ప్రేక్షకులకు నవ్వు ఆగదు: గోపీచంద్‌ | Gopichand About Viswam Movie | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులకు నవ్వు ఆగదు: గోపీచంద్‌

Oct 9 2024 12:30 AM | Updated on Oct 9 2024 12:30 AM

Gopichand About Viswam Movie

‘‘విశ్వం’ చిత్రం షూటింగ్‌లో ప్రతి సన్నివేశం చేసేటప్పుడు నవ్వుకుంటూనే ఉన్నాం. వినోదం, యాక్షన్‌ అద్భుతంగా వచ్చాయి. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు నవ్వు ఆగదు... చాలా ఎంజాయ్‌ చేస్తారు. ఒక్క మాట చెప్పగలను... శ్రీను వైట్లగారు ఈజ్‌ బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌’’ అని గోపీచంద్‌ అన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్‌ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గోపీచంద్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీను వైట్లగారి సినిమా లో ఎంత వినోదం ఆశిస్తారో... అంతకు మించి ఇవ్వడానికి ఆయన ‘విశ్వం’ స్క్రిప్ట్‌పై దాదాపు 7 నెలలు పని చేశారు. నేను చాలా సినిమాలు చేశాను. ఆయన వద్ద ఉండే సౌకర్యం ఎక్కడా ఫీల్‌ అవ్వలేదు. రాజీ పడకుండా ఈ సినిమా తీసిన విశ్వప్రసాద్, చక్రపాణిగార్లకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ–‘‘విశ్వం’ అందమైన ప్రయాణం. ఈ సినిమాని అనుకున్నట్లు తీయగలిగా. ఈ చిత్రం అందర్నీ నవ్విస్తుందని వంద శాతం నమ్మకం ఉంది’’అని చెప్పారు. 

‘‘విశ్వం’ పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. అందరూ మా సినిమాని ఎంజాయ్‌ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌. ‘‘మా కుటుంబం 86 ఏళ్ల నుంచి సినిమాల్లో ఇన్వాల్వ్‌ అయింది. ‘విశ్వం’ నాకు తొలి సినిమా. ఇది మా హీరో సినిమా అని గోపీచంద్‌ అభిమానులు కాలర్‌ ఎగరేసేలా ఉంటుంది’’ అని వేణు దోనేపూడి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement