ఓ మారుమూల గ్రామానికి, ఓ పోస్ట్మేన్కి మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘తపాల్’. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో ఈ చిత్రం హాట్ టాపిక్గా నిలిచింది. శుక్రవారం నాడు విడుదల కానున్న ఈ చిత్రాన్ని పలువురు సినీ ప్రముఖులు చూశారు. వారిలో శ్రీదేవి ఒకరు. ఈ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, శ్రీదేవి కోసం ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి మరీ సినిమా చూపించారు. చూసిన తర్వాత శ్రీదేవి ఉద్వేగంతో కంట తడిపెట్టారు. ‘‘దర్శకునిగా లక్ష్మణ్కి ఇది మొదటి సినిమా. అయినప్పటికీ ఎంతో అద్భుతంగా తీశారు.
ఈ మధ్యకాలంలో నన్ను చాలా ఉద్వేగానికి గురిచేసిన చిత్రమిది’’ అని సామాజిక నెట్వర్క్ ట్విట్టర్లో శ్రీదేవి పేర్కొన్నారు. ఇంతకీ శ్రీదేవికి ఈ చిత్రాన్ని చూపించాలని లక్ష్మణ్ ఎందుకనుకున్నారంటే.. చాలాకాలం తరువాత వెండితెరపైకి వచ్చిన చిత్రం ‘ఇంగ్లిష్ వింగ్లిష్’కి ఛాయాగ్రాహకునిగా పని చేసింది ఆయనే. ఆ విధంగా ఆమెతో లక్ష్మణ్కు మంచి అనుబంధం ఏర్పడింది. పైగా శ్రీదేవి మంచి నటి కాబట్టి, తన ప్రయత్నాన్ని ఆమెకు చూపించాలనుకున్నారట లక్ష్మణ్. ఆ సంగతి ఆయనే విలేకరులకు చెప్పుకొచ్చారు.
శ్రీదేవి ఉద్వేగంతో కంట
Published Wed, Sep 24 2014 11:09 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఓ వైపు జూడాల సమ్మె.. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- మొన్న తనయుడు.. ఇప్పుడు తండ్రి.. అడ్వాన్స్గా రూ.4 కోట్లు!
- ఇంగ్లండ్తో సెమీస్.. రవీంద్ర జడేజాపై వేటు! స్టార్ బ్యాటర్కు చోటు
- ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్పాట్ : గుండె ఆగినంత పనైందట!
- స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్సభలో దుమారం
- ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా?
- హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
- T20 World Cup 2024: పేలవ ఫామ్లో విరాట్.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?
- ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్కు కౌంటరిచ్చిన హీరోయిన్!
- కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
Advertisement