
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మాస్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్కు మంచి ఆదరణ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.