
‘వంశీ’ సినిమాలో కలసి నటించిన సూపర్స్టార్ మహేష్బాబు, నమ్రతా శిరోద్కర్.. ప్రేమించిపెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేటితో వీరి దాంపత్య జీవితానికి పద్నాలుగేళ్లు నిండాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లిరోజున అన్నదానం చేస్తూ ఈ జంట.. మంచి మనసును చాటుకుంది.
హైదరాబాద్లోని ఓ దివ్యాంగుల పాఠశాలలో అన్నదానం చేశారు. 650 మంది ఉన్న ఈ స్కూల్లో నేడు మహేష్-నమ్రతలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, నమ్రతలది ఎంతో మంచి మనసంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.






Comments
Please login to add a commentAdd a comment