్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దసరాకు విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ వేట్టైయాన్తో పోటీపడనుంది. అయితే తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోవడం గోపిచంద్కు కలిసొచ్చే అవకాశముంది. అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కాగా.. ఈ చిత్రంలో జిషు సేన్గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. -
'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ
గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. శ్రీనువైట్ల దర్శకుడు. అప్పట్లో 'వెంకీ', 'దుబాయ్ శీను', 'ఢీ' తదితర సినిమాలతో తెలుగులో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీనువైట్ల.. ఆ తర్వాత రొటీన్ మూస తరహా స్టోరీలతో మూవీస్ తీశాడు. అవి ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'విశ్వం'.(ఇదీ చదవండి: 'బిగ్బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?)దసరా కానుకగా అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ చూస్తే శ్రీనువైట్ల మార్క్ కామెడీ కనిపించింది. అలానే తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే 'విశ్వం' కోసం మరోసారి నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు యాక్షన్, నాన్న అనే ఎమోషన్ కూడా చూపించారు.టీజర్ చూస్తే పర్వాలేదనిపిస్తోంది గానీ స్టోరీ ఏ మాత్రం రొటీన్గా ఉన్నాసరే ప్రేక్షకులు తిరస్కరించే ఛాన్స్ ఉంది. మరి 'విశ్వం' సినిమాతో గోపీచంద్-శ్రీనువైట్ల కాంబో ఏం చేస్తుందో చూడాలి? తెలుగులో దసరాకి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేం లేవు. తమిళ నుంచి రజినీకాంత్ 'వేట్టాయాన్' ఉంది. మరి రజనీ మూవీని తట్టుకుని 'విశ్వం' ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం) -
ధూం ధాం పాటలు బాగున్నాయి
‘‘ధూం ధాం’ టీజర్ ఆకట్టుకునేలా ఉంది.. పాటలు బాగున్నాయి. రామ్ కుమార్ మంచి నిర్మాత. డైరెక్టర్ సాయి అంకితభావం ఉన్న వ్యక్తి. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన గోపీమోహన్ ‘లౌక్యం’ సినిమా నుంచి నాతో పని చేస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్ అన్నారు. హెబ్బా పటేల్, చేతన్ కృష్ణ జంటగా సాయికిశోర్ మచ్చ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధూం ధాం’. ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం టీజర్ను గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల విడుదల చేశారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. ‘దుబాయ్ శీను’ నుంచి ‘బాద్షా’ వరకు నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడు సాయికిశోర్. రామ్ కుమార్గారు సినిమా మీద ప్యాషన్తో విదేశాల నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని సాయికిశోర్ మచ్చా తెలిపారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని ఎంఎస్ రామ్ కుమార్ చెప్పారు. -
మీ మద్దతు.. మీరే నా బలం: గోపిచంద్ ఎమోషనల్ పోస్ట్
గతేడాది రామబాణం మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం ఆయన విశ్వం చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనువైట్ల డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియో బ్యానర్లపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.అయితే గోపిచంద్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ కెరీర్లో సహకరించిన నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. అభిమానుల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని.. మీరే నా బలం అంటూ పోస్టులో రాసుకొచ్చారు. మీడియా మిత్రుల సపోర్ట్ మరువలేదని గుర్తు చేసుకున్నారు. మీ మద్దతు నాకు ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తూ.. విశ్వం సినిమాతో మళ్లీ కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. కాగా.. 2001 తొలివలపు మూవీతో గోపించంద్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జయం మూవీతో విలన్గా మెప్పించి.. హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 🙏❤️ pic.twitter.com/9XQhJYx7wV— Gopichand (@YoursGopichand) August 3, 2024 -
హై ఓల్టేజ్ యాక్షన్
గోపీచంద్ హీరోగా రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ్ర΄÷డక్షన్స్ చివరి దశలో ఉన్న ‘విశ్వం’ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ది జర్నీ ఆఫ్ విశ్వం’ అనే వీడియోను విడుదల చేశారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘విశ్వం’.శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్, యాక్షన్, కామెడీతో ఈ సినిమా ఉంటుంది. గోపీచంద్ని ఒక విభిన్నమైన పాత్రలో చూపిస్తున్నారు దర్శకుడు. సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయో తెలియజేయడంతో పాటు ఆడియన్స్లో ఎగ్జయిట్మెంట్ని క్రియేట్ చేసేలా ఈ వీడియోను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: చేతన్ భరద్వాజ్. -
కమ్బ్యాక్ కోసం ట్రైన్ కామెడీనే నమ్ముకున్న శ్రీనువైట్ల!
తెలుగులో కొన్ని క్లాసిక్ సినిమాలు తీస్తే 'వెంకీ' ఇందులో కచ్చితంగా ఉంటుంది. ఈ మూవీలోని కామెడీ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ట్రైన్లో వెంకీ తన గ్యాంగ్తో చేసే కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. ఎవరికైనా బోర్ కొడితే ఇప్పటికీ యూట్యూబ్లో ఎక్కువగా చూసే కామెడీ సీన్ ఏదైనా ఉందా అంటే అది 'వెంకీ ట్రైన్ కామెడీ'నే. ఇప్పుడు హిట్ కొట్టడం కోసం శ్రీనువైట్ల మళ్లీ దీన్ని నమ్ముకున్నారా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో అజిత్.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!)'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు' లాంటి సినిమాల్లో కామెడీతో తనకంటూ సెపరేట్ ట్రేడ్ మార్క్ సృష్టించిన శ్రీనువైట్ల.. ఆ తర్వాత వరస ప్లాఫులతో డౌన్ అయిపోయారు. ఓ దశలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయాడా అనుకున్నారు. కానీ ప్రస్తుతం గోపీచంద్తో 'విశ్వం' సినిమా తీస్తున్నాడు. తాజాగా 'జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో నిమిషం నిడివి ఉన్న వీడియోని రిలీజ్ చేశారు.వీడియో చూస్తుంటే ఫారెన్ లొకేషన్స్, ఫైట్స్ లాంటి కమర్షియల్ అంశాలు కనిపించాయి. కానీ ట్రైన్ కామెడీ సీన్స్ కూడా కనిపించాయి. టీటీఈతో హీరో అండ్ గ్యాంగ్ చేసే కామెడీ తరహా విజువల్స్ చూపించారు. అయితే హిట్ కోసం తహతహలాడుతున్న శ్రీనువైట్ల.. మళ్లీ తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే నమ్ముకున్నాడా అనిపిస్తుంది. 'వెంకీ' వచ్చినప్పటితో పోలిస్తే జనాల మైండ్ సెట్ మారిపోయింది. మరి వింటేజ్ శ్రీనువైట్ల తరహాలో ఈ ట్రైన్ కామెడీ బిట్ ఉంటుందా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
గోపీచంద్ 'విశ్వం' టీజర్ రిలీజ్.. కామెడీ కాదు ఈసారి యాక్షనే!
శ్రీనువైట్ల.. ఈ పేరు చెప్పగానే ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మీమ్స్ లో ఉండే సగం సినిమాలు ఈయన తీసినవే. కానీ తర్వాత తర్వత ట్రెండ్ కి తగ్గ మూవీస్ చేయలేక సైడ్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత సినిమా చేశాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. (ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!) అప్పుడెప్పుడో 'బాద్ షా'తో ఓ మాదిరి హిట్ కొట్టిన శ్రీనువైట్ల.. ఆగడు, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి చిత్రాలతో వరస ఫ్లాప్స్ దెబ్బకు సైడ్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు ఇక సినిమాలు చేయడేమో అని అందరూ అనుకున్నారు. కానీ గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకి 'విశ్వం' అని టైటిల్ ఫిక్స్ చేసి, టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే శ్రీనువైట్ల ఈసారి కామెడీని కాకుండాయాక్షన్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు శ్రీనువైట్లతో పాటు గోపీచంద్ కి కూడా చాలా అవసరం. మరి ఏం చేస్తారో చూడాలి? బహుశా ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఎట్టకేలకు ఓటీటీకి గోపిచంద్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. టెంపుల్ బ్యాక్డ్రాప్లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అభిమానులు అంతా భావించారు. గతవారమే ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో భీమా ఓటీటీ కొత్త తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఉగాది సందర్భంగా అఫీషియల్ డేట్ను రివీల్ చేసింది. ఈనెల 25 నుంచి భీమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. Surprise surprise! Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024 -
కొత్త పాయింట్తో...
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్తో కలిసి చిత్రాలయం స్టూడియోస్పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్బస్టర్స్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
ఓటీటీలో గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఆ రోజేనా..?
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన భీమా డిజిటల్ రైట్స్ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్డ్రాప్లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్ మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
భీమాని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్
‘‘భీమా’ సినిమా బాగుంది. యాక్షన్, కామెడీ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్స్లో మంచి వేరియేషన్స్ చూపించారని మంచి అప్లాజ్ వస్తోంది. ఇంత మంచి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన థ్యాంక్స్ మీట్లో దర్శకులు మారుతి, సంపత్ నంది అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘భీమా’ వంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన దర్శకుడు హర్షకు, నిర్మాత రాధామోహన్గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘భీమా’కు ఆడియన్స్ నుంచి లభిస్తోన్న స్పందన సంతోషాన్నిస్తోంది’’ అన్నారు హర్ష. ‘‘రోజు రోజుకీ మా సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. విద్యార్థుల పరీక్షలు పూర్త య్యాయి. చూడనివారు మా సినిమాను చూడండి’’ అన్నారు రాధామోహన్. మాళవికా శర్మ మాట్లాడారు. -
శ్రీకాంత్ మేనకోడలితో గోపీచంద్ పెళ్లి.. ఎవరు సెట్ చేశారో తెలుసా?
గోపీచంద్... కెరీర్ ప్రారంభంలో హిట్ల మీద హిట్లు కొట్టాడు. హీరోగా, విలన్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ రానురానూ ఈ హీరోకు అవకాశాలు తగ్గాయి. చేసిన నాలుగైదు సినిమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అయితే ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన భీమా మూవీ మాత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా పర్వాలేదనిపిస్తోంది. చూడగానే నచ్చేసింది తాజాగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ హీరో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనది ప్రేమ వివాహమని తెలిపాడు. గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఒకసారి రేష్మ ఫోటో చూశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్సయ్యాను. తర్వాత ఆమె శ్రీకాంత్ మేనకోడలు అని తెలిసింది. అప్పటికే నాకు శ్రీకాంత్తో పరిచయం ఉంది కానీ ఈ విషయం డైరెక్ట్గా మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించింది. ఆయనే మధ్యవర్తిత్వం అందుకే నటుడు చలపతిరావు అంకుల్కు విషయం చెప్పాను. ఆయన మధ్యవర్తిత్వం చేశారు. శ్రీకాంత్తో మాట్లాడి పెళ్లి సెట్ చేశారు. ఆయనే పెళ్లికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకున్నారు. రేష్మ నాకు ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్.. టీషర్ట్' అని చెప్పుకొచ్చాడు. కాగా 2013లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీతారలతో పాటు రాజకీయప్రముఖులు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం గోపీచంద్- రేష్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: ఆమె ఎక్కడుంటే అక్కడ నాశనమే.. రెండో పెళ్లితో సంతోషంగా ఉన్నా.. -
క్లాప్స్.. విజిల్స్ పడుతూనే ఉన్నాయి
‘‘భీమా’ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీలో ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో ఎమోషన్ని అద్భుతంగా ఎలివేట్ చేస్తూ ఫైట్స్ డిజైన్ చేశారు రామ్–లక్ష్మణ్ మాస్టర్స్. చివరి అరగంట థియేటర్స్లో ప్రేక్షకుల నుంచి క్లాప్స్, విజిల్స్ పడుతూనే ఉన్నాయి. ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరో గోపీచంద్. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో గోపీచంద్ మాట్లాడుతూ–‘భీమా’ లాంటి మంచి మూవీతో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకునేలా చేసిన హర్షకి ధన్యవాదాలు. రాజీ పడకుండా సినిమాని గ్రాండ్గా నిర్మించిన రాధామోహన్, శ్రీధర్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మా భీమా’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు కేకే రాధామోహన్. ‘‘భీమా’లో ఇంటర్వెల్, క్లైమాక్స్లో ప్రేక్షకుల కేరింతలు చూసి సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఎ. హర్ష. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్ (ఫోటోలు)
-
‘భీమా’ మూవీ రివ్యూ.. 'గోపీచంద్' హిట్ కొట్టాడా..?
టైటిల్: భీమా నటీనటులు: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్,మాళవిక శర్మ,నాజర్,వెన్నెల కిషోర్,నరేష్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాత: కేకే రాధామోహన్ దర్శకత్వం: ఏ. హర్ష సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ సంగీతం: రవి బస్రుర్ విడుదల తేది: మార్చి 8, 2024 భీమా కథేంటంటే సినిమా ప్రారంభంలోనే పరశురాముడి కథతో ప్రారంభం అవుతుంది. ఒకానొక సమయంలో పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడిని కోరాడు. సముద్రంలో గొడ్డలిని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో భార్గవరాముడు గొడ్డలి విసిరాడు. దీంతో సముద్రం వెనక్కు వెళ్లింది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమా కథ బాదామితో పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో కథ జరుగుతుంది. కేరళలోని మహేంద్రగిరిలో సినిమా కథ మొదలౌతుంది. ఆ ప్రాంతంలో అరాచక శక్తులతో అల్లకల్లోలంగా ఉంటుంది. అక్కడి ప్రజలతో పాటుగా పోలీసు వ్యవస్థను శక్తి భవాని (ముఖేష్ తివారి) గడగడలాడించే స్థాయిలో ఉంటాడు. పెట్రోల్ ట్యాంకర్స్ మాటున అతను చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. మహేంద్రగిరిలో తనకు అడ్డు తగిలేవాడు ఎవడూ లేడని శక్తి భవాని తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరో వైపు భీమా కథలో పరశురామ క్షేత్రం అనే ఊరు తెరపైకి వస్తుంది. ఆ ఊరులో గత యాభైఏళ్లుగా మూత పడిన శివాలయాన్ని తన అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటాడు భవాని. సరిగ్గా అలాంటి సమయంలో ఎస్సైగా మహేంద్రగిరిలోకి ఎంట్రీ ఇస్తాడు భీమా (గోపీచంద్)... ఈ క్రమంలోనే విద్య (మాళవికా శర్మ) ఎంట్రీ ఇస్తుంది. విద్య ఒక స్కూల్లో పనిచేస్తూనే మొక్కలపై పరిశోధనలు కూడా చేస్తూ ఉంటుంది. పరశురామ క్షేత్రంలో ఆయుర్వేద వైద్యుడిగా రవీంద్రవర్మ (నాజర్) ఉంటారు. ఆయన దగ్గర విద్య మొక్కలపై పలు పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ రవీంద్రవర్మ ప్రజలకు వైద్యం చేస్తూ దగ్గరగా ఉంటే.. శక్తి భవాని ప్రజలను భయపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో మరణించిన మనిషిని కూడా బతికించే మందును కనిపెట్టాలని ఆయుర్వేద వైద్యంలో పలు పరిశోధనలు చేస్తుంటాడు రవీంద్రవర్మ.. ఇలా ఆసక్తిగా నడుస్తున్న కథలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ కథలో పెట్రోలు ట్యాంకర్స్ మాటున భవాని చేస్తున్న అక్రమ వ్యాపారం ఏంటి..? భీమాని అడ్డుకోవటం కోసం భవాని పన్నిన వ్యూహం ఏమిటి..? విలన్లను ఎదుర్కొనే క్రమంలో భీమా ఏం అయ్యాడు..? ఎప్పుడో చిన్నతనంలో విడిపోయిన తన తమ్ముడు రామా (గోపీచంద్) కథలోకి ఎలా వచ్చాడు..? పరశురామ క్షేత్రంలో ఉన్న శివాలయం 50 ఏళ్లుగా ఎందుకు మూత పడింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినిమా చూస్తున్నంత సేపు అందరిలో కలుగుతాయి. ప్రీ క్లైమాక్స్లో రివీల్ అయ్యే అసలు ట్విస్ట్ ఏమిటి..? ఇవన్నీ తెలియాలంటే 'భీమా' చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా ప్రారంభంలోనే పరశురాముడి గురించి చెప్పడం.. ఆపై పరశురామ క్షేత్రంలోని శివాలయంలో జరిగే కొన్ని సంఘటనలు చూపించడంతో కథ అంతా మానవాతీత శక్తులతో నిండి ఉంటుందని అనుకుంటాం కానీ అదేమీ కాదని 15 నిమిషాల్లోనే తెలిపోతుంది. అక్కడ నుంచి రోటీన్ కమర్షియల్ స్టోరీతో సినిమా జరుగుతుంది. ఫస్టాఫ్లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా సినిమాల్లో కనిపించిందే ఉంటుంది. కథ ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా చెప్పిన కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష కొంత సమయం తర్వాత మెల్లిమెల్లిగా స్టోరీపై పట్టు కోల్పోయాడు. సినిమా ప్రారంభంలో చెప్పిన శివాలయం పాయింట్ను చివరి వరకు ఎక్కడా ప్రస్థావన ఉండదు. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలి.. ఎందుకంటే గోపీచంద్ రెండు పాత్రలు చేశాడు.. ఆపై గుడి కాన్సెప్ట్ ఉంది. కథలో ప్రేక్షకుడు లీనం అయ్యేలా తెరకెక్కించాలి. కానీ భీమాలో అది కాస్తా మైనస్గా మారింది. కమర్షియల్ టచ్ ఉన్న స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్ను చేర్చి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా గోపీచంద్, మాళవికా శర్మ మధ్య ఉండే లవ్ ట్రాక్ కాస్త తగ్గించి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. కన్నడ చిత్ర సీమలో కొరియోగ్రాఫర్గా కెరియర్ స్టార్ట్ చేసిన ఏ. హర్ష శివరాజ్కుమార్తో 'వేదా' చిత్రాన్ని తీసి తెలుగు వారికి దగ్గరయ్యాడు. దీంతో గోపీచంద్తో భీమా సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ ఆయనకు దక్కింది. సినిమాలో గోపీచంద్ నటనకు ఎలాంటి పేరు పెట్టాల్సిన పనిలేదు.. రెండు పాత్రలలో ఆయన ఇరగదీశాడు.. సినిమా మొత్తం సింగిల్ హ్యాండ్తో నడిపించాడు. సినిమా స్టోరీ అంతా కూడా ఫాంటసీ ఎలిమెంట్తో డైరెక్టర్ తెరకెక్కించి ఉండుంటే భారీ హిట్ కొట్టేది అని చెప్పవచ్చు. ఎవరెలా చేశారంటే.. భీమాగా పోలీసు గెటప్లో కనిపించిన గోపీచంద్.. రామాగా పురోహితుడి పాత్రలో కూడా కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్లలో ఇరగదీశాడని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ ఆయన చక్కగా నటించాడు. ఇక సినిమాలో గోపీచంద్ తర్వాత నాజర్ పాత్ర అందరినీ మెప్పిస్తుంది. తెరపై గోపీచంద్ మాళవికా శర్మ,ప్రియా భవానీ శంకర్ల కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. పోలీసు పాత్రలో గోపీచంద్ ఉన్నంత సేపు ప్రేక్షకులో ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఫైట్ అందరినీ కట్టిపడేస్తుంది. విలన్గా నటించిన శక్తి భవానీని డైరెక్టర్ అంతగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్,నరేష్, పూర్ణ,నాజర్ వంటి స్టార్స్ వారి పరిధిమేరకు మెప్పించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన అందించిన బీజీఎమ్ సినిమాపై పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేస్తుంది. పాటలు అంతగా నోటెడ్ కాకపోయినప్పటికీ తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్ ప్లే మరికొంత బలంగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు అనిపిస్తాయి. సినిమా చివరిలో 30 నిమిషాల పాటు దర్శకుడి చూపిన పని తీరుకు ఎక్కువ మార్కులు పడుతాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్ డెస్క్ -
గోపీచంద్ 'భీమా' టాక్ ఎలా ఉందంటే..
గోపీచంద్ హీరోగా నటించిన భీమా నేడు (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందొ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. భీమా భారీ యాక్షన్ మూవీ అని ఓవర్సీస్ ఆడియెన్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. గోలీమార్ తర్వాత మరోసారి పోలీస్ అవతారంలో గోపీచంద్ మెప్పించాడని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో ఉన్న గోపీచంద్కు ఈ సినిమా కాస్త రిలీఫ్ ఇస్తుందని అంటున్నారు. ముఖ్యంగా గోపీచంద్ కటౌట్గా తగ్ కథ భీమాతో కుదిరిందని నెటిజన్లు అంటున్నారు. డ్యూయల్ షేడ్ క్యారెక్టర్లోగోపీచంద్ తన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారని పేర్కొంటున్నారు. పరుశురామ క్షేత్రం ఎపిసోడ్లో గోపీచంద్ శివతాండవం చేశాడని నెట్టింట వైరల్ అవుతుంది. ముఖ్యంగా గోపీచంద్కు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంత మేరకు తోడు కావడంతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. భీమా సినిమాకు ప్రధానంగా యాక్షన్ సీక్వెన్స్లు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ రేంజ్లో ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన బీజీఎమ్ పీక్స్కు వెళ్తుందని ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. చాలా సీన్స్కు ఆయన ఇచ్చిన ఎలివేషన్ బీజీఎమ్తోనే సినిమాకు మేజర్ ప్లస్ అయిందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ కెరీర్లో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా భీమా రికార్డుకెక్కింది. భీమాతో గోపీచంద్ మళ్లీ హిట్టు ట్రాక్లోకి వచ్చాడని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఫ్యాన్స్కు మాత్రం భీమాతో బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చాడని తెలుపుతున్నారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని గ్యారెంటీగా భీమా మెప్పిస్తుందని కామెంట్ల చేస్తున్నారు. @YoursGopichand Nee Cutout Ki Padalsina Cinema Ani Strong Feeling 🔥 Expecting Macho Star Mass Blockbuster#BHIMAA #BhimaaFromToday pic.twitter.com/tqV9dTnFLS — ST (@Iconic_Powerism) March 7, 2024 INSIDE INFO : #BHIMAA - INTERVAL IS GOOD & CLIMAX IS MAJOR HIGHLIGHT OF THE FILM 🔥🔥🔥🔥🔥#Gopichandh pic.twitter.com/CFKRcFYn6X — GetsCinema (@GetsCinema) March 7, 2024 interval ❌ climax🥵🥵🥵#BhimaaFromToday #BHIMAA pic.twitter.com/0Bo9uiZVoA — Santhosh (@Santhosh_offl8) March 8, 2024 The Backbone Of The Film @RaviBasrur .... You're One Of The Reason To Witness #BHIMAA .... Definitely Your Music Gonna Resound More 🔥❤️🔥💥🔥❤️🔥💥 declaring MASSive Blockbuster in advance #BHIMAA#Gopichand #BHIMAA @BhimaaMovie pic.twitter.com/TjajnXcVR1 — Surya Sujith (@ntrfansujith) March 7, 2024 Telugu audience always failed to encourage our gem of actors like #gopichand films like sahasam, okkadunnadu & Gautham nanda deserved so much love. Unfortunately Telugu audience were busy praising other language films. #bhimaa #Gaami pic.twitter.com/EIVkV0TtBH — Theinfiniteview (@theinfiniteview) March 8, 2024 -
Bhimaa: ఎమోషన్.. ఎలివేషన్.. ఎంటర్టైన్మెంట్తో పాటు సందేశం
‘‘సినిమాలో ఏ మాత్రం ల్యాగ్ ఉన్నా సరే థియేటర్స్లో ఆడియన్స్ మొబైల్ ఫోన్స్ చూస్తున్నారు. సో... ఆడియన్స్ను ఎంగేజ్ చేయాలంటే మంచి స్క్రీన్ ప్లే ఉండాలి. ‘భీమా’లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది. ఎలివేషన్.. ఎమోషన్.. ఎంటర్టైన్మెంట్లతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో ‘భీమా’ చిత్రంలో ఓ సామాజిక సందేశం కూడా ఉంది’’ అన్నారు దర్శకుడు ఎ. హర్ష. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ఈ నెల 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో ఎ.హర్ష మాట్లాడుతూ– ‘‘కరోనా సెకండ్ వేవ్ సమయంలో ‘భీమా’ చిత్రం సహనిర్మాత శ్రీధర్గారు ఓ కథ ఉంటే చెప్పమన్నారు. ఆన్లైన్లో గోపీచంద్గారికి ‘భీమా’ స్టోరీలైన్ చెప్పాను. ఆ తర్వాత ఫుల్ స్టోరీ చెప్పాను. ఆయనకు నచ్చింది. చిన్న మార్పులు సూచించారు. ఆ తర్వాత సెట్స్పైకి వెళ్లాం. గోపీచంద్గారు అద్భుతమైన నటుడు. ఆయన చేసిన ‘భీమా’ పాత్రను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రాధామోహన్గారు నిర్మించిన ‘బెంగాల్ టైగర్’కు కొరియోగ్రాఫర్గా చేశాను. ఇప్పుడు ఆయన నిర్మించిన సినిమాకు దర్శకత్వం వహించడం హ్యాపీ’’ అన్నారు. -
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: హీరో గోపీచంద్
‘‘భీమా’ పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. నేను చేసిన భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలున్నాయి. ఈ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ని హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది. సినిమా చూసి బయటికి వచ్చాక ప్రేక్షకుల మనసులో భీమా నిలిచిపోతాడనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు. ► ‘భీమా’ సహనిర్మాత శ్రీధర్గారు కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. అప్పుడో కథ చెప్పాడు హర్ష.. కథ బావుంది కానీ ఆ సమయంలో చేయకూడదని అనిపించింది. పోలీస్ నేపథ్యంలో ఏదైనా వైవిధ్యమైన కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్న హర్ష ఆ తర్వాత వచ్చి ‘భీమా’ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ► నేను గతంలో పోలీసు పాత్రలు చేశాను. ‘గోలీమార్’లో డిఫరెంట్ కాప్. ‘ఆంధ్రుడు’ లవ్ స్టోరీ నేపథ్యంలో నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథే. ‘శౌర్యం’ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పోలీస్ పాత్రని ‘భీమా’లో చేశాను. ఈ పోలీసు కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది.. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. హర్ష కన్నడలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ‘భీమా’ని అద్భుతంగా తీశాడు.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► ‘భీమా’ పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ట్రైలర్లో చూపించినట్లు అఘోరాలు, కలర్ ప్యాలెట్, నేపథ్య సంగీతం వల్ల ‘అఖండ’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉంది. పైగా సినిమా కూడా మహా శివరాత్రికి వస్తోంది. అయితే దీన్ని మేం ముందుగా ప్లాన్ చేయలేదు.. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను. ► నిర్మాత రాధామోహన్, నా కాంబినేషన్లో ‘పంతం’ (2018) సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పంతం’ వాణిజ్య పరంగా సక్సెస్ అయినా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ, ‘భీమా’తో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాని చాలా గ్రాండ్గా నిర్మించారాయన. ► మా నాన్న (డైరెక్టర్ టి. కృష్ణ)తో పాటు ఆ తరంలోని దర్శకులు జనాలతో మమేకం అయ్యేవారు. అలా ప్రజల సాధక బాధకాలు, సమస్యలు తెలుసుకుని కథ రాసుకుని, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి హిట్ సాధించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకర్గారి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగిలిన వారు సమాజం, ప్రజల నేపథ్యంలో కథలు రాయడం లేదు. సొసైటీ బ్యాక్డ్రాప్ని ఎంచుకుని సరైన విధానంలో తెరపై చూపించగలిగితే ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. దర్శకత్వం అనేది చాలా కష్టమైన పని.. అందుకే నాకు ఆ ఆలోచన లేదు. ► చిత్ర పరిశ్రమలో దాదాపు 22 ఏళ్ల ప్రయాణం నాది.. ఇన్నేళ్ల జర్నీ హ్యాపీగా ఉంది కానీ నటుడిగా పూర్తిగా సంతృప్తి పడటం లేదు. ఒక నటుడికి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ, ఆ చాన్స్ రాలేదు.. వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాం. ప్రస్తుతం శ్రీను వైట్లగారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ఆ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లతో ఓ చిత్రం, యూవీ క్రియేషన్స్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. -
‘భీమా’ డిఫరెంట్ కాప్ స్టోరీ..ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి: గోపీచంద్
‘ఇప్పటికే నేను పలు సినిమాల్లో పోలీసు పాత్రలు చేశాను. గోలీమార్ డిఫరెంట్ కాప్ స్టోరీ. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. లాంటి పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో గోపీచంద్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం రీలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కోవిడ్ టైమ్లో దర్శకుడు హర్ష నాకొక కథ చెప్పారు. అది బాగుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీసుకి సంబధించి ఏదైనా డిఫరెంట్ కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా 'కథ' చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. అలా కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైయింది. ► భీమా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో చాలా ఇంటన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రోమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూసి బయటికి వచ్చాక భీమా ప్రేక్షకుడి మనసులో నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ► ఈ చిత్రాన్ని చాలా మంది 'అఖండ' తో పోలుస్తున్నారు. కానీ ఆ కథతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వల్ల అలా అనిపించవచ్చు ఏమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా 'అఖండ' పోలిస్తే మంచిదేగా (నవ్వుతూ). భీమా పరశురామక్షేత్రంలో జరిగే కథ. అందుకే అలాంటి నేపధ్యం తీసుకున్నాం. ► హర్ష చాలా అనుభవం వున్న దర్శకుడు. చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే చేశాడు. చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, మలుపులు, సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు అదే పేరు యాప్ట్ అని టైటిల్ గా పెట్టడం జరిగింది. ► ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. కథకు కావాల్సిన పాత్రలు. పాత్రలకు ఒక పర్పస్ ఉంటుంది. ► రవిబస్రూర్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయింది. ట్రైలర్ లో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. దానికి మించి సినిమాలో ఉంటుంది. మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశాడు. ► ప్రస్తుతం శ్రీను వైట్ల గారితో ఓ సినిమా చేస్తున్న. ముఫ్ఫై శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. తర్వాత ప్రసాద్ గారితో ఒక సినిమా ఉంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో ఉంటుంది. -
నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు: గోపీచంద్
మ్యాచో హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'భీమా'. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో వరంగల్లోని హన్మకొండలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. అందులో డౌటే లేదు ప్రీరిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్షను పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను... కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు' అని చెప్పారు. ఆయన నవ్వుతోనే ఎనర్జీ.. దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. 'భీమాలో ఎనర్జీ పవర్ వుంది. గోపిచంద్ గారు ఎంతో అద్భుతమైన వ్యక్తి. చాలా హంబుల్గా ఉంటారు. ఆయన నవ్వుతో మాకు ఎనర్జీ వస్తుంది. మార్చి 8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. థియేటర్స్లో హై ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది' అన్నారు. రఘు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, రమణ లంక, కళ్యాణ్ చక్రవర్తితో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. చదవండి: సడన్గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి -
Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా హీరోయిన్
టాలీవుడ్లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. మరోవైపు పాత హీరోయిన్లు మెల్లమెల్లగా కనుమరుగు అవుతూనే ఉంటారు. ఫ్లాప్స్ పడ్డోళ్లు వెళ్లపోయారంటే ఓ అర్థముంది. కానీ బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన తర్వాత కొందరు బ్యూటీస్ సైడ్ అయిపోతుంటారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి స్టోరీనే. తెలుగులో ఒక్కటే సినిమాతో అద్భుతమైన క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల్నే పక్కనబెట్టేసింది. మరి ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మూన్ మూన్ బెనర్జీ. కనీసం ఈ పేరు కూడా ఎప్పుడూ విన్నట్లు లేదే అని అనుకుంటున్నారా? కంగారూ పడకుండి. గోపీచంద్కి హీరోగా బ్రేక్ ఇచ్చిన ఫస్ట్ మూవీ 'యజ్ఞం' గుర్తుందా? అందులో హీరోయిన్గా చేసింది ఈమెనే. కోల్కతాకు చెందిన మూన్ మూన్ బెనర్జీ.. 1997 నుంచి హిందీ సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో హీరోయిన్గా ఛాన్స్ రావడంతో తెలుగులో మూవీ చేసింది. మరి ఏమైందో ఏమో గానీ 'యజ్ఞం' తర్వాత తెలుగుతో పాటు వేరే ఏ భాషలోనూ సినిమా చేయలేదు. సీరియల్స్ మాత్రం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా 'దోరీ' అనే సీరియల్లో నటిస్తోంది. అయితే టాలీవుడ్లో చేస్తున్నప్పుడు యుక్త వయసులో ఉంది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కనిపించలేదు. తాజాగా వయసు పెరగడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇకపోతే 2010లో నీరజ్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Moon banerrjee (@moonbanerrjee) -
ప్రభాస్తో సినిమా? క్లారిటీ ఇచ్చిన మ్యాచో స్టార్
ఒకప్పుడు విలన్.. తర్వాత హీరో.. ఎన్నో సూపర్ హిట్స్ చూసిన గోపీచంద్ ప్రస్తుతం ఒక్క హిట్టు కోసం పరితపిస్తున్నాడు. ఆయన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతుండటంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు. తన ఆశలన్నీ భీమా సినిమాపైనే పెట్టుకున్నాడు. కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 8న రిలీజ్ కానుంది. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్స్గా నటించారు. అలా చెప్పుకోవడం ఇష్టముండదు తాజాగా ఓ షోకి హాజరైన గోపీచంద్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నువ్వు చాలామందిని చదివిస్తున్నావు.. ఎందుకని బయటకు చెప్పుకోవడం లేదు అని యాంకర్ అడిగాడు. అందుకు హీరో స్పందిస్తూ.. నాకలా చెప్పుకోవాలని ఉండదు. ఎవరైతే బాగా చదువుతారో వారికి సాయం చేద్దామనుకుంటాను. కొంతమందికైతే ఆ చదివించేది నేనేనని కూడా తెలియదు అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్-గోపీచంద్ కాంబినేషన్లో సినిమా వస్తుందా? అన్న ప్రశ్నకు.. కచ్చితంగా ఓ సినిమా చేస్తామని చెప్పాడు. కానీ అదెప్పుడు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమన్నాడు. చదవండి: ఇప్పటికే మూడు ప్లాస్టిక్ సర్జరీలు పూర్తి.. అయినా కోలుకోలేని స్థితిలో.. -
Bhimaa HD Photos: గోపీచంద్ ‘భీమా’ మూవీ స్టిల్స్
-
రాక్షసులపై యుద్ధం .. ట్రెండింగ్లో ‘భీమా’ ట్రైలర్
‘శ్రీ మహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు’ అంటూ సాగుతుంది ‘భీమా’ ట్రైలర్. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ కథానాయికలు. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు ఒక డిఫరెంట్ గోపీచంద్ని చూస్తారు’’ అన్నారు ఎ. హర్ష. ‘‘శివరాత్రికి శివుని ఆశీస్సులతో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను’’ అన్నారు రాధామోహన్. -
నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ ఎంత మంచి యాక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వ్యక్తిగత జీవితం ఏంటనేది పక్కనబెడితే యాక్టింగ్ పరంగా ప్రతి సినిమాతోనూ మెస్మరైజ్ చేస్తుంటాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి బయట పెద్దగా కనిపించని ఈయన.. తాజాగా 'భీమా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఫుల్ జోష్తో మాట్లాడాడు. అలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేయడం విశేషం. (ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలతో హీరోయిన్ ప్రగ్యా.. తమన్నాని చూస్తే తట్టుకోవడం కష్టమే!) దివంగత హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కానీ నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వందలాది చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రాబోతున్న గోపీచంద్ 'భీమా' సినిమాలోనూ నరేశ్ మంచి పాత్రే చేసినట్లు ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇందులో ఫుల్ జోష్తో స్పీచ్ ఇచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత తనని చూసి అందరూ (అబ్బాయిలని ఉద్దేశించి) కన్నుకొడతారని నవ్వుతూ చెప్పాడు. అయితే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశాడనేది కొన్నిరోజులు ఆగితే తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
ట్రెండ్కి తగ్గట్లే 'భీమా' ట్రైలర్.. కాకపోతే ఆ విషయమే?
తెలుగు హీరోల్లో కొందరి పరిస్థితి దారుణంగా ఉంది. సినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే మాట చాలా కాలమైంది. ఇలాంటి వాళ్లలో గోపీచంద్ ఒకడు. సిక్స్ ఫీట్ కటౌట్తో పాటు హీరోకి ఏమేం కావాలో అన్ని ఉన్నాయి ఒక్క హిట్ తప్ప. దీంతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని తాపత్రయంతో ఉన్నాడు. అలా 'భీమా' చిత్రంతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 'భీమా' ఫస్ట్ లుక్, టీజర్ అవి చూస్తే ఇది యాక్షన్ సినిమా అని అర్థమైంది. తాజాగా ట్రైలర్తో ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఓ ఊరు, అందులో విలన్స్, హీరో పోలీస్, కొన్ని సమస్యలు వస్తాయి. హీరో వాటిని ఎలా ఎదిరించాడు? ఈ కథలో ఇంకో గోపీచంద్ కూడా ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. మరి ఇద్దరు గోపీచంద్లా? లేదా ఒకడే ఇద్దరా అనేది సినిమా వస్తే తెలుస్తోంది. ట్రైలర్ పరంగా చూస్తుంటే ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లు డివోషనల్ ప్లస్ యాక్షన్ సన్నివేశాలతో ఉంది. అయితే ట్రైలర్లోనే చాలావరకు స్లో మోషన్ షాట్స్ ఉన్నాయి. దీనిబట్టి చూస్తుంటే సినిమాలోనూ ఫైట్ సీన్స్, స్లో మోషన్ షాట్స్ లాంటివి గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. అయితే ఈ తరహా యాక్షన్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. అయితే 'భీమా'లో దీన్ని మించి ఏముంటుందనేది చూడాలి. అలానే ఇది హిట్ కావడం గోపీచంద్ కి చాలా అవసరం కూడా! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
గల్లీ సౌండుల్లో భీమా
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కేకే రాధామోహన్ నిర్మించిన ‘భీమా’ మార్చి 8న రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లీ సౌండుల్లో..’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. రవి బస్రూర్, సంతోష్ వెంకీ రాసిన ఈ పాటను సంతోష్ వెంకీ పాడారు. ‘‘గోపీచంద్ పాత్ర గురించి చెప్పే ట్రాక్ ఇది. ఈ పాట మాస్ని అల రించేలా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్
బల్లికురవ: ఆత్మహత్యాయ్నతం చేసిన ఓ యువకుడి ప్రాణాలను వలంటీర్ కాపాడాడు. ప్రాథమిక చికిత్స చేసి సకాలంలో ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో శనివారం జరిగింది. కుంచాల సుభాషిణి, కనకారావు దంపతుల కుమారుడు గోపీచంద్ (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. కనకారావు ఐదేళ్లుగా గ్రామంలో లేడు. సుభాషిణి తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉంటూ తనకున్న పొలంతోపాటు కుమారుని సాయంతో గొర్రెలను మేపుతోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు అనారోగ్యం బారిన పడ్డాడు. గోపీచంద్ గొర్రెల కాపలాకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతడిని సుభాషిణి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన గోపీచంద్ ఇంట్లోనే పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని గమనించిన తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అక్కడే ఉన్న సీ వన్ క్లస్టర్ వలంటీర్ బత్తుల రమేశ్బాబు..గోపీచంద్ పురుగుమందు తాగినట్లు గుర్తించాడు. బీఎస్సీ నర్సింగ్ చదివిన వలంటీర్.. గోపీచంద్కు ప్రాథమిక చికిత్స చేసి తాగిన పురుగు మందును కక్కించాడు. మెరుగైన చికిత్స కోసం 35 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రావడం ఆలస్యమవుతుందని భావించి మరొకరి సహాయంతో బైక్పైనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందడంతో గోపీచంద్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్ను గ్రామ సచివాలయ కార్యదర్శి షేక్.బాజీ, ఎంపీడీవో హనుమారెడ్డి, ఈవోఆర్డీ దాసరి సుమతి అభినందించారు. -
గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఎప్పుడంటే?
రామబాణం తర్వాత మాచో స్టార్ గోపీచంద్ చేస్తున్న చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. అతనికి జంటగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ నటిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు గోపీచంద్ ట్వీట్ చేశారు. దీంతో గోపీచంద్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. గతేడాది నటించిన రామబాణం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపిచంద్కు కలిసొచ్చే పోలీస్ పాత్ర గోపీచంద్ 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్స్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా.. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. హరహర మహాదేవ శంభో శంకర..! See you all in Cinemas with #BHIMAA this Mahashivratri🔱 pic.twitter.com/aeu1jYQIB2 — Gopichand (@YoursGopichand) January 29, 2024 -
గోపిచంద్ సినిమాతో ఎంట్రీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో అలా వచ్చి.. ఇలా గుడ్ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. కేరళలోని త్రిసూర్లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్లు రావడంతో టాలీవుడ్కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నిర్మాతతో ప్రేమ పెళ్లి అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
Bhimaa Teaser: వేటాడేందుకు బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు
టాలీవుడ్ మ్యాచోస్టార్ గోపీచంద్ 'భీమా'గా బాక్సాఫీస్ బరిలోకి అడుగు పెట్టనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మాత. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. టీజర్లో ఆయన లుక్ అదిరిపోయేలా ఉంది. గోపీచంద్ ఒక ఎద్దుపై కూర్చొని సంకెళ్లతో పాటు ఖాకీ దుస్తుల్లో కనిపించాడు. వినూత్నమైన యాక్షన్ ఎంటర్టైనర్గా గోపీ కెరియర్లో 31వ చిత్రంగా భీమా తెరకెక్కుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న భీమా సినిమాతో దర్శకుడు హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఫిబ్రవరి 16న భీమా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనువైట్ల డైరెక్షన్లో తన 32 వ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. -
కాంబినేషన్ కుదిరిందా?
హీరో అజిత్ ప్రస్తుతం ‘విడాముయార్చి’ సినిమాతో బిజీగా ఉన్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అజర్బైజాన్లో పూర్తయిందని కోలీవుడ్ టాక్. అయితే అజిత్ తెలుగులో ఓ సినిమా కోసం రెడీ అవుతున్నారని, మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాకు దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు అనుకుంటున్నారట. మరి.. అజిత్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కుదిరిందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. -
ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఆగిపోయిన రవి తేజ, గోపీచంద్ మూవీ
-
ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ ఏసీబీ కోర్టు ఆదేశం
-
టాలీవుడ్ సినీ దిగ్గజం చంద్రమోహన్ చివరి సినిమా ఇదే!
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. మరో సినీ దిగ్గజం నింగికెగిసింది. తన వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులను అలరించిన సీనియర్ నటుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ సినీనటులు, అభిమానులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. 1966లొ రంగుల రాట్నంతో ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రమోహన్.. దశాబ్దాల పాటు తన కెరీర్లో వందల చిత్రాల్లో నటించారు. హీరోగా, నటుడిగా, విభిన్నమైన పాత్రల్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో మెప్పించారు. అలనాటి స్టార్ హీరోయిన్స్, శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి వారితో సినిమాలు చేశారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్లో చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో చంద్రమోహన్ కనిపించారు. చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. -
మిలన్కు బై బై
మిలన్కు బై బై చెప్పారు గోపీచంద్. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటలీలో మొదలైన విషయం గుర్తుండే ఉంటుంది. అక్కడి మిలన్ నగరంలో ప్లాన్ చేసిన షెడ్యూల్ ముగిసింది. గోపీచంద్తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటతో ఈ విదేశీ షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్. -
ఇటలీలో ఆటాపాటా
గోపీచంద్ ఇటలీకి మకాం మార్చారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనెపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబరు 24) శ్రీనువైట్ల బర్త్ డే. ఈ సందర్భంగా ఇటలీలో శ్రీనువైట్ల అండ్ టీమ్ లొకేషన్స్ను ఫైనలైజ్ చేస్తున్న వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సౌత్ ఇటలీలోని మాంటెరా లొకేషన్స్లో ప్రారంభం కానుంది. మేజర్ షూటింగ్ను విదేశాల్లోనే కంప్లీట్ చేస్తారట చిత్రయూనిట్. గోపీచంద్పై ముందుగా ఓ యాక్షన్ సీన్ను ప్లాన్ చేశారట శ్రీనువైట్ల. ఆ తర్వాత ఓ పాటని కూడా చిత్రీకరించనున్నారని భోగట్టా. ఈ చిత్రంలో కావ్యాథాపర్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. -
ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా
హీరోయిన్ సదా పేరు చెప్పగానే 'వెళ్లవయ్యా వెళ్లు..' అనే డైలాగ్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ డైలాగ్ పాపులారిటీ అలాంటిది మరి. అయితే హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సదా.. ఆ తర్వాత సరైన ఛాన్సులు రాకపోవడంతో నటనని పక్కనబెట్టేసింది. ప్రస్తుతం రియాలిటీ షో జడ్జిగా పలు షోలు చేస్తోంది. అయితే గతంలో ఓ సినిమాలో ఓ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతోందట. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) ఏ సీన్ గురించి..? నితిన్-తేజ కాంబోలో వచ్చిన 'జయం' మూవీ టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన వాళ్లతో పాటు విలన్గా నటించిన గోపీచంద్కి కూడా అద్భుతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఈ మూవీలో ఓ సీన్లో భాగంగా హీరోయిన్ సదా బుగ్గపై.. విలన్ గోపీచంద్ నాలుకతో నాకుతాడు. సదా ఈ సీన్ గురించే చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సదా ఏం చెప్పింది? 'జయం సినిమాలో ఓ సీన్లో ఎందుకు నటించా అని ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ సీన్ చేయనని దర్శకుడికి ముందే చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. మూవీకే ఆ సన్నివేశం హైలైట్గా నిలుస్తుందని చెప్పి ఒప్పించారు. అయితే ఆ సీన్ పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి చాలాసేపు ఏడ్చాను. నా ముఖాన్ని పదేపదే కడుక్కున్నాను. ఇప్పటికీ టీవీలో ఆ విజువల్ వస్తే ఆ దరిదాపుల్లో ఉండను' అని సదా చెప్పినట్లు సదరు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్నే అవమానించిన రజనీకాంత్!) -
డైరెక్టర్ శ్రీను వైట్లతో గోపీచంద్ కొత్త సినిమా
-
కొత్త చిత్రం షురూ
గోపీచంద్ హీరోగా నటించనున్న తాజా చిత్రం శనివారం ఆరంభమైంది. సూపర్స్టార్ కృష్ణ ఆశీస్సులతో ప్రారంభమైన చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సన్నివేశానికి నిర్మాత నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ‘‘ప్రధాన భాగాన్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్గారిని విభిన్న పాత్రలో చూపిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
శ్రీను వైట్ల, గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభోత్సవం
-
గోపీచంద్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఓటీటీకి వచ్చేస్తోన్న రామబాణం!
మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. జగరపతిబాబు, ఖుష్బూ ప్రధానపాత్రలు పోషించారు. అయితే లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. (ఇది చదవండి: బాలీవుడ్లో మరో సినిమా చేస్తోన్న ధనుష్.. ముచ్చటగా మూడోసారి! ) మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామబాణం... నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ ఇంకెప్పుడు ఓటీటీలోకి వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో గోపీచంద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీ రానుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: సీనియర్ నటి నిరోషా ఇంట చోరీ.. విలువైన నగలు సహా..) -
గోపీచంద్ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్
మ్యాచో స్టార్ గోపీచంద్తో యజ్ఞం,సౌఖ్యం.. వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఆ తర్వాత బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాను తీసి ఇండస్ట్రీలో కంటికి కనిపించకుండా పోయాడు. రాజ్తరుణ్తో ‘తిరగబడరాసామీ’ సినిమా పుణ్యమా అని మళ్లీ తెరపైకి వచ్చి ఆ సినిమాలో నటించిన మన్నారా చోప్రాను ముద్దు పెట్టడం వంటి చేష్టలతో వైరల్ అయ్యాడు. ఆ వెంటనే గోపీచంద్పై పలు అసభ్య పదాలతో వ్యక్తిగతంగా దూషించాడు. (ఇదీ చదవండి: హీరో గోపీచంద్ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్) 'ఒరేయ్ అంత బలిసిందా రా నీకు'.. అంటూ గోపీ చంద్పై విరుచుకుపడటమే కాకుండా ఆ ఇంటర్వ్యూలో మొత్తం ఆయన్ను తిట్టడమే పని పెట్టుకున్నాడు. ఇంకేముంది వెంటనే గోపీచంద్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరిని భారీగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తాగి వచ్చి తమ హీరోపై ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సరైన రీతిలో బుద్ధి చెబుతామని సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చారు. ఇలా మాట్లాడే వాడికి ఏ హీరో అయినా సినిమా అవకాశం ఎలా ఇస్తారని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఇలా గోపీచంద్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోయడంతో డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి చివరకు దిగొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ గురించి మళ్లీ ఇలా చెప్పుకొచ్చాడు. 'గోపీతో ఎలాంటి గొడవ లేదు. నాకు ఆయన బిడ్డలాంటి వాడు.. తమ్ముడు లాంటి వాడు.. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు.. ఆ వ్యాఖ్యల వల్ల రిగ్రేట్గా ఫీల్ అవుతున్నాను. గోపీచంద్ విషయంలో నాదే తప్పు. ఆ మాటలు కూడా గోపీపై ఆవేదనతోనే వచ్చాయి. నా వల్ల హర్ట్ అయిన గోపీచంద్ ఫ్యాన్స్ ఫోన్లు చేస్తున్నారు. ఇంతటితో వదిలేయండి.' అని ఆయన అన్నారు. కానీ ఎ.ఎస్.రవికుమార్ చౌదరిపై గోపీ చంద్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు ఏ మాత్రం తగ్గడం లేదు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే స్థితిలో ఉన్నావని ఒకరంటే... ఆరోజు తాగి మాట్లాడితే.. ఈ రోజు తాగకుండా మాట్లాడుతున్నాడని మరోకరు తెలిపారు. ఈ వివాదంపై గోపీచంద్ మాత్రం స్పందించ లేదు. -
హీరో గోపీచంద్ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్తరుణ్ ‘తిరగబడరాసామీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో హీరోయిన్గా మాల్వీ మల్హోత్రా ఉండగా మున్నారా చోప్రా నెగటివ్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ కార్యక్రమంలో మున్నారా చోప్రాను డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ముద్దు పెట్టుకోవడంతో చాలరోజుల తర్వాత ఆయన పేరు వైరల్ అయింది. గోపీచంద్తో యజ్ఞం,సౌఖ్యం... సాయి ధరమ్తేజ్తో పిల్లా నువ్వులేని జీవితం.. బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాలకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. సుమారు పదేళ్ల తర్వాత రాజ్తరుణ్తో ‘తిరగబడరాసామీ’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగ ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా హీరో గోపీచంద్పై ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు ఇలా చేశాడు. గతంలో అందరం చెట్టు కింద కూర్చోని భోజనం చేసేవాళ్లం.. ఒకరోజు అతని కోసం వెళ్తే కొంతసేపు వెయిట్చేయమను అన్నాడు అని గోపీచంద్ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఇలా విమర్శలు చేశాడు. 'ఒరేయ్ అంత బలిసిందా రా మీకు..? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్.. ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐయిదారుగురిని దాటుకుని రావాల్నా.. వాడిని హీరోగా నేనే చేశాను (యజ్ఞం). అప్పటివరకు వాడు విలన్గా నటించేవాడు (జయం,నిజం,వర్షం). నా సినిమాతో వాడు హీరోగా గుర్తింపు పొందాడు. ఆ సినిమాకు నేను తీసుకున్న రెమ్యునరేషన్ కంటే వాడికి తక్కువ. అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకో అర్థం కాదు.. వాడు ఇప్పుడు ఎదరుపడినా ఇలానే మాట్లాడుతాను. ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు నేడు పూర్తిగా మారిపోయాడు. 2016 సంవత్సరంలో కోఠి ఉమెన్స్ కాలేజీలో 'రారాజు' సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో నేను కూడా అక్కడికి వెళ్లాను. అప్పటికే నేను బాలకృష్ణతో వీరభద్ర సినిమా తీసి ప్లాప్లో ఉన్నాను. ఈ కారణంతో మరో సినిమా తీద్దామని అడిగిన నన్ను దూరం పెట్టాడు. మంచి కథ చేసి రండి చూద్దాం అని అవమానించాడు. ఇదంతా జరిగిన సమయంలో ఫైట్ మాస్టర్ విజయ్ కూడా అక్కడే ఉన్నారు.' అని ఆయన పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గోపిచంద్ ఫ్యాన్స్ కూడా ఎ.ఎస్.రవికుమార్ చౌదరిపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే హీరోయిన్ మున్నారా చోప్రాను ముద్దు పెట్టుకుని విమర్శలు ఎదుర్కొంటుండగా.. తాజాగ చేసిన వ్యాఖ్యలతో ఆయనపై గోపీచంద్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు గోపీచంద్పై ఎలాంటి రిమార్క్ లేదని... అతనిపై ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి కామెంట్లు కూడా చేయలేదని వారు తెలుపుతున్నారు. వ్యక్తిగతంగా ఏదో కారణం పెట్టుకుని పబ్లిగ్ ప్లాట్ఫామ్పై ఇలా మాట్లాడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కంటే గొప్పోళ్లా..? ఇండస్ట్రీలో మొఖం మీద మేకప్ వేసుకున్న తర్వాత మేకలాంటి చేష్టలు చాలమందికి ఉన్నాయని ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తెలిపాడు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న వారిలో చాలమంది రీల్ హీరోస్ మాత్రమే అని రియల్ కాదన్నాడు. తలపొగరు నెత్తికెక్కి డెమీగాడ్స్లా కొందరు హీరోలు విర్రవీగుతున్నారంటూ.. చిరంజీవి, బాలకృష్ణ కంటే వీళ్లందదు గొప్పోళ్లా..? అంటూ ఫైర్ అయ్యాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా డిసిప్లెన్ కలిగిన వ్యక్తి అంటూ పేర్కొంన్నాడు. -
గోపీచంద్కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు, ఎవరంటే?
గోపీచంద్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఫీసర్ భీమ పాత్రలో నటిస్తున్నారు గోపీచంద్. భీమాకు జోడీగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మలను ఎంపిక చేసినట్లు గురువారం చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ‘‘కుటుంబ భావోద్వేగాలు మిళితమైన యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ.. చూసేందుకు రెడీనా..?
బాక్సాఫీస్ కలెక్షన్లు దండుకోవడానికి థియేటర్స్ స్టేషన్లో కొందరు స్టార్స్ పోలీసాఫీసర్స్గా చార్జ్ తీసుకోనున్నారు. కొందరు పోలీస్ యూనిఫామ్ వేసుకుని, సెట్స్లో లాఠీ తిప్పుతున్నారు. మరికొందరు కథలు విన్నారు.. యూనిఫామ్తో సెట్స్కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ వివరాలు తెలుసుకుందాం. మళ్లీ డ్యూటీ ‘మూండ్రు ముగమ్’ (1982), ‘పాండియన్ ’ (1992), హిందీలో ‘హమ్’ (1991), ‘దర్బార్’ (2020)... ఇలా ఇప్పటివరకూ రజనీకాంత్ ఏడెనిమిది చిత్రాల్లో పోలీసాఫీసర్గా నటించారు. మళ్లీ రజనీ పోలీస్గా చార్జ్ తీసుకోనున్నారట. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ముస్లిమ్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీ కనిపించనున్నారని టాక్. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఆగస్టు 10న విడుదల కానున్న ‘జైలర్’ చిత్రంలో రజనీ జైలర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పోలీస్ స్పిరిట్ పోలీసాఫీసర్గా ప్రభాస్ కటౌట్ స్క్రీన్పై సూపర్గా ఉంటుందని, సిల్వర్ స్క్రీన్పై ఖాకీ డ్రెస్ వేసిన ఫుల్ లెంగ్త్ పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్ను చూడాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆశపడుతున్నారు. వీరి ఆశ ‘స్పిరిట్’తో తీరనుందనే టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందట. పుష్పర కాలం తర్వాత... ‘శౌర్యం (2008)’, ‘గోలీమార్ (2010)’ వంటి చిత్రాల్లో గోపీచంద్ పోలీస్గా సిల్వర్ స్క్రీన్పై డ్యూటీ చేశారు. పుష్కర కాలం తర్వాత గోపీచంద్ మళ్లీ పోలీస్గా లాఠీ పట్టారు. హర్ష తెరకెక్కిస్తున్న ‘భీమా’ చిత్రం కోసమే పోలీస్గా డ్యూటీ చేస్తున్నారు గోపీచంద్. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఆఫీసర్ అర్జున్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్గా బాధ్యతలు తీసుకోనున్నారు నాని. ‘హిట్’ ఫ్రాంచైజీలో ‘హిట్ 3’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘హిట్ 1’లో విశ్వక్సేన్, ‘హిట్ 2’లో అడివి శేష్ పోలీసాఫీసర్స్గా నటించారు. ‘హిట్ 3’లో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్గా నాని నటించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ్రపారంభమవుతుందట. కొన్ని సన్నివేశాల్లో... హీరో నితిన్ పోలీసాఫీసర్గా చార్జ్ తీసుకున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా’ (ప్రచారంలో ఉన్న టైటిల్). శ్రీలీల హీరోయిన్. ఇందులో హీరోగా నటిస్తున్న నితిన్ కొన్ని సీన్స్లో పోలీస్గా కనిపిస్తారట. అమరన్.. ఇన్ ది సిటీ ‘బ్లాక్’, ‘సీఎస్ఐ: సనాతన్’ వంటి చిత్రాల్లో ఆది సాయికుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా సిల్వర్ స్క్రీన్ క్రైమ్స్ను చేధించారు. తాజాగా ‘అమరన్: ఇన్ ది సిటీ చాఫ్టర్ 1’ చిత్రంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్గా ఓ కేసును పరిశోధిస్తున్నారు. ఎస్. బాలేశ్వర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ది కానిస్టేబుల్ ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’, ‘కుర్రాడు’ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ తాజాగా పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ పాత్ర చేస్తున్నారు. ‘బలగం’ జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎవరు? హంతకులు ఎవరు? అనేది కనిపెట్టేందుకు జేడీ చక్రవర్తి ఓ స్కెచ్ వేశారు. పోలీసాఫీ సర్గా జేడీ చక్రవర్తి వేసిన ఈ స్కెచ్ డీటైల్స్ ‘హూ’ సినిమాలో తెలుస్తాయి. జేడీ చక్రవర్తి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రెడ్డమ్మ కె. బాలాజీ నిర్మించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తారు. పోలీసులే ప్రధాన నిందితులైతే... దోషులను పట్టుకునే పోలీసులే నిందులైతే ఏం జరుగు తుంది? అనే కథాంశంతో దర్శకుడు తేజా మార్ని ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రంలోని ముఖ్య తారలంతా పోలీసులుగా నటిస్తున్నారని తెలిసింది. ‘ఖడ్గం’ (2002), ‘ఆపరేషన్ దుర్యోధన’ (2007), ‘టెర్రర్’ (2016) వంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన శ్రీకాంత్ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ పోలీస్గా కనిపిస్తారు. ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. పోలీస్ రన్నర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘రన్నర్’. విజయ్ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ భాస్కర్, ఫణీంద్ర, ఎం. శ్రీహరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కొడుకుల అనుబంధంతో సాగే ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో జానీ మాస్టర్ నటిస్తున్నారని తెలిసింది. వీరే కాదు... మరికొందరు కూడా పోలీసాఫీసర్లుగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. -
గోడ చాటకు పోయి ఏడ్చాడు..
-
ఆ ఒక్క తప్పు వల్లే నా లైఫ్ ఇలా ఉంది
-
మీ నాన్న చేసిన మంచి వల్లే నువ్వు ఈరోజు హీరో అయ్యావు
-
నా పిల్లలకు విలువలు, మానవత్వం నేర్పిస్తా..
-
భీమా.. ఇది కూడా ప్లాప్ అయితే మాత్రం
-
ఫ్యామిలీ వెడ్డింగ్లో శ్రీకాంత్,గోపీచంద్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న గోపీచంద్ 'రామబాణం' మూవీ
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మే5న విడుదలయ్యింది.జగపతిబాబు, ఖుష్భూ కీలక పాత్రలను పోషించారు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రామబాణం మూవీ థియేటర్లలో విడుదలై నెలరోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 3 నుంచి ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
హీరో గోపిచంద్ ఫ్యామిలీ క్యూట్ ఫోటోలు
-
గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల తర్వాత శ్రీవాస్ డైరెక్షన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం' మూవీ రివ్యూ) ఈ చిత్రంలో జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 5 తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి డిలీటెడ్ సీన్స్ను చిత్రబృందం విడుదల చేసింది. ట్విటర్ వేదికగా వీడియోలను పంచుకున్నారు. (ఇది చదవండి: ఓ ఆర్టిస్ట్గా మాత్రమే చూడండి.. కామంతో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ!) -
ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి..? హిట్ అవ్వకపోతే మాత్రం
-
రామబాణం మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
గోపీచంద్ 'రామబాణం' మూవీ రివ్యూ
టైటిల్: రామబాణం నటీనటులు: గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడేకర్ తదితరులు నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల దర్శకత్వం: శ్రీవాస్ సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ: వెట్రీ పళనిస్వామి ఎడిటర్: ప్రవీణ్ పూడి మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం మే 5, 2023న థియేటర్లలో విడుదలైంది. అన్నదమ్ముల రిలేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో భిన్నమైన ఎలివేషన్స్తో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. రాజారాం(జగపతిబాబు), భువనేశ్వరి(ఖుష్బూ ఆర్గానిక్ ఫుడ్ హోటల్ వ్యాపారం చేస్తుంటారు. రాజారాంకు తమ్ముడి విక్కీ( గోపీచంద్) బిజినెస్లో సాయంగా ఉంటాడు. అక్కడే పాపారావు(నాజర్) హోటల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. రాజారాం తక్కువ ధరకే ఫుడ్ అందించడాన్ని ఓర్వలేని పాపారావు.. జగపతిబాబుతో గొడవలకు దిగుతాడు. ఇది చూసి సహించలేని విక్కీ.. పాపారావు గోడౌన్ను తగలబెడతాడు. ఈ విషయం తెలుసుకున్న రాజారాం.. విక్కీని మందలిస్తాడు. నీతి, నిజాయితీ అనుకుంటూ తిరిగే రాజారాం తీరు నచ్చక చిన్నప్పుడే కోల్కతాకు పారిపోతాడు విక్కీ. అక్కడ గుప్తా అనే వ్యక్తి విక్కీని చేరదీస్తాడు. ఆ తర్వాత కోల్కతాను తన గుప్పిట్లో పెట్టుకున్న డాన్ ముఖర్జీ సామ్రాజ్యాన్ని కూలదోసి.. తానే విక్కీ భాయ్గా చెలామణి అవుతాడు. అదేక్రమంలో భైరవి(డింపుల్ హయాతి)ప్రేమిస్తాడు. భైరవిని పెళ్లి చేసుకోవాలనుకున్న విక్కీకి భైరవి నాన్న(సచిన్ ఖేడేకర్) ఓ కండీషన్ పెడతాడు. దీంతో దాదాపు 14 ఏళ్ల తర్వాత తిరిగి హైదరాబాద్కు వస్తాడు విక్కీ. (చదవండి: నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నా : సెల్వ రాఘవన్) కోల్కతా నుంచి వచ్చిన విక్కీని.. అన్న రాజారాం సంతోషంతో ఆహ్వానిస్తాడు. అయిదే పాపారావు(నాజర్), అతని అల్లుడు జీకే(తరుణ్ అరోరా)తో జరిగిన గొడవల గురించి విక్కీకి తెలియకుండా జాగ్రత్తపడతాడు రాజారాం. అదేవిధంగా విక్కీ సైతం తన కోల్కతాలో భాయ్ అన్న విషయాన్ని దాచిపెడతాడు. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో రాజా రాంను వ్యాపారంలో కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తారు నాజర్, జీకే. అసలు వాళ్లిద్దరూ రాజారాంను ఢీ కొట్టేందుకు చేసిన ప్లానేంటి? కోల్కతా నుంచి వచ్చిన విక్కీ ఏం చేశాడు? విక్కీకి భైరవి నాన్న పెట్టిన కండీషన్ ఏంటి? అసలు అన్న రాజారాం కోసం విక్కీ ఏం చేశాడు? వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే అసలు కథ. కథ ఎలా సాగిందంటే... లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. డైరెక్టర్ శ్రీవాస్ సినిమా అంటే కామెడీ, ఎమోషన్స్, డిఫెరెంట్ ఎలివేషన్స్ ఉంటాయని తెలిసిందే. కథను హీరో గోపీచంద్ను చూపించడంతోనే మొదలెట్టాడు. సినిమా ప్రారంభంలోనే విలేజ్ బ్యాక్డ్రాప్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత హీరో కోల్కతా వెళ్లడం.. విక్కీ భాయ్గా ఎదగడం చకాచకా జరిగిపోతాయి. సినీ ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టించకుండా కథను వేగంగా తీసుకెళ్లాడు. కథను ఎక్కడే గానీ సాగతీయలేదు. స్టోరీ రోటీన్గా అనిపించినా కామెడీ సీన్స్, ఎమోషన్స్తో ఆడియన్స్కు బోరు కొట్టించకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డాడనే చెప్పాలి. అయితే కథలో ఎలాంటి ట్విస్టులు లేకపోవడం పెద్ద మైనస్. కామెడీ సీన్స్, ఫైట్స్, సాంగ్స్తో ఫస్టాప్ సింపుల్గా ముగించాడు. కథలో సీన్స్ ప్రేక్షకుని ఊహకు అందేలా ఉంటాయి. సెకండాఫ్ వచ్చేసరికి కథ మొత్తం అన్నదమ్ములు విక్కీ, రాజారాం.. విలన్స్ నాజర్, జీకే చుట్టే తిరుగుతుంది. అన్నకు తెలియకుండా తమ్ముడు.. తమ్ముడికి తెలియకుండా అన్న ఒకరికోసం ఒకరు ఆరాటపడే ఎమోషన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబంలో ఉండే ఎమోషన్స్కే ప్రాధాన్యత ఇచ్చారు. కథను ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా చేయడంలో శ్రీవాస్ తన మార్క్ను చూపించాడు. బ్రదర్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ను తెరకెక్కించడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. అక్కడక్కడా బోరుగా అనిపించినా.. కామెడీ సీన్స్తో నెట్టుకొచ్చారు. సాంగ్స్, ఫైట్స్, కామెడీ సీన్స్ ఫర్వాలేదనిపించినా.. ఆడియన్స్కు అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే ప్రేక్షకులను ఓ సందేశాన్ని ఇచ్చాడు డైరెక్టర్. కేవలం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యాన్స్కు మాత్రమే ఫర్వాలేదనిపించేలా ఉంది. మాస్ ఆడియన్స్కు కాస్తా బోరుగానే అనిపించేలా కథనం సాగుతుంది. ఎవరెలా చేశారంటే... మాచో స్టార్ గోపీచంద్ మరోసారి తన మార్క్ను చూపించారు. ఫైట్ సీన్స్, కామెడీ టైమింగ్తో అదరగొట్టాడు. హీరోయిన్ డింపుల్ హయాతి ఫర్వాలేదనిపించింది. సాంగ్స్లో తన గ్లామర్తో అలరించింది. గోపీచంద్ అన్న, వదినలుగా జగపతిబాబు, ఖుష్బూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎప్పుడు సీరియస్ పాత్రలు చేసే జగపతి బాబు.. ఈసారి సైలెంట్ క్యారెక్టర్లోనూ మెప్పించాడు. నాజర్, అలీ, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడేకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయాకొనిస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. ఎడటింగ్లో కొన్ని సీన్స్కు కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్తాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు: హీరో గోపీచంద్
‘‘వందేళ్ల క్రితం అమ్మను ‘అమ్మ’ అనే పిలిచాం. ఇప్పుడూ అమ్మా అనే పిలుస్తాం. తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు. అలాగే సినిమాల విషయంలో ఆడియన్స్ మారలేదు. సరైన కంటెంట్ ఇస్తే ఆడియన్స్ సినిమాలు చూస్తున్నారు. అయితే కథలో ఆడియన్స్ను మనం ఎంతవరకు ఇన్వాల్వ్ చేయగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. వారు కనెక్ట్ అయ్యే ఏ జానర్ సినిమా తీసినా వాటిని ఆదరిస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో గోపీచంద్ చెప్పిన విశేషాలు.... ► ఈ మధ్య నేను ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేశాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు భూపతిరాజాగారు చెప్పిన కథ, అందులోని బ్రదర్ ఎమోషన్స్ నచ్చడంతో ‘రామబాణం’ సినిమా చేశాం. హిట్ చిత్రాలు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ల తర్వాత శ్రీవాస్, నేను మరో సినిమా చేయాలని ‘రామబాణం’ చేయలేదు. కథ కుదిరింది కాబట్టి చేశాం. ► ‘రామబాణం’ అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్కు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా చేశాం. అలాగే అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంది. ఓ సమస్యను మనం కొన్నేళ్లు పట్టించుకోకుండా ఉంటే దాని దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. అప్పుడు బాధ పడతాం. ఈ విషయాన్నే ‘రామబాణం’లో చూపించాం. ► ‘లక్ష్యం’ సినిమాలో జగపతిబాబుగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ సినిమాలో అన్నదమ్ముల్లా నటించిన మేం ‘రామబాణం’లోనూ అన్నదమ్ముల్లా నటించాం. ఈ సినిమాలో జగపతిబాబుగారిది కీలకపాత్ర. హీరోగా నా క్యారెక్టర్ పెంచేసి, ఆయన క్యారెక్టర్ను తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాకు కథే హీరో. కథే సినిమాను నడిపించాలి. ► టీజీ విశ్వప్రసాద్గారు మంచి నిర్మాత. ఇండస్ట్రీలో అతి మంచితనం మంచిది కాదని నేను ఆయనకు చె΄్పాను. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఉంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ► ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్షతో ఓ సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత దర్శకలు శ్రీను వైట్ల, తేజగార్లతో సినిమాలు ఉంటాయి. ► గతంలో నేను ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ వంటి విభిన్నమైన సినిమాలు చేశాను. ఆ సినిమాలు ఇప్పుడు వచ్చి ఉంటే హిట్ అయ్యేవి. అయితే ఆ తరహా సినిమాల్లో నాకు నటించాలని ఉన్నా సరైన కథలు దొరకడం లేదు. ► హిట్ సినిమాలు అందించాలనే ఒత్తిడి నాకే కాదు... ప్రతి హీరోకూ ఉంటుంది. ఎందుకంటే ఓ సినిమా ఫలితంపై ఎన్నో కుటుంబాలు (ముఖ్యంగా బయ్యర్లు, డిస్ట్రిబూటర్స్ని ఉద్దేశిస్తూ..) ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు హిట్ అవుతాయని మేం భావించిన సినిమాలు సరైన ఫలితాలను ఇవ్వక΄ోవచ్చు. తప్పులను విశ్లేషించుకుని అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. నాకు వచ్చిన ప్రతి రోల్ని డ్రీమ్ రోల్లా భావిస్తాను. ► నా కెరీర్ స్టార్టింగ్లో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాను. ఇండస్ట్రీలో ముందు నన్ను నిలబెట్టింది విలన్ రోల్సే. ప్రభాస్ సినిమాలో విలన్పాత్ర చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే కథ, అందులోని విలన్పాత్ర పవర్ఫుల్గా ఉండాలి. -
యాంకర్ గా నవదీప్ కొత్త అవతారం. రివర్స్ లో ఆదుకున్న జగపతిబాబు, గోపీచంద్
-
ప్రభాస్ కూడా పెట్టించుకోరా..? ఆయన బాగా పెడతాడు అన్నాడు
-
ప్రభాస్ తో మల్టీస్టారర్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన గోపీచంద్
-
సెకండ్ ఇన్నింగ్స్తో నా జీవితమే మారిపోయింది.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదు
‘‘గతంలో నేను చేసిన ‘శివరామరాజు’ చిత్రం అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూశాక విడిపోయిన 24 కుటుంబాలు మళ్లీ కలిశాయి. ‘రామబాణం’ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ మూవీలో కీలక పాత్ర చేసిన జగపతిబాబు విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఇండస్ట్రీలో ఇప్పుడు హారర్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి... సెంటిమెంట్ తగ్గింది. నెగిటివిటీ పెరిగింది. సినిమా ఎంత క్రూరంగా ఉంటే అంత బావుంటోంది.. అందుకే నేను సక్సెస్ అయ్యాను (నవ్వుతూ). అయితే అంత నెగిటివిటీ లోనూ పాజిటివిటీ ఉందని చెప్పడానికి ‘రామబాణం’ వస్తోంది. ► సెకండ్ ఇన్నింగ్స్లో నేనిప్పటి వరకూ 70కిపైగా పాత్రలు చేశా. అయితే చెప్పుకోడానికి ఏడెనిమిది సినిమాలే ఉన్నాయి. కొందరు నన్ను సరిగ్గా వాడుకోలేదు. కానీ ‘రామబాణం’ విషయంలో అలా కాదు. ఈ చిత్రాన్ని బలంగా మలిచాడు శ్రీవాస్. ఇందులో ఆర్గానిక్ ఫుడ్ ప్రాధాన్యతని చక్కగా చూపించాం. ► నేను హీరో కాదు.. విలన్ కాదు.. యాక్టర్ని. అందులోనూ డైరెక్టర్స్ యాక్టర్ని. మన నుంచి వాళ్లు ఏం రాబట్టుకోవాలనుకుంటున్నారో వారి కళ్లు చూస్తే అర్థమౌతుంది. నాకు ఎప్పుడైనా కథే ముఖ్యం. కాంబినేషన్ కాదు. పాత్ర నచ్చకపోతే కుదరదని చెబుతున్నాను. ► సెకండ్ ఇన్నింగ్స్తో నా జీవితమే మారిపోయింది. హీరో అనేది పెద్ద బాధ్యత.. ఒత్తిడి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఒత్తిడి లేకపోవడంతో నటనపైనే దృష్టి పెడుతున్నాను. ► చిన్న సినిమా అనేది ఉండదు. హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు.. పాత్ర, సినిమా ముఖ్యం. సల్మాన్ ఖాన్తో చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ తర్వాత బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. గాడ్ ఫాదర్ లాంటి పాత్ర చేయాలని ఉంది. అలాగే ‘గాయం’కి మరో స్థాయిలో ఉండే పాత్ర చేయాలనే ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న నాలుగైదు సినిమాలు పెద్ద బ్యానర్స్లోనివే. -
Ramabanam Movie Stills: గోపీచంద్ ‘రామబాణం’ మూవీ స్టిల్స్