Gopichand
-
భారీ ప్రాజెక్ట్లో గోపిచంద్.. డైరెక్టర్గా ఎవరంటే?
టాలీవుడ్ హీరో గోపీచంద్ ఈ ఏడాదిలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. గతేడాది విశ్వం, భీమా చిత్రాలతో మెప్పించిన గోపిచంద్ కొత్త ఏడాదిలో ప్రాజెక్ట్ ప్రకటించారు. అతని కెరీర్లో 33వ చిత్రంగా నిలవనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను గోపీచంద్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఐబీ 71, ఘాజీ వంటి చిత్రాలతో సంకల్ప్ రెడ్డి ఫేమస్ అయ్యారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూలి మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇదివరకెన్నడు చూడని పాత్రలో గోపిచంద్ కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దాదాపు 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. Excited to announce my next from the vision of #SankalpReddy, teaming up once again with my producers @srinivasaaoffl garu & Pavan garu under @SS_ScreensNeed all your love..! pic.twitter.com/8wHOdw7d70— Gopichand (@YoursGopichand) March 10, 2025 -
మరో ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ 'విశ్వం'
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో గోపీచంద్ ఒకడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'విశ్వం'. అప్పట్లో కామెడీ చిత్రాలతో తనదైన ట్రెండ్ చేసిన శ్రీనువైట్ల.. దాదాపు ఆరేళ్ల తర్వాత చేసిన సినిమా ఇది. థియేటర్లలో రిలీజైన ఇరవై రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది.(ఇదీ చదవండి: సూర్య 'కంగువ'.. తెలుగులోనే ముందు!)గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ఈ సినిమాని ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్గా తీశారు. చెప్పడం అయితే కామెడీ అన్నారు గానీ రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీ అయ్యేసరికి జనాలు రిజెక్ట్ చేశారు. దీపావళి సందర్భంగా తొలుత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లోకి స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.'లౌక్యం' సినిమా వచ్చి పదేళ్లు దాటిపోయింది. ఈ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్.. ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు. కాకపోతే అవి వచ్చి వెళ్తున్నాయి తప్పితే ఒక్కటి గుర్తుంచుకోదగ్గ స్థాయిలో లేదు. మరోవైపు శ్రీనువైట్ల కూడా ఎంతో నమ్మకంతో ఈ సినిమా తీశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం వీళ్లిద్దరి చేతిలోనూ మరో ప్రాజెక్ట్ లేదు. (ఇదీ చదవండి: OTT Review: ఊహకందని థ్రిల్లింగ్ వెకేషన్)Feel every emotion in one film! Viswam is the perfect blend for your weekend watchlist.Watch #Gopichand and #kavyathapar starrer #viswam now on #aha@YoursGopichand @SreenuVaitla @KavyaThapar @vishwaprasadtg @peoplemediafcy @VenuDonepudi pic.twitter.com/Xyk9PPLV7y— ahavideoin (@ahavideoIN) November 2, 2024 -
ఓటీటీలో 'విశ్వం'.. అప్పుడే స్ట్రీమింగ్కు రానుందా..?
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. బాక్సాఫీస్ వద్ద కాస్త పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న చాలా సినిమాలు థియేటర్స్లో సందడి చేయనున్నాయి. దీంతో విశ్వం చిత్రాన్ని దాదాపు అన్ని స్క్రీన్స్ నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్లో ఉన్నారట. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.దసరా సందర్భంగా అక్టోబర్ 11న విడుదలైన 'విశ్వం' పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు నష్టాలు తప్పలేదని సమాచారం. ఇప్పుడు కాస్త త్వరగా ఓటీటీలో అయినా విడుదల చేస్తే కొంతైనా సేఫ్ కావచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నవంబర్ 1న 'విశ్వం' సినిమా అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయునున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కథ పెద్దగా ఆకట్టుకోకపోయినా కామెడీతో ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు. -
గోపీచంద్ 'విశ్వం'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘విశ్వం’ మూవీ రివ్యూ
టైటిల్: విశ్వంనటీనటులు: గోపీచంద్, కావ్యథాపర్, నరేశ్, సునీల్, వెన్నెల కిశోర్, సుమన్, ప్రగతి తదితరులునిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడిదర్శకత్వం: శ్రీనువైట్లసంగీతం: చైతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్విడుదల తేది: అక్టోబర్ 11, 2024శ్రీనివైట్లకు ఈ మధ్యకాలంలో సరైన హిట్ సినిమాలే లేదు. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ(2018)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ‘విశ్వం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కు మచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బారిగా చేయడంతో ‘విశ్వం’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? విజయదశమి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం శ్రీను వైట్లకు విజయం దక్కిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేటంటే..కేంద్ర మంత్రి సీతారామరాజు(సుమన్)కు హత్యకు గురవుతాడు. ఈ హత్యను దర్శన అనే బాలిక కళ్లారా చూస్తుంది. హంతకులు ఆ బాలికను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఓ రోజు దర్శన ప్యామిలి మొత్తం కొండగట్టుకు వెళ్ళ్తుండగా కొంతమది వారిపై అటాక్ చేస్తారు. గోపిరెడ్డి(గోపీచంద్) వచ్చి వారిని రక్షిస్తాడు. అనంతరం తాను బిల్డర్ బుల్ రెడ్డి కొడుకునని పరిచయం చేసుకొని దర్శన ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అసలు గోపిరెడ్డి ఎవరు? దర్శనను ఎందుకు కాపాడుతున్నాడు? కేంద్రమంత్రిని చంపిందెవరు? ఈ హత్యకు ఇండియాలో జరగబోయే ఉగ్రవాద చర్యలకు గల సంబంధం ఏంటి? ఇండియాలో సెటిలైన పాకిస్తాన్ ఉగ్రవాది ఖురేషి(జిష్షుసేన్ గుప్తా) చేస్తున్న కుట్ర ఏంటి? ఈ కథలో బాచిరాజు(సునీల్) పాత్ర ఏంటి? కాస్ట్యూమ్ డిజైనర్ సమైరా (కావ్యథాపర్)తో గోపిరెడ్డి ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి హిట్ కొట్టిన చరిత్ర శ్రీనువైట్లది. ఆయన సినిమాలో కామెడీతో పాటు కావాల్సినన్ని కమర్శియల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. అయితే గత కొన్నాళ్లుగా శ్రీనువైట్ల మ్యాజిక్ తెరపై పని చేయడం లేదు. అందుకే ఈ సారి తన పంథా మార్చుకొని ‘విశ్వం’ తెరకెక్కించానని ఓ ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల చెప్పారు. సినిమాలో కామెడీ కొత్తగా ఉంటుందని బలంగా చెప్పారు. మరి సినిమాలో నిజంగా కొత్త కామెడీ ఉందా? కొత్తకథను చెప్పాడా? అంటే లేదనే చెప్పాలి.శ్రీనువైట్ల గత సినిమాల మాదిరే విశ్వం కథనం సాగుతుంది. టెర్రరిస్ట్ బ్యాగ్డ్రాప్ స్టోరీకి చైల్డ్ సెంటిమెంట్ జోడించి, తనకు అచ్చొచ్చిన కామెడీ పంథాలోనే కథనం నడిపించాడు. పాయింట్ బాగున్నా.. తెరపై చూస్తే మాత్రం పాత సినిమాలే గుర్తొస్తుంటాయి. ఫస్టాఫ్లో జాలిరెడ్డి(పృథ్వి), మ్యాంగో శ్యామ్(నరేశ్) కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. హీరోయిన్లో ప్రేమాయణం, యాక్షన్ సీక్వెన్స్ రొటీన్గా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్లో హీరో ప్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. ట్రైన్ ఎపిసోడ్ కూడా ప్రమోషన్స్లో చెప్పినంత గొప్పగా ఏమీ ఉండదు కానీ..కొన్ని చోట్ల మాత్రం నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్ కామెడీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. విలనిజం బలంగా లేకపోవడం కూడా సినిమాకు మైనస్సే. క్లైమాక్స్లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. గోపిరెడ్డి పాత్రకి గోపిచంద్ పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటి మాదిరే యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. స్టెప్పులు కూడా బాగానే వేశాడు. ప్లాష్బ్యాక్ స్టోరీలో గోపీచంద్ నటన బాగుంటుంది. కావ్యథాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. నరేశ్, పృథ్వీల కాంబోలో వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్లస్ అయింది. సునీల్ పాత్ర ఇంపాక్ట్ సినిమాపై అంతగా ఏమి ఉండదనే చెప్పాలి. సుమన్, ప్రగతి, వెన్నెల కిశోర్తో పాటు మిలిగిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. భీమ్స్ కంపోజ్ చేసిన 'గుంగురూ గుంగురూ' పాట థియేటర్లో ఈళలు వేయిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో తొలగించాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. -రేటింగ్: 2.25/5 -
విశ్వం అన్ని వర్గాలను అలరిస్తుంది: నిర్మాత కామెంట్స్
హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం విశ్వం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వేణు దోనేపూడి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 11న విడుదలవుతోన్న ఈ మూవీ విశేషాలను చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మీడియాతో పంచుకున్నారు.నిర్మాత వేణు మాట్లాడుతూ.. విశ్వం ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి కమర్షియల్ అంశాలతో అందరినీ అలరిస్తోంది. శ్రీను వైట్ల స్క్రిప్ట్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా కథనాన్ని శ్రీను వైట్ల తన స్టైల్లో రూపొందించారని అన్నారు.అనంతరం మాట్లాడుతూ.. ఇటలీలోని మిలాన్లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్. ఇందులో గోపీచంద్ అద్భుతంగా నటించారు. అతని కామెడీ టైమింగ్,యాక్షన్కు ఆడియెన్స్ ఫిదా అవుతారు. అతని కెరీర్లోనే విశ్వం అద్భుతంగా ఉంటుంది. శ్రీను వైట్ల, గోపీచంద్లతో కలిసి ఎన్నో విషయాల గురించి నేర్చుకున్నా. సినిమాల మీదున్న ప్యాషన్తోనే విశ్వం సినిమాను నిర్మించాను. చిత్రాలయం స్టూడియోలో అద్భుతమైన కథలు, సంగీతంతో ఆకట్టుకునే చిత్రాలను నిర్మించడం నా లక్ష్యం అని అన్నారు. -
'విశ్వం' నుంచి మాస్ సాంగ్ రిలీజ్
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మాస్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్కు మంచి ఆదరణ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. -
నవ్వు ఆపుకోలేక.. చాలామంది ఆర్టిస్టులకి సారీ చెప్పా : గోపీచంద్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత 'విశ్వం' కథ లైన్ గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్ గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్ కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన ఏడు నెలలు సమయం తీసుకొని విశ్వం కథని ఫాం చేరు. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల గారి మార్క్ తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్ గా వున్నాయి. → లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ విశ్వంలో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్ కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్ గా వచ్చాయి.→ శ్రీను వైట్ల గారి వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఇందులో ఉంది. అయితే అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్ కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. టర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, వీటి గణేష్, నరేష్ గారు, ప్రగతి గారు.. ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ట్రైన్ సీక్వెన్స్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న టెన్షన్ కూడా రన్ అవుతుంది. అది చాలా బాగుంటుంది.→ బేసిక్ గా ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. పాపకి ఏడేళ్లు ఉంటాయి. కానీ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పెర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. ఆ పాప కూడా ఈ సినిమాకి చాలా ప్లస్.→ శ్రీను వైట్ల గారి సినిమాల్లో కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ అయి ఉంటుంది. ఆయన ఈ రెండిటిని పర్ఫెక్ట్ బ్లడ్ తో తీసుకొస్తారు. మనం చెప్పాలనుకున్న కథని ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ఆడియన్స్ చక్కగా రిసీవ్ చేసుకుంటారని ఆయన నమ్మకం. అలానే ఆయన సక్సెస్ అయ్యారు. విశ్వం కూడా అంత బాగుంటుందని మా నమ్మకం.→ శ్రీను వైట్ల గారిలో నేచురల్ గానే ఒక సెటైరికల్ కామెడీ ఉంటుంది. ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంటుంది. ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది, ఆయన ప్రతి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. షూటింగ్ చేసేటప్పుడు ఆయన టైమింగ్ పట్టుకోవడానికి ఫస్ట్ టుడేస్ నాకు కొంచెం కష్టం అనిపించింది.→ ఇందులో నా క్యారెక్టర్ పేరు విశ్వం. అయితే రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లగారికి చెప్పాను. అయితే ఈ సినిమాకి 'విశ్వం' టైటిల్ యాప్ట్ అని ఆయన చెప్పారు.→ స్టోరీ విన్నప్పుడు బోర్ కొట్టకూడదు. ఎంగేజింగ్ గా ఉండాలి. కథని నేను ఒక ఆడియన్ లాగే వింటాను. బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ అనిపించినప్పుడు అలాంటి స్క్రిప్ట్ చేయడానికి ఇష్టపడతాను.→ ప్రభాస్తో సినిమా చేయాలని నాక్కుడా ఉంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం. -
ప్రేక్షకులకు నవ్వు ఆగదు: గోపీచంద్
‘‘విశ్వం’ చిత్రం షూటింగ్లో ప్రతి సన్నివేశం చేసేటప్పుడు నవ్వుకుంటూనే ఉన్నాం. వినోదం, యాక్షన్ అద్భుతంగా వచ్చాయి. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు నవ్వు ఆగదు... చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్క మాట చెప్పగలను... శ్రీను వైట్లగారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్’’ అని గోపీచంద్ అన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘శ్రీను వైట్లగారి సినిమా లో ఎంత వినోదం ఆశిస్తారో... అంతకు మించి ఇవ్వడానికి ఆయన ‘విశ్వం’ స్క్రిప్ట్పై దాదాపు 7 నెలలు పని చేశారు. నేను చాలా సినిమాలు చేశాను. ఆయన వద్ద ఉండే సౌకర్యం ఎక్కడా ఫీల్ అవ్వలేదు. రాజీ పడకుండా ఈ సినిమా తీసిన విశ్వప్రసాద్, చక్రపాణిగార్లకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ–‘‘విశ్వం’ అందమైన ప్రయాణం. ఈ సినిమాని అనుకున్నట్లు తీయగలిగా. ఈ చిత్రం అందర్నీ నవ్విస్తుందని వంద శాతం నమ్మకం ఉంది’’అని చెప్పారు. ‘‘విశ్వం’ పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. అందరూ మా సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘మా కుటుంబం 86 ఏళ్ల నుంచి సినిమాల్లో ఇన్వాల్వ్ అయింది. ‘విశ్వం’ నాకు తొలి సినిమా. ఇది మా హీరో సినిమా అని గోపీచంద్ అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుంది’’ అని వేణు దోనేపూడి పేర్కొన్నారు. -
గోపీచంద్ ‘విశ్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యాక్షన్ సినిమా చేయాలని ఉంది:కావ్యా థాపర్
‘‘ఓ నటిగా నాకు యాక్షన్, సైకో కిల్లర్, డీ గ్లామరస్.. ఇలా విభిన్న తరహాపాత్రలు చేయాలని ఉంది. అయితే నాకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ వస్తున్నాయి. ‘విశ్వం’లో నాకు మంచి క్యారెక్టర్ దక్కింది’’ అని అన్నారు హీరోయిన్ కావ్యా థాపర్. గోపీచంద్, కావ్యా థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వంలో వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కావ్యా థాపర్ చెప్పిన విశేషాలు.⇒ ఈ సినిమాలో నేను కాస్ట్యూమ్ డిజైనర్ రోల్ చేశాను. మోడ్రన్గా ఉండే అమ్మాయి. కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నా క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్ కనిపిస్తుంది... ఫన్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో సీనియర్ నరేశ్, పవిత్రగార్లు నా తల్లిదండ్రులు. శ్రీను వైట్లగారు మంచి నటన రాబట్టుకున్నారు. మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఈ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్లో నా క్యారెక్టర్లో కూడా ఫన్ ఉంటుంది. ఈ సినిమాలో పదిహేను మంది హాస్యనటులు నటించారు. ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. కథలో ఎమోషన్, యాక్షన్ కూడా ఉన్నాయి.⇒ ‘విశ్వం’ సినిమాను మల్టిపుల్ లొకేషన్స్లో చిత్రీకరించాం. మైనస్ 15 డిగ్రీల వాతావరణంలో సినిమా టీమ్ అందరూపాల్గొన్నాం. విదేశాల్లోనూ షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను నటించిన ‘ఈగిల్’కి కూడా విశ్వప్రసాద్గారే నిర్మాత. ఓ రకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీని హోమ్ బ్యానర్గా భావిస్తుంటాను. ఇక నాకు తెలుగు భాష అర్థం అవుతుంది. ఓ టీచర్ను నియమించుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. మూడు కొత్త సినిమాలకు సైన్ చేశాను. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. -
గోపీచంద్ యాక్షన్కు శ్రీను వైట్ల మార్క్ డైరెక్షన్తో 'విశ్వం' ట్రైలర్
గోపీచంద్ హీరోగా రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి భారీ యాక్షన్ ట్రైలర్ విడుదలైంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ సీన్స్తో పాటు మంచి కామెడీ కూడా ట్రైలర్లో చూపించారు. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి ఈ మూవీని నిర్మించారు. 'హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘విశ్వం’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది.ట్రైలర్తోనే సినిమాపై అంచనాలు పెంచేశారని చెప్పవచ్చు. శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్కు గోపీచంద్ యాక్షన్, కామెడీతో ఈ సినిమా ఉండనుంది. గోపీచంద్ని ఒక విభిన్నమైన పాత్రలో దర్శకుడు చూపించారు. ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో నటించారు. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోయేలా ఉంది. -
విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల
‘‘దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కానీ నా గత సినిమాల సన్నివేశాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఆడియన్స్ సినిమాలను చూసే తీరు మారిపోయింది. నా కామెడీ, యాక్షన్ సన్నివేశాలను ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. కానీ నా థీమ్ వారిని అలరించడం లేదని తెలుసుకున్నాను. ఆ దిశగా మార్పులు చేసుకుని, కొత్త థీమ్తో నా స్టైల్ ఆఫ్ మేకింగ్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాను. ‘విశ్వం’లో నా మార్క్ యాక్షన్, ఎమోషన్, ఆడియన్స్కు నచ్చే కొత్త థీమ్ను మేళవించేందుకు స్ట్రగుల్ అయ్యాను. కానీ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనెపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘విశ్వం’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన విశేషాలు.∙విశ్వం అనే ఓ క్యారెక్టర్ చేసే జర్నీయే ఈ సినిమా కథ. ఈ విశ్వంలో ఎన్నో సీక్రెట్స్ ఉంటాయంటారు. అలానే మా సినిమాలోని విశ్వం క్యారెక్టర్లోనూ ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. అవి థియేటర్స్లో చూడండి. నా గత చిత్రాల్లో కామెడీ, యాక్షన్ బలంగా ఉంటాయి. ఈ అంశాలతోపాటు మంచి ఎమోషనల్ డెప్త్ కూడా ఈ చిత్రంలో ఉంది. ఇలాంటి ఎమోషనల్ డెప్త్ ఉన్న సినిమా నేను చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలోనిపాప సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాగే ఓ అంతర్జాతీయ సమస్యని ఈ సినిమాలో ప్రస్తావించడం జరిగింది. ∙‘విశ్వం’లో గోపీచంద్ అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్గా ఉంటుంది. నా గత చిత్రం ‘వెంకీ’లోని ట్రైన్ ఎపిసోడ్ సక్సెస్ అయ్యింది.ఇప్పటికీ ఆ ఎపిసోడ్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ‘విశ్వం’లో కథ ప్రకారమే ట్రైన్ ఎపిసోడ్ పెట్టాం. ఈ చిత్రంలో ఆర్గానిక్ కామెడీ మాత్రమే ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ రియలిస్ట్గా ఉంటాయి. డిఫరెంట్ లేయర్స్, వేరియేషన్స్ ఉన్న ‘విశ్వం’ తరహా సినిమాకు మ్యూజిక్ చేయడం కష్టం. చేతన్ భరద్వాజ్ మంచి సంగీతం ఇచ్చారు. ఆర్ఆర్ ఇంకా బాగా చేశారు. అలాగే నా పని తీరు తెలిసిన గోపీ మోహన్తో మళ్లీ ఈ సినిమాకు పని చేశాను. ∙‘అమర్ అక్బర్ ఆంటోని’ (2018) సినిమా వల్ల నిర్మాతలకు నష్టం లేదు. కానీ ఈ సినిమా థియేటర్స్లో సరిగా ఆడకపోవడంతో ఆ ఎఫెక్ట్ నాపై పడింది. సినిమా అంటే ఆడియన్స్కు నచ్చేలా కూడా తీయాలని నాకు మరింత అర్థమైంది. వీటన్నింటినీ సదిదిద్దుకుని ‘విశ్వం’ చేశానని నేను నమ్ముతున్నాను. మా టీమ్ కూడా నమ్ము తోంది. ప్రేక్షకులు కూడా నమ్మి, ‘విశ్వం’ను హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ‘ఢీ’ సీక్వెల్గా ‘ఢీ2’ ప్రకటించాం. కానీ శ్రీహరిగారిపాత్రకు రీప్లేస్మెంట్ కుదరడం లేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను. -
'వస్తాను వస్తానులే' అంటోన్న గోపిచంద్.. రొమాంటిక్ సాంగ్ చూశారా!
టాలీవుడ్ స్టార్ గోపిచంద్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ చిత్రంలో డబుల్ ఇస్మార్ట్ భామ కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: 'మీరు అదే పనిలో ఉండండి'.. పవన్ కల్యాణ్కు మరోసారి కౌంటర్!)ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 'మొరాకన్ మగువా' అంటూ సాగే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'వస్తాను వస్తానులే' అంటూ సాగే లవ్ అండ్ రొమాంటిక్ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించగా.. వెంగి లిరిక్స్ అందించారు. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్, ఎమోషన్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. ఈనెల 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో జిషు సేన్గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. -
Viswam Movie: హార్ట్ టచ్చింగ్గా ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్
గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వం. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా బ్యానర్స్పై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువా' కూడా మంచి హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్ ని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసే హార్ట్ టచ్చింగ్ నంబర్ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.(చదవండి: ఓటీటీలో 'దేవర'.. అన్ని రోజుల తర్వాతేనా?)'అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు. మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపిచంద్ కు వున్న బాండింగ్ ని రివిల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. -
చిన్నారి తల్లీ.. కలకు భయపడకు
గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’ అంటూ సాగేపాటని విడుదల చేసింది చిత్రయూనిట్.‘మొండి తల్లి పిల్ల నువ్వు.. అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి, కలకు భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈపాటని సాహితీ చాగంటిపాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందిన చిత్రం ‘విశ్వం’. ఇటీవల విడుదలైన తొలిపాట ‘మొరాకో మగువా..’ కి మంచి స్పందన వచ్చింది. ‘తల్లి, కూతురు నేపథ్యంలో వచ్చే ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’పాట కథలోని భావోద్వేగాల లోతును తెలియజేస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్. -
గోపిచంద్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో గోపిచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: 'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ)ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మొరాకన్ మగువా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇప్పటికే విశ్వం టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్, ఎమోషన్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దసరాకు విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ వేట్టైయాన్తో పోటీపడనుంది. అయితే తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోవడం గోపిచంద్కు కలిసొచ్చే అవకాశముంది. అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కాగా.. ఈ చిత్రంలో జిషు సేన్గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. -
'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ
గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. శ్రీనువైట్ల దర్శకుడు. అప్పట్లో 'వెంకీ', 'దుబాయ్ శీను', 'ఢీ' తదితర సినిమాలతో తెలుగులో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీనువైట్ల.. ఆ తర్వాత రొటీన్ మూస తరహా స్టోరీలతో మూవీస్ తీశాడు. అవి ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'విశ్వం'.(ఇదీ చదవండి: 'బిగ్బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?)దసరా కానుకగా అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ చూస్తే శ్రీనువైట్ల మార్క్ కామెడీ కనిపించింది. అలానే తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే 'విశ్వం' కోసం మరోసారి నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు యాక్షన్, నాన్న అనే ఎమోషన్ కూడా చూపించారు.టీజర్ చూస్తే పర్వాలేదనిపిస్తోంది గానీ స్టోరీ ఏ మాత్రం రొటీన్గా ఉన్నాసరే ప్రేక్షకులు తిరస్కరించే ఛాన్స్ ఉంది. మరి 'విశ్వం' సినిమాతో గోపీచంద్-శ్రీనువైట్ల కాంబో ఏం చేస్తుందో చూడాలి? తెలుగులో దసరాకి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేం లేవు. తమిళ నుంచి రజినీకాంత్ 'వేట్టాయాన్' ఉంది. మరి రజనీ మూవీని తట్టుకుని 'విశ్వం' ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం) -
ధూం ధాం పాటలు బాగున్నాయి
‘‘ధూం ధాం’ టీజర్ ఆకట్టుకునేలా ఉంది.. పాటలు బాగున్నాయి. రామ్ కుమార్ మంచి నిర్మాత. డైరెక్టర్ సాయి అంకితభావం ఉన్న వ్యక్తి. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన గోపీమోహన్ ‘లౌక్యం’ సినిమా నుంచి నాతో పని చేస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్ అన్నారు. హెబ్బా పటేల్, చేతన్ కృష్ణ జంటగా సాయికిశోర్ మచ్చ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధూం ధాం’. ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం టీజర్ను గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల విడుదల చేశారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. ‘దుబాయ్ శీను’ నుంచి ‘బాద్షా’ వరకు నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడు సాయికిశోర్. రామ్ కుమార్గారు సినిమా మీద ప్యాషన్తో విదేశాల నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని సాయికిశోర్ మచ్చా తెలిపారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని ఎంఎస్ రామ్ కుమార్ చెప్పారు. -
మీ మద్దతు.. మీరే నా బలం: గోపిచంద్ ఎమోషనల్ పోస్ట్
గతేడాది రామబాణం మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం ఆయన విశ్వం చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనువైట్ల డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియో బ్యానర్లపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.అయితే గోపిచంద్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ కెరీర్లో సహకరించిన నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. అభిమానుల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని.. మీరే నా బలం అంటూ పోస్టులో రాసుకొచ్చారు. మీడియా మిత్రుల సపోర్ట్ మరువలేదని గుర్తు చేసుకున్నారు. మీ మద్దతు నాకు ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తూ.. విశ్వం సినిమాతో మళ్లీ కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. కాగా.. 2001 తొలివలపు మూవీతో గోపించంద్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జయం మూవీతో విలన్గా మెప్పించి.. హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 🙏❤️ pic.twitter.com/9XQhJYx7wV— Gopichand (@YoursGopichand) August 3, 2024 -
హై ఓల్టేజ్ యాక్షన్
గోపీచంద్ హీరోగా రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ్ర΄÷డక్షన్స్ చివరి దశలో ఉన్న ‘విశ్వం’ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ది జర్నీ ఆఫ్ విశ్వం’ అనే వీడియోను విడుదల చేశారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘విశ్వం’.శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్, యాక్షన్, కామెడీతో ఈ సినిమా ఉంటుంది. గోపీచంద్ని ఒక విభిన్నమైన పాత్రలో చూపిస్తున్నారు దర్శకుడు. సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయో తెలియజేయడంతో పాటు ఆడియన్స్లో ఎగ్జయిట్మెంట్ని క్రియేట్ చేసేలా ఈ వీడియోను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: చేతన్ భరద్వాజ్. -
కమ్బ్యాక్ కోసం ట్రైన్ కామెడీనే నమ్ముకున్న శ్రీనువైట్ల!
తెలుగులో కొన్ని క్లాసిక్ సినిమాలు తీస్తే 'వెంకీ' ఇందులో కచ్చితంగా ఉంటుంది. ఈ మూవీలోని కామెడీ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ట్రైన్లో వెంకీ తన గ్యాంగ్తో చేసే కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. ఎవరికైనా బోర్ కొడితే ఇప్పటికీ యూట్యూబ్లో ఎక్కువగా చూసే కామెడీ సీన్ ఏదైనా ఉందా అంటే అది 'వెంకీ ట్రైన్ కామెడీ'నే. ఇప్పుడు హిట్ కొట్టడం కోసం శ్రీనువైట్ల మళ్లీ దీన్ని నమ్ముకున్నారా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో అజిత్.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!)'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు' లాంటి సినిమాల్లో కామెడీతో తనకంటూ సెపరేట్ ట్రేడ్ మార్క్ సృష్టించిన శ్రీనువైట్ల.. ఆ తర్వాత వరస ప్లాఫులతో డౌన్ అయిపోయారు. ఓ దశలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయాడా అనుకున్నారు. కానీ ప్రస్తుతం గోపీచంద్తో 'విశ్వం' సినిమా తీస్తున్నాడు. తాజాగా 'జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో నిమిషం నిడివి ఉన్న వీడియోని రిలీజ్ చేశారు.వీడియో చూస్తుంటే ఫారెన్ లొకేషన్స్, ఫైట్స్ లాంటి కమర్షియల్ అంశాలు కనిపించాయి. కానీ ట్రైన్ కామెడీ సీన్స్ కూడా కనిపించాయి. టీటీఈతో హీరో అండ్ గ్యాంగ్ చేసే కామెడీ తరహా విజువల్స్ చూపించారు. అయితే హిట్ కోసం తహతహలాడుతున్న శ్రీనువైట్ల.. మళ్లీ తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే నమ్ముకున్నాడా అనిపిస్తుంది. 'వెంకీ' వచ్చినప్పటితో పోలిస్తే జనాల మైండ్ సెట్ మారిపోయింది. మరి వింటేజ్ శ్రీనువైట్ల తరహాలో ఈ ట్రైన్ కామెడీ బిట్ ఉంటుందా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
గోపీచంద్ 'విశ్వం' టీజర్ రిలీజ్.. కామెడీ కాదు ఈసారి యాక్షనే!
శ్రీనువైట్ల.. ఈ పేరు చెప్పగానే ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మీమ్స్ లో ఉండే సగం సినిమాలు ఈయన తీసినవే. కానీ తర్వాత తర్వత ట్రెండ్ కి తగ్గ మూవీస్ చేయలేక సైడ్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత సినిమా చేశాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. (ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!) అప్పుడెప్పుడో 'బాద్ షా'తో ఓ మాదిరి హిట్ కొట్టిన శ్రీనువైట్ల.. ఆగడు, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి చిత్రాలతో వరస ఫ్లాప్స్ దెబ్బకు సైడ్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు ఇక సినిమాలు చేయడేమో అని అందరూ అనుకున్నారు. కానీ గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకి 'విశ్వం' అని టైటిల్ ఫిక్స్ చేసి, టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే శ్రీనువైట్ల ఈసారి కామెడీని కాకుండాయాక్షన్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు శ్రీనువైట్లతో పాటు గోపీచంద్ కి కూడా చాలా అవసరం. మరి ఏం చేస్తారో చూడాలి? బహుశా ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఎట్టకేలకు ఓటీటీకి గోపిచంద్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. టెంపుల్ బ్యాక్డ్రాప్లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అభిమానులు అంతా భావించారు. గతవారమే ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో భీమా ఓటీటీ కొత్త తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఉగాది సందర్భంగా అఫీషియల్ డేట్ను రివీల్ చేసింది. ఈనెల 25 నుంచి భీమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. Surprise surprise! Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024 -
కొత్త పాయింట్తో...
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్తో కలిసి చిత్రాలయం స్టూడియోస్పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్బస్టర్స్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
ఓటీటీలో గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఆ రోజేనా..?
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన భీమా డిజిటల్ రైట్స్ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్డ్రాప్లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్ మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
భీమాని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్
‘‘భీమా’ సినిమా బాగుంది. యాక్షన్, కామెడీ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్స్లో మంచి వేరియేషన్స్ చూపించారని మంచి అప్లాజ్ వస్తోంది. ఇంత మంచి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన థ్యాంక్స్ మీట్లో దర్శకులు మారుతి, సంపత్ నంది అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘భీమా’ వంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన దర్శకుడు హర్షకు, నిర్మాత రాధామోహన్గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘భీమా’కు ఆడియన్స్ నుంచి లభిస్తోన్న స్పందన సంతోషాన్నిస్తోంది’’ అన్నారు హర్ష. ‘‘రోజు రోజుకీ మా సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. విద్యార్థుల పరీక్షలు పూర్త య్యాయి. చూడనివారు మా సినిమాను చూడండి’’ అన్నారు రాధామోహన్. మాళవికా శర్మ మాట్లాడారు. -
శ్రీకాంత్ మేనకోడలితో గోపీచంద్ పెళ్లి.. ఎవరు సెట్ చేశారో తెలుసా?
గోపీచంద్... కెరీర్ ప్రారంభంలో హిట్ల మీద హిట్లు కొట్టాడు. హీరోగా, విలన్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ రానురానూ ఈ హీరోకు అవకాశాలు తగ్గాయి. చేసిన నాలుగైదు సినిమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అయితే ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన భీమా మూవీ మాత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా పర్వాలేదనిపిస్తోంది. చూడగానే నచ్చేసింది తాజాగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ హీరో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనది ప్రేమ వివాహమని తెలిపాడు. గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఒకసారి రేష్మ ఫోటో చూశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్సయ్యాను. తర్వాత ఆమె శ్రీకాంత్ మేనకోడలు అని తెలిసింది. అప్పటికే నాకు శ్రీకాంత్తో పరిచయం ఉంది కానీ ఈ విషయం డైరెక్ట్గా మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించింది. ఆయనే మధ్యవర్తిత్వం అందుకే నటుడు చలపతిరావు అంకుల్కు విషయం చెప్పాను. ఆయన మధ్యవర్తిత్వం చేశారు. శ్రీకాంత్తో మాట్లాడి పెళ్లి సెట్ చేశారు. ఆయనే పెళ్లికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకున్నారు. రేష్మ నాకు ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్.. టీషర్ట్' అని చెప్పుకొచ్చాడు. కాగా 2013లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీతారలతో పాటు రాజకీయప్రముఖులు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం గోపీచంద్- రేష్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: ఆమె ఎక్కడుంటే అక్కడ నాశనమే.. రెండో పెళ్లితో సంతోషంగా ఉన్నా.. -
క్లాప్స్.. విజిల్స్ పడుతూనే ఉన్నాయి
‘‘భీమా’ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీలో ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో ఎమోషన్ని అద్భుతంగా ఎలివేట్ చేస్తూ ఫైట్స్ డిజైన్ చేశారు రామ్–లక్ష్మణ్ మాస్టర్స్. చివరి అరగంట థియేటర్స్లో ప్రేక్షకుల నుంచి క్లాప్స్, విజిల్స్ పడుతూనే ఉన్నాయి. ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరో గోపీచంద్. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో గోపీచంద్ మాట్లాడుతూ–‘భీమా’ లాంటి మంచి మూవీతో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకునేలా చేసిన హర్షకి ధన్యవాదాలు. రాజీ పడకుండా సినిమాని గ్రాండ్గా నిర్మించిన రాధామోహన్, శ్రీధర్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మా భీమా’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు కేకే రాధామోహన్. ‘‘భీమా’లో ఇంటర్వెల్, క్లైమాక్స్లో ప్రేక్షకుల కేరింతలు చూసి సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఎ. హర్ష. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్ (ఫోటోలు)
-
‘భీమా’ మూవీ రివ్యూ.. 'గోపీచంద్' హిట్ కొట్టాడా..?
టైటిల్: భీమా నటీనటులు: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్,మాళవిక శర్మ,నాజర్,వెన్నెల కిషోర్,నరేష్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాత: కేకే రాధామోహన్ దర్శకత్వం: ఏ. హర్ష సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ సంగీతం: రవి బస్రుర్ విడుదల తేది: మార్చి 8, 2024 భీమా కథేంటంటే సినిమా ప్రారంభంలోనే పరశురాముడి కథతో ప్రారంభం అవుతుంది. ఒకానొక సమయంలో పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడిని కోరాడు. సముద్రంలో గొడ్డలిని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో భార్గవరాముడు గొడ్డలి విసిరాడు. దీంతో సముద్రం వెనక్కు వెళ్లింది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమా కథ బాదామితో పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో కథ జరుగుతుంది. కేరళలోని మహేంద్రగిరిలో సినిమా కథ మొదలౌతుంది. ఆ ప్రాంతంలో అరాచక శక్తులతో అల్లకల్లోలంగా ఉంటుంది. అక్కడి ప్రజలతో పాటుగా పోలీసు వ్యవస్థను శక్తి భవాని (ముఖేష్ తివారి) గడగడలాడించే స్థాయిలో ఉంటాడు. పెట్రోల్ ట్యాంకర్స్ మాటున అతను చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. మహేంద్రగిరిలో తనకు అడ్డు తగిలేవాడు ఎవడూ లేడని శక్తి భవాని తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరో వైపు భీమా కథలో పరశురామ క్షేత్రం అనే ఊరు తెరపైకి వస్తుంది. ఆ ఊరులో గత యాభైఏళ్లుగా మూత పడిన శివాలయాన్ని తన అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటాడు భవాని. సరిగ్గా అలాంటి సమయంలో ఎస్సైగా మహేంద్రగిరిలోకి ఎంట్రీ ఇస్తాడు భీమా (గోపీచంద్)... ఈ క్రమంలోనే విద్య (మాళవికా శర్మ) ఎంట్రీ ఇస్తుంది. విద్య ఒక స్కూల్లో పనిచేస్తూనే మొక్కలపై పరిశోధనలు కూడా చేస్తూ ఉంటుంది. పరశురామ క్షేత్రంలో ఆయుర్వేద వైద్యుడిగా రవీంద్రవర్మ (నాజర్) ఉంటారు. ఆయన దగ్గర విద్య మొక్కలపై పలు పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ రవీంద్రవర్మ ప్రజలకు వైద్యం చేస్తూ దగ్గరగా ఉంటే.. శక్తి భవాని ప్రజలను భయపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో మరణించిన మనిషిని కూడా బతికించే మందును కనిపెట్టాలని ఆయుర్వేద వైద్యంలో పలు పరిశోధనలు చేస్తుంటాడు రవీంద్రవర్మ.. ఇలా ఆసక్తిగా నడుస్తున్న కథలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ కథలో పెట్రోలు ట్యాంకర్స్ మాటున భవాని చేస్తున్న అక్రమ వ్యాపారం ఏంటి..? భీమాని అడ్డుకోవటం కోసం భవాని పన్నిన వ్యూహం ఏమిటి..? విలన్లను ఎదుర్కొనే క్రమంలో భీమా ఏం అయ్యాడు..? ఎప్పుడో చిన్నతనంలో విడిపోయిన తన తమ్ముడు రామా (గోపీచంద్) కథలోకి ఎలా వచ్చాడు..? పరశురామ క్షేత్రంలో ఉన్న శివాలయం 50 ఏళ్లుగా ఎందుకు మూత పడింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినిమా చూస్తున్నంత సేపు అందరిలో కలుగుతాయి. ప్రీ క్లైమాక్స్లో రివీల్ అయ్యే అసలు ట్విస్ట్ ఏమిటి..? ఇవన్నీ తెలియాలంటే 'భీమా' చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా ప్రారంభంలోనే పరశురాముడి గురించి చెప్పడం.. ఆపై పరశురామ క్షేత్రంలోని శివాలయంలో జరిగే కొన్ని సంఘటనలు చూపించడంతో కథ అంతా మానవాతీత శక్తులతో నిండి ఉంటుందని అనుకుంటాం కానీ అదేమీ కాదని 15 నిమిషాల్లోనే తెలిపోతుంది. అక్కడ నుంచి రోటీన్ కమర్షియల్ స్టోరీతో సినిమా జరుగుతుంది. ఫస్టాఫ్లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా సినిమాల్లో కనిపించిందే ఉంటుంది. కథ ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా చెప్పిన కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష కొంత సమయం తర్వాత మెల్లిమెల్లిగా స్టోరీపై పట్టు కోల్పోయాడు. సినిమా ప్రారంభంలో చెప్పిన శివాలయం పాయింట్ను చివరి వరకు ఎక్కడా ప్రస్థావన ఉండదు. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలి.. ఎందుకంటే గోపీచంద్ రెండు పాత్రలు చేశాడు.. ఆపై గుడి కాన్సెప్ట్ ఉంది. కథలో ప్రేక్షకుడు లీనం అయ్యేలా తెరకెక్కించాలి. కానీ భీమాలో అది కాస్తా మైనస్గా మారింది. కమర్షియల్ టచ్ ఉన్న స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్ను చేర్చి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా గోపీచంద్, మాళవికా శర్మ మధ్య ఉండే లవ్ ట్రాక్ కాస్త తగ్గించి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. కన్నడ చిత్ర సీమలో కొరియోగ్రాఫర్గా కెరియర్ స్టార్ట్ చేసిన ఏ. హర్ష శివరాజ్కుమార్తో 'వేదా' చిత్రాన్ని తీసి తెలుగు వారికి దగ్గరయ్యాడు. దీంతో గోపీచంద్తో భీమా సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ ఆయనకు దక్కింది. సినిమాలో గోపీచంద్ నటనకు ఎలాంటి పేరు పెట్టాల్సిన పనిలేదు.. రెండు పాత్రలలో ఆయన ఇరగదీశాడు.. సినిమా మొత్తం సింగిల్ హ్యాండ్తో నడిపించాడు. సినిమా స్టోరీ అంతా కూడా ఫాంటసీ ఎలిమెంట్తో డైరెక్టర్ తెరకెక్కించి ఉండుంటే భారీ హిట్ కొట్టేది అని చెప్పవచ్చు. ఎవరెలా చేశారంటే.. భీమాగా పోలీసు గెటప్లో కనిపించిన గోపీచంద్.. రామాగా పురోహితుడి పాత్రలో కూడా కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్లలో ఇరగదీశాడని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ ఆయన చక్కగా నటించాడు. ఇక సినిమాలో గోపీచంద్ తర్వాత నాజర్ పాత్ర అందరినీ మెప్పిస్తుంది. తెరపై గోపీచంద్ మాళవికా శర్మ,ప్రియా భవానీ శంకర్ల కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. పోలీసు పాత్రలో గోపీచంద్ ఉన్నంత సేపు ప్రేక్షకులో ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఫైట్ అందరినీ కట్టిపడేస్తుంది. విలన్గా నటించిన శక్తి భవానీని డైరెక్టర్ అంతగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్,నరేష్, పూర్ణ,నాజర్ వంటి స్టార్స్ వారి పరిధిమేరకు మెప్పించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన అందించిన బీజీఎమ్ సినిమాపై పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేస్తుంది. పాటలు అంతగా నోటెడ్ కాకపోయినప్పటికీ తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్ ప్లే మరికొంత బలంగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు అనిపిస్తాయి. సినిమా చివరిలో 30 నిమిషాల పాటు దర్శకుడి చూపిన పని తీరుకు ఎక్కువ మార్కులు పడుతాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్ డెస్క్ -
గోపీచంద్ 'భీమా' టాక్ ఎలా ఉందంటే..
గోపీచంద్ హీరోగా నటించిన భీమా నేడు (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందొ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. భీమా భారీ యాక్షన్ మూవీ అని ఓవర్సీస్ ఆడియెన్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. గోలీమార్ తర్వాత మరోసారి పోలీస్ అవతారంలో గోపీచంద్ మెప్పించాడని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో ఉన్న గోపీచంద్కు ఈ సినిమా కాస్త రిలీఫ్ ఇస్తుందని అంటున్నారు. ముఖ్యంగా గోపీచంద్ కటౌట్గా తగ్ కథ భీమాతో కుదిరిందని నెటిజన్లు అంటున్నారు. డ్యూయల్ షేడ్ క్యారెక్టర్లోగోపీచంద్ తన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారని పేర్కొంటున్నారు. పరుశురామ క్షేత్రం ఎపిసోడ్లో గోపీచంద్ శివతాండవం చేశాడని నెట్టింట వైరల్ అవుతుంది. ముఖ్యంగా గోపీచంద్కు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంత మేరకు తోడు కావడంతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. భీమా సినిమాకు ప్రధానంగా యాక్షన్ సీక్వెన్స్లు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ రేంజ్లో ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన బీజీఎమ్ పీక్స్కు వెళ్తుందని ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. చాలా సీన్స్కు ఆయన ఇచ్చిన ఎలివేషన్ బీజీఎమ్తోనే సినిమాకు మేజర్ ప్లస్ అయిందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ కెరీర్లో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా భీమా రికార్డుకెక్కింది. భీమాతో గోపీచంద్ మళ్లీ హిట్టు ట్రాక్లోకి వచ్చాడని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఫ్యాన్స్కు మాత్రం భీమాతో బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చాడని తెలుపుతున్నారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని గ్యారెంటీగా భీమా మెప్పిస్తుందని కామెంట్ల చేస్తున్నారు. @YoursGopichand Nee Cutout Ki Padalsina Cinema Ani Strong Feeling 🔥 Expecting Macho Star Mass Blockbuster#BHIMAA #BhimaaFromToday pic.twitter.com/tqV9dTnFLS — ST (@Iconic_Powerism) March 7, 2024 INSIDE INFO : #BHIMAA - INTERVAL IS GOOD & CLIMAX IS MAJOR HIGHLIGHT OF THE FILM 🔥🔥🔥🔥🔥#Gopichandh pic.twitter.com/CFKRcFYn6X — GetsCinema (@GetsCinema) March 7, 2024 interval ❌ climax🥵🥵🥵#BhimaaFromToday #BHIMAA pic.twitter.com/0Bo9uiZVoA — Santhosh (@Santhosh_offl8) March 8, 2024 The Backbone Of The Film @RaviBasrur .... You're One Of The Reason To Witness #BHIMAA .... Definitely Your Music Gonna Resound More 🔥❤️🔥💥🔥❤️🔥💥 declaring MASSive Blockbuster in advance #BHIMAA#Gopichand #BHIMAA @BhimaaMovie pic.twitter.com/TjajnXcVR1 — Surya Sujith (@ntrfansujith) March 7, 2024 Telugu audience always failed to encourage our gem of actors like #gopichand films like sahasam, okkadunnadu & Gautham nanda deserved so much love. Unfortunately Telugu audience were busy praising other language films. #bhimaa #Gaami pic.twitter.com/EIVkV0TtBH — Theinfiniteview (@theinfiniteview) March 8, 2024 -
Bhimaa: ఎమోషన్.. ఎలివేషన్.. ఎంటర్టైన్మెంట్తో పాటు సందేశం
‘‘సినిమాలో ఏ మాత్రం ల్యాగ్ ఉన్నా సరే థియేటర్స్లో ఆడియన్స్ మొబైల్ ఫోన్స్ చూస్తున్నారు. సో... ఆడియన్స్ను ఎంగేజ్ చేయాలంటే మంచి స్క్రీన్ ప్లే ఉండాలి. ‘భీమా’లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది. ఎలివేషన్.. ఎమోషన్.. ఎంటర్టైన్మెంట్లతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో ‘భీమా’ చిత్రంలో ఓ సామాజిక సందేశం కూడా ఉంది’’ అన్నారు దర్శకుడు ఎ. హర్ష. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ఈ నెల 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో ఎ.హర్ష మాట్లాడుతూ– ‘‘కరోనా సెకండ్ వేవ్ సమయంలో ‘భీమా’ చిత్రం సహనిర్మాత శ్రీధర్గారు ఓ కథ ఉంటే చెప్పమన్నారు. ఆన్లైన్లో గోపీచంద్గారికి ‘భీమా’ స్టోరీలైన్ చెప్పాను. ఆ తర్వాత ఫుల్ స్టోరీ చెప్పాను. ఆయనకు నచ్చింది. చిన్న మార్పులు సూచించారు. ఆ తర్వాత సెట్స్పైకి వెళ్లాం. గోపీచంద్గారు అద్భుతమైన నటుడు. ఆయన చేసిన ‘భీమా’ పాత్రను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రాధామోహన్గారు నిర్మించిన ‘బెంగాల్ టైగర్’కు కొరియోగ్రాఫర్గా చేశాను. ఇప్పుడు ఆయన నిర్మించిన సినిమాకు దర్శకత్వం వహించడం హ్యాపీ’’ అన్నారు. -
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: హీరో గోపీచంద్
‘‘భీమా’ పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. నేను చేసిన భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలున్నాయి. ఈ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ని హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది. సినిమా చూసి బయటికి వచ్చాక ప్రేక్షకుల మనసులో భీమా నిలిచిపోతాడనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు. ► ‘భీమా’ సహనిర్మాత శ్రీధర్గారు కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. అప్పుడో కథ చెప్పాడు హర్ష.. కథ బావుంది కానీ ఆ సమయంలో చేయకూడదని అనిపించింది. పోలీస్ నేపథ్యంలో ఏదైనా వైవిధ్యమైన కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్న హర్ష ఆ తర్వాత వచ్చి ‘భీమా’ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ► నేను గతంలో పోలీసు పాత్రలు చేశాను. ‘గోలీమార్’లో డిఫరెంట్ కాప్. ‘ఆంధ్రుడు’ లవ్ స్టోరీ నేపథ్యంలో నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథే. ‘శౌర్యం’ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పోలీస్ పాత్రని ‘భీమా’లో చేశాను. ఈ పోలీసు కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది.. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. హర్ష కన్నడలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ‘భీమా’ని అద్భుతంగా తీశాడు.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► ‘భీమా’ పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ట్రైలర్లో చూపించినట్లు అఘోరాలు, కలర్ ప్యాలెట్, నేపథ్య సంగీతం వల్ల ‘అఖండ’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉంది. పైగా సినిమా కూడా మహా శివరాత్రికి వస్తోంది. అయితే దీన్ని మేం ముందుగా ప్లాన్ చేయలేదు.. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను. ► నిర్మాత రాధామోహన్, నా కాంబినేషన్లో ‘పంతం’ (2018) సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పంతం’ వాణిజ్య పరంగా సక్సెస్ అయినా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ, ‘భీమా’తో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాని చాలా గ్రాండ్గా నిర్మించారాయన. ► మా నాన్న (డైరెక్టర్ టి. కృష్ణ)తో పాటు ఆ తరంలోని దర్శకులు జనాలతో మమేకం అయ్యేవారు. అలా ప్రజల సాధక బాధకాలు, సమస్యలు తెలుసుకుని కథ రాసుకుని, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి హిట్ సాధించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకర్గారి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగిలిన వారు సమాజం, ప్రజల నేపథ్యంలో కథలు రాయడం లేదు. సొసైటీ బ్యాక్డ్రాప్ని ఎంచుకుని సరైన విధానంలో తెరపై చూపించగలిగితే ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. దర్శకత్వం అనేది చాలా కష్టమైన పని.. అందుకే నాకు ఆ ఆలోచన లేదు. ► చిత్ర పరిశ్రమలో దాదాపు 22 ఏళ్ల ప్రయాణం నాది.. ఇన్నేళ్ల జర్నీ హ్యాపీగా ఉంది కానీ నటుడిగా పూర్తిగా సంతృప్తి పడటం లేదు. ఒక నటుడికి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ, ఆ చాన్స్ రాలేదు.. వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాం. ప్రస్తుతం శ్రీను వైట్లగారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ఆ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లతో ఓ చిత్రం, యూవీ క్రియేషన్స్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. -
‘భీమా’ డిఫరెంట్ కాప్ స్టోరీ..ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి: గోపీచంద్
‘ఇప్పటికే నేను పలు సినిమాల్లో పోలీసు పాత్రలు చేశాను. గోలీమార్ డిఫరెంట్ కాప్ స్టోరీ. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. లాంటి పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో గోపీచంద్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం రీలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కోవిడ్ టైమ్లో దర్శకుడు హర్ష నాకొక కథ చెప్పారు. అది బాగుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీసుకి సంబధించి ఏదైనా డిఫరెంట్ కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా 'కథ' చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. అలా కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైయింది. ► భీమా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో చాలా ఇంటన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రోమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూసి బయటికి వచ్చాక భీమా ప్రేక్షకుడి మనసులో నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ► ఈ చిత్రాన్ని చాలా మంది 'అఖండ' తో పోలుస్తున్నారు. కానీ ఆ కథతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వల్ల అలా అనిపించవచ్చు ఏమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా 'అఖండ' పోలిస్తే మంచిదేగా (నవ్వుతూ). భీమా పరశురామక్షేత్రంలో జరిగే కథ. అందుకే అలాంటి నేపధ్యం తీసుకున్నాం. ► హర్ష చాలా అనుభవం వున్న దర్శకుడు. చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే చేశాడు. చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, మలుపులు, సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు అదే పేరు యాప్ట్ అని టైటిల్ గా పెట్టడం జరిగింది. ► ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. కథకు కావాల్సిన పాత్రలు. పాత్రలకు ఒక పర్పస్ ఉంటుంది. ► రవిబస్రూర్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయింది. ట్రైలర్ లో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. దానికి మించి సినిమాలో ఉంటుంది. మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశాడు. ► ప్రస్తుతం శ్రీను వైట్ల గారితో ఓ సినిమా చేస్తున్న. ముఫ్ఫై శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. తర్వాత ప్రసాద్ గారితో ఒక సినిమా ఉంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో ఉంటుంది. -
నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు: గోపీచంద్
మ్యాచో హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'భీమా'. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో వరంగల్లోని హన్మకొండలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. అందులో డౌటే లేదు ప్రీరిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్షను పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను... కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు' అని చెప్పారు. ఆయన నవ్వుతోనే ఎనర్జీ.. దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. 'భీమాలో ఎనర్జీ పవర్ వుంది. గోపిచంద్ గారు ఎంతో అద్భుతమైన వ్యక్తి. చాలా హంబుల్గా ఉంటారు. ఆయన నవ్వుతో మాకు ఎనర్జీ వస్తుంది. మార్చి 8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. థియేటర్స్లో హై ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది' అన్నారు. రఘు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, రమణ లంక, కళ్యాణ్ చక్రవర్తితో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. చదవండి: సడన్గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి -
Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా హీరోయిన్
టాలీవుడ్లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. మరోవైపు పాత హీరోయిన్లు మెల్లమెల్లగా కనుమరుగు అవుతూనే ఉంటారు. ఫ్లాప్స్ పడ్డోళ్లు వెళ్లపోయారంటే ఓ అర్థముంది. కానీ బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన తర్వాత కొందరు బ్యూటీస్ సైడ్ అయిపోతుంటారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి స్టోరీనే. తెలుగులో ఒక్కటే సినిమాతో అద్భుతమైన క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల్నే పక్కనబెట్టేసింది. మరి ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మూన్ మూన్ బెనర్జీ. కనీసం ఈ పేరు కూడా ఎప్పుడూ విన్నట్లు లేదే అని అనుకుంటున్నారా? కంగారూ పడకుండి. గోపీచంద్కి హీరోగా బ్రేక్ ఇచ్చిన ఫస్ట్ మూవీ 'యజ్ఞం' గుర్తుందా? అందులో హీరోయిన్గా చేసింది ఈమెనే. కోల్కతాకు చెందిన మూన్ మూన్ బెనర్జీ.. 1997 నుంచి హిందీ సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో హీరోయిన్గా ఛాన్స్ రావడంతో తెలుగులో మూవీ చేసింది. మరి ఏమైందో ఏమో గానీ 'యజ్ఞం' తర్వాత తెలుగుతో పాటు వేరే ఏ భాషలోనూ సినిమా చేయలేదు. సీరియల్స్ మాత్రం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా 'దోరీ' అనే సీరియల్లో నటిస్తోంది. అయితే టాలీవుడ్లో చేస్తున్నప్పుడు యుక్త వయసులో ఉంది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కనిపించలేదు. తాజాగా వయసు పెరగడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇకపోతే 2010లో నీరజ్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Moon banerrjee (@moonbanerrjee) -
ప్రభాస్తో సినిమా? క్లారిటీ ఇచ్చిన మ్యాచో స్టార్
ఒకప్పుడు విలన్.. తర్వాత హీరో.. ఎన్నో సూపర్ హిట్స్ చూసిన గోపీచంద్ ప్రస్తుతం ఒక్క హిట్టు కోసం పరితపిస్తున్నాడు. ఆయన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతుండటంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు. తన ఆశలన్నీ భీమా సినిమాపైనే పెట్టుకున్నాడు. కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 8న రిలీజ్ కానుంది. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్స్గా నటించారు. అలా చెప్పుకోవడం ఇష్టముండదు తాజాగా ఓ షోకి హాజరైన గోపీచంద్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నువ్వు చాలామందిని చదివిస్తున్నావు.. ఎందుకని బయటకు చెప్పుకోవడం లేదు అని యాంకర్ అడిగాడు. అందుకు హీరో స్పందిస్తూ.. నాకలా చెప్పుకోవాలని ఉండదు. ఎవరైతే బాగా చదువుతారో వారికి సాయం చేద్దామనుకుంటాను. కొంతమందికైతే ఆ చదివించేది నేనేనని కూడా తెలియదు అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్-గోపీచంద్ కాంబినేషన్లో సినిమా వస్తుందా? అన్న ప్రశ్నకు.. కచ్చితంగా ఓ సినిమా చేస్తామని చెప్పాడు. కానీ అదెప్పుడు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమన్నాడు. చదవండి: ఇప్పటికే మూడు ప్లాస్టిక్ సర్జరీలు పూర్తి.. అయినా కోలుకోలేని స్థితిలో.. -
Bhimaa HD Photos: గోపీచంద్ ‘భీమా’ మూవీ స్టిల్స్
-
రాక్షసులపై యుద్ధం .. ట్రెండింగ్లో ‘భీమా’ ట్రైలర్
‘శ్రీ మహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు’ అంటూ సాగుతుంది ‘భీమా’ ట్రైలర్. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ కథానాయికలు. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు ఒక డిఫరెంట్ గోపీచంద్ని చూస్తారు’’ అన్నారు ఎ. హర్ష. ‘‘శివరాత్రికి శివుని ఆశీస్సులతో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను’’ అన్నారు రాధామోహన్. -
నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ ఎంత మంచి యాక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వ్యక్తిగత జీవితం ఏంటనేది పక్కనబెడితే యాక్టింగ్ పరంగా ప్రతి సినిమాతోనూ మెస్మరైజ్ చేస్తుంటాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి బయట పెద్దగా కనిపించని ఈయన.. తాజాగా 'భీమా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఫుల్ జోష్తో మాట్లాడాడు. అలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేయడం విశేషం. (ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలతో హీరోయిన్ ప్రగ్యా.. తమన్నాని చూస్తే తట్టుకోవడం కష్టమే!) దివంగత హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కానీ నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వందలాది చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రాబోతున్న గోపీచంద్ 'భీమా' సినిమాలోనూ నరేశ్ మంచి పాత్రే చేసినట్లు ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇందులో ఫుల్ జోష్తో స్పీచ్ ఇచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత తనని చూసి అందరూ (అబ్బాయిలని ఉద్దేశించి) కన్నుకొడతారని నవ్వుతూ చెప్పాడు. అయితే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశాడనేది కొన్నిరోజులు ఆగితే తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
ట్రెండ్కి తగ్గట్లే 'భీమా' ట్రైలర్.. కాకపోతే ఆ విషయమే?
తెలుగు హీరోల్లో కొందరి పరిస్థితి దారుణంగా ఉంది. సినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే మాట చాలా కాలమైంది. ఇలాంటి వాళ్లలో గోపీచంద్ ఒకడు. సిక్స్ ఫీట్ కటౌట్తో పాటు హీరోకి ఏమేం కావాలో అన్ని ఉన్నాయి ఒక్క హిట్ తప్ప. దీంతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని తాపత్రయంతో ఉన్నాడు. అలా 'భీమా' చిత్రంతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 'భీమా' ఫస్ట్ లుక్, టీజర్ అవి చూస్తే ఇది యాక్షన్ సినిమా అని అర్థమైంది. తాజాగా ట్రైలర్తో ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఓ ఊరు, అందులో విలన్స్, హీరో పోలీస్, కొన్ని సమస్యలు వస్తాయి. హీరో వాటిని ఎలా ఎదిరించాడు? ఈ కథలో ఇంకో గోపీచంద్ కూడా ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. మరి ఇద్దరు గోపీచంద్లా? లేదా ఒకడే ఇద్దరా అనేది సినిమా వస్తే తెలుస్తోంది. ట్రైలర్ పరంగా చూస్తుంటే ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లు డివోషనల్ ప్లస్ యాక్షన్ సన్నివేశాలతో ఉంది. అయితే ట్రైలర్లోనే చాలావరకు స్లో మోషన్ షాట్స్ ఉన్నాయి. దీనిబట్టి చూస్తుంటే సినిమాలోనూ ఫైట్ సీన్స్, స్లో మోషన్ షాట్స్ లాంటివి గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. అయితే ఈ తరహా యాక్షన్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. అయితే 'భీమా'లో దీన్ని మించి ఏముంటుందనేది చూడాలి. అలానే ఇది హిట్ కావడం గోపీచంద్ కి చాలా అవసరం కూడా! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
గల్లీ సౌండుల్లో భీమా
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కేకే రాధామోహన్ నిర్మించిన ‘భీమా’ మార్చి 8న రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లీ సౌండుల్లో..’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. రవి బస్రూర్, సంతోష్ వెంకీ రాసిన ఈ పాటను సంతోష్ వెంకీ పాడారు. ‘‘గోపీచంద్ పాత్ర గురించి చెప్పే ట్రాక్ ఇది. ఈ పాట మాస్ని అల రించేలా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్
బల్లికురవ: ఆత్మహత్యాయ్నతం చేసిన ఓ యువకుడి ప్రాణాలను వలంటీర్ కాపాడాడు. ప్రాథమిక చికిత్స చేసి సకాలంలో ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో శనివారం జరిగింది. కుంచాల సుభాషిణి, కనకారావు దంపతుల కుమారుడు గోపీచంద్ (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. కనకారావు ఐదేళ్లుగా గ్రామంలో లేడు. సుభాషిణి తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉంటూ తనకున్న పొలంతోపాటు కుమారుని సాయంతో గొర్రెలను మేపుతోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు అనారోగ్యం బారిన పడ్డాడు. గోపీచంద్ గొర్రెల కాపలాకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతడిని సుభాషిణి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన గోపీచంద్ ఇంట్లోనే పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని గమనించిన తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అక్కడే ఉన్న సీ వన్ క్లస్టర్ వలంటీర్ బత్తుల రమేశ్బాబు..గోపీచంద్ పురుగుమందు తాగినట్లు గుర్తించాడు. బీఎస్సీ నర్సింగ్ చదివిన వలంటీర్.. గోపీచంద్కు ప్రాథమిక చికిత్స చేసి తాగిన పురుగు మందును కక్కించాడు. మెరుగైన చికిత్స కోసం 35 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రావడం ఆలస్యమవుతుందని భావించి మరొకరి సహాయంతో బైక్పైనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందడంతో గోపీచంద్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్ను గ్రామ సచివాలయ కార్యదర్శి షేక్.బాజీ, ఎంపీడీవో హనుమారెడ్డి, ఈవోఆర్డీ దాసరి సుమతి అభినందించారు. -
గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఎప్పుడంటే?
రామబాణం తర్వాత మాచో స్టార్ గోపీచంద్ చేస్తున్న చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. అతనికి జంటగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ నటిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు గోపీచంద్ ట్వీట్ చేశారు. దీంతో గోపీచంద్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. గతేడాది నటించిన రామబాణం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపిచంద్కు కలిసొచ్చే పోలీస్ పాత్ర గోపీచంద్ 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్స్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా.. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. హరహర మహాదేవ శంభో శంకర..! See you all in Cinemas with #BHIMAA this Mahashivratri🔱 pic.twitter.com/aeu1jYQIB2 — Gopichand (@YoursGopichand) January 29, 2024 -
గోపిచంద్ సినిమాతో ఎంట్రీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో అలా వచ్చి.. ఇలా గుడ్ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. కేరళలోని త్రిసూర్లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్లు రావడంతో టాలీవుడ్కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నిర్మాతతో ప్రేమ పెళ్లి అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
Bhimaa Teaser: వేటాడేందుకు బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు
టాలీవుడ్ మ్యాచోస్టార్ గోపీచంద్ 'భీమా'గా బాక్సాఫీస్ బరిలోకి అడుగు పెట్టనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మాత. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. టీజర్లో ఆయన లుక్ అదిరిపోయేలా ఉంది. గోపీచంద్ ఒక ఎద్దుపై కూర్చొని సంకెళ్లతో పాటు ఖాకీ దుస్తుల్లో కనిపించాడు. వినూత్నమైన యాక్షన్ ఎంటర్టైనర్గా గోపీ కెరియర్లో 31వ చిత్రంగా భీమా తెరకెక్కుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న భీమా సినిమాతో దర్శకుడు హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఫిబ్రవరి 16న భీమా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనువైట్ల డైరెక్షన్లో తన 32 వ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. -
కాంబినేషన్ కుదిరిందా?
హీరో అజిత్ ప్రస్తుతం ‘విడాముయార్చి’ సినిమాతో బిజీగా ఉన్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అజర్బైజాన్లో పూర్తయిందని కోలీవుడ్ టాక్. అయితే అజిత్ తెలుగులో ఓ సినిమా కోసం రెడీ అవుతున్నారని, మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాకు దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు అనుకుంటున్నారట. మరి.. అజిత్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కుదిరిందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. -
ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఆగిపోయిన రవి తేజ, గోపీచంద్ మూవీ
-
ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ ఏసీబీ కోర్టు ఆదేశం
-
టాలీవుడ్ సినీ దిగ్గజం చంద్రమోహన్ చివరి సినిమా ఇదే!
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. మరో సినీ దిగ్గజం నింగికెగిసింది. తన వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులను అలరించిన సీనియర్ నటుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ సినీనటులు, అభిమానులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. 1966లొ రంగుల రాట్నంతో ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రమోహన్.. దశాబ్దాల పాటు తన కెరీర్లో వందల చిత్రాల్లో నటించారు. హీరోగా, నటుడిగా, విభిన్నమైన పాత్రల్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో మెప్పించారు. అలనాటి స్టార్ హీరోయిన్స్, శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి వారితో సినిమాలు చేశారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్లో చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో చంద్రమోహన్ కనిపించారు. చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. -
మిలన్కు బై బై
మిలన్కు బై బై చెప్పారు గోపీచంద్. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటలీలో మొదలైన విషయం గుర్తుండే ఉంటుంది. అక్కడి మిలన్ నగరంలో ప్లాన్ చేసిన షెడ్యూల్ ముగిసింది. గోపీచంద్తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటతో ఈ విదేశీ షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్. -
ఇటలీలో ఆటాపాటా
గోపీచంద్ ఇటలీకి మకాం మార్చారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనెపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబరు 24) శ్రీనువైట్ల బర్త్ డే. ఈ సందర్భంగా ఇటలీలో శ్రీనువైట్ల అండ్ టీమ్ లొకేషన్స్ను ఫైనలైజ్ చేస్తున్న వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సౌత్ ఇటలీలోని మాంటెరా లొకేషన్స్లో ప్రారంభం కానుంది. మేజర్ షూటింగ్ను విదేశాల్లోనే కంప్లీట్ చేస్తారట చిత్రయూనిట్. గోపీచంద్పై ముందుగా ఓ యాక్షన్ సీన్ను ప్లాన్ చేశారట శ్రీనువైట్ల. ఆ తర్వాత ఓ పాటని కూడా చిత్రీకరించనున్నారని భోగట్టా. ఈ చిత్రంలో కావ్యాథాపర్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. -
ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా
హీరోయిన్ సదా పేరు చెప్పగానే 'వెళ్లవయ్యా వెళ్లు..' అనే డైలాగ్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ డైలాగ్ పాపులారిటీ అలాంటిది మరి. అయితే హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సదా.. ఆ తర్వాత సరైన ఛాన్సులు రాకపోవడంతో నటనని పక్కనబెట్టేసింది. ప్రస్తుతం రియాలిటీ షో జడ్జిగా పలు షోలు చేస్తోంది. అయితే గతంలో ఓ సినిమాలో ఓ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతోందట. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) ఏ సీన్ గురించి..? నితిన్-తేజ కాంబోలో వచ్చిన 'జయం' మూవీ టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన వాళ్లతో పాటు విలన్గా నటించిన గోపీచంద్కి కూడా అద్భుతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఈ మూవీలో ఓ సీన్లో భాగంగా హీరోయిన్ సదా బుగ్గపై.. విలన్ గోపీచంద్ నాలుకతో నాకుతాడు. సదా ఈ సీన్ గురించే చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సదా ఏం చెప్పింది? 'జయం సినిమాలో ఓ సీన్లో ఎందుకు నటించా అని ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ సీన్ చేయనని దర్శకుడికి ముందే చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. మూవీకే ఆ సన్నివేశం హైలైట్గా నిలుస్తుందని చెప్పి ఒప్పించారు. అయితే ఆ సీన్ పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి చాలాసేపు ఏడ్చాను. నా ముఖాన్ని పదేపదే కడుక్కున్నాను. ఇప్పటికీ టీవీలో ఆ విజువల్ వస్తే ఆ దరిదాపుల్లో ఉండను' అని సదా చెప్పినట్లు సదరు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్నే అవమానించిన రజనీకాంత్!) -
డైరెక్టర్ శ్రీను వైట్లతో గోపీచంద్ కొత్త సినిమా
-
కొత్త చిత్రం షురూ
గోపీచంద్ హీరోగా నటించనున్న తాజా చిత్రం శనివారం ఆరంభమైంది. సూపర్స్టార్ కృష్ణ ఆశీస్సులతో ప్రారంభమైన చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సన్నివేశానికి నిర్మాత నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ‘‘ప్రధాన భాగాన్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్గారిని విభిన్న పాత్రలో చూపిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
శ్రీను వైట్ల, గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభోత్సవం
-
గోపీచంద్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఓటీటీకి వచ్చేస్తోన్న రామబాణం!
మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. జగరపతిబాబు, ఖుష్బూ ప్రధానపాత్రలు పోషించారు. అయితే లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. (ఇది చదవండి: బాలీవుడ్లో మరో సినిమా చేస్తోన్న ధనుష్.. ముచ్చటగా మూడోసారి! ) మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామబాణం... నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ ఇంకెప్పుడు ఓటీటీలోకి వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో గోపీచంద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీ రానుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: సీనియర్ నటి నిరోషా ఇంట చోరీ.. విలువైన నగలు సహా..) -
గోపీచంద్ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్
మ్యాచో స్టార్ గోపీచంద్తో యజ్ఞం,సౌఖ్యం.. వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఆ తర్వాత బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాను తీసి ఇండస్ట్రీలో కంటికి కనిపించకుండా పోయాడు. రాజ్తరుణ్తో ‘తిరగబడరాసామీ’ సినిమా పుణ్యమా అని మళ్లీ తెరపైకి వచ్చి ఆ సినిమాలో నటించిన మన్నారా చోప్రాను ముద్దు పెట్టడం వంటి చేష్టలతో వైరల్ అయ్యాడు. ఆ వెంటనే గోపీచంద్పై పలు అసభ్య పదాలతో వ్యక్తిగతంగా దూషించాడు. (ఇదీ చదవండి: హీరో గోపీచంద్ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్) 'ఒరేయ్ అంత బలిసిందా రా నీకు'.. అంటూ గోపీ చంద్పై విరుచుకుపడటమే కాకుండా ఆ ఇంటర్వ్యూలో మొత్తం ఆయన్ను తిట్టడమే పని పెట్టుకున్నాడు. ఇంకేముంది వెంటనే గోపీచంద్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరిని భారీగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తాగి వచ్చి తమ హీరోపై ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సరైన రీతిలో బుద్ధి చెబుతామని సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చారు. ఇలా మాట్లాడే వాడికి ఏ హీరో అయినా సినిమా అవకాశం ఎలా ఇస్తారని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఇలా గోపీచంద్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోయడంతో డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి చివరకు దిగొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ గురించి మళ్లీ ఇలా చెప్పుకొచ్చాడు. 'గోపీతో ఎలాంటి గొడవ లేదు. నాకు ఆయన బిడ్డలాంటి వాడు.. తమ్ముడు లాంటి వాడు.. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు.. ఆ వ్యాఖ్యల వల్ల రిగ్రేట్గా ఫీల్ అవుతున్నాను. గోపీచంద్ విషయంలో నాదే తప్పు. ఆ మాటలు కూడా గోపీపై ఆవేదనతోనే వచ్చాయి. నా వల్ల హర్ట్ అయిన గోపీచంద్ ఫ్యాన్స్ ఫోన్లు చేస్తున్నారు. ఇంతటితో వదిలేయండి.' అని ఆయన అన్నారు. కానీ ఎ.ఎస్.రవికుమార్ చౌదరిపై గోపీ చంద్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు ఏ మాత్రం తగ్గడం లేదు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే స్థితిలో ఉన్నావని ఒకరంటే... ఆరోజు తాగి మాట్లాడితే.. ఈ రోజు తాగకుండా మాట్లాడుతున్నాడని మరోకరు తెలిపారు. ఈ వివాదంపై గోపీచంద్ మాత్రం స్పందించ లేదు. -
హీరో గోపీచంద్ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్తరుణ్ ‘తిరగబడరాసామీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో హీరోయిన్గా మాల్వీ మల్హోత్రా ఉండగా మున్నారా చోప్రా నెగటివ్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ కార్యక్రమంలో మున్నారా చోప్రాను డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ముద్దు పెట్టుకోవడంతో చాలరోజుల తర్వాత ఆయన పేరు వైరల్ అయింది. గోపీచంద్తో యజ్ఞం,సౌఖ్యం... సాయి ధరమ్తేజ్తో పిల్లా నువ్వులేని జీవితం.. బాలకృష్ణతో వీరభద్ర వంటి సినిమాలకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. సుమారు పదేళ్ల తర్వాత రాజ్తరుణ్తో ‘తిరగబడరాసామీ’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగ ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా హీరో గోపీచంద్పై ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు ఇలా చేశాడు. గతంలో అందరం చెట్టు కింద కూర్చోని భోజనం చేసేవాళ్లం.. ఒకరోజు అతని కోసం వెళ్తే కొంతసేపు వెయిట్చేయమను అన్నాడు అని గోపీచంద్ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఇలా విమర్శలు చేశాడు. 'ఒరేయ్ అంత బలిసిందా రా మీకు..? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్.. ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐయిదారుగురిని దాటుకుని రావాల్నా.. వాడిని హీరోగా నేనే చేశాను (యజ్ఞం). అప్పటివరకు వాడు విలన్గా నటించేవాడు (జయం,నిజం,వర్షం). నా సినిమాతో వాడు హీరోగా గుర్తింపు పొందాడు. ఆ సినిమాకు నేను తీసుకున్న రెమ్యునరేషన్ కంటే వాడికి తక్కువ. అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకో అర్థం కాదు.. వాడు ఇప్పుడు ఎదరుపడినా ఇలానే మాట్లాడుతాను. ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు నేడు పూర్తిగా మారిపోయాడు. 2016 సంవత్సరంలో కోఠి ఉమెన్స్ కాలేజీలో 'రారాజు' సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో నేను కూడా అక్కడికి వెళ్లాను. అప్పటికే నేను బాలకృష్ణతో వీరభద్ర సినిమా తీసి ప్లాప్లో ఉన్నాను. ఈ కారణంతో మరో సినిమా తీద్దామని అడిగిన నన్ను దూరం పెట్టాడు. మంచి కథ చేసి రండి చూద్దాం అని అవమానించాడు. ఇదంతా జరిగిన సమయంలో ఫైట్ మాస్టర్ విజయ్ కూడా అక్కడే ఉన్నారు.' అని ఆయన పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గోపిచంద్ ఫ్యాన్స్ కూడా ఎ.ఎస్.రవికుమార్ చౌదరిపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే హీరోయిన్ మున్నారా చోప్రాను ముద్దు పెట్టుకుని విమర్శలు ఎదుర్కొంటుండగా.. తాజాగ చేసిన వ్యాఖ్యలతో ఆయనపై గోపీచంద్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు గోపీచంద్పై ఎలాంటి రిమార్క్ లేదని... అతనిపై ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి కామెంట్లు కూడా చేయలేదని వారు తెలుపుతున్నారు. వ్యక్తిగతంగా ఏదో కారణం పెట్టుకుని పబ్లిగ్ ప్లాట్ఫామ్పై ఇలా మాట్లాడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కంటే గొప్పోళ్లా..? ఇండస్ట్రీలో మొఖం మీద మేకప్ వేసుకున్న తర్వాత మేకలాంటి చేష్టలు చాలమందికి ఉన్నాయని ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తెలిపాడు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న వారిలో చాలమంది రీల్ హీరోస్ మాత్రమే అని రియల్ కాదన్నాడు. తలపొగరు నెత్తికెక్కి డెమీగాడ్స్లా కొందరు హీరోలు విర్రవీగుతున్నారంటూ.. చిరంజీవి, బాలకృష్ణ కంటే వీళ్లందదు గొప్పోళ్లా..? అంటూ ఫైర్ అయ్యాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా డిసిప్లెన్ కలిగిన వ్యక్తి అంటూ పేర్కొంన్నాడు. -
గోపీచంద్కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు, ఎవరంటే?
గోపీచంద్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఫీసర్ భీమ పాత్రలో నటిస్తున్నారు గోపీచంద్. భీమాకు జోడీగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మలను ఎంపిక చేసినట్లు గురువారం చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ‘‘కుటుంబ భావోద్వేగాలు మిళితమైన యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ.. చూసేందుకు రెడీనా..?
బాక్సాఫీస్ కలెక్షన్లు దండుకోవడానికి థియేటర్స్ స్టేషన్లో కొందరు స్టార్స్ పోలీసాఫీసర్స్గా చార్జ్ తీసుకోనున్నారు. కొందరు పోలీస్ యూనిఫామ్ వేసుకుని, సెట్స్లో లాఠీ తిప్పుతున్నారు. మరికొందరు కథలు విన్నారు.. యూనిఫామ్తో సెట్స్కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ వివరాలు తెలుసుకుందాం. మళ్లీ డ్యూటీ ‘మూండ్రు ముగమ్’ (1982), ‘పాండియన్ ’ (1992), హిందీలో ‘హమ్’ (1991), ‘దర్బార్’ (2020)... ఇలా ఇప్పటివరకూ రజనీకాంత్ ఏడెనిమిది చిత్రాల్లో పోలీసాఫీసర్గా నటించారు. మళ్లీ రజనీ పోలీస్గా చార్జ్ తీసుకోనున్నారట. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ముస్లిమ్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీ కనిపించనున్నారని టాక్. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఆగస్టు 10న విడుదల కానున్న ‘జైలర్’ చిత్రంలో రజనీ జైలర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పోలీస్ స్పిరిట్ పోలీసాఫీసర్గా ప్రభాస్ కటౌట్ స్క్రీన్పై సూపర్గా ఉంటుందని, సిల్వర్ స్క్రీన్పై ఖాకీ డ్రెస్ వేసిన ఫుల్ లెంగ్త్ పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్ను చూడాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆశపడుతున్నారు. వీరి ఆశ ‘స్పిరిట్’తో తీరనుందనే టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందట. పుష్పర కాలం తర్వాత... ‘శౌర్యం (2008)’, ‘గోలీమార్ (2010)’ వంటి చిత్రాల్లో గోపీచంద్ పోలీస్గా సిల్వర్ స్క్రీన్పై డ్యూటీ చేశారు. పుష్కర కాలం తర్వాత గోపీచంద్ మళ్లీ పోలీస్గా లాఠీ పట్టారు. హర్ష తెరకెక్కిస్తున్న ‘భీమా’ చిత్రం కోసమే పోలీస్గా డ్యూటీ చేస్తున్నారు గోపీచంద్. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఆఫీసర్ అర్జున్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్గా బాధ్యతలు తీసుకోనున్నారు నాని. ‘హిట్’ ఫ్రాంచైజీలో ‘హిట్ 3’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘హిట్ 1’లో విశ్వక్సేన్, ‘హిట్ 2’లో అడివి శేష్ పోలీసాఫీసర్స్గా నటించారు. ‘హిట్ 3’లో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్గా నాని నటించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ్రపారంభమవుతుందట. కొన్ని సన్నివేశాల్లో... హీరో నితిన్ పోలీసాఫీసర్గా చార్జ్ తీసుకున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా’ (ప్రచారంలో ఉన్న టైటిల్). శ్రీలీల హీరోయిన్. ఇందులో హీరోగా నటిస్తున్న నితిన్ కొన్ని సీన్స్లో పోలీస్గా కనిపిస్తారట. అమరన్.. ఇన్ ది సిటీ ‘బ్లాక్’, ‘సీఎస్ఐ: సనాతన్’ వంటి చిత్రాల్లో ఆది సాయికుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా సిల్వర్ స్క్రీన్ క్రైమ్స్ను చేధించారు. తాజాగా ‘అమరన్: ఇన్ ది సిటీ చాఫ్టర్ 1’ చిత్రంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్గా ఓ కేసును పరిశోధిస్తున్నారు. ఎస్. బాలేశ్వర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ది కానిస్టేబుల్ ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’, ‘కుర్రాడు’ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ తాజాగా పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ పాత్ర చేస్తున్నారు. ‘బలగం’ జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎవరు? హంతకులు ఎవరు? అనేది కనిపెట్టేందుకు జేడీ చక్రవర్తి ఓ స్కెచ్ వేశారు. పోలీసాఫీ సర్గా జేడీ చక్రవర్తి వేసిన ఈ స్కెచ్ డీటైల్స్ ‘హూ’ సినిమాలో తెలుస్తాయి. జేడీ చక్రవర్తి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రెడ్డమ్మ కె. బాలాజీ నిర్మించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తారు. పోలీసులే ప్రధాన నిందితులైతే... దోషులను పట్టుకునే పోలీసులే నిందులైతే ఏం జరుగు తుంది? అనే కథాంశంతో దర్శకుడు తేజా మార్ని ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రంలోని ముఖ్య తారలంతా పోలీసులుగా నటిస్తున్నారని తెలిసింది. ‘ఖడ్గం’ (2002), ‘ఆపరేషన్ దుర్యోధన’ (2007), ‘టెర్రర్’ (2016) వంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన శ్రీకాంత్ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ పోలీస్గా కనిపిస్తారు. ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. పోలీస్ రన్నర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘రన్నర్’. విజయ్ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ భాస్కర్, ఫణీంద్ర, ఎం. శ్రీహరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కొడుకుల అనుబంధంతో సాగే ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో జానీ మాస్టర్ నటిస్తున్నారని తెలిసింది. వీరే కాదు... మరికొందరు కూడా పోలీసాఫీసర్లుగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. -
గోడ చాటకు పోయి ఏడ్చాడు..
-
ఆ ఒక్క తప్పు వల్లే నా లైఫ్ ఇలా ఉంది
-
మీ నాన్న చేసిన మంచి వల్లే నువ్వు ఈరోజు హీరో అయ్యావు
-
నా పిల్లలకు విలువలు, మానవత్వం నేర్పిస్తా..
-
భీమా.. ఇది కూడా ప్లాప్ అయితే మాత్రం
-
ఫ్యామిలీ వెడ్డింగ్లో శ్రీకాంత్,గోపీచంద్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న గోపీచంద్ 'రామబాణం' మూవీ
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మే5న విడుదలయ్యింది.జగపతిబాబు, ఖుష్భూ కీలక పాత్రలను పోషించారు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రామబాణం మూవీ థియేటర్లలో విడుదలై నెలరోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 3 నుంచి ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
హీరో గోపిచంద్ ఫ్యామిలీ క్యూట్ ఫోటోలు
-
గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల తర్వాత శ్రీవాస్ డైరెక్షన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం' మూవీ రివ్యూ) ఈ చిత్రంలో జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 5 తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి డిలీటెడ్ సీన్స్ను చిత్రబృందం విడుదల చేసింది. ట్విటర్ వేదికగా వీడియోలను పంచుకున్నారు. (ఇది చదవండి: ఓ ఆర్టిస్ట్గా మాత్రమే చూడండి.. కామంతో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ!) -
ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి..? హిట్ అవ్వకపోతే మాత్రం
-
రామబాణం మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
గోపీచంద్ 'రామబాణం' మూవీ రివ్యూ
టైటిల్: రామబాణం నటీనటులు: గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడేకర్ తదితరులు నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల దర్శకత్వం: శ్రీవాస్ సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ: వెట్రీ పళనిస్వామి ఎడిటర్: ప్రవీణ్ పూడి మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం మే 5, 2023న థియేటర్లలో విడుదలైంది. అన్నదమ్ముల రిలేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో భిన్నమైన ఎలివేషన్స్తో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. రాజారాం(జగపతిబాబు), భువనేశ్వరి(ఖుష్బూ ఆర్గానిక్ ఫుడ్ హోటల్ వ్యాపారం చేస్తుంటారు. రాజారాంకు తమ్ముడి విక్కీ( గోపీచంద్) బిజినెస్లో సాయంగా ఉంటాడు. అక్కడే పాపారావు(నాజర్) హోటల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. రాజారాం తక్కువ ధరకే ఫుడ్ అందించడాన్ని ఓర్వలేని పాపారావు.. జగపతిబాబుతో గొడవలకు దిగుతాడు. ఇది చూసి సహించలేని విక్కీ.. పాపారావు గోడౌన్ను తగలబెడతాడు. ఈ విషయం తెలుసుకున్న రాజారాం.. విక్కీని మందలిస్తాడు. నీతి, నిజాయితీ అనుకుంటూ తిరిగే రాజారాం తీరు నచ్చక చిన్నప్పుడే కోల్కతాకు పారిపోతాడు విక్కీ. అక్కడ గుప్తా అనే వ్యక్తి విక్కీని చేరదీస్తాడు. ఆ తర్వాత కోల్కతాను తన గుప్పిట్లో పెట్టుకున్న డాన్ ముఖర్జీ సామ్రాజ్యాన్ని కూలదోసి.. తానే విక్కీ భాయ్గా చెలామణి అవుతాడు. అదేక్రమంలో భైరవి(డింపుల్ హయాతి)ప్రేమిస్తాడు. భైరవిని పెళ్లి చేసుకోవాలనుకున్న విక్కీకి భైరవి నాన్న(సచిన్ ఖేడేకర్) ఓ కండీషన్ పెడతాడు. దీంతో దాదాపు 14 ఏళ్ల తర్వాత తిరిగి హైదరాబాద్కు వస్తాడు విక్కీ. (చదవండి: నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నా : సెల్వ రాఘవన్) కోల్కతా నుంచి వచ్చిన విక్కీని.. అన్న రాజారాం సంతోషంతో ఆహ్వానిస్తాడు. అయిదే పాపారావు(నాజర్), అతని అల్లుడు జీకే(తరుణ్ అరోరా)తో జరిగిన గొడవల గురించి విక్కీకి తెలియకుండా జాగ్రత్తపడతాడు రాజారాం. అదేవిధంగా విక్కీ సైతం తన కోల్కతాలో భాయ్ అన్న విషయాన్ని దాచిపెడతాడు. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో రాజా రాంను వ్యాపారంలో కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తారు నాజర్, జీకే. అసలు వాళ్లిద్దరూ రాజారాంను ఢీ కొట్టేందుకు చేసిన ప్లానేంటి? కోల్కతా నుంచి వచ్చిన విక్కీ ఏం చేశాడు? విక్కీకి భైరవి నాన్న పెట్టిన కండీషన్ ఏంటి? అసలు అన్న రాజారాం కోసం విక్కీ ఏం చేశాడు? వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే అసలు కథ. కథ ఎలా సాగిందంటే... లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. డైరెక్టర్ శ్రీవాస్ సినిమా అంటే కామెడీ, ఎమోషన్స్, డిఫెరెంట్ ఎలివేషన్స్ ఉంటాయని తెలిసిందే. కథను హీరో గోపీచంద్ను చూపించడంతోనే మొదలెట్టాడు. సినిమా ప్రారంభంలోనే విలేజ్ బ్యాక్డ్రాప్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత హీరో కోల్కతా వెళ్లడం.. విక్కీ భాయ్గా ఎదగడం చకాచకా జరిగిపోతాయి. సినీ ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టించకుండా కథను వేగంగా తీసుకెళ్లాడు. కథను ఎక్కడే గానీ సాగతీయలేదు. స్టోరీ రోటీన్గా అనిపించినా కామెడీ సీన్స్, ఎమోషన్స్తో ఆడియన్స్కు బోరు కొట్టించకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డాడనే చెప్పాలి. అయితే కథలో ఎలాంటి ట్విస్టులు లేకపోవడం పెద్ద మైనస్. కామెడీ సీన్స్, ఫైట్స్, సాంగ్స్తో ఫస్టాప్ సింపుల్గా ముగించాడు. కథలో సీన్స్ ప్రేక్షకుని ఊహకు అందేలా ఉంటాయి. సెకండాఫ్ వచ్చేసరికి కథ మొత్తం అన్నదమ్ములు విక్కీ, రాజారాం.. విలన్స్ నాజర్, జీకే చుట్టే తిరుగుతుంది. అన్నకు తెలియకుండా తమ్ముడు.. తమ్ముడికి తెలియకుండా అన్న ఒకరికోసం ఒకరు ఆరాటపడే ఎమోషన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబంలో ఉండే ఎమోషన్స్కే ప్రాధాన్యత ఇచ్చారు. కథను ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా చేయడంలో శ్రీవాస్ తన మార్క్ను చూపించాడు. బ్రదర్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ను తెరకెక్కించడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. అక్కడక్కడా బోరుగా అనిపించినా.. కామెడీ సీన్స్తో నెట్టుకొచ్చారు. సాంగ్స్, ఫైట్స్, కామెడీ సీన్స్ ఫర్వాలేదనిపించినా.. ఆడియన్స్కు అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే ప్రేక్షకులను ఓ సందేశాన్ని ఇచ్చాడు డైరెక్టర్. కేవలం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యాన్స్కు మాత్రమే ఫర్వాలేదనిపించేలా ఉంది. మాస్ ఆడియన్స్కు కాస్తా బోరుగానే అనిపించేలా కథనం సాగుతుంది. ఎవరెలా చేశారంటే... మాచో స్టార్ గోపీచంద్ మరోసారి తన మార్క్ను చూపించారు. ఫైట్ సీన్స్, కామెడీ టైమింగ్తో అదరగొట్టాడు. హీరోయిన్ డింపుల్ హయాతి ఫర్వాలేదనిపించింది. సాంగ్స్లో తన గ్లామర్తో అలరించింది. గోపీచంద్ అన్న, వదినలుగా జగపతిబాబు, ఖుష్బూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎప్పుడు సీరియస్ పాత్రలు చేసే జగపతి బాబు.. ఈసారి సైలెంట్ క్యారెక్టర్లోనూ మెప్పించాడు. నాజర్, అలీ, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడేకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయాకొనిస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. ఎడటింగ్లో కొన్ని సీన్స్కు కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్తాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు: హీరో గోపీచంద్
‘‘వందేళ్ల క్రితం అమ్మను ‘అమ్మ’ అనే పిలిచాం. ఇప్పుడూ అమ్మా అనే పిలుస్తాం. తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు. అలాగే సినిమాల విషయంలో ఆడియన్స్ మారలేదు. సరైన కంటెంట్ ఇస్తే ఆడియన్స్ సినిమాలు చూస్తున్నారు. అయితే కథలో ఆడియన్స్ను మనం ఎంతవరకు ఇన్వాల్వ్ చేయగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. వారు కనెక్ట్ అయ్యే ఏ జానర్ సినిమా తీసినా వాటిని ఆదరిస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో గోపీచంద్ చెప్పిన విశేషాలు.... ► ఈ మధ్య నేను ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేశాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు భూపతిరాజాగారు చెప్పిన కథ, అందులోని బ్రదర్ ఎమోషన్స్ నచ్చడంతో ‘రామబాణం’ సినిమా చేశాం. హిట్ చిత్రాలు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ల తర్వాత శ్రీవాస్, నేను మరో సినిమా చేయాలని ‘రామబాణం’ చేయలేదు. కథ కుదిరింది కాబట్టి చేశాం. ► ‘రామబాణం’ అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్కు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా చేశాం. అలాగే అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంది. ఓ సమస్యను మనం కొన్నేళ్లు పట్టించుకోకుండా ఉంటే దాని దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. అప్పుడు బాధ పడతాం. ఈ విషయాన్నే ‘రామబాణం’లో చూపించాం. ► ‘లక్ష్యం’ సినిమాలో జగపతిబాబుగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ సినిమాలో అన్నదమ్ముల్లా నటించిన మేం ‘రామబాణం’లోనూ అన్నదమ్ముల్లా నటించాం. ఈ సినిమాలో జగపతిబాబుగారిది కీలకపాత్ర. హీరోగా నా క్యారెక్టర్ పెంచేసి, ఆయన క్యారెక్టర్ను తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాకు కథే హీరో. కథే సినిమాను నడిపించాలి. ► టీజీ విశ్వప్రసాద్గారు మంచి నిర్మాత. ఇండస్ట్రీలో అతి మంచితనం మంచిది కాదని నేను ఆయనకు చె΄్పాను. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఉంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ► ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్షతో ఓ సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత దర్శకలు శ్రీను వైట్ల, తేజగార్లతో సినిమాలు ఉంటాయి. ► గతంలో నేను ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ వంటి విభిన్నమైన సినిమాలు చేశాను. ఆ సినిమాలు ఇప్పుడు వచ్చి ఉంటే హిట్ అయ్యేవి. అయితే ఆ తరహా సినిమాల్లో నాకు నటించాలని ఉన్నా సరైన కథలు దొరకడం లేదు. ► హిట్ సినిమాలు అందించాలనే ఒత్తిడి నాకే కాదు... ప్రతి హీరోకూ ఉంటుంది. ఎందుకంటే ఓ సినిమా ఫలితంపై ఎన్నో కుటుంబాలు (ముఖ్యంగా బయ్యర్లు, డిస్ట్రిబూటర్స్ని ఉద్దేశిస్తూ..) ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు హిట్ అవుతాయని మేం భావించిన సినిమాలు సరైన ఫలితాలను ఇవ్వక΄ోవచ్చు. తప్పులను విశ్లేషించుకుని అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. నాకు వచ్చిన ప్రతి రోల్ని డ్రీమ్ రోల్లా భావిస్తాను. ► నా కెరీర్ స్టార్టింగ్లో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాను. ఇండస్ట్రీలో ముందు నన్ను నిలబెట్టింది విలన్ రోల్సే. ప్రభాస్ సినిమాలో విలన్పాత్ర చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే కథ, అందులోని విలన్పాత్ర పవర్ఫుల్గా ఉండాలి. -
యాంకర్ గా నవదీప్ కొత్త అవతారం. రివర్స్ లో ఆదుకున్న జగపతిబాబు, గోపీచంద్
-
ప్రభాస్ కూడా పెట్టించుకోరా..? ఆయన బాగా పెడతాడు అన్నాడు
-
ప్రభాస్ తో మల్టీస్టారర్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన గోపీచంద్
-
సెకండ్ ఇన్నింగ్స్తో నా జీవితమే మారిపోయింది.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదు
‘‘గతంలో నేను చేసిన ‘శివరామరాజు’ చిత్రం అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూశాక విడిపోయిన 24 కుటుంబాలు మళ్లీ కలిశాయి. ‘రామబాణం’ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ మూవీలో కీలక పాత్ర చేసిన జగపతిబాబు విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఇండస్ట్రీలో ఇప్పుడు హారర్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి... సెంటిమెంట్ తగ్గింది. నెగిటివిటీ పెరిగింది. సినిమా ఎంత క్రూరంగా ఉంటే అంత బావుంటోంది.. అందుకే నేను సక్సెస్ అయ్యాను (నవ్వుతూ). అయితే అంత నెగిటివిటీ లోనూ పాజిటివిటీ ఉందని చెప్పడానికి ‘రామబాణం’ వస్తోంది. ► సెకండ్ ఇన్నింగ్స్లో నేనిప్పటి వరకూ 70కిపైగా పాత్రలు చేశా. అయితే చెప్పుకోడానికి ఏడెనిమిది సినిమాలే ఉన్నాయి. కొందరు నన్ను సరిగ్గా వాడుకోలేదు. కానీ ‘రామబాణం’ విషయంలో అలా కాదు. ఈ చిత్రాన్ని బలంగా మలిచాడు శ్రీవాస్. ఇందులో ఆర్గానిక్ ఫుడ్ ప్రాధాన్యతని చక్కగా చూపించాం. ► నేను హీరో కాదు.. విలన్ కాదు.. యాక్టర్ని. అందులోనూ డైరెక్టర్స్ యాక్టర్ని. మన నుంచి వాళ్లు ఏం రాబట్టుకోవాలనుకుంటున్నారో వారి కళ్లు చూస్తే అర్థమౌతుంది. నాకు ఎప్పుడైనా కథే ముఖ్యం. కాంబినేషన్ కాదు. పాత్ర నచ్చకపోతే కుదరదని చెబుతున్నాను. ► సెకండ్ ఇన్నింగ్స్తో నా జీవితమే మారిపోయింది. హీరో అనేది పెద్ద బాధ్యత.. ఒత్తిడి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఒత్తిడి లేకపోవడంతో నటనపైనే దృష్టి పెడుతున్నాను. ► చిన్న సినిమా అనేది ఉండదు. హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు.. పాత్ర, సినిమా ముఖ్యం. సల్మాన్ ఖాన్తో చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ తర్వాత బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. గాడ్ ఫాదర్ లాంటి పాత్ర చేయాలని ఉంది. అలాగే ‘గాయం’కి మరో స్థాయిలో ఉండే పాత్ర చేయాలనే ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న నాలుగైదు సినిమాలు పెద్ద బ్యానర్స్లోనివే. -
Ramabanam Movie Stills: గోపీచంద్ ‘రామబాణం’ మూవీ స్టిల్స్
-
సుమక్కతో అట్లుంటది సీరియస్ గా ఉంటె గోపీచంద్ కూడా పడీ పడీ నవ్వుకున్నాడు
-
గుడి కడతానన్న అభిమాని.. హీరోయిన్ ఆన్సర్ అదిరిందిగా!
సినీ తారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు కొందరు ఫ్యాన్స్. మరి కొందరేమో ఏకంగా గుడి కట్టేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇలా ఇప్పటికే ఖుష్భూ, నిధి అగర్వాల్, హన్సిక, నమిత, మొన్నీ మధ్య సమంత.. ఇలా హీరోయిన్లకు గుడికట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అభిమాని హీరోయిన్ డింపుల్ హయాతికి గుడి కట్టాలనుకున్నాడు. ఈ విషయాన్ని నేరుగా ఆమెనే అడిగేశాడు. మ్యాచో హీరో గోపీచంద్తో డింపుల్ కలిసి నటించిన సినిమా రామబాణం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్, మీమర్స్తో హీరోహీరోయిన్లు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. 'మీకు గుడి కట్టాలనుకుంటున్నా. అది పాలరాయితో కట్టించాలా? లేక ఇటుకలతో కట్టించాలా' అని ప్రశ్నించాడు. దీనికి డింపుల్ సమాధానిమిస్తూ.. 'నాకు బంగారంతో గుడి కట్టండి..చాలా బాగుంటుంది' అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. డింపుల్ ఆన్సర్కి అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రామబాణం టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే....!
-
గోపీచంద్ తో ఇప్పటివరకు ఎవరూ ఇలా మాట్లాడి ఉండరు..!!
-
వాళ్లందరికీ.. నా కృతఙ్ఞతలు !
-
ఏంటండీ..! ఆ పంచె కట్టులో అలా ఉన్నారు..!!
-
మా హ్యాట్రిక్ కాంబినేషన్ అదిరిపోద్ది..! అంటున్న డైరెక్టర్ శ్రీవాస్
-
Ramabanam Movie Stills: గోపీచంద్ ‘రామబాణం’ మూవీ స్టిల్స్
Ramabanam Movie HD Stills : గోపీచంద్ ‘రామబాణం’ మూవీ స్టిల్స్ -
రామబాణంతో ఇన్నాళ్లకు కుష్బూ స్పెషల్ ఇంటర్వ్యూ
-
మే తొలివారం థియేటర్/ ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్సిరీస్లివే
టాలీవుడ్కి ఏప్రిల్ నెల అంతగా కలిసి రాలేదు. ఆ నెలలలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఒక్క విరూపాక్ష మినహా మిగతావేవి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. రావణాసుర, మీటర్, శాకుంతలం, ఏజెంట్ చిత్రాలైతే భారీ నష్టాలను మిగిల్చాయి. ఇక మే నెలలో అయినా సాలిడ్ హిట్ కొట్టాలని టాలీవుడ్ వేచి చూస్తుంది. ఈ నెలలో వరుస చిత్రాలు విడుదల కాబోతుంది. మరి తొలివారం అటు థియేటర్.. ఇటు ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేయండి. రామబాణం గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషించారు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లరి నరేశ్ సీరియస్ ప్రయోగం ‘ఉగ్రం’ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్ జంటగా నటింన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. నరేశ్ కెరీర్లో 60వ సినిమా ఇది. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సీరియస్గా సాగే కథ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో మే 5న తెలుస్తుంది. ‘అరంగేట్రం’ రోషన్. జెడ్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్.టి, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్ సత్తిపండు కీలక పాత్రల్లో నటించిన చిత్రం అరంగేట్రం. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి.కె నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల మధ్య ప్రధానంగా సాగే సినిమా ఇది. యాద్గిరి అండ్ సన్స్ అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ ‘యాద్గిరి & సన్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు ‘ది కేరళ స్టోరీ’అనే సినిమా మలయాళం, హిందీలో మే 5న విడుదల కాబోతుంది. అదా శర్మ, సిద్ది ఇదాని మెయిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక తమిళ్లో కులసామి అనే చిన్న సినిమా మే 5న విడుదల కాబోతుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు\వెబ్ సిరీస్లు నెట్ఫ్లిక్స్ మీటర్ మూవీ (తెలుగు)- మే 5 తూ ఝూటీ మే మక్కర్ (హిందీ)- మే5 ది టేర్(ఇంగ్లీష్)- మే2 శాంక్చురీ- మే 4 యోగి(తెలుగు) మే 5 డిస్నీ ప్లస్ హాట్స్టార్ కరోనా పేపర్స్(మలయాళ చిత్రం)- మే5 సాస్ బహూ ఔర్ ప్లమింగో(హిందీ)- మే 5 ఆహా గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్- మే5 ఇవి కూడా చదవండి: నీ బతుకేంటో నాకు తెలుసు.. అశ్వనీదత్పై పోసాని ఫైర్ నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య -
రామబాణం మంచి సినిమా
‘‘రామబాణం’లాంటి మంచి కథ ఇచ్చిన భూపతి రాజాగారికి థ్యాంక్స్. మంచి కమర్షియల్ ఫార్మాట్లో అద్భుతమైన ఎమోషన్స్తో ఈ కథ ఉంటుంది.. దాన్ని అంతే బాగా తీశాడు శ్రీవాస్. మా గత చిత్రాలు ‘లక్ష్యం, లౌక్యం’ లాగా ‘రామబాణం’ లోనూ మంచి వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి’’ అని హీరో గోపీచంద్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘విశ్వ ప్రసాద్, వివేక్గార్లు ఎంత మంచి నిర్మాతలంటే.. ఏది కావాలని అడిగినా.. ‘ఇది ఎందుకు?’ అని అడగరు.. అలాంటి మంచి మనసున్న వారికి మంచి జరగాలి. ‘రామబాణం’ చాలా మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం తర్వాత డింపుల్కి మంచి భవిష్యత్ ఉంటుంది. ‘లక్ష్యం’ తర్వాత జగపతి బాబుగారు, నేను మళ్లీ ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా చేశాం.. ఆయనతో చేస్తుంటే యాక్టర్ అని కాకుండా సొంత బ్రదర్లా అనిపిస్తారు.. అందుకే మా ఇద్దరి మధ్య సన్నివేశాలు, ఎమోషన్స్ బాగా పండాయి. నాది, అలీగారి కాంబినేషన్ చాలా బాగుంటుంది. 5న వస్తున్న ‘రామబాణం’ మీ అందరికీ (ఫ్యాన్స్, ఆడియన్స్) నచ్చుతుంది’’ అన్నారు. డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ – ‘‘రామబాణం’ నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్గార్లు, నా లక్కీ హీరో గోపీచంద్గారు.. ఎలాంటి వివాదాలు లేకుండా పాజిటివ్గా ఉంటారు. అలా మా అందరి కాంబినేషన్లో సినిమా అనగానే ఓ పాజిటివ్ వైబ్రేషన్. హ్యాట్రిక్ కాంబినేషన్ అంటూ మా మనసులో ఓ ఆలోచన తిరుగుతూ ఉండేది.. అది మాకు మరింత నమ్మకాన్ని, సంకల్పాన్ని ఇచ్చింది. ‘రామబాణం’ ఫస్ట్కాపీ చూసిన తర్వాత నా అసిస్టెంట్ డైరెక్టర్స్.. ‘టెక్నీషియన్స్ అని మరచిపోయి సినిమా చూశాం’ అన్నారు.. అంటే సినిమాలో అంత లీనమయ్యారు.. ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతికి లోనవుతారు. మా ‘లక్ష్యం, లౌక్యం’లకు మించి ‘రామబాణం’ పెద్ద హిట్ కావాలి. ఈ సినిమా ఎట్టి పరిస్థితిల్లోనూ గోపీచంద్గారి అభిమానుల అంచనాలకు తగ్గదు’’ అన్నారు. సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ–‘‘రామబాణం’ లాంటి మంచి సినిమా తీశాం. ఈ చిత్రానికి మీరు(ప్రేక్షకులు) మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘గోపీచంద్ 30 సినిమాలు చేస్తే దాదాపు 25 సినిమాల్లో తనతో కలిసి నేను నటించాను’’అన్నారు నటుడు అలీ. ఈ వేడుకలో నిర్మాత కేకే రాధామోహన్, డైరెక్టర్స్ మారుతి, సంపత్ నంది, కార్తీక్ దండు, హర్ష, రచయిత కోనా వెంకట్, నటులు సోనియా చౌదరి, కాశీ విశ్వనాథ్, సప్తగిరి, తరుణ్ అరోరా తదితరులు పాల్గొన్నారు. -
నా పాట కాపీ కోటేసారు...
-
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్
‘‘శ్రీవాస్గారితో ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలు చేశాను. మూడో సినిమాగా ‘రామబాణం’ చేద్దామనుకున్నప్పుడు ఆ రెండు సినిమాల్లా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ‘రామబాణం’ వంటి మంచి సినిమా తీసిన విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగార్లకు థ్యాంక్స్. అందరికీ మా సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీవాస్ మాట్లాడుతూ– ‘‘రామబాణం’ ఔట్పుట్ చూశాక నమ్మకంగా ఉన్నాం. ఇంటర్వెల్, క్లయిమాక్స్ హైలెట్ అవుతాయి. సెకండ్ హాఫ్లోని భావోద్వేగ సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి’’ అన్నారు. ‘‘ఈ వేసవిలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. -
శుభ్రంగా ఉన్నాను...వల్గర్ అంటావేంటి? రిపోర్టర్పై హీరోయిన్ అసహనం
రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో తనదైన అందం, యాక్టింగ్తో యువత గుండెలను కొల్లగొట్టిన బ్యూటీ డింపుల్ హయాతి. ప్రస్తుతం ఈ భామ మ్యాచోస్టార్ గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’లో నటించింది. ఈ సినిమా మే 5వ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్పై హీరోయన్ డింపుల్ హయాతి అసహనం వ్యక్తం చేసింది. రామబాణం టీమ్ బుధవారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి, దర్శకుడు శ్రీవాస్తో పాటు మిగిలిన టీమ్ సభ్యులంతా మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరు చిత్ర బృందాన్ని ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ ‘ఈ మధ్య డైరెక్టర్లు చాలా మంది హీరోయిన్ల క్యారెక్టర్లను డిఫరెంట్గా క్రియేట్ చేస్తున్నారు. కొత్త జానర్లలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్గా ఉన్నట్టు అనిపిస్తోంది. కొంచెం రొమాంటిక్గా అనిపిస్తోంది. ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ.. మీ క్యారెక్టర్ డిజైన్ ఎలా ఉంటుంది?’ అని హీరోయిన్ని అడిగారు. (చదవండి: వెయ్యి కోట్లు నమోదు చేసే సినిమా ఏదీ?) వల్గర్ అనే పదం వినగానే ఒకింత అసహనానికి గురైన డింపుల్.. ‘వల్గర్ అంటారేంటి? నాకు తెలిసి సినిమాలో ఎక్కడా వల్గర్ సీన్స్ చూడలేదు. గ్లింప్సస్ కూడా అలాంటివేవీ వదల్లేదు అనుకుంటున్నాను. మా సినిమా పాటల్లో, పోస్టర్లలో నేను శుభ్రంగానే ఉన్నాను. మీరు వల్గర్ అంటుంటే నిజానికి నాకు అర్థం కావడం లేదు’ అని నవ్వుతూనే తన అసహనాన్ని వ్యక్తం చేసింది. (చదవండి: మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్.. కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు) దీంతో వెంటనే దర్శకుడు శ్రీవాస్ జోక్యం చేసుకొని .. ‘ఈ ప్రెస్ మీట్కి ఆమె వేసుకొన్ని డ్రెస్ చూస్తేనే ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇదొక ఒక ట్రెడిషనల్ సినిమా. ట్రెడిషనల్గా ఉండాలని వెస్టరన్ డ్రెస్లు నేను వేసుకోనండి అని సంప్రదాయ దుస్తుల్లో ప్రచార కార్యక్రమాలకు వస్తోంది. వీటిని బట్టి సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ డెప్త్ ఏంటో అర్థమవ్వాలి’ అని కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు. -
మీ నాన్న గొప్పోడు, కానీ నువ్వేం చేశావ్? గోపీచంద్ను కడిగిపారేసిన తేజ
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తోంది. గోపీచంద్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. తాజాగా రామబాణం హీరో గోపీచంద్ను ఇంటర్వ్యూ చేశాడు డైరెక్టర్ తేజ. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే అతడు పలు విషయాల్లో హీరోను కడిగిపారేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలయ్యతో ప్రకటించిన మూవీ నీ దగ్గరకు ఎలా వచ్చింది? డైరెక్టర్ శ్రీవాస్తో గొడవలయ్యాయట.. నిజమేనా? అని అడగ్గా.. సినిమాలో లెన్త్లు ఎక్కువైపోతున్నాయి. గతంలో ఇలా జరిగిన సినిమాల ఫలితం ఎలా ఉందో చూశాను. అందుకే ఈ విషయంలో డైరెక్టర్కు, నాకు చిన్న గొడవలయ్యాయి అని ఒప్పుకున్నాడు గోపీచంద్. బాగా నచ్చిన సినిమా ఏదన్న ప్రశ్నకు జయం అని బదులిచ్చాడు. నీకు ఒక కథ చెప్పాను, ఓకే అన్నావు. హీరోయిన్ దొరకలేదు.. మంచి హీరోయిన్ను వెతికేలోపు ఇంకో సినిమా మొదలుపెట్టేశావు. మళ్లీ నేను ఫోన్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు అని తేజ అనగా తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాడు హీరో. అంటే నీ దృష్టిలో తేజ కంటే మరొక డైరెక్టర్ బెటర్ అని నన్ను పక్కన పడేశావ్ కదా, అందుకే ఫోన్ ఎత్తలేదు అని విమర్శలు గుప్పించాడు. మీ నాన్నగారు చేసిన మంచిపని వల్ల నీకు జయంలో ఛాన్స్ వచ్చింది. మీ నాన్న గొప్పోడు. మరి నువ్వేం పీకావ్? అంటూ గోపీచంద్ను సూటిగా ప్రశ్నించాడు తేజ. మొత్తానికి ఇంటర్వ్యూలో తన ప్రశ్నలతో గోపీచంద్ను ఎన్కౌంటర్ చేశాడు తేజ. Macho Starr @YoursGopichand in an interview with Favourite Director @tejagaru FULL INTERVIEW TOMORROW 💥#RamaBanam #RamabanamOnMay5 🏹 @peoplemediafcy pic.twitter.com/R1cbizia3n — Vamsi Kaka (@vamsikaka) April 25, 2023 -
‘రామబాణం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
-
'నేను హైవేలో డేంజర్ జోన్ బోర్డు లాంటోన్ని'.. ఆసక్తిగా ట్రైలర్
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుంది. గోపీచంద్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సినిమాపై మాంచి హైప్ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఏపీలోని రాజమండ్రిలో రిలీజ్ చేశారు మేకర్స్. 'ఈ క్షణం.. ఈ ప్రయాణం.. నేను ఊహించింది కాదు.. ప్లాన్ చేసింది కాదు..' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. జగపతిబాబు, ఖుష్బు ఇందులో కీలక పాత్రలఉ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Here it is..#RamabanamTrailer is out now! - https://t.co/e2FEBTIxKm#RamaBanam in Theatres from MAY 5th#RamabanamOnMay5@DirectorSriwass @IamJagguBhai @khushsundar @DimpleHayathi @MickeyJMeyer @peoplemediafcy — Gopichand (@YoursGopichand) April 20, 2023 -
జగపతిబాబు అంతకు ముందే తెలుసు.. ఆయనను చౌ మామా అని పిలుస్తా
‘‘నా కెరీర్ ప్రారంభంలో రాఘవేంద్రరావు, పి. వాసు, భారతీరాజా, బాలచందర్, జంధ్యాల, గోపాల్ రెడ్డి వంటి ఎందరో గొప్ప దర్శకులతో పని చేశాను. నా పాత్ర బాగుందన్నా, బాగా లేదన్నా ఆ క్రెడిట్ దర్శకులదే. ఎందుకంటే వారు చెప్పినట్టే నేను చేస్తాను. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం నా పనిని ప్రేమిస్తాను.. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని నటి ఖుష్బూ అన్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన ఖుష్బూ చెప్పిన విశేషాలు. ► ‘రామబాణం’ ప్రధానంగా కుటుంబ బంధాల నేపథ్యంలో ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబమంతా కలిసి ఉండాలని ఈ సినిమా చెబుతుంది. ప్రస్తుతం మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ మూవీలో నేను చేసిన భువనేశ్వరి పాత్ర మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుంది. ► మొదట్లో తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలోనే ఉండేది.. ఆ తర్వాత హైదరాబాద్కి తెలుగు ఇండస్ట్రీ వచ్చింది. అయితే నా కుటుంబం కోసం నేను అక్కడే ఉండిపోయాను. అప్పుడు తమిళ్లో ఎక్కువ చాన్సులు వచ్చాయి. డేట్స్ సర్దుబాటు కాక తెలుగులో ‘చంటి’ వంటి సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ బాధ ఉంది. ► గోపీచంద్తో మొదటిసారి ‘రామబాణం’లో నటించాను. జగపతిబాబుగారు నటుడు కాకముందు నుంచే నాకు తెలుసు. ఆయన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్గారు నిర్మించిన రెండు సినిమాల్లో నేను బాలనటిగా చేశాను. జగపతిగారు మంచి మనసున్న వ్యక్తి. నేను చౌ మామా అని పిలుస్తాను. ► ప్రస్తుత కాలంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలాంటి గొప్ప నిర్మాణ సంస్థను చూడటం చాలా కష్టం. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారు సెట్స్కి పెద్దగా వచ్చేవారు కాదు. వారు వరుస హిట్స్ అందుకోవడం సంతోషంగా ఉంది. శ్రీవాస్తో మొదటిసారి పని చేస్తున్నట్లు అనిపించలేదు. తనతో పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. ► అప్పటికి, ఇప్పటికి మేకింగ్ పరంగా, నటన పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. నేనే ఇప్పటి తరం నుంచి కొన్ని నేర్చుకోవాలి. హీరోయిన్ డింపుల్ హయతి మేకప్, హెయిర్ స్టైల్ చేసుకునే విధానం నన్ను ఆకట్టుకుంది. నటనలోనూ మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు సెటిల్డ్గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అయితే అప్పట్లో లొకేషన్లో సరైన వసతులు లేకపోయినా ఎలా మేకప్ వేసుకోవాలి? ఎలా కాస్ట్యూమ్ మార్చుకోవాలి? అనే ట్రిక్స్ మాకు తెలిసేవి. ఈ తరానికి అలాంటివి తెలీదు. ► కెరీర్లో గ్లామర్ రోల్స్ చేశాను, డ్యాన్స్లు చేశా. ఇప్పుడు అవన్నీ అయిపోయాయి. ప్రేక్షకులు సినిమా చూసే కోణం కూడా మారింది. వారి మనసుల్లో స్థానం సంపాదించుకునే పాత్రలు చేయాలి. అలాంటి పాత్రనే ‘రామబాణం’లో చేశాను. తెలుగులో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్రకిప్రాధాన్యత ఉంటే నిడివి తక్కువ అయినా చేస్తాను. ప్రస్తుతం మనసుకి నచ్చిన పాత్రలే ఎంచుకుంటున్నాను.. అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నా. విజయ్ హీరోగా చేసిన ‘వారసుడు’లో నాది 18 నిమిషాల పాత్ర.. అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో నా పాత్ర సన్నివేశాలు తొలగించారు. ► సినిమాల్లో డైరెక్టర్స్ సృష్టించిన పాత్రకి తగ్గట్లు చేయాలి. కానీ, టీవీ షోల్లో నాకు నచ్చినట్టు ఉండొచ్చు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నాను. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయాను. అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. -
గోపిచంద్తో శ్రీవాస్ హ్యాట్రిక్ పక్కా! ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది..
‘‘గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం, లౌక్యం’ సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాల తరహాలోనే ఫ్యామిలీ, యాక్షన్, బ్రదర్ సెంటి మెంట్ నేపథ్యంలో ‘రామబాణం’ ఉంటుంది. ఈ చిత్రంతో గోపీచంద్– శ్రీనివాస్ హ్యాట్రిక్ హిట్ కొడతారు’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా జగపతిబాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ చెప్పిన విశేషాలు. ► సినిమాలపై ఉన్న ప్యాషన్తో సాఫ్ట్వేర్ రంగం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పరిశోధన చేసి, ఫ్యాక్టరీ మోడల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. మిగతా కొత్త నిర్మాతల్లాగా ఒకట్రెండు సినిమాలు కాకుండా ఎక్కువ తీస్తున్నాం. మంచి విజయాలతో విజయవంతమైన సంస్థగా ఎదగడం హ్యాపీ. ► శ్రీవాస్ ‘రామబాణం’ కథ చెప్పినప్పుడు ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందనిపించింది. క్రియేటివ్ సైడ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.. మంచి ఔట్పుట్ తీసుకొచ్చారు. ► కాన్సెప్ట్ నచ్చితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు నిర్మిస్తున్నాం. అయితే సినిమా విజయం అనేది మన చేతుల్లో ఉండదు.. కానీ వంద శాతం మన ప్రయత్నం చేయాలి. మేం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుండటంతో విజయాల శాతం ఎక్కువగానే ఉంది. మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. మా అమ్మాయికి సినిమాపై ఆసక్తి ఉంది. శర్వానంద్తో చేస్తున్న సినిమా విషయంలో తన ప్రమేయం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, అల్లు అర్జున్.. ఇలా అందరి హీరోలతో సినిమాలు నిర్మించాలనుంది.. ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. -
దిల్ రాజు, ఎన్టీఆర్ తో ఆ నెక్స్ట్ లెవెల్ సినిమా రిలీజ్ అయ్యి ఉంటె..
-
చిలుకూరు బాలాజీ టెంపుల్ పాడుబడిందని అక్కడ మహేష్ బాబు సినిమా చేయలేదు
-
గోపీచంద్ సినిమా టైటిల్ గురించి బాలకృష్ణ ని అగిడితే...
-
గోపీచంద్ కి దిష్టి తీయాలి..
-
లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ కొడుతున్నాం
-
రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిది: గోపీచంద్
కర్నూలు(టౌన్): రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిదని సినీ హీరో గోపీచంద్ అన్నారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో శుక్రవారం రాత్రి రామబాణం సినిమాలోని ‘దరువెయ్యరా’ పాట లాంచింగ్ ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ తన 30వ సినిమాగా రామబాణం విడుదల కానుందన్నారు. హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. -
గోపీచంద్ “రామబాణం” నుంచి ధరువెయ్ రా సాంగ్ విడుదల
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుంది. గోపీచంద్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సినిమాపై మాంచి హైప్ను క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటకే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడదే జోష్తో ధరువెయ్ రా సాంగ్ను విడుదల చేశారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. జగపతిబాబు, ఖుష్బు ఇందులో కీలక పాత్రలో పోషిస్తున్నారు. -
'నా ప్రాణం ఆగదు పిల్లా.. బెంగాలీ రసగుల్లా' అంటున్న గోపీచంద్
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ ఫోన్..’ అనే మాస్ పాటని గురువారం విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ పాటలు రాయడంలో స్పెషలిస్ట్ అయిన కాసర్ల శ్యామ్ తెలంగాణ యాసలో ఈ పాటను రాశారు. రామ్ మిరియాల, మోహనా భోగరాజు ఆలపించారు. ఈ సాంగ్లో గోపీచంద్, డింపుల్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విపరీకంగా ఆకట్టుకుంటాయి అని చిత్రబృందం తెలిపింది. జగపతిబాబు, ఖుష్బు, అలీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. -
జగ్గూభాయ్తో గోపీచంద్.. అదిరిన 'రామబాణం' పోస్టర్
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. గతంలో గోపీచంద్కి లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్కి ఇది మూడో చిత్రం. ఈ వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ(గురువారం)శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో గోపీచంద్తో పాటు జగపతి బాబు కూడా ఉన్నారు. పంచెకట్టులో చేతులు పట్టుకొని నడుస్తున్న స్పెషల్ లుక్ ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తోంది. -
పోస్టర్ చూద్దాం.. ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్
పండగ చేద్దాం.. పోస్టర్ చూద్దాం అన్నట్లు ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని పోస్టర్లను చూద్దాం. ♦ వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. ♦ పల్లకి మోస్తున్నారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ♦ నాగచైతన్య పోలీస్గా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న రిలీజవుతుంది. ♦ కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ♦ ‘మామా మశ్చింద్ర’ చిత్రంలో ట్రిపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు సుదీర్బాబు. దర్శక–నటుడు హర్షవర్థన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దుర్గ, పరశురామ్, డీజే పాత్రల్లో కనిపిస్తారు సుధీర్బాబు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానుంది. ♦ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘అర్జునదారి గాండీవ’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ♦ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. 2012 యుగాంతం కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మాత. ♦ పోలీసాఫీసర్గా కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్’. అతుల్యా రవి హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల సమర్పణలో చెర్రీ (చిరంజీవి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ దగ్గుబాటి అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. గీతికా తివారి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. పి. కిరణ్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫీష్ ’. ఈ చిత్రానికి విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి సహనిర్మాతలు. ♦ రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాను రమణ మొగిలి, తిరుపతిరెడ్డి బీరం నిర్మించారు. ‘‘స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హెరాస్మెంట్కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
రాహుల్ సిప్లిగంజ్ పాడిన బుల్..బుల్.. సాంగ్ విన్నారా?
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘బుల్ బుల్ అన్స్టాపబుల్..’ అనే తొలి పాటని హీరో గోపీచంద్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్తో కలసి భీమ్స్ పాడారు. ‘‘ఈ పాటలో సన్నీ, సప్తగిరి మాస్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
సమ్మర్పై గురిపెట్టిన ‘రామబాణం’
‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి హిట్స్తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ చేస్తున్న మూడో చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం ఈ చిత్రం కొత్త పోస్టర్ని విడుదల చేసి, మే 5న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘ఈ చిత్రంలో గోపీచంద్ చేస్తున్న విక్కీ పాత్ర పవర్ఫుల్గా ఉంటుంది. ప్రత్యేకమైన మేకోవర్తో గోపీచంద్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ‘లక్ష్యం, లౌక్యం’లను మించేలా ‘రామబాణం’ ఉండాలని శ్రీవాస్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, సామాజిక సందేశం మిళితమైన బలమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. విద్యార్థులకు పరీక్షలు ముగిశాక, వేసవిలో వినోదం పంచడానికి మా ‘రామబాణం’ దూసుకు రానుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: వెట్రి పళనిస్వామి. #Ramabanam hitting Theatres on May 5th!!@DirectorSriwass @vishwaprasadtg @DimpleHayathi @MickeyJMeyer @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/0sX11TXvc1 — Gopichand (@YoursGopichand) March 4, 2023 -
సమ్మర్లో వస్తానంటున్న గోపీచంద్.. పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఖాతాలో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. 'లక్ష్యం', 'లౌక్యం' లాంటి హిట్ చిత్రాల డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా రామబాణం. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుండగా,జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. #Ramabanam hitting Theatres on May 5th!!@DirectorSriwass @vishwaprasadtg @DimpleHayathi @MickeyJMeyer @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/0sX11TXvc1 — Gopichand (@YoursGopichand) March 4, 2023 -
కన్నడ దర్శకుడుతో గోపీచంద్ కొత్త సినిమా..మాస్ యాక్షన్ షురూ
గోపీచంద్ కెరీర్లో 31వ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించనున్నారు. రాధామోహన్ మాట్లాడుతూ.. ‘మా బేనర్లో 14వ చిత్రాన్ని గోపీచంద్, హర్ష కాంబినేషన్లో నిర్మించడం ఆనందంగా ఉంది. కన్నడలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన హర్ష ఈ భారీ బడ్జెట్ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటి వరకూ గోపీచంద్ పలు భారీ యాక్షన్ ఎంటర్టైనర్లు చేశారు. ఈ చిత్రం వాటికి భిన్నంగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న మాసీవ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ నెలలోనే షూటింగ్స్ ఆరంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: స్వామి.జె. -
Gopichand Latest Photos: అసిస్టెంట్ గృహా ప్రవేశానికి హాజరైన గోపీచంద్.. ఫోటోలు వైరల్
-
గోపీచంద్ గొప్ప మనసు.. అసిస్టెంట్ పిలిచిన వెంటనే..!
టాలీవుడ్లో గోపించంద్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోలలో ఆయన అంతా సింపుల్గా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘తొలివలపు’ చిత్రంతో టాలీవుడ్కి పరిచయమైన హీరో గోపీచంద్. ఆ తర్వాత విలన్గా పలు సినిమాల్లో నటించి, మళ్లీ హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా మరోసారి గోపీచంద్ తన మంచి మనసును చాటుకున్నారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలోనే కాదు నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే? గోపీచంద్ దగ్గర అసిస్టెంట్గా శ్రీను అనే వ్యక్తి పని చేస్తున్నారు. ఇటీవలే ఆయన సొంతిల్లు నిర్మించి గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి హీరో గోపిచంద్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వారితో కలిసి సరదాగా గడిపారు. గోపీచంద్ రాకతో అసిస్టెంట్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. దీంతో గోపీచంద్ సింప్లిసిటీని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా.. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో రామ బాణం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి కనిపించనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'రామబాణం'తో వస్తున్న గోపీచంద్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామబాణం'. 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల తర్వాత శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్బంగా గోపీచంద్ ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. విక్కీ అనే పవర్ఫుల్ పాత్రలో గోపీచంద్ లుక్ ఆకట్టుకుంటోంది. 'విక్కీస్ ఫస్ట్ యారో' పేరుతో విడుదల చేసిన ప్రత్యేక వీడియో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. రామబాణంలో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. ఈ వీడియో చూస్తే ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైట్స్ చూస్తే పూర్తి యాక్షన్ను తలపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు బలమైన కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో సరికొత్త గోపీచంద్ను చూడబోతున్నామని అర్థమవుతోంది. విక్కీస్ ఫస్ట్ యారో వీడియో ప్రేక్షకుల్లో అంచనాలను భారీ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 వేసవి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
వేసవిలో రామబాణం
‘లక్ష్యం’ (2007), ‘లౌక్యం’ (2014) చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రానికి ‘రామబాణం’ టైటిల్ను ఖరారు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ను శనివారం ప్రకటించారు. డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుçష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో గోపీచంద్కు అన్నా వదిన పాత్రల్లో జగపతిబాబు, ఖుష్బూ కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ‘‘బాలకృష్ణగారు మా సినిమా టైటిల్ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమై ఉన్న బలమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు కథ: భూపతి రాజా, కెమెరా: వెట్రి పళనీస్వామి, సంగీతం: మిక్కీ జే మేయర్. -
బాలయ్యకే ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. ఆసక్తిగా అన్స్టాపబుల్ ప్రోమో
నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్-2 ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. టాలీవుడ్ ఫేమస్ సెలబ్రీటీలు హాజరవుతున్న ఈ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్తో కలిసి హాజరవుతున్న పార్ట్-2 ప్రోమో రిలీజైంది. అయితే ఇప్పటికే ఓ ఎపిసోడ్ ప్రసారం కాగా.. మరో అదిరిపోయే ప్రోమోతో ఆహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ ప్రోమోలో బాలకృష్ణ.. ప్రభాస్, గోపీచంద్ను సరదా ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ ప్రోమోలో ప్రభాస్, గోపీచంద్ మధ్య మరింత సన్నివేశాలు ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఎపిసోడ్లో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. 'డార్లింగ్ ఫ్యాన్స్కు పండుగ ముందే రాబోతోంది. మాకో స్టార్ గోపీచంద్తో ఫ్రెండ్షిప్ కథలు, బాహుబలి సినిమా విజయంపై సరదా ప్రశ్నలతో మరింత ఆసక్తి పెరుగుతోంది. జనవరి 6 వరకు వేచి ఉండండి.' అంటూ ఆహా ట్వీట్ చేసింది. జనవరి 6న రెండో పార్ట్ ప్రసారం కానున్నట్లు ఆహా ప్రకటించింది. -
ఆ ఇద్దరు హీరోయిన్లను షాపింగ్కు తీసుకెళ్తానన్న డార్లింగ్
ప్రభాస్, బాలయ్య కలిస్తే రచ్చ మామూలుగా ఉండదు.. అన్స్టపాబుల్ విత్ ఎన్బీకేలో ప్రభాస్ సందడికి సంబంధించిన ఒక ఎపిసోడ్ రిలీజ్ అవగా అది 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్తో దూసుకుపోతోంది. అయితే మీరు చూసింది కూసంత చూడాల్సింది కొండంత అంటూ ఆహా తాజాగా రెండో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసి న్యూఇయర్ ట్రీట్ ఇచ్చింది. ఈ ప్రోమోలో గోపీచంద్, ప్రభాస్లను ప్రశ్నలతో ఆడుకున్నాడు బాలయ్య. ఇద్దరు హీరోయిన్ల ఫోటోలు చూపించి.. వీరిలో ఎవరితో మీ ఫోన్లు ఎక్స్చేంజ్ చేస్తారని అడిగారు. ఇందుకు గోపీచంద్ తనకు పెళ్లైపోయిందని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. 2008లో ఒక హీరోయిన్ విషయంలో గొడవపడ్డారని బాలయ్య కూపీ లాగేందుకు ప్రయత్నించగా నేనైతే పడలేదు, నీ గురించి చెప్పురా అని గోపీచంద్ను ఇరికించాడు ప్రభాస్. నయనతార, తమన్నాల ఫోటోలు చూపించి.. వీరిలో ఎవరిని షాపింగ్కు తీసుకెళ్తారని అడగ్గా ఇద్దరినీ తీసుకెళ్తానన్నాడు డార్లింగ్. దీంతో బాలకృష్ణ రెబల్ స్టార్ నారీనారీ నడుమ మురారీ అంటూ స్టేజీపై నవ్వులు పూయించాడు. ఇక ఈ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ జనవరి 6న విడుదల కానుంది. Meeru choosindi koosantha, choodalsindhi kondantha! Get ready for some ultimate fun ride with #PrabhasOnAHA and @YoursGopichand . Second half lo raccha mamulga undadu🔥🔥#UnstoppableWithNBK Episode Part 1 Streaming Now#NBKOnAHA #MansionHouse @tnldoublehorse @realmeIndia pic.twitter.com/AzKzKJfquo— ahavideoin (@ahavideoIN) January 1, 2023 Darlingggsssss! We did it. 100 Million streaming minutes. Just love ❤️#PrabhasOnAHA #NBKOnAHA #UnstoppableWithNBKS2 #MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india @BigCMobilesIND @MYDrPainRelief #Tilaknagarindustries #SaiPriyaConstrustions pic.twitter.com/QVez7b1Dg1— ahavideoin (@ahavideoIN) December 31, 2022 చదవండి: ఆగని ధమాకా జోరు.. ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే? ఉన్నావా? చచ్చావా? నవ్వులు పూయిస్తున్న వీడియో -
సీతతో రిలేషన్పై ప్రభాస్ను ప్రశ్నించిన బాలయ్య
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నటసింహ నందమూరి బాలకృష్ణ కలిస్తే ఎలా ఉంటుంది. ఆ జోష్ వేరే లెవల్ కదా! బాలయ్య హోస్ట్ చేస్తోన్న పాపులర్ టాక్ షో అన్స్టాపబుల్లో ప్రభాస్ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో డార్లింగ్ సైలెంట్గా కాకుండా జోకులేస్తూ నవ్విస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటు నందమూరి బాలకృష్ణ అటు ప్రభాస్, గోపీచంద్ల ఫ్యాన్స్కు పర్ఫెక్ట్ విందు భోజనంలాంటి ఎపిసోడ్ను సిద్ధం చేసింది ఆహా. అయితే ఆ ఎపిసోడ్ను ఎడిట్ చేయడానికి మాత్రం చాలా కష్టపడుతోందట. ఎందుకంటే ఇందులో ప్రతి క్షణం ఎంతో విలువైనదే. దాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదించాల్సిందేనంటోంది. దీంతో ఆహా ఈ బాహుబలి ఎపిసోడ్ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకుంది. బాహుబలి - 1 ది బిగినింగ్ ఎపిసోడ్ను డిసెంబర్ 30న, బాహుబలి కన్క్లూజన్ ఎపిసోడ్ను జనవరి 6న ప్రసారం చేయనుంది. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే చరిత్రలో ఓ ఎపిసోడ్ను రెండు భాగాలుగా అందించటం ఇదే మొదటిసారి. తొలి ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ మధ్య జరిగే సంభాషణ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. రెండో ఎపిసోడ్లో ప్రభాస్, గోపీచంద్ కెరీర్ ఇండస్ట్రీలో ఎలా ప్రారంభమైంది. వారి స్నేహం ఎలా ప్రారంభమైంది. ఇన్నేళ్లలో ఎలా బలపడింది అనే విషయాలుంటాయి. ‘‘మాకు అభిమానుల నుంచి లెక్కలేనన్ని మెసేజెస్ వచ్చాయి. ఈ ఎపిసోడ్ను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రసారం చేయాలని కోరారు. దీంతో ప్రభాస్, నందమూరి బాలకృష్ణ, ఆహా టీమ్ అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ను అందించాలని నిర్ణయించుకున్నాం. న్యూ ఇయర్ను నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ కాంబినేషన్తో ఆహాలో రాబోతున్న ఈ టాక్ షో ఎపిసోడ్ కంటే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఏముంటుంది. ఎవరూ ఊహించలేని కొత్త విషయాలు, అంతకు మించిన ఫన్ డిసెంబర్ 30, జనవరి 6న ఆహా ద్వారా స్క్రీన్స్ను ఢీ కొట్టనుంది’’ అని ఆహా టీమ్ తెలియజేసింది. ఇకపోతే తొలి ఎపిసోడ్లో బాలకృష్ణ.. ప్రభాస్ను సీతతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించారు. దానికి ఆయన ఏమని బదులిచ్చారో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే! Content entha bagundante edit cheyadaniki evvaru oppukoledu, ade exclusive experience meeku andinchenduku "direct from the sets to play","Bahubali Episode in 2 parts." Mahishmathi Oopiri pilchuko, he is on the way🗡️🛡️ Have a blast this New year week.❤️🕺#PrabhasOnAha #Prabhas pic.twitter.com/2jynoaYOt5 — ahavideoin (@ahavideoIN) December 28, 2022 చదవండి: మీ ఇంటికొచ్చి తరిమి తరిమి కొడతా: సోహైల్ వార్నింగ్ చెప్పులు కూడా వదిలేసి పారిపోయిన హీరోయిన్ -
ఏండేయ్ ఏమైనా మాట్లాడండి.. ఓ పాట పాడండి.. అదిరిపోయిన ప్రభాస్ ప్రోమో
రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రోమో వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్-2 సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్గా హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఆ షోలో ఆయనతో పాటు మరో హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలయ్య షోకు ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్రోమోలో ఇద్దరి మధ్య సాగిన సంభాషణ తెగ నవ్వులు తెప్పిస్తోంది. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు రెబల్ స్టార్ నవ్వుతూ సమాధానాలిచ్చారు. వర్షం సినిమాలో విలన్ పాత్రలో నటించిన గోపీచంద్, హీరో ప్రభాస్ సంభాషణ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్ చేయనుంది. కాగా.. ఈ షో ఫుల్ ఎపిసోడ్ ఈనెల 30న ఆహాలో ప్రసారం కానుంది. ప్రోమో విషయానికొస్తే.. 'బాలకృష్ణ మంత్రంతో ఈ ప్రోమో ప్రారంభం అయింది. ఆ తర్వాత బాలకృష్ణ నన్ను కూడా డార్లింగ్ పిలవాలి అనడంతో సరే డార్లింగ్ సార్ అంటూ నవ్వులు పూయించారు. ఆ తర్వాత రామ్ చరణ్కు ఫోన్ చేసిన సంభాషణ తెగ ఆకట్టుకుంటోంది. నీ లైఫ్లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటీ? అని బాలయ్య ప్రశ్నించారు. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్తో కలిసి రెబల్ స్టార్ ప్రభాస్ను బాలయ్య ఆట పట్టించారు. చివరగా ప్రభాస్ ఫేమస్ డైలాగ్..' ఏండేయ్ ఏమైనా మాట్లాడండి.. ఓ పాట పాడండి.' చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ హాజరు కావడంతో ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. -
‘జీరో’ని నమ్ముకున్న హీరో.. గోపీచంద్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
ఆసెంటిమెంట్ను వదలను అంటున్నాడు మాచోస్టార్ గోపీచంద్. తన అపజయాలకు బ్రేక్ వేయాలి అంటే..పాత దారినే నమ్ముకోవాలి అనుకుంటున్నాడు. నెక్ట్స్ సినిమాకు కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. ఇంతకీ..మాచో స్టార్ సెంట్ మెంట్ ఏంటి అంటారా? ‘సున్నా’. ఇప్పుడు ఈ హీరో జీరోని నమ్ముకుంటున్నాడు. గోపీచంద్ కు జయం,వర్షం సినిమాలు విలన్ గా పేరు తీసుకువస్తే,యజ్నం,రణం,లక్ష్యం,సాహసం,లౌక్యం లాంటి సినిమాలు హీరోగా నిలబెట్టాయి. ఈ సినిమాలన్ని గోపి హిట్ లిస్ట్లోకి వచ్చాయి. గోపీకి గుర్తింపు తెచ్చిన సినిమాల టైటిల్స్ చివరలో సున్నా ఉండటం విశేషం. సున్నా టైటిల్స్ తో ఎండ్ అయినా సినిమాలు..హిట్ కావటంతో..గోపీచంద్ కూడా ఇది సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు. టైటిల్స్ చివరలో సున్నా లేకుండా ఒంటరి,వాంటెడ్, జిల్,ఆక్సిజన్,చాణక్య ,అరడుగుల బుల్లెట్ లాంటి సినిమాలలో నటించాడు .ఈ సినిమాలన్ని డిజాస్టర్ లిస్ట్లోకి ఎక్కాయి. ఇలా సున్నా టైటిల్ తో ఎండ్ అయిన సినిమాలు విజయం సాధించటంతో..తన రాబోతున్న సినిమాకు కూడా పేరు చివరలో సున్నా వచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశాడు. గోపీచంద్ ప్రస్తుతం..శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం,లౌక్యం లాంటి హిట్లు వచ్చాయి .ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం ట్రై చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ చివరలో సున్నా వచ్చేలా..రామ బాణం టైటిల్ ఫిక్స్ చేశారట. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు,ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి గోపీచంద్ నమ్ముకున్న సున్నా సెంటిమెంట్ వర్కౌట్ అయి..రామ బాణం విజయం సాధిస్తుందో లేదో చూడాలి. -
‘బాహుబలి’తో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే.. ఆకట్టుకుంటున్న ప్రొమో గ్లింప్స్
బాలయ్య హోస్ట్గా ఎన్బీకే విత్ అన్స్టాపబుల్ షో సీజన్-2 సక్సెస్ ఫుల్గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్స్టాపబుల్ సందడి చేయబోతున్నాడు. ఇటీవల ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. మ్యాచో స్టార్ గోపించంద్తో కలిసి ప్రభాస్ అన్స్టాపబుల్ షోకు హజరైన ఫొటోను ఆహా సంస్థ సోమవారం విడుదల చేసింది. షూటింగ్కు సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. చదవండి: మహేశ్-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్డేట్! సూపర్ స్టార్కు తండ్రిగా ఆ స్టార్ హీరో? వీటికి ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఏ సోషల్ మీడియా ప్లాట్ఫాం చూసిన ప్రభాస్ ఫొటోలు, వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఈవెంట్స్ తప్పా ఏలాంటి కార్యక్రమాలైన హజరయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపడు. అలాంటి ప్రభాస్ బాలయ్య షోకు హజరవడంతో అభిమానులు, షో ఫాలోవర్స్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఈ ఎపిసోడ్పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ వీకెండ్ ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో గ్లింప్స్ను వదిలింది ఆహా. చదవండి: అవన్ని పుకార్లే.. ఒక్క పోస్ట్తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఇందులో ప్రభాస్ ఫుల్ జోష్లో కనిపించాడు. ఈ వీడియోలో ‘ఏమ్.. ఏం చెప్తున్నావ్ డార్లింగ్’ అంటూ ప్రభాస్ గట్టిగా అరుస్తు నవ్వులు పూయించాడు. ఆ తర్వాత బాలయ్య దగ్గరికి రమ్మంటే.. డార్లింగ్ వద్దు సర్ అన్నట్టుగా దూరం వెళ్లిపోవడం ఆకట్టుకుంది. మరోవైపు ఓకే సోఫాలో కూర్చొన్న గోపీచంద్కి ప్రభాస్ పెద్ద దెండం పెట్టి మీరు గొప్ప అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతంఈ ప్రోమో గ్లింప్స్ ఇంటర్నెట్లో దుమ్మురేపుతుంది. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ సందర్బంగా ప్రోమోను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ఆహా పేర్కొంది. -
బాలయ్య షోలో ప్రభాస్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
బాలయ్య హోస్ట్గా ఎన్బీకే విత్ అన్స్టాపబుల్ షో సీజన్-2 సక్సెస్ ఫుల్గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్టుగా హాజరవడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఈవెంట్లకు తప్పా బయట ఎక్కడా అంతగా కనిపించరు. అలాంటిది బాలయ్య షోకు ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ షోకు ప్రభాస్ తన స్నేహితుడు, హీరో గోపీచంద్తో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ మరో హైలైట్గా నిలిచింది. ఎక్కువగా బ్లాక్ షర్ట్లో కనిపించే ప్రభాస్ ఎన్బీకే షోలో మాత్రం కలర్ఫుల్గా కనిపించారు. దీంతో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ఏ బ్రాండ్? దాని ధరెంత అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ప్రభాస్ వేసుకున్న షర్ట్ `పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్' కంపెనీకి చెందినదట. దీని ధర సుమారు 115 పౌండ్స్ ఉంటుందట. అంటే అక్షరాలా ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.11,618/. ఏది ఏమైనా ప్రభాస్ ఈ షర్ట్లో మరింత యంగ్ లుక్లో కనిపిస్తున్నారని, ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
ఆహాలో పక్కా కమర్షియల్, ఎప్పటినుంచంటే?
మ్యాచో హీరో గోపీచంద్, హీరోయిన్ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాగానే వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఆగస్టు 5 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. మరింకే... థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఆహాలో మూవీ రిలీజ్ కాగానే ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూసేయండి.. Brace yourself for pakka entertainment🔥with macho star @YoursGopichand and beautiful @RaashiiKhanna_ ❤️#PakkaCommercialOnAHA premieres August 5.#Sathyaraj #RaoRamesh @harshachemudu @varusarath5 @Chitrashukla73@DirectorMaruthi @SKNonline pic.twitter.com/s4PQG0cBvU — ahavideoin (@ahavideoIN) July 30, 2022 చదవండి: గ్యారేజీలో అనిల్ కాపురం.. హీరోయిన్తో సునీల్ దత్ లవ్స్టోరీ.. హఠాత్తుగా వీగన్గా మారిపోయా.. కొత్తలో చాలా కష్టంగా ఉండేది: నుస్రత్ -
షూటింగ్లో ప్రమాదాలు.. అయినా ‘తగ్గేదే లే’ అంటున్న హీరోలు
స్క్రీన్పై హీరో రిస్కీ ఫైట్స్ చేస్తుంటే ఫ్యాన్స్కి ఫీస్ట్. అందుకే ఫ్యాన్స్ కోసం కూడా హీరోలు రిస్కులు తీసుకుంటుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా ఈ మధ్య షూటింగ్లో గాయపడిన హీరోలు కొందరు ఉన్నారు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నా ‘తగ్గేదే లే’ అంటూ షూటింగ్కి హాజరు అయ్యారు. ఆ హీరోల గురించి తెలుసుకుందాం. మనుషులకు దొరక్కుండా జాగ్రత్తగా జారుకునే పనిలో ఉన్నారు రవితేజ. ఎత్తయిన మేడల మీద నుంచి దూకడం, ఎత్తుపల్లాలు ఉన్న రోడ్డు మీద పరిగెత్తడం, అడ్డం వచ్చినవారిని ఇరగ్గొట్టడం... ఇదే పని. ఇదంతా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కోసమే. వంశీ దర్శకత్వంలో స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాగేశ్వరరావు పాత్రను రవితేజ చేస్తున్నారు. దొంగ పాత్ర కాబట్టి సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ. ఓ రిస్కీ ఫైట్ తీస్తున్నప్పుడు రవితేజ గాయాలపాలయ్యారు. ఫలితంగా పది కుట్లు వరకూ పడ్డాయి. అయినా రెస్ట్ తీసుకోకుండా రవితేజ షూటింగ్లో పాల్గొన్నారు. ఇక రవితేజలానే గోపీచంద్ కూడా తన తాజా చిత్రం షూటింగ్లో గాయపడ్డారు. ఈ మూవీ కోసం మైసూర్లో ఓ టెంపుల్ బ్యాక్డ్రాప్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లో గోపీచంద్ పాల్గొన్నప్పుడు కాలుజారి ఎత్తయిన ప్రదేశం నుంచి జారిపడ్డారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఎంత రిస్కీ ఫైట్ని అయినా డూప్ లేకుండా చేస్తుంటారు హీరో విశాల్. ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్స్లో ఆయన గాయపడ్డారు. తాజాగా ‘లాఠీ’ సినిమా షూటింగ్ సెట్లో ఒక్కసారి కాదు.. పలుమార్లు ప్రమాదం బారినపడ్డారు. ఈ చిత్రంలో విశాల్ది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఫైట్స్ కూడా పవర్ఫుల్గా ఉంటాయి. ఈ ఒక్క సినిమా సెట్లోనే ఎక్కువసార్లు గాయపడినా షూటింగ్కి బ్రేక్ ఇవ్వకుండా చేస్తున్నారు విశాల్. మరోవైపు ‘కార్తికేయ 2’ కోసం యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు హీరో నిఖిల్ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చీలమండ బెణకడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి కూడా సూచించారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ’ (2014)కి సీక్వెల్గా ‘కార్తికేయ 2’ రూపొందుతోంది. చందూనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా సెట్స్లో ఉన్న కొన్ని చిత్రాల షూటింగ్స్లో గాయపడిన హీరోలు ఉన్నారు. పెయిన్ కిల్లర్తో... బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ని ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అంటారు. పాత్ర ఎలా డిమాండ్ చేస్తే ఫిజిక్ని అలా మార్చేస్తుంటారు ఆమిర్. అందుకు ఒక ఉదాహరణ ‘దంగల్’. ఇక 57ఏళ్ల వయసులోనూ ఆయన రిస్క్ తీసుకున్న తాజా చిత్రం ‘లాల్సింగ్ చద్దా’. ఈ చిత్రం షూటింగ్లో లాంగ్ రన్ చేసే చేజింగ్ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఆమిర్ కాలికి గాయమైంది. ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన పరిస్థితిలో పెయిన్ కిల్లర్లు తీసుకుని, బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేశారు ఆమిర్ ఖాన్. -
'పక్కా కమర్షియల్'గా హిట్టు.. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కు !
Gopichand Pakka Commercial 1St Week Collections: మ్యాచో హీరో గోపీచంద్, విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన 'పక్కా కమర్షియల్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. రాశీ ఖన్నా క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసాడు మారుతి. ఈ సినిమా కోసం పబ్లిసిటీతో కలుపుకొని దాదాపు రూ. 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. అందులో 32 కోట్లు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్, శాటిలైట్, హిందీ రీమేక్, డబ్బింగ్ అన్ని) రూపంలోనే వచ్చాయి. ఇక సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అందుకే ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది 'పక్కా కమర్షియల్' సినిమా. ఇంత ప్లానింగ్ ఉంటుంది కాబట్టే మారుతి మోస్ట్ బ్యాంకబుల్ డైరెక్టర్ అయ్యాడు. మొదటి రోజు రూ. 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండు రోజులు బాగానే క్యాష్ చేసుకుంది. ఓవరాల్గా 'పక్కా కమర్షియల్' మూడు రోజుల్లోనే సేఫ్ అయిపోయింది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. #PakkaCommercial collects over 𝟏𝟓.𝟐 𝐂𝐑 Worldwide in 3 Days! 🔥💥 This Week, catch the ACTION - FUN Family Entertainer at cinemas near you! 🤩 🎟️: https://t.co/BcOUguIiyK @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @SKNonline @UV_Creations @adityamusic pic.twitter.com/vQpCrMOUQd — GA2 Pictures (@GA2Official) July 4, 2022 -
కమర్షియల్ హిట్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: మారుతి
‘పక్కా కమర్షియల్’ చిత్రం మేము అనుకున్నట్లే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తోంది. నా సినిమాకు వచ్చే అడియన్స్ ఏం ఆశిస్తారో అవన్ని ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తున్నారు. వారందరికి నా ధన్యవాదాలు’అన్నారు ప్రముఖ దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ పతకాలపై బన్నీ వాస్ నిరించారు. జులై 1న ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. (చదవండి: అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా) ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబరాలను జరుపుకుంది. అనంతరం మారుతి మాట్లాడుతూ.. ‘మా సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్ని స్టైలీష్గా చూపించారని, రాశీఖన్నా ట్రాక్ బాగుందని చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ ఇంకా బెటర్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను’ అని అన్నారు. చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఆడియన్స్ మంచి మాస్ ఎంటర్ టైనర్ సినిమా ఇస్తే బాగుంటుందని ఈ సినిమా తీశాం. మేము అనుకున్నట్లే అది ఈ రోజు అందరికీ రీచ్ అయ్యింది. తొలి రోజే రూ.6 కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మా సినిమా క్లియర్ కమర్సియల్ హిట్ కింద పరిగణించవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాను. మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పనిచేసిన గోపి చంద్, రాశి ఖన్నా లకు మరియు మిగిలిన నటీ నటులందరికీ ధన్యవాదాలు ’అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు నటుడు సప్తగిరి. ‘ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికీఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం మేము టికెట్స్ రేట్ తగ్గించాం. ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు. కాబట్టి అందరూ వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ’అన్నారు సహ నిర్మాత ఎస్కేఎన్. ఈ చిత్రంలో రావు రమేశ్, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా
రాశీ ఖన్నా ఫుల్ జోష్లో ఉన్నారు. ‘పక్కా కమర్షియల్’లో ఆమె చేసిన క్యారెక్టర్కి ప్రశంసలు దక్కడం ఓ కారణం అయితే.. చేతి నిండా సినిమాలు ఉండటం మరో కారణం. ‘బిజీగా ఉండటమే కదా కావాల్సింది’ అంటున్నారు ఈ బ్యూటీ. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ ఈ నెల 1 విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్పై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో తన పాత్రకు లభిస్తున్న ప్రశంసలు, ఇతర విశేషాల గురించి రాశీ ఖన్నా ఈ విధంగా చెప్పారు. ‘పక్కా కమర్షియల్’లో నమస్కారం చేసేటప్పుడు సెలబ్రిటీలు ఇంతకన్నా బెండ్ కాకూడదని అంటారు.. ఓ సెలబ్రిటీగా రియల్ లైఫ్లో మీరు.. ? రాశీ ఖన్నా: అసలు నన్ను నేను సెలబ్రిటీలా ఎప్పుడూ అనుకోలేదు. సెలబ్రిటీ, కామన్ పీపుల్ అనే తేడా నాకు ఉండదు. పైగా ఎప్పట్నుంచో నా ఆలోచనలు స్పిరిచ్యువల్గా ఉంటాయి కాబట్టి ‘స్టేటస్’కి ప్రాధాన్యం ఇవ్వను. మనం కెరీర్లో ఎంతైనా సాధించవచ్చు. కానీ అది నెత్తికెక్కించుకుంటే కష్టం. ఒక స్థాయికి చేరుకున్నాక స్టేటస్ మెయింటైన్ చేయాలని అనేవాళ్లు మన చుట్టూ ఉండటం కామన్ కదా.. ? అలాంటివి చెప్పడానికి చాలామంది ఉంటారు. అయితే నాకంటూ ఒక మైండ్ ఉంది. అది చెప్పిన ప్రకారమే ఫాలో అవుతాను. ఒకవేళ నా మైండ్కి ఎక్కించాలని ఎవరైనా ట్రై చేస్తే వాళ్లను దూరం పెడతాను. ‘పక్కా కమర్షియల్’లో టీవీ ఆర్టిస్ట్గా కామెడీ పండించారు.. సీరియల్స్ చూస్తారా? చిన్నప్పుడు చూసేదాన్ని. యాక్చువల్గా కథ చెప్పినప్పుడు అల్లు అరవింద్గారు, మారుతిగారితో ఈ క్యారెక్టర్ని నేను చేయగలనా? అనిపిస్తోంది అన్నాను. ఎందుకంటే నాది ఫుల్ ప్లెడ్జ్డ్ కామెడీ క్యారెక్టర్. కామెడీ చేయడం కష్టం. కానీ ఒక ఆర్టిస్ట్గా చేయాలని ఫిక్సయ్యాను. సినిమా చూసి, అల్లు అరవింద్గారు ‘యాక్టింగ్ చాలా బాగుంది’ అన్నారు. ఆడియన్స్కి కూడా నా నటన నచ్చినందుకు హ్యాపీగా ఉంది. -
‘పక్కా కమర్షియల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. విలక్షణ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచాల మధ్య ఈ శుక్రవారం(జులై 1) విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. గోపిచంద్ యాక్షన్, రాశీఖన్నా గ్లామర్, మారుతి స్టైల్ కామెడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. (చదవండి: ‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ) ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు మొత్తంగా ఈ చిత్రం రూ.6.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా పక్కా కమర్షియల్ కావడం గమనార్హం. ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #PakkaCommercial Mints 𝟔.𝟑 𝐂𝐑 𝐆𝐑𝐎𝐒𝐒 Worldwide on 𝐃𝐀𝐘 𝟏, Best opening day at Box-Office for 𝐌𝐀𝐂𝐇𝐎 𝐒𝐓𝐀𝐑 @YoursGopichand 🔥💥 Don't Miss the ACTION - FUN Entertainer on big screens!🤩 🎟️: https://t.co/BcOUgurfwK @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas pic.twitter.com/hFG2iRWf5F — GA2 Pictures (@GA2Official) July 2, 2022 -
‘పక్కా కమర్షియల్’మూవీ (ఫొటోలు)
-
‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ
టైటిల్ :పక్కా కమర్షియల్ నటీనటులు : గోపిచంద్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్, తదితరులు నిర్మాణ సంస్థలు : జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్ నిర్మాత: బన్నీ వాసు రచన,దర్శకత్వం: మారుతి సంగీతం : జేక్స్ బిజాయ్ సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా ఎడిటర్: ఎన్ పి ఉద్భవ్ విడుదల తేది: జులై 1, 2022 వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో ఈ శుక్రవారం(జులై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉంది ? కమర్షియల్ హిట్ కొట్టేసిందా లేదా రివ్యూలో చూద్దాం. కథేంటంటే... సూర్య నారాయణ (సత్య రాజ్) ఓ సిన్సియర్ న్యాయమూర్తి. వ్యాపారవేత్త వివేక్ (రావు రమేశ్) చేతిలో మోససోయిన యువతికి న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ న్యాయవాద వృత్తికి రాజీనామా చేసి కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తాడు. అతని కొడుకు లక్కీ(గోపిచంద్) కూడా లాయర్ అవుతాడు. కానీ తండ్రిలా నిజాయతీగా కాకుండా మార్కెట్లో అవలీలగా న్యాయాన్ని అమ్మెస్తుంటాడు. తప్పు ఒప్పు చూడకుండా పక్కా కమర్షియల్గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ఓ కేసు విషయంలో వివేక్ తరఫున వాదించి.. అతనికి దగ్గరవుతాడు. అయితే వివేక్ వల్ల బాధింపబడిన యువకుడి కోసం, అతని భార్య కోసం మళ్లీ నల్లకోర్టు వేసి కోర్టుమెట్లు ఎక్కుతాడు సూర్య నారాయణ. వివేక్ తరఫున కొడుకు లక్కి రంగంలోకి దిగుతాడు. ఈ న్యాయ పోరాటంలో ఎవరు గెలిచారు? సొంత తండ్రిని కాదని వివేక్ తరఫున లక్కీ ఎందుకు వాదిస్తాడు ? లక్కీ మరీ అంత కమర్షియల్గా ఎందుకు మారాడు ? చివరకు సూర్యనారాయణ కోరుకున్నట్లుగా వివేక్కి శిక్ష పడిందా లేదా? తండ్రికొడుకుల న్యాయపోరాటంలో సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’ ఎలాంటి పాత్ర పోషించింది? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. పక్కా కమర్షియల్లో కథను పక్కకు పెట్టి కామెడీతో లాక్కోచ్చాడు. హీరోయిజం మీదనే ఎక్కువ దృష్టిపెట్డాడు. టైటిల్కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఓ ఎమోషనల్ సీన్తో సినిమా మొదలవుతుంది. లాయర్ లక్కీగా గోపిచంద్ ఎంట్రీతోనే టైటిల్ దగ్గట్టుగా పక్కా కమర్షియల్గా సినిమా సాగుతుంది. సీరియల్ నటి ‘లాయర్ ఝాన్సీ’ ఎంట్రీతో కామెడీ డబుల్ అవుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్స్ విషయంలో మారుతి మరోసారి తన మార్క్ చూపించాడు. సీరియల్లో తన క్యారెక్టర్ని చంపారంటూ ‘లాయర్ ఝాన్సీ’ కోర్టు ఆశ్రయించే సీన్ నవ్వులు పూయిస్తుంది. రొటీన్ కామెడీ సీన్స్తో ఫస్టాఫ్ అంతా సోసోగా సాగుతుంది. ఇక సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్కి దగ్గరైన లక్కీ చివరకు అతన్ని ఎలా జైలు పాలు చేశాడనేది వినోదాత్మకంగా చూపించాడు. సెకండాఫ్లో చాలా ఫ్రెష్ కామెడీతో నవ్వించాడు మారుతి. సినిమాల్లో వచ్చే ఫైట్ సీన్స్పై వేసిన సెటైర్, రావు రమేశ్, అజయ్ ఘోష్ల మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ ప్రేక్షకుడి ఊహకి అందేట్లుగా ఉంటుంది. కథని, లాజిక్స్ని పక్కకు పెట్టి చూస్తే.. ‘పక్కా కమర్షియల్’ పక్కా నవ్విస్తుంది. ఎవరెలా చేశారంటే.. డబ్బు కోసం అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చే పక్కా కమర్షియల్ లాయర్ లక్కీ పాత్రలో గోపిచంద్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్గా కనిపించాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత తనదైన కామెడీతో నవ్వించాడు.ఫైట్ సీన్స్లో కూడా అద్భుతంగా నటించాడు. ఒక సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’గా రాశీఖన్నా ఇరగదీసింది. స్క్రీన్పై చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. సీరియల్ భాషలో ఆమె చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఇక హీరో తండ్రి సూర్యనారాయణ పాత్రలో సత్యరాజ్ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు చేయడం ఆయనకు కొత్తేమి కాదు. మారుతి గత సినిమాల మాదిరే ఇందులో కూడా రావు రమేశ్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. విలన్ వివేక్గా తనదైన నటనతో మెప్పించాడు. సప్తగిరి, వైవా హర్ష, ప్రవీణ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజాయ్ సంగీతం బాగుంది. 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్తో పాటు 'అందాల రాశి..'పాట కూడా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా ఫ్రెష్గా ఉంది. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
అలాంటి పాత్రలు దొరికితే మళ్లీ విలన్గా చేస్తా: గోపిచంద్
మాచో స్టార్ గోపిచంద్-రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషనల్లో భాగంగా గోపిచంద్, డైరెక్టర్ మారుతి ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలపై గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: నాకు అలాంటి సీన్స్లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా ఈ సందర్భంగా షో హోస్ట్.. పక్కా కమర్షియల్ అనే పదాన్ని ఎక్కువగా నెగెటివ్ సెన్స్ వాడతాం.. మరి అసలు ఎలా ఉండనుందనే ప్రశ్నకు గోపిచంద్ ఇలా స్పందించాడు. ‘ఈ మూవీ చాలా వినోదభరితంగా ఉంటుంది. రణం, లౌక్యం చిత్రాల తర్వాత నేను ఫుల్ లెన్త్ కామెడీ చేసింది ఈ సినిమాలోనే. పక్కా కమర్షిల్లో ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే అన్ని అంశాలు ఉంటాయి’ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు మళ్లీ విలన్గా చేస్తారా? అని అడగ్గా.. తప్పకుండ చేస్తానని చెప్పాడు గోపిచంద్. చదవండి: సినిమాలకు గుడ్బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా? అయితే తాను ఇప్పటి వరకు చేసిన విలన్ రోల్స్ అన్ని కూడా హీరోలకు ధీటుగా ఉన్నవేనని, మళ్లీ అలాంటి వైవిధ్యమైన పాత్రలు ఉంటేనే చేస్తానని తెలిపాడు. అనంతరం దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మీరు అసలైన గోపిచంద్ని చూస్తారంటూ ఆసక్తకర కామెంట్స్ చేశాడు. గోపిచంద్ సెట్లో చాలా ప్రశాంతంగా ఉటాడని, సీన్లలోనే నటించేటప్పుడు ఆయనలోని నటుడిని చూసి ఆశ్చర్యం వేసేదన్నాడు. ఇక బయట ఉండే క్యాజువల్ గోపిచంద్ని మీరు ఈ సినిమాలో చూస్తారని మారుతి చెప్పుకొచ్చాడు. -
శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆమె వీఐపీ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెను ఆశీర్వదించి ప్రసాదాలను అందజేశారు. చదవండి: నాకు అలాంటి సీన్స్లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా కాగా తాను తాజాగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్ సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రాశీ ఖన్నా పేర్కొన్నారు. మారుతి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. -
నాకు అలాంటి సీన్స్లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా
తనకు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమే ఈజీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా. తాజాగా ఆమె నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషనల్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రాశీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు ఎలాంటి సన్నివేశాల్లో చేయడం మీకు ఇష్టమని, తొలిసారి ఈ సినిమాలో కామెడీ చేశారు కదా ఎలా అనిపించిందని అడిగిన ప్రశ్నకు రాశీ నిర్మొహమాటం రొమాంటిక్ సీన్స్ అంటే ఇష్టమని చెప్పింది. చదవండి: సమంతకు మరో స్పెషల్ సాంగ్ ఆఫర్? ఈసారి తెలుగులో కాదు! ఈ మేరకు ఆమె ‘నాకు తెలిసి కామెడీ చేయడం చాలా కష్టం. కానీ రొమాన్స్ అలా కాదు. కామెడీతో పోలిస్తే హీరోలతో రొమాన్స్ సీన్స్ చేయడం సులభం. ఇప్పటి వరకు సినిమాల్లో నేను రొమాంటిక్ సన్నివేశాల్లోనే చేశాను. ఆ సీన్స్లో నటించి బోర్ కొట్టింది. ప్రస్తుతం కామెడీని ఎంజాయ్ చేస్తున్నా. పక్కా కమర్షియల్లో నా కామెడీ బాగుటుంది. బాగా నవ్వుకోవచ్చు’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాలో రాశీ ఖన్నా తొలిసారి నల్లకోటు ధరించింది. ఇందులో ఆమె లేడీ లాయర్గా తన కామెడీతో అందరిని నవ్వించనుంది. చదవండి: సినిమాలకు గుడ్బై చెప్పబోతున్న విలక్షణ నటుడు!, కారణం ఇదేనా? -
ఆ బాధ్యత డైరెక్టర్దే.. లేకపోతే నిర్మాతలు, ప్రేక్షకులు నష్టపోతారు
‘‘నిర్మాతను, థియేటర్ వ్యవస్థను కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. ప్రస్తుతం డైరెక్టర్ ఎంత బాధ్యతగా ఉన్నాడంటే నిర్మాతను ఒప్పించాలి, థియేటర్ను కాపాడుకోవాలి, ఆడియన్స్ను సినిమాకు రప్పించాలి. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ అయితే అక్కడి ఆడియన్స్ కూడా కళ్లను పక్కకు తిప్పుకోకుండా చూపించగలగాలి.. అప్పుడే ఒక డైరెక్టర్ సక్సెస్ అయినట్టు’’ అన్నారు డైరెక్టర్ మారుతి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు మారుతి చెప్పిన విశేషాలు. ► ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ బాగా రాసుకోవాలి. అవసరమైతే రెండు నెలలు ఎక్కువ కష్టపడి అయినా స్క్రిప్ట్ను మన టేబుల్ మీదే ఎడిట్ చేసు కుంటే వృథా తగ్గిపోయి నిర్మాతకు చాలా డబ్బులు మిగులుతాయి. దీనికి తోడు మంచి మంచి సబ్జెక్టులు వస్తాయి. ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్తో పాటు షూటింగ్ రోజులు తగ్గించాలి.. మంచి కథలను సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్కు నచ్చేలా తీయాలి. మనకు ఇష్టమొచ్చినట్లుగా తీస్తే చూడరు. ► ఒక వ్యక్తి డైరెక్టర్ కావాలంటే ప్రతిభ కంటే ముందు తను ఒక ప్రేక్షకుడు అయ్యుంటే బెస్ట్ సినిమా తీస్తాడు. నాకు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం ఉండటం వల్ల కమర్షియల్ యాంగిల్లో సినిమాలు చేస్తున్నాను. ఆడియన్స్కు ఏం కావాలో ఇచ్చి, వారి దగ్గర డబ్బులు తీసుకొని నిర్మాతలకు ఇవ్వా ల్సిన మీడియేషన్ బాధ్యత డైరెక్టర్దే.. ఈ మీడియేషన్ కరెక్ట్గా చేయకపోతే ఇటు నిర్మాతలు, అటు ప్రేక్షకులు నష్టపోతారు. ► ‘పక్కా కమర్షియల్’ మంచి కథతో అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులు సంతోషంగా కాలర్ ఎగరేసుకుని చూసే సినిమా ఇది. దివంగత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ఈ సినిమా టైటిల్ పాటకు మంచి స్పందన వచ్చింది. ► జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్పై నా దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. దానికి కారణం మంచి కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు సెట్ అవ్వడం. మనకు చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నా రు. వాళ్లకు తగిన క్యారెక్టర్స్ రాస్తే మిగతా భాషల నటీనటులను తెచ్చుకోవాల్సిన పని ఉండదు. ► సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు పెద్ద సినిమాలకు ఎక్కువగా థియేటర్స్కు రావడం లేదు.. అందుకే మేము తక్కువ రేట్కే మా ‘పక్కా కమర్షియల్’ని చూపించనున్నాం. ఓటీటీలో చూసేయొచ్చు అనుకుంటారేమో.. ఇప్పుడప్పుడే ఓటీటీకి రాదు (నవ్వుతూ). -
పక్కా కమర్షియల్ ప్రీరిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా మెగాస్టార్!
గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు వినికిడి. ఇకపోతే ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్ ఉన్న సినిమా చేశానని ఇటీవల గోపీచంద్ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘పక్కా కమర్షియల్’ కథలో హ్యూమర్కు మంచి స్కోప్ ఉందని, మారుతి రాసిన కథకు న్యాయం చేశాననే అనుకుంటున్నానని పేర్కొన్నాడు. అటు రాశీ ఖన్నా సైతం ఈ సినిమా తనకెంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. ‘ప్రతిరోజూ పండగ’ చిత్రంలో చేసిన ఏంజెల్ ఆర్నా పాత్రకు రెండు రెట్ల వినోదం ఈ సినిమాలో ఉంటుందని తెలిపింది. చదవండి: ఓటీటీలో చేయను, ఎప్పటికీ నేను బిగ్ స్క్రీన్ హీరోనే! ఇంజనీర్ను పెళ్లాడిన బుల్లితెర బ్యూటీ -
నా ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తం: గోపీచంద్
గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా జూలై 1న విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్స్తో బిజీ అయ్యాడు గోపీచంద్. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన వారిలో నిర్మాత నాగేశ్వరరావు ఒకరు. ఆయన నన్ను హీరోగా పెట్టి తొలి వలపు సినిమా చేశారు. అది ఫస్ట్ మూవీ కావడంతో నేనెలా చేస్తానో అని చాలామందికి అనుమానపడ్డారు. చివరకు ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఆరునెలల వరకు ఏ సినిమా రాలేదు. ఆ తర్వాత పరిస్థితుల వల్ల విలన్గా చేశాను. నేను చేసినవాటిలో కొన్ని ఆడవని ముందే అనిపించాయి. ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబు అని మనసులో అనుకున్నాను. చిన్నప్పుడు నా అన్న ప్రేమ్చంద్ బ్లేడు తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ముక్కు కోసి పప్పులో పెడతారా? ఎలా పెడతారు? అంటూ బ్లేడు తీసుకుని నా ముక్కు కోసేశాడు. అప్పుడు నేను పెరుగన్నం తింటున్నా.. రక్తం కారి నా పళ్లెంలో నిండిపోయింది. ఇక నా చిన్నతనంలో అంటే దాదాపు నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది' అని ఎమోషనలయ్యాడు గోపీచంద్. ఆ తర్వాత మారుతి తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఒకసారి ల్యాబ్కు వెళ్లినప్పుడు.. సినిమా ఫస్ట్ కాపీ చూసి తక్కువ నిడివిలో తీయాలి, ఇలా తీయకూడదు అని సూచించాను. దానికాయన నువ్వు డైరెక్టర్ అయి సినిమా తీయు, తెలుస్తుంది. అప్పుడు ఎలా తీయాలో మాకు చెప్పండి, నేర్చుకుంటాం అంటూ నానామాటలు అన్నారు' అని గుర్తు చేసుకున్నాడు. చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె సైరన్, షూటింగ్స్ బంద్! -
చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్
హిట్,ప్లాప్లతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథనలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు హీరో గోపీచంద్. ‘తొలివలపు’ చిత్రంతో టాలీవుడ్కి పరిచయమై..తర్వాత విలన్గా పలు సినిమాల్లో నటించి, మళ్లీ హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచోస్టార్ ‘పక్కా కమర్షియల్’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. రాశీఖన్నా హీరోయిన్. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా గోపీచంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూ తన రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. జయం చిత్రానికి గాను తాను తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.11 వేలు మాత్రమేనని చెప్పాడు. డైరెక్టర్ తేజకు 11 లక్కీ నంబరు అని.. అందుకే తనకు రూ.11 వేలు ఇచ్చారని అన్నాడు. ఆ డబ్బులు తీసుకుని.. దీని పక్కన ఇంకో సున్నా ఉండోచ్చు కదా అని అనుకున్నానని సరదాగా చెప్పాడు. ఇక ఇప్పటివరకు నటించిన చిత్రాలలో దేనికి ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకున్నావని అడగ్గా.. ‘పక్క కమర్షియల్’ చిత్రానికే అత్యధిక పారితోషికం అందుకున్నానని బదులిచ్చాడు. ఎవరికైనా అప్పు ఇచ్చారా అని అడిగితే.. చాలా మందికి ఇచ్చానని, కొంతమంది తిరిగి ఇస్తే.. మరికొంత మంది ఇవ్వలేదని చెప్పాడు. వారి పరిస్థితి చూసి తాను కూడా డబ్బులు అడగలేదన్నారు. ఇలాంటి విషయాలలో తాను అంత కమర్షియల్ కాదని గోపీచంద్ తెలిపాడు. -
జయం సినిమాలో నా పారితోషికం ఎంతంటే?: గోపీచంద్
విలన్గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా రాణిస్తున్నాడు గోపీచంద్. మధ్యలో సినిమా ఎంపికలో కొన్ని తప్పులు చేసి తడబడ్డ గోపీచంద్ సీటీమార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు జయం సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. 'నా సంపాదన జయంతోనే మొదలైంది. తేజగారి లక్కీ నంబర్ రూ.11 వేలు. అందుకని నాకు పారితోషికం కూడా అంతే ఇచ్చారు. దీని పక్కన ఓ సున్నా కూడా ఉండొచ్చు కదా అనిపించింది. అది నా మొదటి రెమ్యునరేషన్. ఆ డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చాను. ఇక నా జీవితంలో చాలామందికి అప్పిచ్చాను. కానీ కొందరు తిరిగివ్వలేరు. సరే, వాళ్ల పరిస్థితి బాగోలేదేమోలే అని వదిలేస్తానే తప్ప కమర్షియల్గా వ్యవహరించి వాళ్ల దగ్గర నుంచి నా డబ్బులు రాబట్టుకోలేదు' అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు. చదవండి: పెళ్లి చేసుకున్నాం, మా లైఫ్లో పెద్ద ఛేంజ్ ఏం లేదు లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో! -
‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ లాంచ్
-
ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు, కమెడియన్: రాశీ ఖన్నా
‘‘నేను హీరోగా చేసిన ‘రణం’, ‘లౌక్యం’ చిత్రాల్లో మంచి కామెడీ ఉంది.. వీటికి ఓ మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయితే అదే ‘పక్కా కమర్షియల్’ చిత్రం. ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఆదివారం హీరో గోపీచంద్ బర్త్ డే (జూన్ 12). ఈ సందర్భంగా ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ – ‘‘నా పుట్టినరోజున మిమ్మల్ని (ఫ్యాన్స్ని ఉద్దేశించి) కలిసినందుకు సంతోషంగా ఉంది. మారుతి వంటి మంచి మనిషిని నాకు పరిచయం చేసిన యూవీ క్రియేషన్స్ వంశీకి చాలా థ్యాంక్స్. ‘పక్కా కమర్షియల్’ కథ బాగా వచ్చింది. ట్రైలర్లో చూసింది కొంచెమే. సినిమాలో ఫుల్ మీల్స్ ఉంది. మారుతి అలాంటి సీన్స్ను రాశారు’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘గోపీచంద్గారు కథ ఒప్పుకున్న తర్వాత ఆయన్ను బాగా చూపించాలనే విషయంపై ఏకాగ్రత పెట్టాను. అందుకు తగ్గట్లుగానే గోపీచంద్గారు ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్గారు, వంశీ, వాసులకు ధన్యవాదాలు’’ అన్నారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ టైమ్ నేను ఓ కామెడీ రోల్ చేశాను. ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు. కమెడియన్ అయ్యాను (నవ్వుతూ)’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్గారు, నా కెరీర్లో ఈ చిత్రం స్పెషల్గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. సినిమాను ‘పక్కా కమర్షియల్’గానే తీసినా థియేటర్లో ప్రేక్షకులకు చూపించేందుకు నాన్ కమర్షియల్గా టికెట్ ధరలను అందుబాటులో ఉంచుతున్నాం’’ అన్నారు. ‘‘ఎమోషన్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను మేళవించి ఈ సినిమాను మారుతిగారు తెరకెక్కించారు’’ అన్నారు సహనిర్మాత ఎస్కేఎన్. నటులు ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య పాల్గొన్నారు. చదవండి: హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా? విక్రమ్లో సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు? -
పక్కా కమర్షియల్ ట్రైలర్: నేను హీరోను కాదు, విలన్..
'ప్రతిరోజు పండగే' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి -
పక్కా కమర్షియల్: సగం డైలాగ్తోనే వీడియో ముగించారు!
గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. రాశీఖన్నా కథానాయిక. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. బుధవారం ఈ సినిమా నుంచి ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ముప్పై సెకన్ల వీడియో క్లిప్లో హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, హీరో గోపీచంద్, సత్యరాజ్ కోర్టు గదిలో లాయర్ గెటప్లో కనిపించారు. 'మీరు కేసు ఒప్పుకునేముందు ఫీజులతో రమ్మంటారు. పనయ్యాక వాడిని వంగబెట్టి తడిమి....' అంటూ సగం డైలాగ్తోనే ఆపేశారు. ఫుల్ డైలాగ్స్తో నిండిన ట్రైలర్ వీక్షించాలంటే జూన్ 12 వరకు ఆగాల్సిందే! అంటే హీరో గోపీచంద్ బర్త్డే రోజే ట్రైలర్ రిలీజవుతుందన్నమాట. అలాగే నిర్మాతలు అదేరోజు కర్నూలులో భారీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని సైతం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల మాదిరిగా కాకుండా పక్కా కమర్షియల్ టిక్కెట్లను సాధారణ ధరలకే విక్రయిస్తామని నిర్మాత బన్నీ వాసు ఇదివరకే హామీ ఇచ్చారు. చదవండి: సూర్య ఎంట్రీ సీన్.. స్క్రీన్ తగలబెట్టిన ఫ్యాన్స్! తమ రిలేషన్ను అఫిషీయల్ చేసిన లవ్బర్డ్స్ -
అలా చేస్తే చేటు తప్పదు
‘‘ఈ మధ్య నిర్మాతలు త్వరగానే సినిమాలను ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఇలా చేస్తే చేటు తప్పదేమో. మా ‘పక్కా కమర్షియల్’ చిత్రం మాత్రం ఆలస్యంగానే ఓటీటీకి వస్తుంది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘టి. కృష్ణ (హీరో గోపీచంద్ తండ్రి) గొప్ప దర్శకులు. ఆయనతో మా బ్యానర్లో ఓ సినిమా తీయాలనుకున్నాను. కుదర్లేదు. ఇప్పుడు వారి అబ్బాయి గోపీచంద్తో ‘పక్కా కమర్షియల్’ సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. గోపీచంద్లో ఉన్న కామెడీని దర్శకుడు మారుతి బాగా బయటకు తీశారు. ఈ సినిమాను బాగా ఖర్చు పెట్టి తీశాం’’ అన్నారు. ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్ ఉన్న సినిమా చేశాను. ‘పక్కా కమర్షియల్’ కథలో హ్యూమర్కు మంచి స్కోప్ ఉంది. మారుతి రాసిన కథకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను’’ అన్నారు గోపీచంద్. ‘‘నా నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీకి ఇతర అంశాలు జోడించి తీసిన చిత్రం ‘పక్కా కమర్షియల్’’ అన్నారు మారుతి. ‘‘ఎంటర్ టైన్మెంట్కు మంచి యాక్షన్ కుదిరిన చిత్రం ఇది’’ అన్నారు బన్నీ వాసు. ‘‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ‘ప్రతిరోజూ పండగ’ చిత్రంలో నేను చేసిన ఏంజెల్ ఆర్నా పాత్రకు రెండు రెట్ల వినోదం ఈ సినిమాలో ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా. సహనిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. -
‘పక్కా కమర్షియల్’ టికెట్ రేట్స్పై బన్నీవాసు క్లారిటీ
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టికెట్ల ధరలపై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. అందరికి అందుబాటులో ఉండేలా ‘పక్కా కమర్షియల్’ టికెట్ ధరలు ఉంటాయని చెప్పారు. (చదవండి: స్టేజ్పై మహేశ్బాబు డ్యాన్స్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు) మూవీ ప్రమోషన్స్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ..‘టికెట్ రేట్స్ అందరికి అందుబాటులో ఉండాలని కోరుకునే వారిలో అల్లు అరవింద్, నేను ముందు వరుసలో ఉంటాం. పక్కా కమర్షియల్ మూవీలో టికెట్ల రేట్లను తగ్గించాం. ఈ సినిమాకి నైజాంలో 160(జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్లో రూ.150+ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్లో రూ.100+ జీఎస్టీ’గా టికెట్ రేట్లు ఉంటాయి’ అని బన్నీ వాసు స్పష్టం చేశారు. టికెట్ కోసం డబ్బులు పెట్టిన వారంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని ఆయన చెప్పుకొచ్చారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా అంత త్వరగా ఓటీటీలోకి రాదని, ఎఫ్3కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది’ అని అల్లు అరవింద్ చెప్పారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించగా, సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. -
అందాల రాశీ.. మేకప్ వేసి.. సాంగ్ విన్నారా?
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. రాశీ ఖన్నా కథానాయిక. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించారు. జూలై 1న సినిమా రిలీజ్ చేస్తున్న తరుణంలో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టించి చిత్రయూనిట్. అందులో భాగంగా అందాల రాశీ.. అనే లిరికల్ సాంగ్ను రిలీజ్ చేసింది. 'అందాల రాశీ మేకప్ వేసి.. నాకోసం ఒచ్చావే.. స్వర్గంలో కేసే నామీదేసి భూమ్మీద మూసావే..' అంటూ మొదలైంది. జేక్స్ బెజోయ్ అందించిన ఈ మెలోడీ మ్యూజిక్కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా సాయిచరణ్ భాస్కరుణి, రమ్య బెహరా అద్భుతంగా పాడారు. చదవండి 👇 కోటి రూపాయలు ఇస్తామన్నా పాడనని చెప్పేసిన కేకే ఆమె కోసం కొట్టేవాడు.. అందుకే ఆత్మహత్యాయత్నం: టీవీ నటి -
‘పక్కా కమర్షియల్’ నుంచి ‘అందాల రాశీ..’వచ్చేస్తుంది
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ని మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా జూన్ 1న ఈ చిత్రం నుంచి ‘అందాల రాశీ..’ అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ చాలా స్టైలిష్గా కనిపిస్తారు’అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించగా, సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. -
పక్కా కమర్షియల్ అంటున్న గోపీచంద్
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్కు, దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన టైటిల్ సాంగ్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ చాలా స్టైలిష్గా కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: కరమ్ చావ్ల, సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి.