4 రోజుల్లో రూ.14 కోట్లు వసూలు | Mani Ratnam's 'O Kadhal Kanmani' mints over Rs.14 crore | Sakshi
Sakshi News home page

4 రోజుల్లో రూ.14 కోట్లు వసూలు

Published Tue, Apr 21 2015 9:00 PM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

4 రోజుల్లో రూ.14 కోట్లు వసూలు

4 రోజుల్లో రూ.14 కోట్లు వసూలు

మణిరత్నం తాజా చిత్రం 'ఓ కాదల్ కన్మణి' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

చెన్నై: మణిరత్నం తాజా చిత్రం 'ఓ కాదల్ కన్మణి' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా  మొదటి నాలుగు రోజుల్లో రూ.14 కోట్లు వసూలు చేసింది. తెలుగులోకి 'ఓకే బంగారం' పేరుతో అనువాదమైన ఈ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు.

సహజీనం నేపథ్యంలో తనదైన శైలిలో మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించారు. వరుస పరాజయాలతో వెనుకబడిన మణిరత్నంకు ఈ చిత్ర విజయం ఊరటనిచ్చింది. విదేశాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement