Laxman
-
తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, నల్లగొండ : తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ముఖ్యమంత్రి రేవంత్ నీ పని అయిపోయింది.. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడినవి అంటూ చెప్పుకొచ్చారు.నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘తుమ్మితే ఊడిపోయే ముక్కులా తెలంగాణ, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రేవంత్ నీ పని అయిపోయింది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. 14 నెలలుగా విద్యార్థుల నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల వరకు రేవంత్ ప్రభుత్వం వారిని రాచి రంపాన పెడుతోంది.రాష్ర్టంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే ధైర్యమే లేదు. వందేళ్ల కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. బీఆర్ఎస్ గత చరిత్రలా మిగిలిపోయింది. బీఆర్ఎస్ 25 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటూ అభ్యర్థినే నిలబెట్టలేకపోయింది. సమస్యలపై బరిగీసి కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమే.సంఘాల పేరుతో పోటీ చేస్తున్న వ్యక్తులకు రేవంత్తో పోట్లాడే దమ్ముందా అనేది ఆలోచించుకోవాలి. 317 జీవోపై పోరాడి జైలుకు పోయింది బీజేపీ నేతలు మాత్రమే. ఆనాడు ఏ ఒక్క టీచర్ ఎమ్మెల్సీ కూడా దీనిపై మాట్లాడలేదు. పదవీ విరమణ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. రేవంత్ పాలనపై పట్టులేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టాయి. కేసీఆర్ చిప్పచేతికి ఇస్తే దాని పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు రేవంత్’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘ఎమ్మెల్సీలు గెలిస్తే సంచలనమే’
సాక్షి,నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక అరువు తెచ్చుకున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నిజామాబాద్లో ఆదివారం(ఫిబ్రవరి16) నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్ మాట్లాడారు.‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్కు అభ్యర్థులు కరువయ్యారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలను గెలిపించాలి. ఎన్నికల విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించే అవకాశం ఉంది.కులగణన పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. బీసీ హక్కులను,రిజర్వేషన్లను ముస్లింలకు అప్పజెప్పే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడే పనిలేదు. వాళ్ల దుకాణం బంద్ అయింది.ఎంపీ అర్వింద్ కామెంట్స్హిందూ రాష్ట్ర స్థాపనే నా లక్ష్యంఎన్నికలు ఏవైనా..ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారుప్రపంచానికి దిక్సూచిగా మారిన మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటుదేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలి -
‘కాంగ్రెస్ ఔట్.. ప్రజలు తిడుతున్నారని ఎమ్మెల్యేనే చెప్పారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లు కాబోతున్నాయి. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్నారు.. అమలు చేయమంటే ఆర్ధిక పరిస్థితి బాగా లేదని సాకులు చూపుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయండి లేకపోతే అధికారం నుంచి దిగిపోవాలని ఘాటు విమర్శలు చేశారు.రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ స్పీకర్ హామీలను అమలు చేయమని స్వయంగా చెప్పడంతో కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బహిర్గతం అయ్యింది. ఆర్ధిక పరిస్థితి తెలియక హామీలు ఇచ్చామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెబుతున్నారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్నారు.. అమలు చేయమంటే ఆర్ధిక పరిస్థితి బాగా లేదని సాకులు చూపుతున్నారు. వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని విస్మరించారు.ప్రజలు తిరగబడుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. హామీలు అమలు చేయండి లేకపోతే అధికారం నుంచి దిగిపోవాలి. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చాలా మంది రైతులను విస్మరించారు. మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు ఆ ఊసే లేదు. హామీలు ఇచ్చి మొండి చెయ్యి చూపితే బీజేపీ ఊరుకోదు. హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మోసాలను గుర్తించి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.తెలంగాణలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకువస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఏడాది కింద ఎనిమిది వేల మంది పదవి విరమణ పొందితే.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కేసీఆర్ మూడేళ్లలో ఇస్తామని బాండ్స్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే తక్షణమే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ విస్మరించింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోకుండా పదవి విరమణ పొందిన ఉద్యోగులను గోస పుచ్చుకుంటున్నారు.ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేయాలి. బీజేపీ అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించండి.. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్లు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
రేవంత్.. నువ్వు రాహుల్ కాంగ్రెస్లో లేవా?: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ కొంగ జపం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాహుల్ గాంధీ వెంటనే అశోక్ నగర్కు రావాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అశోక్నగర్లో అభ్యర్థులను లాఠీలతో కొడుతున్నారు. వారి తలలు పగులగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ సిటి లైబ్రరీకి వచ్చి అరచేతితో వైకుంఠం చూపించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ కొంగ జపం చేస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. యువత చేస్తున్న డిమాండ్ను అర్థం చేసుకోవాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. రిజర్వేషన్లకు చెల్లు చీటీ చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఉల్లంఘించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. దగా చేస్తున్నారు.అభ్యర్థులపై లాఠీలు ఝుళిపిస్తున్నారు.. తలలు పగుల కొడుతున్నారు. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. రాహుల్ గ్యారంటీల పేరుతో చేస్తున్న మోసాలో పట్ల జనం అప్రమత్తం అయ్యారు. కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోచుకుంటే.. మూసీ పేరుతో కాంగ్రెస్ దోచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. లక్షా 50వేల కోట్ల అవినీతికి కాంగ్రెస్ కుట్ర చేసింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతులు.. రుణమాఫీ, హామీలపై ప్రశ్నిస్తుంటే.. వారిని పక్కదారి పట్టిస్తున్నారు. లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. మంత్రులు ఒక మాట, ఎంపీలు ఒక మాట చెప్తున్నారు. రైతు భరోసా లేకుండా పోయింది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. రాహుల్ కాంగ్రెస్ వేరు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు వేరా?. ఉన్న అవకాశాలను కొల్లగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జీవో-29 ద్వారా లక్షల మంది అవకాశాలను కొల్లగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు. ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులకు బీజేపీ బాసటగా నిలుస్తోంది’ అంటూ హామీ ఇచ్చారు. -
ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది
తల్లిదండ్రులు మడావి లక్ష్మణ్, కమలాబాయిలతో టీచరు ఉద్యోగం సాధించిన కుమార్తెలు కవిత, దివ్య, కళ్యాణి, టీచర్ కావడమే లక్ష్యమంటున్న చిన్నకుమార్తె కృష్ణప్రియ (కుడి చివర) ‘ఎంత మంది పిల్లలు?’ అనే ప్రశ్న వినిపించినప్పుడల్లా లక్ష్మణ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తినంత పనయ్యేది. ఎందుకంటే...‘నాకు అయిదుగురు ఆడపిల్లలు’ అనే మాట లక్షణ్ నోటినుంచి వినిపించడమే ఆలస్యం ‘అయ్యో!’ అనే అకారణ సానుభూతి వినిపించేది. ‘ఇంట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది అయిదుగురు ఆడపిల్లలంటే మాటలా! నీ కోసం చాలా కష్టాలు ఎదురుచూస్తున్నాయి’ అనేవాళ్లు. అయితే వారి పెదవి విరుపు మాటలు, వెక్కిరింపులు తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఇల్లు పిల్లలకు బడి పాఠాలు చెప్పే ఇల్లే కాదు... ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసేవారికి గుణపాఠాలూ చెబుతుంది.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు చెందిన మడావి లక్ష్మణ్ బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ఆదివాసీ తెగకు చెందిన లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తరువాత ఆర్థిక కష్టాలు తీరాయి. లక్ష్మణ్– కమలాబాయి దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.‘ఆడపిల్ల ఇంటికి అదృష్టం’ అన్నారు చుట్టాలు పక్కాలు, పెద్దలు.రెండోసారి ఆడపిల్ల పుట్టింది. వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ అన్నారు.‘ఇద్దరు పిల్లలు చాలు’ అనుకునే సమయంలో ‘లేదు... లేదు... అబ్బాయి కావాల్సిందే’ అని పట్టుబట్టారు ఇంటి పెద్దలు.మూడో సారి... అమ్మాయి. ‘ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చాలు’ అనుకునే లోపే....‘అలా ఎలా కుదురుతుంది....అబ్బాయి...’ అనే మాట మళ్లీ ముందుకు వచ్చింది.నాల్గోసారి... అమ్మాయి.‘ఇక చాలు’ అని గట్టిగా అనుకున్నా సరే... పెద్దల ఒత్తిడికి తలవొంచక తప్పలేదు.‘ఆరు నూరైనా ఈసారి కొడుకే’ అన్నారు చాలా నమ్మకంగా పెద్దలు. దేవుడికి గట్టిగా మొక్కుకున్నారు.అయిదోసారి... అమ్మాయి. ‘అయ్యయ్యో’ అనే సానుభూతులు ఆకాశాన్ని అంటాయి. అయితే లక్ష్మణ్, కమలాబాయి దంపతులు ఎప్పుడూ నిరాశపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖర్చులకు సరిపడా జీతం రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. ‘ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా సరే పిల్లలను బాగా చదివించాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు లక్ష్మణ్. పిల్లల్ని చదివించడమే కాదు ఆడపిల్లలు అనే వివక్ష ఎక్కడా ప్రదర్శించేవారు కాదు. ఆటల్లో, పాటల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే బెత్తం పట్టుకోనక్కర్లేదు. వారికి నాలుగు మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఆ మాటే వారికి తిరుగులేని తారకమంత్రం అవుతుంది.అయిదుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ‘‘అమ్మా... మీ నాయిన టీచర్. మా నాయినకు మాత్రం చదువు ఒక్క ముక్క కూడా రాదు. నాకు మాత్రం సదువుకోవాలనే బాగా ఇది ఉండే. అయితే మా కుటుంబ పరిస్థితి చూస్తే... ఇంత దీనమైన పరిస్థితుల్లో సదువు అవసరమా అనిపించేది. ఎందుకంటే సదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఏ రోజుకు ఆరోజే బువ్వకు కష్టపడే మా దగ్గర డబ్బు ఎక్కడిది! అయినా సరే సదువుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను...’ అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. వారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఫలితం వృథా పోలేదు.ఇప్పుడు...రెండో కూతురు కవిత, మూడో కూతురు దివ్య, నాల్గో కూతురు కళ్యాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్న కూతురు కృష్ణప్రియ కొద్ది మార్కుల తేడాతో టీచర్ అయ్యే చాన్స్ మిస్ అయింది. అక్కలలాగే టీచర్ కావాలని కలలు కంటున్న కృష్ణప్రియకు మరోప్రయత్నంలో తన కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అప్పుడు ఒకే ఇంట్లో నలుగురు టీచర్లు!ఇంటర్ వరకు చదివిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువులు చదవాలనుకుంటోంది. వారిలాగే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటుంది. ఇప్పుడు లక్ష్మణ్ను చూసి జనాలు ఏమంటున్నారు? ‘నీకేమయ్యా... ఇంటినిండా టీచర్లే!’ ‘మీది టీచర్స్ ఫ్యామిలీ’నాన్న మాటలుతల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. వారి ఆశీర్వాద బలంతోనే టీచర్ అయ్యాను. ‘చదువే మన సంపద’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయన మాటలు మనసులో నాటుకు΄ోయాయి.– కవిత, రెండో కుమార్తెనేను టీచర్... అక్కహెడ్మాస్టర్అక్క కవితకు, నాకు ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను జైనూర్ మండలం జెండాగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. మా స్కూలుకు అక్క కవితనే ప్రధానో΄ాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మేము ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం సంతోషంగా ఉంది.– దివ్య, మూడో కుమార్తెఆరోజు ఎంత సంతోషమో!మొన్నటి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో నాకు ΄ోస్టింగ్ ఇచ్చారు. మొన్ననే విధుల్లో చేరాను. టీచర్గా మొదటి రోజు స్కూల్కి వెళ్లినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘మా ముగ్గురు పిల్లలు టీచర్లే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను’ అంటున్నాడు నాన్న.– కళ్యాణి, నాలుగో కుమార్తెటీచర్ కావడమే నా లక్ష్యంఅక్క కళ్యాణితో కలిసి నేను కూడా మొన్నటి డీఎస్సీ పరీక్ష రాశాను. కొద్ది మార్కుల తేడాతో నాకు ఉద్యోగం చేజారింది. అయితే నా లక్ష్యాన్ని మాత్రం వీడను. ఎలాగైనా టీచర్ కొలువు సాధిస్తాను.– కృష్ణప్రియ, ఐదో కుమార్తె – గోడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి -
భర్త అంత్యక్రియలకు సాయం చేయండి..
హుజూరాబాద్ రూరల్: మృత్యువు హఠాత్తుగా భర్తను కబళించింది. అంత్యక్రియలకు పేదరికం ఆటంకంగా నిలిచింది. కన్నీళ్లు దిగమింగుకున్న ఆ ఇల్లాలు సాయం కోసం వేడుకోగా.. స్పందించిన మానవత్వం చివరి మజిలీకి అవసరమైన సాయం చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ధర్మరాజుపల్లిలో చోటుచేసుకుంది. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన కోట లక్ష్మణ్–ప్రేమలత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. కూలినాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూతుళ్లకు ఉన్నంతలో వివాహం జరిపించారు. ఇక తమ బతుకు తాము బతుకుదామనుకునే సమయంలో లక్ష్మణ్ మంగళవారం ఇంటి వద్ద హఠాత్తుగా కిందపడిపోయాడు. ఆ సమయంలో అందుబాటులో ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆలస్యమైంది. చివరకు కొందరు గ్రామస్తులు అక్కడకు రావడంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే చికిత్స అందిస్తుండగానే లక్ష్మణ్ మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు అద్దె ఇంటి యజమాని అడ్డు చెప్పాడు. దీంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం.. దుఃఖాన్ని దిగమింగుకుంది. ఊరు బయటనే ఓ డేరా వేయించి అక్కడే మృతదేహాన్ని ఉంచారు. అయితే, అంత్యక్రియలు పూర్తిచేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో మృతుడి భార్య కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని చూసేందుకు వచి్చన వారిని సాయం చేయాలని ప్రాధేయపడింది. తల్లీకూతుళ్లు చేతులు చాచి ఆర్థికసాయం కోసం విన్నవించడం గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. స్పందించిన వారు తలాకొంత పోగుచేసి రూ.80 వేలను మృతుడి కుటుంబానికి అందజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సూచన మేరకు ఆ పార్టీ నాయకులు కూడా కొంత నగదు అందజేయడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం...
-
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలన గాడితప్పి ప్రజారోగ్యం పడకేసి తెలంగాణ మొత్తం విషజ్వరాల బారిన పడినందున.. వెంటనే ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచి్చందని, కానీ దీనిద్వారా అసలైన సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో చెరువులను పరిరక్షించాల్సిందేనని, కానీ ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు. కబ్జాల వివరాలు బయట పెట్టాలని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. దేవాదాయ భూములు, అసైన్డ్ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్నాక.. వాటిపై ప్రతాపం చూపొద్దన్నారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రుణమాఫీ చేయలేదు.. తులం బంగారం లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వ లేదని ఎద్దేవా చేశారు. ఉచితాలు, హామీలు, గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు హామీలిచ్చి.. గద్దెనెక్కాక ప్రజలను గోస పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అవినీతి, అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీస్తున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీ కటాకట్ కటాకట్ డబ్బులు వేస్తామని చెప్పారు.. ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఫటాఫట్ దివాలా తీశాయని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణనుæ ఢిల్లీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కోర్టులకు రాజకీయ రంగు పులమడం కాంగ్రెస్కే చెల్లిందన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామన్న.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, అన్ని విషయాలకు కోర్టులు, న్యాయ వ్యవస్థ ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా లక్ష్మణ్ చెప్పారు. అధికారంలోకి రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలకు పిచ్చి ముదిరిందని, ఇప్పటికే ఆ పార్టీ ఖేల్ఖతం.. దుకాణం బంద్ అయ్యిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు కొత్తగా కలిసేది ఏముంది? వాళ్లు ఎప్పుడో కలిశారు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో బీజేపీ ఉద్యమ బాట పడుతుందని, త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తుందని లక్ష్మణ్ వెల్లడించారు. -
చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్ పై ఎంపీ లక్ష్మణ్ రియాక్షన్
-
కేసీఆర్ పై చర్యలేవి ?
-
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్.. రేవంత్ భవిష్యత్తు ప్రశ్నార్థకం..!
-
హామీలు మరిస్తే ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర, పార్లమెంట్లో ‘చిన్నమ్మ’సుష్మా స్వరాజ్ చేసిన కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. సుష్మా స్వరాజ్ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలుంచిæ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే తెలంగాణ పోరాటం తరహాలోనే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి గ్యారంటీలను అమలు చేయకపోతే ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని, వచ్చే ఐదేళ్లు ఆయనకు కష్టమేనని వ్యాఖ్యానించారు. ‘సోనియా గాంధీ బలిదేవత అన్న రేవంత్రెడ్డి ఇప్పుడు ఆమెకే భక్తుడు అయ్యాడు. మాజీ సీఎం కేసీఆర్ విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఉచితాలు, గ్యారంటీలు ఓట్లు దండుకోవడం కోసమే. వివాదాలు సృష్టించి కాలం గడపాలని అనుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా కాదు. తెలంగాణ సమాజం తెచ్చుకుంది. గత ప్రభుత్వం చేసిన దురాగతాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దోచు కోవడం కోసం రాజీపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు’అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అనుభవి స్తోందని మండిపడ్డారు. రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరవాలని శ్రీకాంతాచారితో మొద లు పెడితే ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నా రు. 1,200 మంది అమరులయ్యారు. వారి బలిదానాల తోనే తెలంగాణ వచ్చింది’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ బీబీపాటిల్, పార్టీనేతలు కాసం వెంకటేశ్వర్లు, మనోహర్రెడ్డి, శిల్పారెడ్డి, ప్రేంసింగ్రాథోడ్, ఎన్విసుభాష్, పీఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 1969 ఉద్యమకారులకు బీజేపీ సన్మానం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని బీజేపీ నేత డా.కె.లక్ష్మణ్ శాలు వాలతో సన్మానించారు. మాజీ మంత్రులు మేచినేని కిషన్రావు, మర్రి శశిధర్ రెడ్డి, అలాగే యాదగిరి గౌడ్ తదితరులు సన్మానం అందుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారిని గుర్తించి గౌరవించాలని ఉద్యమ కారులు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మోదీ నాయకత్వంలో బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. మేచినేని కిషన్రావు మాట్లాడుతూ.. ‘బీజేపీ చొరవ వల్ల తెలంగాణ సిద్ధించింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఉద్యమకారులుగా తీర్మానం చేశాం. ఈ రోజు నుంచి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు. వంద ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయాలి’అని అన్నారు. -
ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్. కవాడిగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని, ఈ కేసులో కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ తాత్సారం చేస్తోందని ఆరోపించింది. ఈ కుంభకోణంలో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని, ఇందుకోసం న్యాయ పోరాటానికి సైతం సిద్ధంగా ఉందని ప్రకటించింది.కేసులో సూత్రధారులు, పాత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలో సీఎం రేవంత్రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్ ఇప్పుడెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.కేసీఆర్తో లోపాయికారీ ఒప్పందం ఉందా?ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తామన్నారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కేసు నుంచి తన కుమార్తె కవితను తప్పించడంకోసమే బీజేపీ నేతలపై కేసీఆర్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.బీఆర్ఎస్ రద్దు కోరుతూ లేఖ రాస్తా: కొండా 2017కంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తామని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యవహారాలతో పాటు రక్షణ పరమైన ఒప్పందాల్లో నూ కేసీఆర్ వేలు పెట్టాడని తెలుస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో నయీం తరహా పాలన సాగిందని, సొంత కుటుంబం పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు.రేవంత్ను సోనియా బెదిరించారు: బూర‘బీఆర్ఎస్పై కేసులు పెడితే నీపని అవుతుంది అని సోనియా గాంధీ బెదిరించారు. అందుకే రేవంత్ రెడ్డి మొహం చిన్నగా చేసుకుని వచ్చాడు’ అని బూ ర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించారు. ధర్నాలో ఎంపీ బీబీపాటిల్, మాజీ మంత్రులు జి.విజయ రామా రావు, ఇ.పెద్దిరెడ్డి, నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎన్. రామ చంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మా రావు, ప్రేంసింగ్ రాథోడ్, భేతి సుభాష్రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఢిల్లీ పెద్దల ఒత్తిడితో వల్లే రేవంత్ రాజీ: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లో మాజీ సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఇది సామాన్య నేరం కాదు.. దేశద్రోహం లాంటిది అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, ఎంపీ లక్ష్మణ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతిని వెలికితీస్తామన్న సీఎం రేవంత్ ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్ వెనకడుగు వేస్తున్నారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్ ఈ కేసులో రాజీ పడ్డారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్లో బాధితుడు అయినప్పటికీ రేవంత్ ఏం చేయలేని స్థితిలో ఉన్నారు.కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనని ఈ వ్యవహారంతో తేలిపోయింది. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఢిల్లీ నేతను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను కాపాడేందుకు ఈ కేసును వాడుకున్నారు. ఇక, తెలంగాణలో అందెశ్రీ పాటను అధికార గీతం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ రావడం ఖాయం. ఆగస్టు సంక్షోభం వస్తే మేము రక్షించే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చివరి నాలుగు రోజుల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారం, దీంతో ముడిపడిన అంశాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు ముగియనుండటంతో.. అప్పట్లోగా చేపట్టే ప్రచారం, ఇప్పటివరకు నిర్వహించిన ప్రచార సరళి, ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలి, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ ప్రస్తావించాల్సిన అంశాలు, సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని దు్రష్పచారం జరిగితే ఎలా ఖండించాలి అన్న వాటిపై కీలక నేతలు సమీక్షించారు. శనివారం లోగా పోలింగ్బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చి ఓటర్లను వారి ఇళ్లల్లో కలుసుకునేలా కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగు రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, మీడియా కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోశ్, ఎలక్షన్ కమిటీ చైర్మన్ డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. మీడియా, సోషల్ మీడియా కమిటీల భేటీలో... వీరితో పాటు రాజస్తాన్ సీఎం భజన్లాల్ శర్మ, తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై, పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ప్రేంసింగ్ రాథోడ్, డా.ఎస్.ప్రకాష్ రెడ్డి, పోరెడ్డి కిశోర్ రెడ్డి, రచనా రెడ్డి, పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిలు పాల్గొన్నారు.అలాంటి దు్రష్పచారం మళ్లీ జరగొద్దు.. ఐదు నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల హామీల అమలు నెరవేర్చకపోవడం వంటి వాటిని ఎండగట్టడంతో పాటు... రిజర్వేషన్ల రద్దు, ఇతర అంశాలపై కొన్నిరోజులుగా బీజేపీపై చేస్తున్న దు్రష్పచారాన్ని మరింత సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ సూచించారు. తెలంగాణలోని కొన్ని మీడియా సంస్థలు (సాక్షి కాదు) బీజేపీ పట్ల ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నాయని, పారీ్టకి నష్టం కలిగించే దిశలో ఇతర పారీ్టల ప్రచారానికి ఊతమిస్తున్నాయని సంతోష్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఒక పత్రికలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి దుష్యంత్ కుమార్ చౌహాన్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి, తప్పుడు ప్రచారానికి దోహదపడేలా వార్త ప్రచురించారని ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. చివరి నాలుగు రోజులూ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు పారీ్టవర్గాల సమాచారం. -
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలులో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను తప్పకుండా రద్దు చేస్తామని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీబోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు తప్ప.. మరే రిజర్వేషన్లు రద్దు చేయబోమని, అలాగే రాజ్యాంగాన్ని కూడా మార్చేది లేదని ఆయన వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు మినహా.. కుల, మతం పేరిట రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. కులాల ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వొద్దన్నదే రాజీవ్గాంధీ అని గుర్తు చేశారు. రంగనాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయని కాంగ్రెస్.. మండల్ కమిషన్ను కూడా రాజీవ్గాంధీ వ్యతిరేకించారన్న విషయాన్ని రాహుల్గాం«దీ, రేవంత్రెడ్డి తెలుసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ సూచించారు. ముస్లిం సంతుష్టీకరణ పేరిట హిందూ సమాజంపై విషం చిమ్ముతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లో లక్ష్మణ్ పార్టీ నాయకులు ప్రకాశ్రెడ్డి, సుభాష్ రవి కిషోర్తో కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముస్లింలను సంతృప్తిపర్చేందుకు కాంగ్రెస్ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తోందని, బీసీల రిజర్వేషన్లును తగ్గించి ముస్లింలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.బీజేపీ దేవుళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తోందంటున్న సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఎక్కడకు వెళ్తే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతూ.. అదే దేవుళ్లను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. కులగణనకు మేం వ్యతిరేకం కాదు కానీ.. కుల గణనకు తాము వ్యతిరేకం కాదని, అయితే అది శాస్త్రీయంగా, పరిశోధనాత్మకంగా జరగాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే.. ఈ కూటమి తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ తెస్తామంటున్నారని, సీఏఏపై కూడా దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా సీఏఏను అమలు చేస్తామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో తాము వికసిత్ భారత్ అంటుంటే.. కాంగ్రెస్ విభజించు భారత్ అంటూ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అక్షింతలు, కాషాయంతో తిండి లభిస్తుందా అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై లక్ష్మణ్ స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చర్మాన్ని ప్రజలు వొలిచిన విషయం గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
ఆయన లక్షణాలే నా అక్షరాలకు స్ఫూర్తి
ఓ నాయకుడి గురించి రాసేటప్పుడు కలం కదలాలంటే ఆ నాయకుడి వ్యక్తిత్వంలో బలం ఉండాలి. అక్షరాలు పరుగులు తీయాలంటే లక్షణాలు ప్రేరణ కావాలి అంటున్నారు జానపద గేయ రచయిత లక్ష్మణ్.‘నీ బుల్లెట్టు బండెక్కి..’ పాట ద్వారా తెలుగు రాష్ట్రాల్ని ఊపేసిన ఈ యువ రచయిత వైఎస్ జగన్ మోహన్రెడ్డి గుణగణాల్ని వర్మిస్తూ రాసిన ‘జెండాలు జత గట్టడమేమీ అజెండా.. జనం గుండెలో గుడికట్టడమే జగన్ అజెండా’ అనే పాట తెలుగు నాట ఉర్రూతలూగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సాక్షితో తన అనుభూతిని పంచుకున్నారిలా... – సత్యార్థ్ పేదల ముంగిట్లో పథకాలు పాట రాయడానికి ముందు వలంటీర్లతో స్వయంగా మాట్లాడి ఆయన అమలు చేసిన పథకాల గురించి తెలుసుకున్నా. కడుపు నిండినోడ్ని కాదు ఆకలితో కడుపు మండేవాడ్ని మాత్రమే పట్టించుకోవాలనీ, చాచిన ప్రతీ చేయికీ సాయం అందాలి అనే ఆలోచనలతోనే ఆయన ఆ పథకాలన్నీ తీర్చిదిద్దారని అర్థమైంది. ఆ అవగాహనే ‘‘మా ఇంటికే తెచ్చిండు ప్రభు త్వం మా చేతికే ఇచ్చిండు రా పథకం’’ అంటూ కీర్తించేలా చేసింది. ప్రభుత్వ పథకాలు ఇంటికి రావడం దేశంలోనే జగన్ సార్ వల్ల వచ్చిన గొప్ప మార్పు. నిరుపేదలు ఆస్పత్రి ఖర్చులతో అన్యాయం అయిపోవద్దు. రోగంతో కోలుకున్నాక కూడా వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లకు పూర్తిగా నయమైంది అని కచ్చితంగా తెలుసుకోవాలి... అని ఆయన మాట విన్నప్పుడు నిజంగా నాకు కళ్లలో నీళ్లొచ్చాయి. కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా.. జగన్ పుట్టుకలో వెనుకడుగేయని తత్వం ఉంది. ఆయన్ను నమ్ముకున్న కార్యకర్త ఆత్మగౌరవంతో ఉండాలి. ధైర్యంగా కొట్లాడాలి. ఏదోవిధంగా గెలవాలని, తాను పొత్తులకు దిగజారిపోకూడదు అని ఆయన అనుకుంటారు. తన కోసం వారు మనస్సాక్షిని చంపుకుని బతకొద్దు అనేది ఆయన ఆలోచన అని నాకు అర్థమైంది. పైన ఉన్న దేవుడ్ని కింద ఉన్న జనాన్నే నేను నమ్ముకున్నా అంటూ తరచుగా ఆయన చెప్పడం నాకెంత స్ఫూర్తినిచ్చిందో... పరిచయమైన కొద్దీ... పదునెక్కిన పదం జగన్ మీద అప్పటికే ఎన్నో గొప్ప పాటలు వచ్చాయి. ఆయన కోసం పాట రాయాలంటే మామూలు విషయం కాదు.అందుకే ఈ పాట రాసే అవకాశం నాకు వచ్చినప్పుడు... కొంచెం సందేహించిన మాట నిజం.పైగా నాది తెలంగాణ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అంతగా తెలియదు. దాంతో పాటకు ముందు ఆయన ఇంటర్వ్యూ లు వరుసపెట్టి చూశా.. రకరకాల మార్గాల ద్వారా తెలుసుకుంటుంటే....అర్ధమవుతూ వచ్చింది జగన్ ఏంటో... నిఖార్సైన గ్రేట్ లీడర్... ఆయన పాట రాసి అది అందరి మెప్పూ పొందడం వల్ల ఎంత ఆనందం పొందుతున్నానో...ఆయన పాలన విశేషాలు, ప్రజాసేవ గురించి తెలుసుకోవడం వల్ల అంతకు మించిన ఆనందం పొందుతున్నాను. ఇలాంటి పేదల పక్షపాతి లాంటి నాయకుడ్ని నేనింత వరకూ చూడలేదు. ఇంత చేసినా.. రకరకాలుగా ఆయనకు చెడు చేయాలనే ఆలోచనలు కొంతమంది చేస్తున్నారని బాధ అనిపిస్తుంది. సారిచ్చిన పథకాలు పేదింటికి ఏ స్థాయిలో అందుతున్నాయి? పేదలు ఎంత తృప్తిగా ఉన్నారు? అనేది కనపడుతున్నా.. వ్యతిరేక మీడియా దు్రష్పచారం చేస్తోంది. అందుకే నా వంతుగా ఆయన వ్యక్తిత్వాన్ని పాట ద్వారా బలంగా చెప్పాలని అను కున్నా. నేను రైటర్గా గతంలోనూ కొందరు నేతల గుణగణాల్ని వర్మిస్తూ రాశాను. అయితే వ్యక్తిగతంగా ఇంతగా ప్రభావితం అయింది ఇదే తొలిసారి. జగన్ గారి గురించి రాసేటప్పుడు తెలియని శక్తి ఏదో ఆవహిస్తుందేమో అనిపించింది. -
సర్వేలు అదే చెబుతున్నాయి: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 12 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు. సర్వేలు సైతం బీజేపీ గెలుపును ధృవీకరిస్తున్నాయని చెప్పారు. 247 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 235 స్థానాల్లో ఓడిపోబోతుందంటూ జోస్యం చెప్పారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నేలా విడిచి సాము చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయినట్లు కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారు. రెండు అంకెల సీట్లు బీజేపీకి రావడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పస లేని విమర్శలు చేస్తున్నారు. అభద్రతా భావంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గత చరిత్రగానే మారిపోతోంది. ఆడలేక మద్దెల చెరువు అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే అసెంబ్లీ సీటు బీజేపీ సాధించగా... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ స్థానాలు గెలిచింది. తెలంగాణలో నాలుగు సీట్లు గెలవడంతోనే బీజేపీ సీట్ల సంఖ్య 300 మార్క్ దాటింది’’ అని లక్ష్మణ్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్: రేవంత్కు కొత్త సవాల్ విసిరిన ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని సీరియస్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, ఎంపీ లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడితే.. సందట్లో సడేమియా అన్నట్టుగా అధికారులు సర్దుకున్నారు. గత ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కును గత ప్రబుతం అణచివేసింది. తెలంగాణను అబాసుపాలు చేసింది. పోలీసుల అనుమతితో ఒకటి రెండు ఫోన్ ట్యాపింగ్లు జరగవచ్చని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్పై సీబీఐతో విచారణ జరిపించాలి. వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలి. లీక్ వీరుడు కాదు.. గ్రీక్వీరుడైతే సీబీఐ విచారణకు వెంటనే ఆదేశించాలి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
BRS చచ్చిన పాము..ఆ పార్టీని బీజేపీ ఉపేక్షించదు: లక్ష్మణ్
-
నేను రాసిన పాటలోని పదాలు సీఎం జగన్ నోట రావడం..ఈ జన్మకు ఇది చాలు
-
నేను రాసిన పాటలోని పదాలు సీఎం జగన్ నోట రావడం ఈ జన్మకు ఇది చాలు
-
బీజేపీకి 10 సీట్లు ఫిక్స్
-
మంత్రి కొప్పుల ఈశ్వర్కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కాగా కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై అనర్హత విధించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఎమ్మెల్యేగా ఆయనపై వేటు వేయాలని పిటిషన్లు వేశారు. ధర్మపురి ఎన్నికపై రీకౌంటింగ్ జరపాలని కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కాంగ్రెస్నేత పిటిషన్ను కొట్టివేసింది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో కరీంనగర్ జల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసి కేవలం 441 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్పై గెలిచారు. దీంతో వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించకముందే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని, అధికారులు ఆయనకు మద్దతిచ్చారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ధర్మపురి నియోజవకవర్గం నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మళ్లీ ఈ ఇద్దరు నేతలే తలపడుతున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఈసారి గెలుపెవరిదో తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. -
బీజేపీ గ్రాఫ్ పెరిగింది.. కారు షెడ్డుకు వెళ్ళడం ఖాయం: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ బూటకపు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ మ్యానిఫెస్టో ప్రజల మ్యానిఫెస్టోనని పేర్కొన్నారు. ఆచరణకు అమలయ్యే హామీలను మాత్రమే బీజేపీ ఇచ్చిందని చెప్పారు. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షల కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. తెచ్చుకున్న తెలంగాణ అధోగతిపాలు కావొద్దన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చే ప్రకటనలు ఆపివేయడం హర్షించదగిన పరిణామమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను బూటకపు హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు రైతు భరోసా అనేది సాధ్యం కాదని చెప్పారు. సాధ్యం కాదని తెలిసీ రైతుభరోసా ఇస్తామని చెప్పి ప్రజలను ఏమార్చుతోందని మండిపడ్డారు.. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్నారు లక్ష్మణ్. ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటనతో తెలంగాణ క్యాడర్లో జోష్ నింపిందని తెలిపారు. బీసీలు, మాదిగలు బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. త్వరలో కారు షెడ్డుకు వెళ్ళడం... హస్తానికి మొండి చెయ్యి గ్యారంటీ అని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏనాడూ కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు రాలేదని ప్రస్తావించారు. ఆంధ్ర, రాయలసీమలో వచ్చే మెజార్టీ సీట్లతోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. -
చేసేదే చెబుతాం!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిపై (యూనిఫాం సివిల్ కోడ్) నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ శుక్రవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెబుతుందని స్పష్టం చేశారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, దీనికి అనేక చట్టపరమైన ఇబ్బందులున్నాయని పేర్కొన్నారు. అందువల్ల వాటిని ఎలా అధిగమించాలనే అంశంపై దృష్టి పెట్టి, నిజమైన బీసీలకు న్యాయం చేసే దిశగా ఆలోచిస్తున్నామన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీసీ గణన నిర్వహించినా ఆ వివరాలు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. పండిట్ నెహ్రూ మొదలుకొని రాహుల్గాంధీ వరకు అందరూ బీసీ వ్యతిరేకులేనని లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ బీసీ సీఎంను చేస్తామంటే ఎద్దేవా చేసి.. ఓబీసీలను అవమానించిన రాహుల్గాంధీ ఇప్పుడు వారిపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. దీనిపై ఏడుగురు న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటు చేసినందున రాజకీయంగా, చట్టపరంగా ఎలా చేయాలన్న అంశంపై కేంద్ర ప్రభు త్వం దృష్టి పెట్టిందని వివరించారు. కాంగ్రెస్ నుంచి 2014లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏడుగురు, 2018 లో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని, ఈరోజు కాకపోతే భవిష్యత్లోనైనా ఆ పార్టీ బీఆర్ఎస్తో కలవక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పాలించేందుకు కాంగ్రెస్కు 11సార్లు అవకాశమిచ్చారని, గతంలో టీడీపీకి, ఇప్పుడు పదేళ్ల పాటు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినందున ఈసారి బీజేపీకి అవకాశమివ్వాలని ప్రజలకు లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. అధికారమిస్తే యోగి యూపీ మోడల్ బీజేపీ అధికారంలోకి వస్తే యోగి ఆదిత్యనాథ్ యూపీ నమూనాను ఇక్కడ అమలు చేస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరి గా బీజేపీ ఎన్నికల ప్రణాళికలోనూ ఉచితాలు ఉంటాయా? అన్న ఓ విలేకరి ప్రశ్నకు లక్ష్మణ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీలన్నీ కూడా ఓట్ల కోసం వేస్తున్న గాలాలే తప్ప మరొకటి కాదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇది రుజువైందని గుర్తు చేశారు. ఉచితాలు, సరైన పద్ధతిలో సంక్షేమ పథకాల అమలుతో పేదలకు లబ్ధి చేకూర్చడం మధ్య వ్యత్యాసం ఉందన్నారు. హంతకుడే క్షమాపణలు చెప్పినట్టు.. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలున్నాయని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
రేషన్ కార్డులు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం
-
బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
-
బీసీలంటే రాహుల్కు ఎందుకంత చులకనా?: లక్ష్మణ్
సాక్షి, ఢిల్లీ: బీసీ సీఎం చేస్తామన్న బీజేపీ ప్రకటనను రాహుల్ గాంధీ చులకన చేస్తున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీసీ వర్గాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెత్తందార్ల మనస్తత్వంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలున్నారు.. ఆ పార్టీలను తెలంగాణ బీసీలు ఓటుతో తిప్పికొట్టాలన్నారు. బీసీ సీఎం అయ్యేందుకు బీసీలంతా ఏకం కావాలి, తమ సత్తా చాటాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మేము 4 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 3కే పరిమితమైంది. తరతరాలుగా బీసీలను అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్’’ అంటూ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బీజేపీ బీసీల అభిమానాన్ని చూరగొంది. అధికార పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తోంది. బీసీల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న ఎన్నికలు ఇవి. కొండంత ఆశతో బీసీలు మోదీ వైపు చూస్తున్నారు. డిపాజిట్లు గల్లంతైన పార్టీ కాంగ్రెస్. నిన్నటి సభలో రాహుల్ బీసీలను అవమానిస్తారా?. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్. తక్షణమే రాహుల్ బీసీలకు క్షమాపణ చెప్పాలి. బీసీలంటే రాహుల్కు ఎందుకంత చులకనా?. బీసీల పట్ల కాంగ్రెస్ విపరీత ధోరణి మారాలి. ఎక్కడ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి. దేశ ప్రజలంతా ప్రధాని మోదీ వైపు చూస్తున్నారు’’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. చదవండి: కేసీఆర్ డిజైన్ చేస్తే ఇలాగే ఉంటుంది: రాహుల్ గాంధీ -
ఢిల్లీలో కవిత ధర్నాల సంగతేంటి.. బీఆర్ఎస్పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికార బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు సీట్ల కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారు కానీ.. మహిళలకు సీట్లను మాత్రం కేటాయించలేదన్నారు. ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించింది. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించాం. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల ప్రకటన ప్రకటించవచ్చు. బీజేపీ నుంచి కొంతమంది ఎంపీలు అసెంబ్లీ బరిలోకి దిగుతారు. బీజేపీ గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారు. నేను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. నా రాజ్యసభ పదవి కాలం అయిదేళ్లు ఉంది. అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తాను. కిషన్ రెడ్డి కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉంది. ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. జనసేనకు కూడా కొన్ని టికెట్లు ఇస్తాం. రెండో జాబితా ఈ నెల 29 తర్వాత ఉంటుంది. రాజా సింగ్ సస్పెన్షన్, ఎన్నికల్లో పోటీ అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తోంది. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. బీసీల ఓట్లు తీసుకొని అగ్రకులాలు గద్దె నెక్కుతున్నాయి. అభ్యర్థుల మొదటి విడతలో బీసీలకు 20పైగా సీట్లు కేటాయిస్తున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీల సేవలు వాడుకుని వదిలేస్తున్నారు. బీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోంది. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలను బీజేపీ అమలు చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీసీలను బానిసలుగా చూస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు బీసీలకు బీజేపీ కేటాయిస్తుంది’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: తటస్థులు, మేధావులకూ బీజేపీ సీట్లు! -
ఫ్రస్ట్రేషన్లో స్థాయిని మించి మాట్లాడుతున్నాడు: కేటీఆర్పై లక్ష్మణ్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ సంస్కారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. సీఎం కాలేదన్న ఫ్రస్టేషన్లో కేటీఆర్.. తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రానికి సహకరించకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికలు అంటే మద్యం, డబ్బు అయిపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్వి అవకాశవాద రాజకీయాలని విమర్శలు గుప్పించారు. ఈనెల 16 తర్వాత బీజేపీ లిస్ట్ కూడా వస్తుందని లక్ష్మణ్ తెలిపారు. అన్ని వర్గాల వారికి బీజేపీ మాత్రమే సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్లోపే మేనిఫెస్టో, చార్జి షీట్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. ‘ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఎక్కడ.. కేటీఆర్ ఎక్కడ.. పెద్దవారిని తిడితే పెద్దవాన్ని అవుతానని అనుకుంటున్నావా. బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు రాష్ట్రంలో వీస్తున్నాయి. ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు గుంజుతున్నారు. నదులకు నడక నేర్పడం ఏమో కానీ మద్యాన్ని ఏరులై పారించారు. గుజరాథ్కు వెళ్లి చూసి వస్తారు. అదే గుజరాత్ మోడల్నీ ఎగతాళి చేస్తారు. ’ అని లక్ష్మణ్ మండిపడ్డారు. -
అలాంటి పిచ్లపై ఫూల్స్ కూడా వికెట్లు తీస్తారు: అశ్విన్పై సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత గడ్డ మీద తన కోసమే ప్రత్యేకంగా స్పిన్కు అనుకూలించే పిచ్లు తయారు చేయిస్తారని పేర్కొన్నాడు. అందుకే ఇండియాలో తప్ప SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)లో అతడి పప్పులు ఉడకవని తీవ్రస్థాయిలో విమర్శించాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే కామెంటేటర్ల పేర్లను ఐసీసీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కామెంటరీ ప్యానెల్లో చోటు ఆశించి భంగపడిన టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఐసీసీపై విమర్శలు గుప్పించాడు. ‘‘కామెంటరీ ప్యానెల్లో సరైన స్పిన్నర్ ఒక్కరికీ చోటు దక్కలేదు. టోర్నీలో ఇండియాలో జరుగుతున్నా ఇదే పరిస్థితి. స్పిన్ బౌలింగ్ గురించి సాధారణ ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది? వారిని ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? కేవలం బ్యాటర్లు, శ్వేత జాతీయులకు మాత్రమే గేమ్ గురించి తెలుసా? విచారకరం’’ అని శివరామకృష్ణన్ ఎక్స్ ఖాతా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘టీమిండియా బ్యాటర్లు ముఖ్యంగా కింగ్(విరాట్ కోహ్లి) స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇంకానయం మనోళ్లు ఆఖర్లో అశ్విన్ను తీసుకున్నారు. ఒకవేళ వికెట్లు పడ్డా తను బ్యాటింగ్లోనూ రాణించగలడు. పిచ్లు ఫ్లాట్గా ఉంటేనే’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఇండియాలో టెస్టు మ్యాచ్లలో పిచ్లు అశ్విన్ కోసమే తయారు చేస్తారు కాబట్టి టీమిండియా బ్యాటర్లు స్పిన్ ఆడలేకపోతున్నారు. మరి SENA దేశాల్లో అతడి రికార్డు ఎప్పుడైనా గమనించారా?’’ అని శివరామకృష్ణన్ పేర్కొన్నాడు. ఆ తర్వాత సంభాషణ కొనసాగగా.. ‘‘టాంపెరింగ్ చేసిన పిచ్లపై ఫూల్స్ కూడా వికెట్లు తీయగలరు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా గ్రౌండ్కు వెళ్లి అక్కడి సిబ్బందిని కలిసి టాంపర్ చేయాల్సిన ఏరియాల గురించి చెప్పే వారిని నా కళ్లారా చూశాను. ఇండియాలోనే 378 వికెట్లు. ఇప్పటికీ అతడు ఆడుతున్నాడంటే మిగతా వాళ్లకు ఛాన్స్లు లేవని అర్థం. మోస్ట్ అన్ఫిట్ క్రికెటర్. ప్రతిదానికి ఓ సాకు వెదుక్కుంటాడు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో అశ్విన్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన కొంతమంది నెటిజన్లు మీ అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా అని ప్రశ్నించగా.. లేదు.. ఇది నేనే అని లక్ష్మణ్ శివరామకృష్ణన్ సమాధానమిచ్చాడు. కాగా శివరామకృష్ణన్ 1983-87 మధ్య టీమిండియా తరఫున ఏడు టెస్టులు, పదహారు వన్డేలు ఆడాడు. చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్ -
రాజ్యాధికారంలో వాటా దక్కితేనే బీసీలకు న్యాయం..
సాక్షి, హైదరాబాద్: రాజ్యాధి కారంలో బీసీలకు తమవంతు వాటా దక్కినప్పుడే వారికి న్యాయం జరిగినట్లు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. రాను న్న ఎన్నికల్లో బీసీలే ప్రధాన పాత్ర వహించాలని చెప్పారు. గత తొమ్మిళ్లలో బీసీలను ఆదుకునేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాలను ఆదరించి మద్దతుగా నిలవాలని కోరారు. దేశంలోని కుల, చేతివృత్తుల బలోపేతానికి మోదీ– పీఎం విశ్వకర్మ యోజన వంటి బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చారని చెప్పా రు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను వంచించి దగా చేశాయి. బీసీలకు రాజకీయంగా ఇవ్వాల్సిన 33 శాతం వాటాకు కోతపెట్టి.. ఇప్పుడు ఓబీసీ ఎజెండా ఎత్తుకుని ఓట్ల కోసం పాకులాడుతు న్నాయి’ అని మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాల యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రప టానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆధి పత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా, కుల వృత్తులు, వ్యవసాయాధారిత పేద కుటుంబాలకు మద్దతుగా ఐలమ్మ పోరాటం చేశారని కొనియాడారు. -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
అట్టా.. ఎట్టాగా పుట్టేసినావు...
రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. జశ్వంత్ పసుపులేటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘‘అట్టా ఎట్టాగా పుట్టేసినావు..’ అంటూ సాగేపాటని మ్యూజిక్ డైరెక్టర్ రధన్ రిలీజ్ చేశారు. రాజశేఖర్ సుద్మూన్, జశ్వంత్ పసుపులేటి రాసిన ఈపాటను యశ్వంత్ నాగ్, కమల మనోహరిపాడారు. ‘‘హీరో, హీరోయిన్ తొలి చూపులోనే ప్రేమలో పడే సీన్లో వచ్చేపాట ఇది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
TS: సంఘ్ పెద్దలతో బీజేపీ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సమన్వయంపై ఆ పార్టీ నేతలు సంఘ్ పెద్దలతో మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల సహ ఇంఛార్జ్ సునీల్ బన్సల్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, కే.లక్ష్మణ్, బండి సంజయ్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో సంఘ్ పరివార్ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీపరంగా వెంటనే చేయాల్సిన పనులేంటో ఈ సందర్భంగా సంఘ్ పెద్దలు తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. -
ఆత్మగౌరవం నేపథ్యంలో...
లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నచ్చినవాడు’. ఈ సినిమాలోని ‘తోడై నువ్వుండక..’ పాట లిరికల్ వీడియోను అక్కినేని అమల విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలన్నారు. ‘‘మహిళల ఆత్మగౌరవం నేపథ్యంలో అల్లిన ప్రేమకథా చిత్రం ఇది. కామెడీ, నేటి యువతరానికి కావాల్సిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు లక్ష్మణ్. రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్ కీలక పాత్రలు ΄పోషించిన ఈ సినిమాకు మిజో జోసెఫ్ స్వరకర్త. -
కాంగ్రెస్ తోక పార్టీలా బీఆర్ఎస్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ తోక పార్టీలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ కూడా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం చూస్తుంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీలా వారి బంధం ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు ఆప్తో కూడా అవినాభావం సంబంధం మరింతగా బలపడుతోందని ఆరోపించారు. తెలంగాణలో భారీ వర్షాలకు నగరాలు మునిగిపోయినా, జనజీవ నం స్తంభించిపోయినా సీఎం కేసీఆర్కు ఏమీ పట్టలేదనీ, రోమ్ చక్రవర్తిలా వ్యవహరిస్తూ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని నిందించారు. మును పెన్నడూ లేని విధంగా వరంగల్, ఖమ్మం, భద్రాచలం, హైదరాబాద్లు ఒ‘కే సారి జలమయం అయ్యాయని, తెలంగాణకు సముద్రం లేని లోటు తీర్చడం బీఆర్ఎస్కే దక్కిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నదులకు నడక నేర్పడం సంగతి ఏమోగానీ ఢిల్లీ వరకూ మద్యం ప్రవహించేలా ఘనత మాత్రం ఆయన కుటుంబానికే చెల్లిందని ఆరోపించారు. మద్యం ద్వారా పెరిగిన బంధంతోనే సంజయ్ సింగ్కు వత్తాసు పలుకుతున్నారని నిందించారు. కేంద్రబృందాల అంచనా రాగానే సాయం వర్షాల వల్ల తెలంగాణలో నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్రెడ్డి నేతృత్వంలోని బృందం హోంమంత్రి అమిత్షాను కలిసి వివరించిందని లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర బృందాల నష్ట అంచనా రాగానే కేంద్రం నుంచి సహాయం ఉంటుందన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష మార్పు, బండి సంజయ్కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. -
కథా బలమున్న సినిమాలు చేయాలనుంది: హీరో లక్ష్మణ్
రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తీస్తున్న సినిమా 'సీతారాం సిత్రాలు'. లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో డి.నాగ శశిధర్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు అశోక్ చేతుల మీదుగా జరిగాయి. టైటిల్ లోగోను ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కె.వి.గుహన్ విడుదల చేశారు. "నువ్వు గెలవనంత వరకు ఏమీ చెప్పిన అది చెత్తే.. ఒక్కసారి నువ్వు గెలిచాక చెత్త చెప్పిన అది చరిత్రే" అనే కథాంశం తో రాబోతున్న 'సీతారాం సిత్రాలు' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాల్లో నటించాలని ఉంది, 'సీతారాం సిత్రాలు' అందరిని అలరించే ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని చెప్పాడు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!) -
స్వీయ దర్శకత్వంలో నచ్చినవాడు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
దర్శకుడిగా, హీరోగా లక్ష్మణ్ చిన్నా స్వీయ దర్శకత్వంలో తొలిసారిగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'నచ్చినవాడు'. ఈ చిత్రంలో కావ్య రమేశ్ అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. 'నా మనసు నిన్ను చేర' అనే లవ్ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి మిజో జోసెఫ్ సంగీతమందించారు. ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ‘రుద్రమాంబపురం’పై మంత్రి తలసాని ప్రశంసలు) లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ..' నచ్చినవాడు మూవీ మహిళల ఆత్మ గౌరవమే కథాంశంగా చేసుకుని తెరకెక్కించి ప్రేమ కథా చిత్రం. హాస్యానికి పెద్దపీట వేశాం. నేటి యూత్కు కావాల్సిన ప్రతి అంశాన్ని చూపించాం. త్వరలోనే చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. కర్ణాటక, పాండిచ్చేరిలోని బ్యూటిఫుల్ లొకేషన్స్లో పాటలు చిత్రీకరించామని తెలిపారు. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చుతుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. (ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్) -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
జరుగుమల్లి (సింగరాయకొండ): అర్ధరాత్రి హైవేపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ కిందికి దిగేశారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలో హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు చెందిన మోజో ట్రావెల్స్ బస్సు(స్లీపర్) 25 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళుతోంది. బస్సు వెనుక భాగంలో ఉన్న సిగ్నల్ లైట్స్కు విద్యుత్ సరఫరా చేసే వైర్లు, ఏసీ కేబుల్స్ కలిసి ఉండటంతో షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ లక్ష్మణ్.. వెంటనే బస్సును రోడ్డు మార్జిన్లో ఆపివేశాడు. ప్రయాణికులను కిందకు దించి మంటలపై బకెట్తో నీళ్లు చల్లి ఆర్పే ప్రయత్నం చేశా డు. అయినప్పటికీ మంటలు తగ్గకపోగా, కాసేపట్లోనే బస్సు మొత్తం వ్యాí³ంచాయి. అప్పటికే ప్రయాణికులంతా కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్తో అక్కడకు చేరుకుని మంటలనార్పారు. అయితే బస్సులోనే ఉండిపోయిన ప్రయాణికుల లగేజీ మొత్తం కాలిపోయింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కట్టుబట్టలతో మిగిలిన ప్రయాణికులను ఇతర వాహనాల్లో ఎక్కించి గమ్యస్థానాలకు చేర్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ సీఐ రంగనాథ్ తెలిపారు. -
మౌనిక మృతి.. ‘బయటకెళ్తే ఇంటికొస్తారనే నమ్మకం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నగరంలోని కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసం చిన్నారి మౌనిక మ్యాన్హోల్లో పడిపోయి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇదే క్రమంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు.. కళాసిగూడ ఘటనలో జీహెచ్ఎంసీ చర్యలకు సిద్దమైంది. వర్క్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్పై సస్పెన్షన్ విధించింది. ఇక, ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక, చిన్నారి మృతిపై బీజేపీ నేతలు స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మౌనిక మృతికి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే కారణం. కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ సరిగా బిల్లులు ఇవ్వడం లేదు. మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రోడ్లు తవ్వినప్పుడు కనీసం జాగ్రత్తలు పాటించడం లేదు. శాఖల మధ్య సమన్వయం లేదు’ అంటూ విమర్శలు గుప్పించారు మరోవైపు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ పైన మెరుగు.. లోపల మురుగు. బయటకు వెళ్లినవారు ఇంటికొస్తారనే నమ్మకం లేదు. చిన్నారి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: Hyderabad Rains: మ్యాన్హోల్లో పడి చిన్నారి మృతి -
కర్నాటక: కాంగ్రెస్లో చేరిన బీజేపీ సీనియర్ నేత.. ఎన్నికలపై ఎఫెక్ట్?
బెంగళూరు: కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ సీనియర్ నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను టార్గెట్ చేస్తూ వారికే టికెట్స్ ఇస్తున్నాయి. ఇక, బీజేపీ ఇప్పటికే పలువురు సీనియర్లను కాదని కొత్తగా 52 మందిని బరిలోకి దింపింది. 189 మందితో కూడిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు చోటు ఇవ్వడం, సిట్టింగ్లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. దీంతో, బీజేపీ సీనియర్లు.. ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇదిలా ఉండగా, కర్నాటకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీ.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలా సమక్షంలో సవాదీ.. హస్తం పార్టీలో చేరారు. ఇక, కాంగ్రెస్లో చేరిక అనంతరం.. కాంగ్రెస్ అతడిని అథని అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపనున్నట్టు తెలిపింది. దీంతో, ఆయన బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్ సవాదీ అథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సవాదీ.. మాజీ ముఖ్యమంత్రి యాడియూరప్పకు వీరవిధేయుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో పవర్ఫుల్ లీడర్గా లక్ష్మణ్కు పేరుంది. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికల పర్వంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. Former BJP leader & former Karnataka Deputy CM Laxman Savadi has joined Congress today, says State Congress president DK Shivakumar, in Bengaluru Laxman Savadi on April 12 resigned as Legislative Council member & from the primary membership of the BJP after losing the Athani… pic.twitter.com/B9feGbSFb9 — ANI (@ANI) April 14, 2023 మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రఘు అచర్.. జేడీఎస్లో చేరారు. జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆధర్యంలో ఆయన జేడీఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, కర్నాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. Karnataka | Former MLC and Congress leader Raghu Achar joins JD(S), in the presence of party leader HD Kumaraswamy. pic.twitter.com/rTgVTslJMf — ANI (@ANI) April 14, 2023 -
కర్నాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. కాగా కర్నాటక ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలను ఎంపిక చేసింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్నాటక ఎన్నికల ప్రచారానికి నేతలను ఎంపిక చేయగా.. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లుగా తెలంగాణ నేతలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో, వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. అయితే, ఇన్ఛార్జ్లుగా నియమించిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్, అర్వింద్, జితేందర్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రఘునందన్రావు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్ కుమార్ ఉన్నారు. ఇక, లక్ష్మణ్తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అధిష్టానం అప్పగించింది. మరోవైపు.. కర్నాటకలోని 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జ్లుగా నియామకం అయ్యారు. -
కర్ణాటక బీజేపీలో ముసలం
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో అసంతృప్త జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 189 మందితో కూడిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు చోటు ఇవ్వడం, సిట్టింగ్లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో.. పలువురు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాదీ బుధవారం తన రాజీనామా ప్రకటించారు. బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆయన.. పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను ఆత్మగౌవరం ఉన్న రాజకీయ నేతను. టికెట్ కోసం గిన్నె పట్టుకుని పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగి అడుక్కోలేను. ఎవరి ప్రభావం నా మీద లేదు. నా నిర్ణయం నేనే తీసుకున్నా అంటూ లక్ష్మణ్ సవాదీ బీజేపీకి రాజీనామా ప్రకటించారు. ఇక ఆయన కాంగ్రెస్లోకి మారతారనే ప్రచారం ఊపందుకోగా.. కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్ స్పందించారు. ఆయన(లక్ష్మణ్) మాతో టచ్లో లేడు. ఆయనతో మేం మాట్లాడనూ లేదు అని శివకుమార్ తెలిపారు. లక్ష్మణ్ సవాదీ.. మాజీ ముఖ్యమంత్రి యాడియూరప్పకు వీరవిధేయుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో పవర్ఫుల్ లీడర్గా లక్ష్మణ్కు పేరుంది. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికల పర్వంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. అయితే.. 2012లో అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడి.. వివాదంలో చిక్కుకున్నారాయన. మరోవైపు బీజేపీ అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. టికెట్లు రావనే పార్టీ అధిష్టానం స్పష్టత నడుమ.. మంగళవారం ఆ పార్టీ సీనియర్ నేత ఈశ్వరప్ప ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించుకున్నారు. అలాగే.. మాజీ సీఎం జగదీస్ షెట్టర్కు ఊహించినట్లుగానే మొదటి లిస్ట్లో చోటు దక్కకపోగా.. ఆయన సైతం వ్యతిరేక గళం వినిపించారు. రెండో లిస్ట్లో చోటు దక్కకపోతే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వెళ్తానంటూ ప్రకటించారాయన. ఇదే బాటలో మరో 30 మంది నేతలు ఉన్నట్లు సమాచారం. -
ఏం జరిగింది జీ.. సంజయ్ అరెస్ట్పై జేపీ నడ్డా ఆరా!
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ పొలిటికల్గా ప్రకంపనలు సృష్టిస్తోంది. సంజయ్ అరెస్ట్కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం కూడా బండి సంజయ్ అరెస్ట్పై వివరాలు అడిగి తెలుసుకుంటోంది. సంజయ్ అరెస్ట్పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. ఎందుకు అరెస్ట్ చేశారో బీజేపీ నేత రామచందర్రావుకి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, బండి సంజయ్ అరెస్ట్ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?. కుట్రపూరితంగానే బండి సంజయ్ను అరెస్ట్ చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పూర్తిగా కొరవడింది. ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడుతున్నారు. పేపర్ లీకేజీల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సంజయ్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. బండి సంజయ్ను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఇక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్ను ఖండించారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించినందుకే అక్రమ అరెస్ట్లు. టెన్త్ పేపర్ లీకేజీలో తప్పు ఎక్కడుందో తేల్చాలి. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సంజయ్ను అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడుతాం. పోలీసులు చట్టపరంగా వ్యవహరించాలి. తాటాకు చప్పుళ్లకు మేం భయపడం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డికి మరో గౌరవం దక్కింది. రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో ఆయన చోటు దక్కించుకున్నారు. అయితే, రాజ్యసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉండే ఈ రెండు కమిటీల్లో ఇద్దరు తెలుగు ఎంపీలకు అవకాశం దక్కింది. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో డాక్టర్ కె.లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు. -
తెలంగాణలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
-
కోమటిరెడ్డికి అదిరిపోయే కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదనే కామెంట్స్పై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా స్పందించి పొలిటికల్ కౌంటర్ ఇస్తున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కాగా, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాదు. వారు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో ఉండి బీజేపీని గెలిపించమని.. బీజేపీలో కాంగ్రెస్ను గెలిపించమని వ్యాఖ్యలు చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ కూడా స్పందించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో హంగ్ వచ్చే ఛాన్స్ లేదు. బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్లు పొత్తుల కోసం చూస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయింది. ఎవరైనా గెలుస్తామని చెప్తారు. కానీ, కాంగ్రెస్ ఓడిపోతామని చెబుతున్నారు. ఓడిపోతామని తెలిసి కూడా యాత్ర ఎందుకు చేస్తున్నారు?. ఎన్నికలకు ముందు ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేదు. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. అందుకే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలుస్తుంది. కేసీఆర్ ఇంకా.. ఈటల రాజేందర్ తన మనిషే అనుకుంటున్నారు. కాంగ్రెస్లో గెలిచిన వారు బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్కి ఓటు వేస్తే బీఆర్ఎస్లోకి వెళ్తారని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తాయి. వీళ్లందరూ దండుపాళ్యం బ్యాచ్ అని సంచలన కామెంట్స్ చేశారు.’ అని అన్నారు. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారు.. కాంగ్రెస్ వెంటిలేటర్పై ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కలలు కనేది.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తుంది. కుటుంబ పాలన, అవినీతి పాలన, రైతుల వ్యతిరేక పాలన నిరుద్యోగ వ్యతిరేక పాలన బీఆర్ఎస్ ప్రభుత్వానిది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో పోటీచేసి ఘన విజయం సాధిస్తుంది. -
‘కౌంటింగ్లో ఇంత గోప్యత ఎందుకు.. మునుగోడులో ఏం జరుగుతోంది?’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ ఆలస్యంపై టీఆర్ఎస్, బీజేపీ విమర్శలకు దిగుతున్నాయి. కౌంటింగ్లో ఇంత గోప్యత ఎందుకు అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఈవో వైఖరి ఏకపక్షంగా ఉందన్నారు. ఒకేసారి 4 రౌండ్లు ఎందుకు అప్డేట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఈసీవో పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చదవండి: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్ బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్ డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల మొదటి రోజు నుండి కౌంటింగ్ దాకా సీఈవో పనితీరు అనుమానాస్పదమేనన్నారు. పోలింగ్ రోజు టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో మకాం వేస్తే.. ఎవరూ లేరని సీఈవో చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి?: రఘునందన్రావు ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి? అని ప్రశ్నించారు. -
‘కేటీఆర్.. ఆర్ఎస్ఎస్ ముందు మీరెంత, మీ స్థాయి ఎంత?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ పీక్ స్టేజ్కు చేరుకుంది. రెండు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో, మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. మంత్రి కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నువ్వు మోహన్ భగవత్ కాలిగోటికి కూడా సరిపోవు. భగవత్ సాహసాలకు కేసీఆర్, ఆయన కుటుంబం ఏమాత్రం సరితూగరు. ఆర్ఎస్ఎస్ ముందు మీరెంత.. మీ స్థాయి ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకు ముందు మంత్రి కేటీఆర్.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ భగవత్ ఎవరూ అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. ఆయన ఎప్పుడైనా కౌన్సిలర్ గానైనా గెలిచారా అంటూ వ్యాఖ్యలు చేశారు. మోహన్ భగవత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. ముస్లింలను వేరు చేసే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. -
తెలంగాణలో ఒంటరి పోరే అంటున్న కమలదళం
-
విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆ విషయం పార్టీ నేతలనే అడగండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం నన్ను నిశ్శబ్దంలో ఉంచిందన్నారు. ఈ మేరకు విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో మాట్లాడటానికి నాకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగండి. నేను అసంతృప్తిగా ఉన్నానో లేనో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి. నేను ఈ రోజు సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుదాం అనుకున్నా. లక్ష్మణ్ వచ్చి మాట్లాడారు వెళ్లిపోయారు. నాకేం అర్థం కాలేదు. నా సేవలను ఏవిధంగా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్కే తెలియాలి. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని విజయశాంతి అన్నారు. చదవండి: (ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్) -
ఈ గౌరవం ప్రతీ కార్యకర్తది
ముషీరాబాద్: రాజ్యసభ సభ్యుడిగా తనను నియమించడం ప్రతి కార్యకర్తకూ దక్కిన గౌరవంగా భావిస్తానని, కార్యకర్తలను గౌరవించే సంస్కృతి బీజేపీలోనే ఉందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. నామినేషన్ వేయడానికి ఉత్తరప్రదేశ్లోని లక్నోకు బయలుదేరి వెళ్లేముందు మంగళవారం తెల్లవారుజామున ఆశోక్నగర్లోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి లక్నో బయలుదేరి రావాలని, రాజ్యసభ సభ్యుడిగా పార్టీ మిమ్మల్ని నియమించిందని చెప్పడంతో తాను మొదట ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. తన మీద నమ్మకం ఉంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, అధ్యక్షుడు జె.పి.నడ్డా, కార్యదర్శి సంతోష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ప్రాతినిధ్యం వహించే రాష్ట్రం నుంచి ఒక తెలుగువాడికి అవకాశం దక్కడం ఇదే మొదటిసారని ఆనందం వ్యక్తం చేశారు. ఎటువంటి రాజకీయ నేపధ్యం లేని కుటుం బం నుంచి వచ్చిన తనకు ఇంతటి అవకాశాలు కల్పించడం కార్యకర్తలందరికీ దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తన పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచిన విధంగానే పార్టీ గౌరవాన్ని పెంచుతానన్నారు. తెలంగాణను, రాజకీయ భిక్ష పెట్టిన ముషీరాబాద్ ప్రజలను, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎప్పటికీ మరచిపోనని తెలిపారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. లక్నోలో నామినేషన్ దాఖలు సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మంగళవారం రాజ్యసభ అభ్యర్థిగా లక్నోలో నామినేషనల్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్, సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఉత్తరప్రదేశ్లోని 11 రాజ్యసభ సీట్లకు నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారమే గడువు. దీంతో లక్ష్మణ్సహా 8 మంది బీజేపీ అభ్యర్థులు లక్ష్మీకాంత్ వాజ్పేయి, మిథిలేశ్ కుమార్, రాధామోహన్ దాస్ అగర్వాల్, సురేంద్ర సింగ్ నాగర్, బాబూరామ్ నిషాద్, దర్శన సింగ్, సంగీత యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎనిమిది మంది ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి. -
మోదీని ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్నారు: బీజేపీ లక్ష్మణ్
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీఆర్ఎస్తో ఎన్నికల వ్యూహకర్త చర్చలు జరపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్ష్మణ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని మోదీని మూడో సారి అధికారంలోకి రానివ్వకూడదని పీకే(ప్రశాంత్ కిషోర్) లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు టీఆర్ఎస్ బి టీం. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలవి చీకటి ఒప్పందాలు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎన్ని పార్టీలు ఏకమైన ప్రధాని మోదీని ఏమీ చేయలేరు. మూడో సారి కూడా దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్యేతర ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నించారు. పీకేతో భేటీ తర్వాత కాంగ్రెస్తో కలిసి పనిచేసేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. పీకే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్తో కేసీఆర్ పనిచేయబోతున్నారు. పీకే, కేసీఆర్ వ్యూహాలు తెలంగాణలో పనిచేయవు. తెలంగాణ ప్రజలు నమ్మరు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయి. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. టీఆర్ఎస్కు ఎవరు ప్రత్యర్థి అనే విషయం ప్రజలకు తేలియదా..? బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కేటీఆర్ ఓర్వలేకపోతున్నారు.’’ అని అన్నారు. ఇది కూడా చదవండి: కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్..! : ఆర్ఎస్పీ -
5 రాష్ట్రాల ఫలితాలతో కేసీఆర్ కుంగుబాటు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వెలువడిన ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ భయపడిపోయారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అందుకే అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారని విమర్శించారు. మోదీ సర్కార్పై విమర్శలకు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకున్నారన్నారు. బుధవారం పార్టీ నాయకులు జయశ్రీ,, కొల్లి మాధవి, జె.సంగప్ప, ఎన్వీ సుభాష్లతో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ సమావేశాలుగా సాగాయని మండిపడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని అసెంబ్లీలో మరోసారి స్పష్టమైందన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా బీజేపీపైనే విమర్శలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పూర్తిగా కబ్జా చేయడంతో రాష్ట్రం నుంచి ఆ పార్టీ కనుమరుగు కానుందన్నారు. -
చారిత్రక.. అభివృద్ధి కారక బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ చారిత్రక.. అభివృద్ధి కారక.. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. తాయిలాలతో ఎన్నికల బడ్జెట్ ఉంటుందని విశ్లేషకులు చెబుతూ వచ్చారని, అందరి అంచనాలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ పటాపంచలు చేసిందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో హైప్ కోసమే బడ్జెట్ ప్రవేశ పెడతారని.. అంతా డొల్ల అని వ్యాఖ్యానించారు. ఎన్నికల విశ్లేషకుడు పీకే డైరెక్షన్లో బడ్జెట్ ప్రసంగం ముగియక ముందే స్క్రిప్ట్ తయారు చేసుకుని సీఎం కేసీఆర్ కూనిరాగాలు తీశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాదిరిగా ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించి బీజేపీ మోసం చేయదన్నారు. పన్నుల భారం పడకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టారని, పన్నులను పెంచకుండా రూ.5 లక్షల కోట్లకు పైగా అదనపు బడ్జెట్ పెట్టడం విశేష మన్నారు. -
41–ఎ దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: నేర విచారణ చట్టం (సీఆర్పీసీ) సెక్షన్ 41–ఎను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టుల న్యాయవాదుల సంఘం సహాయ కార్యదర్శి జక్కుల లక్ష్మణ్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ (నల్సా)ను ఆదేశించారు. స్పందించిన నల్సా..లక్ష్మణ్ లేఖపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థను సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పి.నవీన్రావు నేతృత్వంలోని సంస్థ త్వరలోనే సమావేశమై తగిన నిర్ణయం తీసుకోనుంది. ‘కొన్నేళ్లుగా నేను కేంద్ర ప్రభుత్వంతోపాటు పలుమార్లు సుప్రీంకోర్టుకు లేఖ రాసినా స్పందన లేదు. 41–ఎను అడ్డుపెట్టుకొని పోలీసులు నిందితులను వేధిస్తున్నారు. లంచం ఇస్తే స్టేషన్లోనే బెయిల్ ఇస్తున్నారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాలను జతచేస్తూ గత ఆగస్టు 26న సీజేఐకి రాసిన లేఖకు ఇంత త్వరగా స్పందన వస్తుందని అనుకోలేదు. సీజేఐకి కృతజ్ఞతలు’అని లక్ష్మణ్ మీడియాతో పేర్కొన్నారు. -
హుజూరాబాద్లో ఈటల గెలుపు ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమైందని, మెజారిటీ ఎంత వస్తుందన్న దే ఇప్పుడు తేలాల్సి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ జాతీయ పదాధికారుల సమావేశంలో ఆయనతోపాటు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పులు ఖాయమని జోస్యం చెప్పారు. ఓబీసీల సంక్షే మం కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఈ నెల 22న ఢిల్లీలో ఓబీసీ మేధావుల సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మణ్ వివరించారు. -
‘బుల్లెట్టు బండి’ పాట సరికొత్త రికార్డ్
వెబ్ ప్రత్యేకం: తెలంగాణ యాసలో ఓ అమ్మాయి పెళ్లిపై పెట్టుకున్న ఆశలను ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే పాట కళ్లకు కట్టేలా ఉంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాట లేనిది ఏ వేడుక కూడా జరగడం లేదు. తాజాగా ఈ పాట యూట్యూబ్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా వంద మిలియన్ల క్లబ్లో చేరిపోయింది. అత్యధిక వ్యూస్ పొందిన జానపద పాటగా నిలిచింది. చదవండి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో ఎస్కే బాజి సంగీతం అందించిన ఈ పాట ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్లో విడుదలైంది. ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లేందుకు ఎలాంటి ఆశలు.. ఊసులు పెంచుకుని ఉంటుందో ఈ పాటలో ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆడవారినే కాక పురుషులను కూడా ఈ పాట ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్తో మరింత వైరల్గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పాట తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఉండే ప్రతి చోటకు వెళ్లింది. తాజాగా ఆ పాట వంద మిలియన్ల క్లబ్లో చేరింది. పది కోట్ల మందికి పైగా ఆ పాటను విని ఎంజాయ్ చేశారు. ఇది ఒక్క యూట్యూబ్లోనే. మిగతా సోషల్ మీడియాలను పరిగణనలోకి తీసుకుంటే వ్యూస్ భారీగా ఉంటాయి. వంద మిలియన్లు దాటడంపై గాయని మోహన భోగరాజు స్పందిస్తూ.. ‘నా తొలి పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని పోస్టు చేసింది. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు -
‘సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణం’
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. అమరుల ఆత్మకు శాంతి కలిగేలా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఐఎంకు మద్దతిచ్చే పార్టీలకు మనుగడ ఉండదన్నారు. -
బీసీల హక్కులు కాలరాసే ప్రభుత్వాలపై ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాదిరిగా రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు పనిచేయాలని కోరుతున్నామన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ముస్లింలను ఓబీసీ జాబితాల్లో చేర్పించి బీసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలపై ఆయా రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చా పెద్దఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలోని ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ సంగమ్లాల్ గుప్తా నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కపిల్, ధోని, గవాస్కర్లతో వాళ్లను పోల్చకండి..
హైదరాబాద్: టీమిండియా యువ ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజాలతో పోల్చకండని విజ్ఞప్తి చేశాడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్. భారత ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యాను కపిల్తో పోలుస్తూ.. విశ్లేషకులు చేసే రచ్చను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. చరిత్రలో ఒకే కపిల్, ఒకే ధోని, ఒకే గవాస్కర్ ఉంటారని, అలాంటి దిగ్గజాలను యువ ఆటగాళ్లను పోల్చడం వల్ల యువకులపై ఒత్తిడి పెరిగిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. కపిల్, తన జమానాలో వికెట్లు తీస్తూ... భారీగా పరుగుల చేస్తూ నిఖార్సైన ఆల్రౌండర్ పాత్రను పోషించాడని... ఈ జనరేషన్లో హార్ధిక్ కూడా అసలుసిసలైన ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేయగల సమర్ధుడని అంటూనే ఇద్దరిని పోల్చడం సరికాదని పేర్కొన్నాడు. కపిల్ క్రికెట్ ఆడిన రోజుల్లో ప్రస్తుతం ఉన్నంత పని భారం ఉండేది కాదని, ఆ పని భారం కారణంగానే నేటి తరంలో అసలుసిసలైన ఆల్రౌండర్లు తయారు కాలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కపిల్ మేటి ఆల్రౌండర్గా కొనసాగాడని, ప్రస్తుత తరంలో ఆల్రౌండర్గా కొనసాగడం చాలా కష్టమని ఆయన వెల్లడించాడు. భారత జట్టు మూడు ఫార్మాట్లలో నిర్విరామంగా క్రికెట్ ఆడటాన్ని ఆయన తప్పుపట్టాడు. అత్యుత్తమ ఆల్రౌండర్గా ఎదిగే శక్తి సామర్థ్యాలున్న ఓ ఆటగాడు గాయంబారిన పడటంతో అతడు బ్యాటింగ్ లేదా బౌలింగ్ మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చిందని హార్ధిక్పై పరోక్ష వ్యాఖ్యలు చేరాడు. ఈ ఏడాది చివర్లో భారత్లో నిర్వహించే టీ20 ప్రపంచకప్లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా రిషబ్ పంత్ను ఆడించాలని ఆయన సూచించాడు. సంజూ సామ్సన్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు కీపింగ్ చేస్తూ ఎంత బాగా ఆడినా ప్రపంచకప్లో మాత్రం పంత్నే ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: ఒక్క ఓవర్ పొదుపుగా బౌల్ చేయాల్సింది.. కేకేఆర్ ఓటమికి నేనే కారణం -
‘అసలు ప్రగతిని డిసెంబర్ 4న చూపిస్తారు’
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ విడుదల చేసిన ప్రగతి నివేదికను ప్రచార నివేదికగా అభివర్ణించారు. ఆ నివేదికలో గతకుల రోడ్లు, డంపింగ్ యార్డులు లేవని ఎద్దేవా చేశారు.(చదవండి: జనం లేని సేన.. జనసేన: నిరంజన్రెడ్డి) ‘‘ కేసీఆర్, కేటీఆర్ పడవలు తిప్పిన బొమ్మలు. బోల్తాపడ్డ కార్లు, ఫుడ్ బోర్డు ప్రయాణం బొమ్మలు లేవు. 2600 బస్తీలు నీట మునిగాయి. హైదరాబాద్కే 2600 చెరువులు తీసుకుని వచ్చిన ఖ్యాతి హరీశ్రావుది. కల్వకుంట్ల కుటుంబ ప్రగతి తప్పితే ప్రజల ప్రగతి లేదు. అసలు ప్రగతిని డిసెంబర్ 4న ప్రజలు చూపిస్తారు. హైదరాబాద్ ప్రజలు పన్నులు కడితే మీరు గతుకుల రోడ్లు, పడవలు ఇస్తున్నారు. విశ్వనగరాన్ని భ్రష్టు పట్టించారని’’ లక్ష్మణ్ దుయ్యబట్టారు. (చదవండి:టీఆర్ఎస్ భయపడుతుంది: బండి సంజయ్) డ్రగ్ మాఫియాను కట్టడి లేదు. మద్యం అమ్మకాలకు అర్ధరాత్రి వరకు అనుమతులిచ్చారు డ్రగ్ కల్చర్తో అనేక మంది అమ్మాయిలు బలవుతున్నారు. ప్రజారవాణాను నిర్వీర్యం చేశారు. కార్మికులు ఆతహత్యలు చేసుకున్నా పట్టడం లేదు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితి గా మార్చారు. నగరంలో యువత ఉపాధి ని నిర్వీర్యం చేశారు. చార్జిషీట్లో టీఆర్ఎస్ అవినీతి ని బట్టబయలు చేస్తామని’’ తెలిపారు. రానున్న రోజుల్లో అనేక మంది ప్రముఖులు, ఉద్యమకారులను బీజేపీ గొడుగు కిందకు తెస్తామని పేర్కొన్నారు. ‘టీఆర్ఎస్లో కేకే అధ్యక్షుడు అవుతాడా.. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతావా’ అంటూ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
పవన్ కల్యాణ్తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ
-
లక్ష్మణ్కు అమిత్షా శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కె. లక్ష్మణ్కు హోంమంత్రి అమిత్షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలను అణగదొక్కిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 90వేల మంది బీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ బీసీల కోసం అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారికి అవి అందకుండా చేస్తోందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దీనికోసం ఓబీసీ మోర్చా కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కనీసం ప్రగతి భవన్ కూడా దాటని సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి బీసీలు అండగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఎదిగినట్టు తెలిపారు. బీజేపీ తెలంగాణపై దృష్టి సారించింది.. బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ నుంచి ఇద్దరికి పార్టీలో కీలక పదవులు ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, వారిని గద్దె దించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. -
మీ నిర్లక్ష్యం... ప్రజలకు ప్రాణసంకటం
రాజు నిరంకుశుడైతే ప్రజలు ఎంత దీన స్థితిలో జీవించాల్సి వస్తుందో కేసీఆర్ను చూసి తెలుసుకోవచ్చు. మహాభారతంలో శకునికి మంత్రి కణికుడు కొన్ని రాజధర్మాలు చెప్పాడు. వాటిని ‘కణిక రాజనీతి’ అంటారు. దుర్మార్గు డైన రాజు తన పరిపాలన కన్నా తనను వ్యతి రేకించేవారి ఆనుపానులు పసిగట్టి పాలించ డమే గొప్పగా భావిస్తాడని కణికుడు చెప్తాడు. ఇలాంటి ‘కణికరాజనీతి’ని అమలు చేస్తున్న కేసీఆర్ నిర్లక్ష్య పాలన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. మొదటి నుండి కరోనా టెస్టులు, కేసులు తక్కువగా చేస్తూ, చూపిస్తూ లాక్డౌన్ సమయం గడిపేసిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. లాక్డౌన్ తర్వాత ఎలాంటి వ్యూహం లేకుండా ప్రజలను గాలికి వదిలేశారు. హైదరా బాద్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రం అయ్యింది. ప్రజలే స్వచ్ఛందంగా తమకుతామే ‘లాక్డౌన్’ విధించు కునే స్థితి వచ్చింది. చేసిన కొద్ది మాత్రం టెస్టులకే రోజూ వస్తోన్న పాజిటివ్ కేసులు 2 వేల వరకు ఉంటున్నాయి. మరణాల సంఖ్య విప రీతంగా పెరుగుతున్నది. గాంధీలో వైద్యం సరిగ్గా అందక వీడియోలు పెట్టి మరీ చచ్చిపోతున్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల దారుణ మైన బిల్లులకు, నిర్లక్ష్య చికిత్సలకు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఓ దశలో గవర్నరే స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కొత్త సచి వాలయ నిర్మాణం కోసం ఆగమేఘాలపై చర్యలు చేపట్టారు. రూ. 500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా చేసేందుకు ఉన్న సచివాలయం కూలగొట్టే పనికి కేసీఆర్ పూనుకొన్నాడు. మరోవైపు చికిత్స కోసం లక్షల రూపాయలు చికిత్స కోసం చెల్లించలేక పేద, మధ్యతరగతి వర్గాలు తమ ఆస్తులు అమ్ముకొనే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ మాత్రం ఇటు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చరు. అటు కరోనాకు ఉచిత చికిత్స అందిస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ను రాష్ట్రంలో అమలు చేయరు. కేంద్ర ప్రభుత్వం కరోనాపై యుద్ధం చేస్తున్న ఫ్రంట్లైన్ వారి యర్స్కు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యా చేపట్టడం లేదు. ఎందరో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, జర్నలిస్టులు కరోనా బారినపడి చస్తున్నా కేసీఆర్కు చీమకుట్టినట్టయినా లేదు. ఆరేళ్ల నుండి విద్య, వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన ఈ ప్రభుత్వం పనితనంలోని ‘డొల్లతనం’ ఇప్పుడు బయటపడుతున్నది. ప్రైవేటు స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు, కాలేజీ లెక్చరర్లు గత నాలుగు నెలల నుండి జీతాల్లేక వ్యవసాయ పొలాల్లో, ఉపాధిహామీ పథకంలో కూలీలుగా, అడ్డా కూలీలుగా మారడం ఈ రాష్ట్ర దుస్థితి తెలియజేస్తున్నది. కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలు మాత్రం ఇలాంటి దుర్భర ఆర్థిక పరిస్థితిలో కూడా ఆన్లైన్ క్లాసుల పేరిట తల్లిదండ్రుల నుండి వేలకు వేలు గుంజుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన వర్షానికే హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా లోని పట్టణాలు, గ్రామాల్లో లింక్ రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. మరోవైపు ‘భూప్రక్షాళన’ పేరుతో రైతుల భూములు కిందామీద అయి పోయి అక్కడ పెద్ద అవినీతి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రెవెన్యూ ఆఫీసుల ముందే రైతులు పురుగులమందు తాగడం, బైఠా యించడం రోజుకో జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఈ రాష్ట్రంలో ఓ ఎంపీ ప్రెస్మీట్ పెట్టే స్వేచ్ఛ కూడా లేదు. ఇటీవల మా ఎంపీ ధర్మపురి అర్వింద్పై జరిగిన దాడే ఉదాహరణ. రాష్ట్ర సాధనకు పోరాడిన ఉద్యో గుల పట్ల సీఎం కేసీఆర్ ఉదాసీన వైఖరి వాళ్లలో తీవ్ర అసంతృప్తికి కారణం అవుతున్నది. రాష్ట్రంలో అప్పుల భారం పెంచేసి వైపరీత్యా లను ఎదుర్కొనే స్థితి కూడా లేకుండా చేయడం సీఎం అసమర్థ పాల నకు నిదర్శనం. ఈ పాపాలన్నీ మీ అధికారాన్ని దగ్ధం చేయడంతో పాటు అహంకారాన్ని ధ్వంసం చేస్తాయ్, జాగ్రత్త! వ్యాసకర్త డాక్టర్ కె. లక్ష్మణ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు -
'సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు.. అందుకే'
సాక్షి, హైదరాబాద్ : ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి వివరిద్దామంటే ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదు.. అందుకే లేఖలు రాయాలని నిర్ణయించినట్లు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్దంతి సందర్భంగా లక్ష్మణ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' కశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి శ్యాం ప్రసాద్ ముఖర్జీ. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ క్లిష్టమైన ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ను దేశంలో విలీనం చేశారు. అలాగే కరోనా మహమ్మారిని ప్రధాని మోదీ విజయవంతంగా ఎదుర్కొని ముందుకెళ్తున్నారు. (‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’) తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక నియంతలా పాలిస్తున్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారింది. విపక్ష పార్టీలు చెప్పే సూచనలను పెడచెవిన పెడుతున్నారు. కరోనా గురించి మాట్లాడితే అధికార పక్షం ఎదురు దాడి చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆఖరికి శవాల విషయం కూడా గందరగోళం నెలకొంది. ఈ విషయమై నేను సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తాను. దీన్ని ఒక విమర్శలా కాకుండా.. మంచి పద్దతిలో స్వీకరించాలి. ప్రభుత్వం చేస్తున్న కరోనా పరీక్షల్లో ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వస్తోంది. లాక్డౌన్ సమయంలోనే ఎక్కువ టెస్టులు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది' అంటూ పేర్కొన్నారు. -
సీఎంను కలుస్తామంటే అరెస్టులా..?
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించిన బీజేపీ ప్రతినిధి బృందాన్ని శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితులను వివరించడానికి బీజేపీ నేతలు అపాయింట్మెంట్ కోరారు. అయితే సీఎంను కలవడానికి అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో బీజేపీ నేతృత్వంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్లతో కూడిన బృందం నేరుగా ప్రగతి భవన్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించి బీజేపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తుగా ప్రగతి భవన్కు వెళ్లే అన్ని దారుల్లోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. హౌస్ అరెస్ట్లపై బీజేపీ నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎంను కలుస్తామంటే అనుమతివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం దారుణం. రాష్ట్రంలో పాలన ఉందా..? అంటూ ప్రశ్నించారు. కరోనా పరీక్షలు దేశంలోనే అత్యల్పంగా తెలంగాణలో జరగడం దారుణం. గాంధీలో కరోనా రోగులకు కనీస వసతులు కూడా లేవు. గాంధీ వెళ్లే కంటే స్మశానానికి వెళ్లడం మంచిదనే భావన కలుగుతోంది. చనిపోయిన శవాలను కూడా సరిగా ఇవ్వడం లేదంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం పరిపాటిగా మారింది. తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా..? ఆర్టికల్ 370 లాంటిది తెలంగాణలో అమలు జరుగుతోందా..? అంటూ మండిపడ్డారు. చదవండి: వారిని స్వదేశానికి తీసుకురండి డెత్ రేట్ దేశ సగటుకంటే తెలంగాణలో అధికంగా ఉంది. గచ్చిబౌలి టిమ్స్ ఏమైంది. ప్రస్తుతం అందులో పిల్లలు క్రికెట ఆడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలను పెంచి పేదల నడ్డి విరుస్తున్నారు. విద్యుత్ చార్జీలను రద్దు చేసి ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖ రాశాము. ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపించాలని లేఖలో కోరాము. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ' బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. చదవండి: గాంధీలో మళ్లీ అదే సీన్ -
జేబుల్లోకి రావట్లేదన్న బాధతో కేసీఆర్ విమర్శలు
సాక్షి, హైదరాబాద్: ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద మోదీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలోని డబ్బులు నేరుగా తన జేబులోకి రావట్లేదన్న దుగ్దతోనే సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కనీసం సెక్రటేరియట్కు రాకుండా, మంత్రులు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండకుండా, నియంతృత్వంతో వ్యవహరిస్తున్న కేసీఆర్ సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. -
‘ఆరేళ్లుగా వారి ఆవేదన అరణ్య రోదనగా మిగిలింది’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో వయసుతో సంబంధం లేకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన దుస్థితి తలెత్తిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో కట్టప్పలు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలని.. వారు తలుచుకుంటే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని పిలుపునిచ్చారు. బుధవారం లక్ష్మణ్ మీడియా ముందు మాట్లాడుతూ.. కేసీఆర్ బాహుబలి అయితే.. కేసీఆర్కు మించిన బ్రహ్మస్త్రం మోదీని ప్రయోగిస్తామని.. తెలంగాణ ప్రభుత్వ పునాదులు కదిలిస్తామని సవాల్ విసిరారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ భజనతోనే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో రాళ్లదాడులు చేసిన వారు ఇప్పుడు కేబినెట్లో ఉన్నారని, హాకి స్టిక్కులు పట్టుకుని పరిగెత్తించే ప్రయత్నం చేసిన వారు కూడా ప్రభుత్వంలో చేరిపోయారని దుయ్యబట్టారు. (ముస్లింలకు స్వేచ్ఛ భారత్లోనే..) తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసినా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్, హరీష్రావును తరిమేస్తుంటే ఉద్యోగులు అడ్డుపడ్డారని, ఆరేళ్లుగా ఉద్యోగులు ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబంగా ఎదుగుతుందని లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రశ్నించినా సస్పెండ్లు చేయడం.. ఏసీబీ దాడులు చేయించి జైళ్లకు పంపడం కామన్గా మారిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తే ఉద్యోగ సంఘాల నేతలను, ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధ్యత ప్రభుత్వానిదేనని, అవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. (ఎంఐఎంను ఎందుకు కట్టడి చేయట్లేదు?) ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిందని, రాష్ట్రపతి నివేదిక కోరిన తర్వాత చేసిన తప్పులను దిద్దులకునే ప్రయత్నం చేసిందని అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ సాధించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఉద్యోగులు ముఖ్యమంత్రిని నమ్ముతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు డీఎస్సీ వేయలేదని, పరీక్షలు రాసిన వారికి నియామక పత్రాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో 21 శాతం ఐఆర్ ఇచ్చిందని, ఉద్యోగ నిమామకాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని ప్రస్తవించారు. తెలంగాణలో మాత్రం ఒక్క నోటిషికేషన్ ఇవ్వలేదని, నేటికి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. వందల కోట్ల తో సచివాలయం.. అసెంబ్లీ నిర్మాణం చేపట్టేందుకు చూస్తున్న కేసీఆర్.. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేక పోతున్నారని ప్రశ్నించారు.గడీల పాలన బద్దలు కొట్టి గరిబీ పాలన తెస్తామని లక్ష్మణ్ తెలిపారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం హాట్ టాపిక్గా మారింది. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు రాబోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు అంటే ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్నే కొనసాగిస్తారా? లేదా అధ్యక్ష పదవి ఆశిస్తున్న బండి సంజయ్కి ఇస్తారా? అన్న చర్చ జోరందుకుంది. దీనిపై లక్ష్మణ్ను వివరణ కోరగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని జాతీయ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు పార్టీకి పూర్తి స్థాయి సమయం వెచ్చించే అవకాశం లక్ష్మణ్కే ఉన్నందున ఆయనకే ఇస్తారన్న చర్చ జరుగుతోంది. సంజయ్కి ఇస్తే ఎంపీగా నియోజకవర్గంపై దృష్టి సారించడం కష్టమవుతుందని, కరీంనగర్లో టీఆర్ఎస్ను, మంత్రులను ఎదుర్కొనే సత్తా ఉన్న నేత జిల్లో లేకుండా పోతారని, పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి సారించే పరిస్థితి ఉండదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ పార్టీ కనుక హిందుత్వ ఎజెండాను మాత్రమే ప్రధానంగా తీసుకుంటే సంజయ్కే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇటు మాజీ మంత్రి డీకే అరుణ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఆమె తన ప్రయత్నాలు ముమ్మ రంచేశారు. ఈ ముగ్గురిలో ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తారన్నది పది రోజుల్లోగా తేలనుంది. మరోవైపు వచ్చే వారం రోజుల్లో 25 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించే అవకాశం ఉందని, ఆ కసరత్తు సాగుతోందని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు -
తెలంగాణ, ఏపీకి బీజేపీ కొత్త అధ్యక్షులు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లకు బీజేపీ కొత్త అధ్యక్షులు రాబోతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు చెప్పారు. ‘తెలంగాణ, ఏపీలో బీజేపీ ద్విగుణీకృతమైన ఉత్సా హంతో ముందుకు సాగే అవకాశం ఉంది. మొన్న జరిగిన తెలంగాణ మున్సి పల్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడమే కాకుండా.. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ లేకుండా పోయింది. ఇక్కడ బీజేపీనే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని స్పష్ట మైన సంకేతాలు వెలువడ్డాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడా తొందరగా మార్పులు వచ్చే అవకాశం ఉంది..’అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసిన అనంతరం విద్యాసాగర్రావు మీడియాతో మాట్లాడారు. సీఏఏతో నష్టం లేకున్నా.. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విద్యాసాగర్రావు అన్నారు. ‘సీఏఏలో ఎలాంటి నష్టదాయక చర్యలు లేకున్నప్పటికీ దానిపై తుపాకీ పెట్టి నరేంద్రమోదీ, బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సీఏఏపై మజ్లిస్, టీఆర్ఎస్ల ఆలోచన ప్రమాదకరమైనది. ప్రతిపక్షాల ఆలోచనలు దేశానికే నష్టం కలిగించేలా ఉన్నాయి. వీటిని అణచాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తాం. ముస్లిం సోదరుల పౌరసత్వం తిరస్కరణకు గురవుతుందన్న ఆలోచన సరికాదు. ఇప్పుడున్న చట్టం ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే హోంశాఖ ఇస్తుంది. నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతికి పౌరసత్వం ఇచ్చాను. అందువల్ల మీ ఆలోచన సరికాదు. జాతి సమైక్యతకు ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ల అవసరం ఎంతో ఉంది. ముస్లిం యువత జాతీయ జెండాలతో బయటకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముస్లిం యువత వందేమాతరం, జనగణమన ఆలపించి కార్యక్రమాన్ని ముగించగలరా..? తెలంగాణలో పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తాం. సెప్టెంబర్ 17కు సంబంధించి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా అమలు చేయాలని నిరసనలు చేపడతాం..’అని వెల్లడించారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు అమలు చేస్తాను..’అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. -
పీఆర్సీ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను వంచించిన కేసీఆర్, ఇప్పుడు ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదా మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తే పీఆర్సీ అంటూ ఉద్యోగులను మభ్య పెడుతున్నారని మండి పడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరేళ్ల పాలనలో ఒక్క గ్రూప్–1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, విద్యార్థులకు స్కాలర్షిప్లు, రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికలు వస్తే మాత్రం రైతులు, ఉద్యోగులు, పీఆర్సీ గుర్తుకు వస్తుందన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల సమయంలో త్వరలోనే పీఆర్సీపై మాట్లాడదామని మభ్యపెట్టారన్నారు. ఉద్యోగ సంఘం నాయకులకు భోజనం పెట్టి, ఉద్యోగుల కడుపు కొట్టారన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని, ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను దగా చేస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా ఉండి సాధారణ ఉద్యోగుల ప్రయోజనాలు పక్కనబెట్టి కొంతమంది ప్రజా ప్రతిని«ధులు, మంత్రులు అయ్యారన్నారు. ఆర్టీసీ విషయంలోనూ ఉద్యోగుల్లో విభేదాలు సృష్టించి ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు ఎప్పుడో ఐఆర్ ఇచ్చారని, తెలంగాణలో మాత్రం దిక్కు లేకుండాపోయిందన్నారు. పీఆర్సీ గడువును మూడుసార్లు పెంచి ఉద్యోగులను ఆవేదనకు గురి చేస్తున్నారన్నారు. పీఆర్సీ గడువు పొడగింపు జీవో 447ను వెంటనే రద్దు చేసి, పీఆర్సీ ప్రకటించాలన్నారు. లేదంటే ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలు బహిర్గతం చేసేందుకే.. టీఆర్ఎస్ మజ్లిస్తో కుమ్మక్కై మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఒవైసీ వద్ద కేసీఆర్ మోకరిల్లి ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారన్నారు. సీఏఏ భారతీయులెవరికీ వ్యతిరేకం కాదన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలను బహిర్గతం చేసేందుకు, సీఏఏకు అనుకూలంగా మార్చి 15న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, అందులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పాల్గొంటారన్నారు. అనంతరం నార్సింగి సహకార సంఘ ఎన్నికల్లో వైస్ చైర్మన్గా గెలిచిన కె.సత్యనారాయణను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, చింతా సాంబమూర్తి, శాంతికుమార్, మోహన్రెడ్డి, ఎన్వీ సుభాష్, సుధాకరశర్మ పాల్గొన్నారు. -
భైంసా బాధితులకు సాయమేదీ?
భైంసా(నిర్మల్)/నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల ఘటనలో నష్టపోయిన బాధితులకు రాష్ట్రం తరఫున ఇప్పటివరకు ఏ సాయం అందలేదని కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం భైంసాకు వచ్చిన ఆయన అల్లర్ల ప్రభావిత ప్రాంతమైన కోర్భగల్లిలో పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు సోయం బాపూరావు, బండి సం జయ్, ధర్మపురి అర్వింద్తోపాటు ఆయన బాధితులను కలిశారు. వారి తో మాట్లాడి సంఘటన, నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనం తరం భైంసాలోని విశ్రాంతి భవనం వద్ద విలేకరులతో మాట్లాడుతూ భైంసా ఘటనలో 101 మంది రూ.2 కోట్ల 33 లక్షల మేరకు నష్టపోయారన్నారు. భైంసా బాధితుల కోసం తన మూడు నెలల వేతనం ఇస్తానని కిషన్రెడ్డి ప్రకటించారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ తరఫున రూ.10 లక్షలు, ఎంపీలు సంజయ్, అర్వింద్ ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించారు. కాగా, కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతు ల్లో తెలంగాణ తల్లి బందీగా మారిందన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్ సమీపంలోని తల్వేద గ్రామశివారులో పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎంఐ ఎంకు వత్తాసు పలుకుతున్న టీఆర్ఎస్పై ప్రజల్లో ద్వేషం పెరుగుతోందని, రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలకు సమాధి కడతారన్నారు. -
రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది కాంగ్రెస్సే
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీనే అని, ఈ విషయంలో బహిరంగ చర్చకు ఉత్తమ్ కుమార్రెడ్డి సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు బీజేపీ చేరువ అవుతుంటే సహించలేక దివాళా కోరు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నిన్నటి వరకు సీఏఏపై కుట్రలు కుతంత్రాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మరో అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. మజ్లిస్ను తలపై పెట్టుకొని కాంగ్రెస్ పార్టీనే పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచిందన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఉత్తమ్ ధర్నా చేస్తారట.. దాని పూర్వా పరాలు ఆయనకు తెలుసా? అని ప్ర శ్నించారు. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు కాంగ్రెస్ మరో కుట్ర చేస్తోందనీ, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్ల మొసలి కన్నీరు, కపట ప్రేమను ఎవరు విశ్వసించరన్నారు. -
ఆసక్తికరంగా కమల రాజకీయం
సాక్షి, ఆదిలాబాద్: ఇక లక్ష్మణ బాణమే మిగిలింది. జిల్లా బీజేపీలో అంతర్గత కలహాల నేపథ్యంలో సుహాసిని రెడ్డి వర్గం జిల్లా అధ్యక్షుడి వ్యవహారాన్ని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడి నేతలు చెప్పిన విషయాలను విన్న ఆయన అటువైపు నుంచి కూడా వివరణ తీసుకొని నిర్ణయం వెళ్లడిస్తామని చెప్పడంతో ఇక మీపైనే భారమంటూ జిల్లా నేతలు తిరుగుబాట పట్టారు. ఇదిలా ఉంటే ఒకవైపు ఓవర్గం నేతలు తనపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర రాజధానికి వెళ్లగా, మరోవైపు పాయల శంకర్ దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీ సోయం బాపురావు, ఇతర నేతలతో కలిసి బీజేపీ ముఖ్యనేతలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏదైన మంత్రాంగం నడిపారా? అనే ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ విషయాలు బయటకు తెలియరాలేదు. జిల్లా నుంచి సుమారు 140 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు కలిసి 25 వాహనాల్లో మంగళవారం ఉదయం హైదరాబాద్కు తరలివెళ్లారు. బీజేపీలో రచ్చ: ఒక్కరి చేతిలో పార్టీ నిర్ణయాలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా బయల్దేరివెళ్లారు. కాగా సాయంత్రం వీరిలో 73 మంది జిల్లా, మండల పదాధికారులు, గాదిగూడ జెడ్పీటీసీ, బజార్హత్నూర్ ఎంపీపీ, పది మంది ఎంపీటీసీలు, ఓ సర్పంచ్, ఉపసర్పంచ్, ఇతర కార్యకర్తలు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. నాంపలి్లలోని బీజేపీ కార్యాలయంలో సాయంత్రం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మోత్కుపల్లి నర్సిములు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్లను జిల్లా నేతలు కలిశారు. ఆదిలాబాద్ జిల్లా పార్టీలో ఒక్కడి చేతిలో నిర్ణయాలు జరుగుతున్నాయని, కోర్ కమిటీ కూర్చోకుండానే బీ–ఫామ్ల కేటాయింపు జరుగుతోందని లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఏక వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ ఆఫీసును నామమాత్రం చేశారని వివరించారు. ఎన్నికల సమయంలో సమష్టి నిర్ణయాలు జరగడం లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలతోపాటు అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఏక వ్యక్తి నిర్ణయాల కారణంగా పార్టీ అనేక చోట్ల ఓటమి పాలైందదని, లేదంటే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చేవని వివరించారు. ఇకనైనా పార్టీని కాపాడాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మంగళవారం ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. ఒకవైపు తనపై రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేసేందుకు జిల్లానేతలు వెళ్లగా మరోవైపు ఆయన ఢిల్లీలో ఏదైన మంత్రాంగం నడిపారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నా అవి బయటకు రాలేదు. బీజేపీలో జరుగుతున్న ఈ రచ్చ ఆసక్తి కలిగిస్తోంది. ఆదిలాబాద్కు వివిధ రైళ్ల పొడిగింపు విషయంలో కేంద్ర మంత్రిని కలిసినా ఢిల్లీలో ఇతర నేతలను కూడా ఆయన కలిశారా.. లేనిపక్షంలో తనపై తిరుగుబాటు చేస్తున్న నేతలకు చెక్ పెట్టేందుకు ఏదైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. -
ఎగువ సభ ఎవరికోసం?
శాసనమండలి నిర్మాణాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని, ఆశయాలను, అధికారాలను పరిశీలిస్తే అది అసలు అవసరమా అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. గత ముప్పది సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అనేక ఉద్యమాలు, కొత్త సామాజిక శక్తులను తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా దళిత ఉద్యమాలు స్త్రీవాద, రైతుకూలీ, వెనుకబడిన కులాల పోరాటాలు రాజకీయ ప్రాతినిధ్యం కోరుతున్నాయి. నిర్మాణపరంగా ప్రస్తుతమున్న శాసనమండలి వీరికి ప్రాతినిధ్యం కల్పించలేదు. ప్రస్తుతమున్న కౌన్సిల్ ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది. షెడ్యూల్డు కులాలు, తెగలవారికి శాసనసభ, లోక్సభలలో సముచిత ప్రాతినిధ్యం కల్పించే నిమిత్తం వారికి రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించారు. శాసనమండలి విషయంలో అలాంటి రిజర్వేషన్లు ఏవీ లేకపోవడంతో వారికి ఎగువసభలో సముచిత ప్రాతినిధ్యం లభించుటలేదు. మొదటి నుండి ఎగువ సభ ఉన్నత వర్గాలవారికి మాత్రమే అందు బాటులో ఉంది తప్ప దళితులకు, బలహీనవర్గాలకు, మహిళలకు కాదన్నది చారిత్రక సత్యం. రాజ్యాంగం ప్రకారం ఎగువసభ సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించింది. మరి ఈ ఆశయం ఏ మేరకు నెరవేరుతున్నట్లు అన్నది ప్రశ్న. ఈ ఆశయం నెరవేరా లంటే చరిత్రలో సుదీర్ఘకాలంపాటు అణచి వేతకు, దోపిడీకి గురైన ఎస్.సి, ఎస్.టి, వెనుకబడిన కులాలు మరియు మహిళలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించి వారికి మండలిలో స్థానం కల్పించాల్సివుంది. గత 70 సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆ దిశలో ఎప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టిన ఉదంతాలులేవు. అలాంటప్పుడు దాని కొనసాగింపు ఎవరికోసం, ఎందుకోసం? అన్నది ప్రశ్న. ఎగువసభల ఏర్పాటు విషయంలో ఉన్న చారిత్రక నేపథ్యాలలో ఒకటి అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఈ సభలను ఏర్పాటుచేసి అందులో సమాజంలో మేధావులుగా గుర్తింపబడ్డ పట్టభద్రులు, ఉపాధ్యాయులతోపాటు సాహిత్యం, కళలు, శాస్త్ర, సాంకేతిక రంగాలు, సాంఘికసేవ మొదలైన రాజకీయేతర రంగాలలో నిష్ణాతులైనవారికి ఇందులో ప్రాతినిధ్యం కలి్పస్తే జాతికి వారి సేవలు ఉపయోగపడతా యని. రాష్ట్ర గవర్నర్ ద్వారా నామనిర్దేశ పద్ధ తిలో భర్తీ అయ్యేవారిలో నిష్ణాతులైన అర్హులకు ఏనాడుకూడా అవకాశం లభించలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీచేయాలనుకునే అభ్యర్థి పట్టభద్రుడే కానవసరం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయుల నియోజకవర్గంలో పోటీచేయాలనుకునే అభ్యర్థి ఉపాధ్యాయుడే కానవసరంలేదు. పోటీకి అందరూ అర్హులే. పోటీకి అర్హులే కానీ వారికి ఓటు హక్కుమాత్రం ఉండదు. ఒక వ్యక్తికి ఓటు హక్కులేకుండా పోటీచేసే హక్కు ఎలా లభిస్తుందో అర్థంకాదు. శాసన నిర్మాణంలో మండలి పాత్ర కేవలం సలహాలివ్వడానికే పరిమితం. ఆ సలహాలను శాసనసభ గౌర వించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. శాసనమండలి తాను ఆమోదించని బిల్లులను చట్టం కాకుండా కేవలం నాలుగు నెలలే జాప్యం చేయగలదు. ఏ బిల్లుకైనా శాసనమండలి ప్రతిపా దించే సవరణలకు సలహాపూర్వకమైన విలువ మాత్రమే ఉంటుంది. ఆర్థిక బిల్లుల విషయంలో ఈ మాత్రం స్వేచ్ఛ, అధికారం కూడా శాసన మండలికి లేదు. అంతేగాక రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు కౌన్సిల్ సభ్యులకు కనీసం ఓటుహక్కు కూడా ఉండదు. అలాంటప్పుడు ఎగువ సభ కొనసాగింపు అవసరమా? అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. గత 70 సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో ఉనికిలోవున్న ఎగువసభల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అవి క్రమంగా ఏ విధంగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా పరిణామం చెందినవో మనకు అర్థం అవుతుంది. ఏ అధికారాలు లేని ఈ ఎగువసభల నిర్వహణకు ప్రజాధనం పెద్దమొత్తంలో దురి్వనియోగం అవుతుంది. క్రమంగా దిగజారుతున్న కౌన్సిల్ ప్రమాణాలను మరియు అది పనిచేస్తున్న తీరుతెన్నులను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాసనసభ ఆ రాష్ట్రంలోని ఎగువసభ రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయం సహేతుకమేకాదు. ముమ్మాటికీ హర్షణీయం.! ప్రొ.జి.లక్ష్మణ్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఓయూ మొబైల్ : 98491 36104 -
కేంద్ర నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్తో తాము చర్చకు సిద్ధమని, కేటీఆర్ అందుకు సిద్ధమా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సవాల్ విసిరారు. బడ్జెట్ ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. టీమిండియా స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం అనేక ప థకాలు, కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి ఇతోధికం గా నిధులు మంజూరు చేస్తున్నా కేటీఆర్ గజినీలా మారి కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం తెచ్చారో చర్చకు రావాలని కేటీఆర్కు ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు మేలుచేసేందుకే: వివిధ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేసే పథకాలు ఆయా రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకే అన్న స్పృహ కేటీఆర్కు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కేటీఆర్ జేబులు నింపేందుకో, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు నొక్కేందుకో బడ్జెట్ ఉం డదని ఆయన గ్రహిస్తే మంచిదన్నారు. భారీ ప్రాజెక్టులు, వాటిపై వ చ్చే కమీషన్లు తప్పితే సంపద సృష్టి, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి లేదన్నారు. కేసీఆర్ మంత్రిగా కొనసాగిన యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం 10 రెట్లు ఎక్కువగా కేంద్ర పన్నులను రాష్ట్రానికి ఇచ్చిందనీ, ప్రత్యేక సహాయం కింద 4 రెట్లు అధికంగా నిధులు అందించిందన్నారు. కాళేశ్వరంపై డీపీఆర్ సమర్పించలేదేం..: విభజన చట్టంలో కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రస్తావనే లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను సమర్పించా లని కేంద్ర ప్రభుత్వం కోరినా ఇంతవరకు ఇవ్వలే దని వెల్లడించారు. డీపీఆర్ను సమర్పిస్తే తమ అవి నీతి అక్రమాలన్నీ బయటపడిపోతాయనేది వారి భయమనీ, రూ.లక్ష కోట్ల పనులకు టెండర్లు పిలవకుండా నామినేషన్లపై నంజుకుని తినేశారని ఆరోపించారు. ఆ కమిషన్లతోనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ నీతి తుక్కుగుడా, నేరేడు చెర్ల, నిజామాబాద్లలో ఎక్కడి పోయిందని లక్ష్మణ్ ప్రశ్నించారు. -
ఇష్టమున్నా.. లేకున్నా.. సీఏఏ అమలు
చార్మినార్/దూద్బౌలి: ఎవరికి ఇష్టమున్నా.. లేకున్నా.. దేశంలో సీఏఏ అమలు తప్పకుండా జరుగుతుందని పలువురు వక్తలు స్పష్టం చేశా రు. ఆర్టికల్ 11 ప్రకారం కేంద్రం చేసిన చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా పాటించాల్సిన అవసరముందన్నారు. సీఏఏ చట్టాన్ని అమలు చేయని రాష్ట్రాలపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించా రు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కావాల ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అఖండ భారత్ సంఘర్ష్ సమితి భాగ్యనగర్ కన్వీనర్ ఆలే భాస్కర్ రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం కుడా స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ, నగర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్రావు, సుప్రీంకోర్టు న్యాయవాది సుభూహీ ఖాన్ తదితరులు పాల్గొని సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. భారత్ మాతాకీ జై.. మోదీ, అమిత్షా జిందాబాద్ అంటూ.. తిరంగా జెండాలు పట్టుకొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే కుడాలో నిర్వహిస్తున్న ఈ సభకు రావాలని.. తామే దారుస్సలాంకు వచ్చి డిబేట్ నిర్వహిస్తామని సవాలు విసిరారు. గతంలో బంగ్లాదేశ్కు చెందిన తస్లీమా నస్రీన్ నగరానికి వచ్చి ప్రెస్క్లబ్లో సమావేశాన్ని నిర్వహిస్తే మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆమెపై విచక్షణారహితంగా దాడులు నిర్వహించారన్నారు. దాడులు చేసిన మజ్లీస్ పార్టీ నాయకులపై ఇప్పటికైనా నగర పోలీసులు కేసులు నమోదు చేసి చార్జ్షీట్ వేయాల్సిన అవసరముందన్నారు. అసదుద్దీన్తో చేతులు కలిపిన సీఎం కేసీఆర్.. సీఏఏను తెలంగాణలో అమలు చేయబోమంటూ ప్రకటిస్తున్నారని, అవసరమైతే అసెంబ్లీలో ప్రకటన చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఎన్నార్సీ, ఎన్పీఆర్ల సందర్భంగా ఇంటికి వచ్చే అధికారులు ఎలాంటి పత్రాలు అడగబోరని.. కేవలం 14 ప్రశ్నలకు జవాబులను మాత్రమే సేకరిస్తారన్నారు. కార్యక్రమంలో హిందూ సంఘటన్ అధ్యక్షుడు కరుణసాగర్, కార్పొరేటర్లు ఆలే లలిత నరేంద్ర, రేణు సోనీల, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సభకు హాజరైన ప్రజలు -
సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా..
ముషీరాబాద్: టీవీల్లో వచ్చే చెత్త సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. సోమవారం ముషీరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సతీమణి కోవ ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అక్షర స్కిల్ డెవలప్మెంట్’సంస్థను లక్ష్మణ్తో కలిసి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాల తో నిండి ఏమాత్రం సామాజిక చైతన్యం లేని టీవీ సీరియళ్లను చూస్తూ మహిళలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, అదే సమయంలో ఆర్థిక చేయూతనిచ్చే నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ తీసుకుని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని మహిళలను కోరారు. మహిళలపై ఉన్న గౌరవంతో ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను, స్ఫూర్తిదాయక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఈ కోవలోదే ‘బేటీ పడావో, బేటీ బచావో’కార్యక్రమమన్నారు. గతంలో మహిళలకు ఉద్యోగాలంటే సూపర్ బజార్లలో, రిసెప్షనిస్టులుగా ఉండేవని కానీ నేడు వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని కొనియాడారు.ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతిలో పెట్టడమనేది సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే పరేడ్కు ఒక మహిళ నేతృత్వం వహించడం గమనార్హమన్నారు. కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధి శేఖర్, అప్సా ప్రతినిధి ప్రవీణ్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి ప్రమోద్, రామానందతీర్థ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. -
హిందూ మత విద్వేషకుల జాబితాలో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) విషం చిమ్మే వారంతా మత విద్వేషకులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీని ఎలా ఢీకొనాలో తెలియక మతాన్ని అడ్డు పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విద్వేషకుల జాబితాలోకి ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా చేరారన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని కాంగ్రెస్ కోరిందని, ఇప్పుడు కేసీఆర్ తీర్మానం చేస్తామని చెబుతున్నారన్నారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని కేసీఆర్ కట్టు కథలు చెబుతున్నారని విమర్శించారు. -
‘సిరిసిల్లకు వెళ్లి చూడు కేటీఆర్’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా వికసించకపోయినా... విస్తరణకు దోహదపడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఫలితాల అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా.. ఒంటరిగా బీజేపీ గణనీయమైన సీట్లు దక్కించుకుందని తెలిపారు. అధికార పార్టీ అనేక అక్రమాలతో పాటు ధన ప్రవాహాన్ని పారించిందని ఆరోపించారు. 3 మున్సిపాలిటీల్లో ఒంటరిగా గెలిచామని, కొన్ని చోట్ల ఎక్కువ స్థానాలు గెలిచామన్నారు. టీఆర్ఎస్కు 30 చోట్ల మెజారిటీ దక్కలేదని, కేటీఆర్ ఇలాకాలో బీజేపీ నాలుగు స్థానాలు గెలిచిందని తెలిపారు. 120 మున్సిపాలిటీల్లో నాలుగైదు చోట్ల మినహా అన్ని చోట్ల బీజేపీకి ప్రాతినిధ్యం లభించిందని అన్నారు. (మున్సిపల్ ఫలితాలు: క్యాంప్లకు తరలింపు ) అదే విధంగా బీజేపీ ఎక్కడ ఉందంటున్న కేటీఆర్ను సిరిసిల్లకు పోయి చూడాలంటూ చురకలంటించారు. ఈ ఫలితాలను ఆదర్శంగా తీసుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరింత కసిగా పోరాడుతామని పేర్కొన్నారు. రెబల్గా పోటీ చేసిన వారిపై చర్యలు తీసుకోని అసమర్థ నాయకత్వం టీఆరెస్ది అని విమర్శించారు. విజయంపై టీఆర్ఎస్కు అంత నమ్మకం అంటే ముందుగా చైర్మన్ అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు రాష్ట్రంలో ధీటైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని, కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. చదవండి: ఈ ఫలితాలు కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టు: ఎంపీ నిజామాబాద్ : మున్సిపాలిటీలన్నీ ఆ పార్టీవే రసవత్తరం.. అక్కడ కమలం, కారు ఢీ..! ఇది ఆలిండియా రికార్డు : కేసీఆర్ -
అసమానతలున్నంత వరకు రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను సవరించి మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీజేపీయేనని వాఖ్యానించారు. మంగళవారం రవీంద్రభారతిలో జాతీయ ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ సెమినార్ ఆఫ్ రిజర్వేషన్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంలో బీజేపీ ముందుంటుందని, దేశానికి రాష్ట్రపతిగా తొలిసారి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని అప్పటి ప్రధాని వాజ్పేయి నిలిపారని గుర్తుచేశారు. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారని, దళిత వ్యక్తిని రాష్ట్రపతిగా చేసింది కూడా బీజేపీ అని తెలిపారు. సమాజంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత కఠినతరం చేసినట్లు చెప్పారు. దళితుల రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించి ప్రధాని మోదీ సాహసం చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్రావు మాట్లాడుతూ దళితులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి లాంటి పథాకాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అట్రాసిటీ కేసులు పెరుగుతున్నాయని, కానీ పోలీసులు నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తూ వారికి పరోక్షంగా సహకరిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు అన్నారు. -
టీఆర్ఎస్కు ఓటేస్తే మజ్లిస్కు పడినట్టే..
సాక్షి, పాలమూరు: మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే.. మజ్లిస్ అభ్యర్థిని చైర్మన్ చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో, భూత్పూర్లో శుక్రవారం బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. హిందూ, మైనార్టీల మధ్య కేసీఆర్ తాకట్లు పెట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు. పౌరసత్వ బిల్లుపై అనవసరపు రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచారని, రైతు బంధు ఆగిపోయిందని, రెండు పడక గదులు పడకేశాయని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే మాట కలగానే మిగిలిందని ఎద్దేవా చేశారు. స్వచ్ఛభారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఇస్తే సొంత పథకాలుగా మార్చి వినియోగించుకుంటున్నారన్నారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే కలెక్టరేట్ మార్పు : డీకే అరుణ మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ ఐదు జిల్లాలకు సరిపోయిన కలెక్టరేట్ను ప్రస్తుతం ఇక్కడి నుంచి మార్చే ప్రయత్నం చేస్తున్నారని దీని వెనుక అసలు కారణం ప్రజాప్రయోజనాలు కాదని అక్కడ ఉన్న నేతల భూముల ధరలు పెంచుకోవడం మాత్రమేనని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాత కలెక్టరేట్ను విద్యా ప్రాంగణంగా మారుస్తామని చెప్పారు. అదేవిధంగా మహబూబ్నగర్ మాజీ ఎంపీ జితేందర్రెడి మాట్లాడుతూ మహబూబ్నగర్ డబుల్ రైల్వే లైన్, పాస్పోర్టు కార్యాలయాలు, ఇతర పనులు అన్ని కేంద్ర నిధులతో జరుగుతున్నట్లు తెలిపారు. పాలమూరు పట్టణంలో చాలా అభివృద్ధి పనులు కేంద్రం నుంచి వచ్చే నిధులతో చేస్తున్నారని, దానిని ఈ ప్రభుత్వం వారి ఖాతాలో వేసుకోవాలని చూస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షురాలు పద్మాజారెడ్డి, పడకుల బాలరాజు, శ్రీనివాస్రెడ్డి, రాజేందర్రెడ్డి,పొడపాటి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
‘ఆ భయంతోనే కేసీఆర్ ప్రచారానికి దూరం’
సాక్షి, హైదరాబాద్ : నల్లధనంతో ఎన్నికలను శాసించే సంస్కృతికి టీఆర్ఎస్ తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం నగరంలో ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటంతోనే కేసీఆర్, కేటీఆర్లు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారని దుయ్యబట్టారు. దొడ్డిదారిన మేయర్,మున్సిపల్ చైర్మన్ పదవులను దక్కించుకోవాలనే కుట్రతో ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లటం లేదని వ్యాఖ్యానించారు. మద్యం,మైనింగ్,ఇసుక మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే అభ్యర్ధులు అమ్ముడు పోతారని, టీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లీస్ కు తాకట్టు పెడతారని మండిపడ్డారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నిధులతో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. -
కేసీఆర్పై మోత్కుపల్లి ఘాటు విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ : కేసీఆర్ పతనం చూడటమే లక్ష్యమని మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఆయన మెదటిసారిగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మోత్కుపల్లి నరసింహులు తీవ్ర విమర్శలు చేశారు. కేసీర్ను ఎనిమిదో నిజాంతో పోల్చారు. ‘కేసీఆర్ను పదవి నుంచి దించేయాలని లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకున్నాను. రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్. కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజలకు బానిసలుగా బతికే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో దళితుల అభివృద్ధే నాకు ముఖ్యం. కేసీఆర్ సీఎం అయ్యాక.. నిరుద్యోగ సమస్య పెరిగింది. ఫీజు రీయింబుర్స్ మెంట్ అమలుచేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను ఆవేదనకు గురిచేస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశానికి కీర్తిప్రతిష్టలు పెరిగాయి. గతంలో 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచినందుకు.. దళితుడిగా గర్విస్తున్నాను’ అని అన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చమరగీతం పాడటామికే మోత్కుపల్లి బీజేపీలో చేరారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ‘రాష్ట్రంలోనే సీనియర్ నాయకుల్లో మోత్కుపల్లి ఒకరు. మోత్కుపల్లి సేవలు తెలంగాణ బీజేపీకి అవసరం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే మా లక్ష్యం. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్కు లేదు. టీఆర్ఎస్ హయాంలో మున్సిపాల్టీలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయి. రాష్ట్రం నిధులతో పాటు.. కేంద్ర నిధులను సైతం గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట మున్సిపాలిటీలకు తరలించారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. మజ్లిస్ కు ఓటు వేసినట్లే. ఎంఐఎం కోసమే ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేశారు.’ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల బిడ్డ మోత్కుపల్లికి బీజేపీ సాదర స్వాగతం పలుకుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యంమని వ్యాఖ్యానించారు. బీజేపీ బలోపేతానికి మోత్కుపల్లి సేవలను ఉపయోగించుకుంటామన్నారు. -
కేసీఆర్ చెప్తే నా పదవికి రాజీనామా చేస్తా: లక్ష్మణ్
సాక్షి, నిజామాబాద్ : ముస్లిం పదం లేదని పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తున్నారంటే పాకిస్తాన్కు వత్తాసు పలుకుతున్నట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రానంతరం ముస్లింలకు ప్రత్యేక దేశాలిచ్చినా.. హిందువుల మీద దాడి మాత్రం ఆపలేదని మండిపడ్డారు. నిజామాబాద్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ హాజరయ్యారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారత్ నుంచి విడిపోయిన ప్రాంతాలు ఇస్లాం దేశాలుగా ఏర్పడితే మనది మాత్రం సెక్యులర్ దేశంగా మిగిలిందన్నారు. తెలంగాణ పేరుతో ఆనాడు ఆంధ్ర ఉద్యోగులు, ప్రజలపై దాడి చేసిన కేసీఆర్.. ఇప్పుడు దేశంలోని హిందువులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆరా లేక ఓవైసీనా అని ప్రశ్నించారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సరైన సమాధానం చెబితే బీజేపీ రాష్ట్ర పదవికి రాజీనామ చేస్తానని ప్రకటించారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే కేసీఆర్కు పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. భద్రాచలంలో రామునికి తలంబ్రాలు ఇవ్వలేని నువ్వు హిందువు ఎలా అవుతావని కేసీఆర్ను నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షాలు కృష్ణార్జుల్లా దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వేతో అరాచకం సృష్టించిన కేసీఆర్.. ఇప్పుడు ఎన్పీఆర్ను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు నిజామాబాద్లో సభ పెడితే హైదరాబాద్లో కేసీఆర్ వణుకుతున్నారని బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ దుయ్యబట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ ముస్లింలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ గడ్డం పీకీ కేసీఆర్కు పెడతా. ఏం పీకుదామని నిజామాబాద్కు వచ్చారో ఓవైసీ చెప్పాలి. కూతురు ఓడిపోయిందన్న బాధలో అసద్ను కేసీఆర్ మాటిమాటికీ నిజామాబాద్ పంపుతున్నారు. కేటీఆర్ అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ బలోపేతం అవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 95 శాతం ఓట్లు వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. జిన్నా కాలం పోయింది గుర్తుంచుకో బీజేపీతో పెట్టుకుంటే ఎంఐఎం చనిపోతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ధర్ అన్నారు. పాకిస్తాన్ భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందని, ఒవైసీ దేశాన్ని ముక్కలు చేయాలని మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జిన్నా కాలం పోయిందని గుర్తుంచుకో ఒవైసీ అంటూ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీఆర్ఎస్, ఎంఐఎం పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. గతంలో ఈ బిల్లును తేవాలని చెప్పిన పార్టీలన్నీ ఇప్పుడు వ్యతిరేకించడం అన్యాయమన్నారు. దేశంలో ఉన్న పాకిస్తానీ, బంగ్లాదేశ్ ముస్లింలను కచ్చితంగా పంపిస్తామని తెలిపారు. బీజేపీ ఉన్నంత వరకు దేశ రక్షణ కోసం పనిచేస్తామని, తెలంగాణలో బీజేపీని గెలిపించాలని సునీల్ కోరారు. -
మున్సిపోల్స్లో సత్తా చూపుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేదని, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం వేరు కాదని ప్రజలు గుర్తించారన్నారు. కాంగ్రెస్ను వెనకేసుకొస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమన్నారు. టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. హైదరాబాద్లో గురువారం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దెబ్బతిన్న సంక్షేమాభివృద్ధి, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనే ప్రధానంగా ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళతామని, అలాగే కేంద్రం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం అంశాలను ప్రజలకు వివరిస్తామన్నారు. టీఆర్ఎస్ ముసుగులో మజ్లిస్ చేస్తున్న పాలనను బీజేపీ మాత్రమే తిప్పికొట్టగలుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. తిరుగులేని శక్తిగా మారుస్తాం... ఉద్యమాలు, పోరాటాల సంవత్సరంగా 2020ని భావిస్తున్నామని, ఈ ఏడాది బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తామని లక్ష్మణ్ తెలిపారు. చాప కింద నీరులా బీజేపీ దూసుకుపోతుంటే కేసీఆర్, కేటీఆర్కు గుబులు పట్టుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ వస్తాయన్నారు. ఎంఐఎం మేలు కోసమే టీఆర్ఎస్ పనిచేస్తుందని, అందుకే పౌరసత్వ సవరణ బిల్ను కూడా వ్యతిరేకించిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకటి అయినందునే టీఆర్ఎస్లోకి వెళ్తున్న తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కాపాడుకోలేకపోయిందన్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈ నెల 7న మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరుతున్నారని లక్ష్మణ్ వెల్లడించారు. -
సీఏఏను అమలు చేసి తీరుతాం
సాక్షి, హైదరాబాద్ : ఎన్ని ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో సోమవారం బీజేపీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు పాల్గొన్నారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక రంగంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం ఏ ఒక్క భారతీయుడికీ వ్యతిరేకం కాదని అన్నారు. రాహుల్ గాంధీ తీరు చదివిస్తే ఉన్న మతి పోయిందన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్, మజ్లీస్, కాంగ్రెస్ మూడు పార్టీలు ఒక్కటేనని.. టీఆర్ఎస్, కాంగ్రెస్లను నడిపించేది ఎంఐఎం పార్టీనేనని మండిపడ్డారు. హోంశాఖ మంత్రిగా ఉన్న మహమూద్ అలీని కేసీఆర్, అసదుద్దీన్ ఇద్దరూ అవమానించారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తగదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్తోపాటు మరికొన్ని పార్టీలు కలిసి హింసకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బీహర్లో నిరసనల సందర్భంగా 280 మంది పోలీసులకు గాయాలయ్యాయని. హింసలో పాల్గొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హింసాత్మక దాడిలో పాల్గొన్న వారి నుంచే నష్ట పరిహారం వసూలు చేస్తామని అన్నారు. ఏ ఒక భారతీయుడికి ఈ చట్టం వ్యతిరేకం కాదని తెలిపారు. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోందని కిషన్రెడ్డి విమర్శించారు. స్వదేశీ శక్తులు, విదేశీ శక్తులు కలిసి మోదీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో కొంతమంది విధ్వంసకారులు పోలీసులపై దాడులకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేస్తూ..పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. -
ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ కోర్ కమిటీ పిలుపునిచ్చింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన కోర్కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కోర్కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు పనిచేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రతి పార్లమెంటు పరిధిలో మున్సిపల్ ఎలక్షన్స్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించింది. అలాగే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమావేశం తప్పుబట్టింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద పెట్టిన కేసులను, పోలీసుల పక్షపాత వైఖరిని సమావేశం ఖండించింది. సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కిషన్రెడ్డి సమక్షంలో పలు పార్టీలకు చెందిన నేతలు ఆదివారం బీజేపీలో చేరారు. -
టీఆర్ఎస్ది ముస్లిం సంతుష్టీకరణే
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లిం అనే పదం లేకపోవడంతోపాటు ఇతర షరతులు ఒప్పుకోకపోవడం వల్లే పార్లమెంట్లో ఈ చట్టాన్ని వ్యతిరేకించినట్లు ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొనడం ముస్లిం సంతుష్టీకరణ తప్పిస్తే మరొకటి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకోవడం నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉందని ఎద్దేవా చేశారు. సవరణ చట్టంలో ముస్లిం అనే పదం లేకపోవడాన్ని ప్రధానంగా పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే దమ్ము టీఆర్ఎస్కు ఉందా? అని ప్రశ్నించారు. శనివారం పౌరసత్వ సవరణ చట్టంపై బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వర్క్షాపులో లక్ష్మణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయాన్ని ముస్లిం కోణంలోనే చూస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో మతహింసను ఎదుర్కోలేక మనదేశం వచ్చిన శరణార్థుల కోసం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొస్తే.. ఇందులోనూ ముస్లిం పదం కోసం పట్టుబట్టడం నిజాం, రజాకార్ పోకడలకు నిదర్శనమని ఆరో పించారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి ఫామ్ హౌస్కే పరిమితమైన సీఎం పట్ల ప్రజల్లో వ్యతిరేకత, ఆగ్రహం పెరిగిపోతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా కేటీఆర్ను సిద్ధం చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ఆయన తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ వార్తను ప్రచారంలో పెడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.. రాజకీయ దురుద్దేశంతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వార్డులలో రిజర్వేషన్ ప్రక్రియను ప్రకటించకుండా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. పంచా యతీ ఎన్నికలలో ఇద్దరు సంతానం నిబంధనలు పెట్టి మున్సిపల్ ఎన్నికలలో ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఇది మైనారిటీ ఓట్ల కోసమా.. ఎన్నికల కోసమా అని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. ఎంఐ ఎం సీఏఏపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, వారి కుట్రలను భగ్నం చేసేందుకు సోమవారం (30న) హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
మూసీని కలుషితం చేశారు: లక్ష్మణ్
లంగర్హౌస్: సమైక్య రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు మూసీని కలుషితం చేశారని దూషించి, ఇప్పుడు రాష్ట్రం సాధించాక వారి వద్ద నుంచి ముడుపుల ప్రవాహాన్ని తెచ్చుకుంటూ ప్రజల ప్రాణాలతో సీఎం కేసీఆర్ చెలగాటాలాడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ‘నమామి మూసీ’ ఉద్యమంలో భాగంగా లంగర్హౌస్ త్రివేణి సంగమాన్ని ఆయన సోమవారం తిలకించారు. వికారాబాద్ అనంతగిరి కొండల నుంచి తెచ్చి న ముచికుందా జలాన్ని త్రివేణి సంగమంలో వదిలి పూజలు చేశారు. ‘మూసీని, ప్రజల ఆరోగ్యాలను కాపాడుకుందాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. కోరితే 70 శాతం నిధులు ఇస్తాం.... ఈ సందర్భంగా ఆలయం ముందు రామ్లీలా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. సబర్మతితో పాటు, గంగా నదిని పూర్తిగా శుద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కోరితే మూసీ ప్రక్షాళన, హుస్సేన్ సాగర్ శుద్ధి కోసం 70 శాతం నిధులను కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, చింతల రాంచంద్రారెడ్డి, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. -
మూసీ నదిని శుద్ధి చేస్తామని ప్రగల్భాలు
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని ప్రక్షాళన చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ముఖ్యమంత్రి కేసీఆర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ సైతం.. మూసీ నదిని సబర్మతి నదిలా శుద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతారే తప్ప, ఆచరణలో కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించరని ఎద్దేవా చేశారు. హైద్రాబాద్కు మంచి నీరందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను కబ్జాలను అడ్డుకోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇక హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రూ. 3వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 3రూపాయలు కూడా ఖర్చు చేయలేదంటూ ఆరోపించారు. 2001లో అప్పటి వాజపేయి ప్రభుత్వం నదుల ప్రక్షాళనకు నిధులను కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టించాయని పేర్కొన్నారు. బాపు ఘాట్ దగ్గర కూడా మూసీ దుర్గంధంగా మారటం బాధాకరమన్నారు. తాగు, సాగునీరు అందించే మూసీ దుర్గంధంగా మారడంతో పాటు నది పరివాహక ప్రాంతంలో పండిన కూరగాయలు సైతం విషతుల్యం అవుతున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. హైద్రాబాద్ను విశ్వనగరంగా మార్చుతామని.. చివరకు విషాద నగరంగా మార్చారంటూ దుయ్యబట్టారు. ముడుపులు తీసుకుని పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను హుస్సేన్ సాగర్లో వదలడంతో డ్రైనేజీ నీరు కలిసి కంపుగా మారిందని తెలిపారు. హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీరుగా మారుస్తామన్న కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయని, సీఎం కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. చదవండి: (మూసీపై ప్రభుత్వం ప్రగల్భాలు) -
మూసీపై ప్రభుత్వం ప్రగల్భాలు
సాక్షి, వికారాబాద్: మూసీ నది ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందే తప్ప, ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన గంగానది ప్రక్షాళన స్ఫూర్తితో మూసీ నది ప్రక్షాళనకు ఉద్యమం ప్రారంభించామని తెలిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని మూసీ జన్మ స్థలం వద్ద శనివారం ప్రత్యేక పూజలు చేసి ‘నమామి మూసీ’పేరిట పోరాటాన్ని ప్రారంభించారు. నదికి హారతి ఇచ్చిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ, మూసీ ప్రవహించే ఐదు జిల్లాల్లో ప్రక్షాళన కార్యక్రమం జరిగే వరకు బీజేపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు. ఇందులో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల మూసీ నది కాలుష్య కాసారంగా మారిందన్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని నదిలోకి వదలడంతో పాటు డ్రైనేజీ నీరు కలిసి కంపుగా మారిందని తెలిపారు. 16న బాపూఘాట్, ఆ తర్వాత సూర్యాపేటలో మూసీ ప్రక్షాళన కోసం ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. శనివారం అనంతగిరిలో పుష్కరిణిలో పూజలు చేస్తున్న లక్ష్మణ్ తదితరులు -
అన్ని రంగాల్లో విఫలమైన కేసీఆర్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రెండోసారి సీఎం అయిన కేసీఆర్ ఏడాది పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎంగా కేసీఆర్ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారని ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల, ఆందోళనల, అవినీతి తెలంగాణగా మార్చారని ఆరోపించారు. మంత్రులే తమ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. -
‘దీక్ష’ ఉద్యమానికి నాంది మాత్రమే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ చేపట్టిన మహిళా సంకల్ప దీక్ష మద్యనిషేధ ఉద్యమానికి నాంది మాత్రమేననీ దీన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మద్యం ప్రభావంతోనే మహిళలపై నేరాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, తెలంగాణలో మద్యాన్ని నిషేధించేవరకు పోరాడతామన్నారు. గురువారం ఇందిరాపార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రెండురోజుల మహిళా సంకల్ప దీక్షకు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్య నియంత్రణ శాఖను, మద్యాన్ని పెంచే శాఖగా మార్చారన్నారు. ‘దిశ’ ఘటన తర్వాత మద్యంపై సర్వత్రా చర్చ సాగుతోందని ఆడపిల్లలపై అకృత్యాలకు మద్యమే ప్రధాన కారణమని భావించి బీజేపీ దీక్ష చేస్తోందన్నారు. ఏపీ సీఎం జగన్ మద్య నియంత్రణపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వాటిని చూసైనా ఇక్కడి ప్రభుత్వం నేర్చు కోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణను సీఎం కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారన్నా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ రాథోడ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్న కుమ్రంభీమ్ జిల్లా ఖానాపూర్కు చెందిన ‘సమత’ కుంటుంబీకులను లక్ష్మణ్ పరామర్శించారు. ‘సమత’పిల్లను చదివించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని, వారు ఎంతవరకు చదివితే అంత వరకు పార్టీ చదివిస్తుందని తెలిపారు. -
నగరం బ్రాందీ హైదరాబాద్గా మారింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష ప్రారంభించారు. రెండురోజులపాటు దీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నియంత్రించి.. దశల వారీగా మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. మద్యం వల్ల బాధితురాలైన వారి కుటుంబసభ్యులు సహా, ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో హత్యాచారానికి గురైన సమత భర్త, అత్త, పిల్లలు కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘ రాజకీయ కారణాలతో దీక్ష చేపట్టలేదు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. తండ్రి కొడుకుల వల్లే బ్రాండ్ హైదరాబాద్ కాస్తా బ్రాందీ హైదరాబాద్గా మారింది. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చేశారు. మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వం రూ. 980 కోట్ల ఆదాయం స్వీకరించింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నా.. మద్యం అమ్మకాలు పెంచుకుంటూపోతున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మద్యం మత్తులో ముంచుతున్నారు. అర్ధరాత్రి మద్యం అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నారు. మద్యం నిషేధించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. పల్లెల్లో బెల్ట్ షాపులను ద్వంసం చేయాలని మహిళా మోర్చా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం’ అని అన్నారు. -
కేసీఆర్ మరో గజినీలా తయారయ్యాడు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన యాదాద్రిలో అపచారాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని, బొట్టు పెట్టుకొని యాగాలు, పూజాలు చేస్తే భక్తునిగా మారలేరని కేసీఆర్ను విమర్శించారు. యాదాద్రిలో దేవుడి కంటే ముందు కేసీఆర్ను దర్శించుకునేందుకు చిత్రాలు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహ స్వామిని ఉల్లితో చెక్కడం దారుణమన్నారు. శిల్పులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు శిల్పాలు చెక్కుతున్నట్లు అధికారులే స్పష్టం చేశారని లక్ష్మణ్ తెలిపారు. ఇక ఆధ్యాత్మికాన్ని అడ్డు పెట్టుకొని యాదాద్రిలో కేసీఆర్ రియల్ ఎస్టేల్ వ్యాపారానికి తెరలేపారని లక్ష్మణ్ ఆరోపించారు. యాదాద్రి అభివృద్ధి కంటే రియల్ ఎస్టేట్పై కేసీఆర్కు మక్కువ ఎక్కువైందని, యాదాద్రిలో ఆయన మహా అపచారానికి పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒక గజినీలా తయారయ్యారని విమర్శించారు. యాదాద్రి జరుగుతున్న అపచారంపై సీఎం వివరణ ఇవ్వాలని డిమండ్ చేశారు. గుడి పునర్నిర్మాణం పేరుతో సినిమా ఆర్ట్ డైరెక్టర్తో అవినీతి పనులు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీడియా స్వేచ్చను హరించిందని, కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ చింతమడకకు కేంద్రం ఎంత నిధులు ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది’ అని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్కు బీజేపీ లక్ష్మణ్ సవాల్ విసిరారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాస్త బ్రాందీ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ వరకు కోవొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దిశా ఘటన నిందితులను ప్రభుత్వం కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి తన ఇంటికి వెళ్లి కనీసం కుటుంబ సభ్యులను పరామర్శించలేదని విమర్శించారు. -
'కేసీఆర్ చర్యల వల్ల రాష్ట్రం దివాలా తీస్తుంది'
సాక్షి, వరంగల్ : మోదీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అశాంతి, అసంతృప్తి నెలకొన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. పోలీసుస్టేషన్లో ఉండాల్సిన పోలీసులు బస్ డిపోలు, రెవెన్యూ కార్యాలయాల ముందు ఉంటున్నారని ఆరోపించారు. బస్సుల్లో తిరగాల్సిన డ్రైవర్, కండక్టర్ చౌరస్తాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికు బలిదానాలతో తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై భుజంపై తుపాకీ పెట్టి ఆర్టీసీ కార్మికులను కాల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రం పూర్తిగా దివాళా తీస్తుందని, సంక్షేమ కార్యక్రమాలు అటకెక్కుతున్నాయని దుయ్యబట్టారు. మీకు దమ్ముంటే ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 41 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోని కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడ వారికి మద్దతు తెలుపుతారో అని భయపడి వారితో చర్చలు జరపడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రసుత్త పరిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఆదివాసీ నేత తాటి కృష్ణ లక్ష్మన్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది రాఫెల్పై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి క్లీన్చిట్ ఇచ్చినట్లు గుర్తుచేశారు. రాహుల్గాంధీ తన కాళ్లకు బలపం కట్టుకొని తిరిగి బీజేపీ నేతలపై బురద జల్లే ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఇప్పటికైనా రాహుల్గాంధీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, తన కుటిల బుద్దిని మానుకోవాలని పేర్కొన్నారు. ఎంతటి జఠిల సమస్యలనైనా మోదీ సామరస్యంగా పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. -
సిద్దిపేటలో బీజేపీ జెండా ఎగరాలి!
సాక్షి, సిద్దిపేట: వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో బీజేపీ జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులో పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ కార్యకర్తల నిజమైన కల భవనం నిర్మాణంతో తీరేది కాదని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే తీరుతుందన్నారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతంలో బీజేపీ జెండా రెపరెపలాడుతోందని, సమీప భవిష్యత్తులోనూ తెలంగాణలో అధికారంలోకి వచ్చి కార్యకర్తల కలను సాకారం చేస్తామన్నారు. సిద్దిపేటలోనూ కాషాయ జెండా రెపరెపలాడాలని, దానికి కార్యకర్తలు పూనుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా గత ఆరేళ్లలో ఉజ్వల యోజన కింద 9 కోట్ల కనెక్షన్లు అందించారని అన్నారు. గత 60 ఏళ్లల్లో గత ప్రభుత్వాలు నిర్మించిన 6.5 మరుగుదొడ్ల నిర్మిస్తే ఈ ఆరేళ్లలో 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారని తెలిపారు. ఏ సిద్ధాంతాన్ని నమ్మి ఇన్ని రోజులుగా కార్యకర్తలు పనిచేస్తున్నారో ఆ సిద్ధాంతాలను ప్రజలు ఆచరించే రోజులు వచ్చినందుకు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. యజ్ఞాలు యాగాలు చేయడంలో తనకు ఎవరూ సాటి రారు అనుకునే వారు రామమందిరం నిర్మాణం విషయంలో నోరు మెదపడం లేదని, కానీ దేశవ్యాప్తంగా అన్ని పార్టీల వారు, వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో 6వ స్థానంలో ఉందని ఇది సిగ్గు చేటని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేసిన పాపం ఏంటి... ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెనే సకల జనుల సమ్మెగా రూపాంతరం చెందిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య పాత్ర పోశించిన కార్మికులు చేసిన పాపం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులను పరిగణించాలని వారికి సమాన జీతాలు ఇవ్వాలని, ప్రభుత్వాల విధానాల వల్లనే ఆర్టీసీ అప్పుల్లో ఉందని విమర్శించిన కేసీఆర్ నేడు సీఎం హోదాలో ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. చినజీయర్ స్వామి చేత అక్షింతలు వేయించుకోవడం కేసీఆర్కు పరిపాటిగా మారిందని, అలాగే హైకోర్టు చేత అక్షింతలు వేయించుకోవడంలో తేడా లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలీసుల ఆంక్షలు, నిర్భందాలతో ఉద్యమాలను ఆపలేరని, వాటికి భయపడి ఉద్యమాలను ఆపేవారు బీజేపీ వారు కాదని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘంకు గౌరవఅధ్యక్షులుగా వ్యవహరించిన హరీశ్రావు వారి సమస్యల పరిష్కారం కోసం ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం కోసం వేసిన పునాదితో సిద్దిపేటలో పార్టీ జెండా ఎగురవేసేందుకు పునాది పడినట్టు కార్యకర్తలు గుర్తించాలని వారికి భరోసానిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాపారావు, కోశాధికారి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్, రామచందర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు గంగాడి మోహన్రెడ్డి, బాలే ష్గౌడ్, శ్రీధర్రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూది శ్రీకాంత్రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అద్యక్షురాలు తోకల ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు. -
ఫీజులు కట్టాలని క్లాస్లో నిలబెడుతుండ్రు
సాక్షి, గజ్వేల్ : ‘సమ్మె కారణంగా మా తల్లిదండ్రులకు జీతాలు రావటం లేదు.. మా స్కూళ్లల్లో ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.. క్లాస్లో అందరి ముందు నిలబెడుతుండ్రు.. మా జీవితాలు ఏమవుతాయోనని భయంగా ఉంది.. మీరే ప్రభుత్వం మీద పోరాటం తీవ్రతరం చేసి మా తల్లిదండ్రుల సమస్యలు పరిష్కారమయ్యేలా చూడండి ప్లీజ్..’ అంటూ ఆర్టీసీ కార్మికుల పిల్లలు మంగళవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద సమ్మెకు మద్దతు పలికేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కార్మికుల పిల్లలు శ్రీవర్ధన్, సాత్విక్, ఆశ్విత్, రక్షిత్రెడ్డి తదితరులు లక్ష్మణ్కు వినతిపత్రం అందజేశారు. సమ్మె వల్ల మా అమ్మానాన్నలు కడుపు నిండా తినడంలేదు.. ఎప్పుడూ చూసినా సమ్మె గురించే ఆలోచిస్తుండ్రు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు తమ బాధను వ్యక్తం చేసిన తీరుపై లక్ష్మణ్ చలించిపోయారు. ‘ఎవరూ ఆందోళన చెందొద్దు.. పోరాడి సమస్యలు పరిష్కరించుకుందాం. కారి్మకులకు బీజేపీ అండగా ఉంటుంది’ అంటూ లక్ష్మణ్ భరోసానిచ్చారు. -
‘ఆర్టీసీ ఉద్యమం అమ్ముడుపోయే సరుకు కాదు’
సాక్షి, సిద్ధిపేట: ఆర్టీసీ కార్మికుల ఉద్యమం సీఎం కేసీఆర్ పతనానికి నాంది పలుకుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం బీజేపీ సిద్ధిపేట జిల్లా కార్యాలయం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలనే పరిష్కరించాలని కార్మికులు అడుగుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగడం లేదన్నారు. ‘ఆర్టీసీ తో మంట పెట్టించుకున్నావ్ జాగ్రత్త.. ఆ మంటల్లో కాలి పోయే రోజు వస్తుందని’ హెచ్చరించారు. కేసీఆర్ పాలనకు తగిన గుణపాఠం చెప్పేది బీజేపీ పార్టీయేనని తెలిపారు. ఆర్టీసీ ఉద్యమం మంత్రుల కోసమో చైర్మన్ల కోసమో అమ్ముడుపోయే సరుకు కాదన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉసురు ఊరికే పోదన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని తెలిపారు. 33 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను డ్యూటీలో చేరకపోతే డిస్మిస్ చేస్తానంటున్నావ్.. సచివాలయానికి రాని మిమ్మల్ని ఎన్ని సార్లు డిస్మిస్ చేయాలని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ముఖ్యమంత్రి జీతాలు ఆగలేదు కానీ, ఆర్టీసీ కార్మికుల జీతాలు మాత్రం ఎందుకు ఆపారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ గరికపాటి మోహన్రావు ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇరువురు 15 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చించుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులను షాకు మోత్కుపల్లి వివరించినట్టు సమాచారం. ఈ నెల 9న హైదరాబాద్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి అధికారికంగా ఆ పార్టీలో చేరనున్నారు. నియంతపాలనకు ముగింపు పలకండి బీజేపీలో చేరే విషయమై ముందుగా అమిత్ షాతో మాట్లాడాలన్న యోచన మేరకు రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చించినట్టు మోత్కుపల్లి మీడియాకు తెలిపారు.ఈ భేటీ సందర్భంగా తాను చెప్పిన విషయాలను సాంతం విన్న అమిత్ షా తీరు సంతోషకరమన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనకు ముగింపు పలకాలని షాను కోరినట్టు తెలిపారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని, అందుకే చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పదవులపై తనకు ఆశలేదని, ఆ విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని బదులి చ్చారు. బడుగు, బలహీన వర్గాలు, దళితుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మోత్కుపల్లి బీజేపీలో చేరిక పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
నియంతృత్వ పాలన కేసీఆర్ పతనానికి నాంది కాబోతుంది
-
'కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో గోక్కోవడమే'
సాక్షి, హైదరాబాద్ : కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో గోక్కోవడమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం లక్ష్మణ్ సమక్షంలో డాక్టర్ పద్మతో పాటు పలువురు డాక్టర్లు, ఫ్రొఫెసర్లు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ .. తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్రం ఏర్పడగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాల్లో మునగడానికి ప్రభుత్వం చేసున్న విదానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఇది ప్రజా రవాణా సంస్థపై పన్నుల భారం మోపుతుందని అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ ! ఇక మీ పతనం ప్రారంభమైంది, ప్రజలు మీ పాలనను గమనిస్తున్నారంటూ మండిపడ్డారు. -
బీజేపీ అండగా ఉంది:లక్ష్మణ్
మూసాపేట: ఆర్టీసీ సమ్మెకు బీజేపీ అండగా ఉందని, కార్మికులు ఆత్మస్థైర్యా న్ని కోల్పోవద్దని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా శాంతియుతంగా పోరాడి హక్కులు సాధించుకుందామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా శుక్రవారం బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కూకట్పల్లి, బీహెచ్ఈఎల్, మియాపూర్ 1, మియాపూర్ 2 డిపోల కార్మికులు, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బైక్ర్యాలీలో లక్ష్మణ్ పాల్గొని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ ప్రస్తావించిన సమస్యలనే ఆర్టీసీ కార్మికులు ప్రస్తావిస్తుంటే ఆయన పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో నిజాంను తలపించే పాలన సాగుతోందన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన గవర్నర్కు ఉన్న మానవతాదృక్పథం సీఎంకు లేదంటే రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నట్లే అన్నారు. తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, ఆర్టీసీ సహ కన్వీనర్ రాజిరెడ్డి, జనసేన, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు . -
ఆర్టీసీపై ప్రభుత్వం అణచివేత ధోరణి
-
‘నాడు మాటిచ్చి.. నేడు మరిచారు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులపై టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సీఎం కేసీఆర్ స్వలాభం కోసం చాలా మాటలు చెప్పారని, అధికారంలోకి వచ్చాకా అన్నీ మర్చిపోయారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి వహిస్తోందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. కార్మికులను వీధులపాలు చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆర్టీసీ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. పాత బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోడం వల్లనే ఆర్టీసీ నష్టాల్లో ఉందని పేర్కొన్నారు. నెలక్రితం సమ్మె నోటీసులు ఇస్తే.. ప్రభుత్వం కనీసం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేయిటీకరణ చేయడం కోసం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. కార్మికుల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. సమ్మెకు దిగిన కార్మికులతో ఇకపై ఎలాంటి చర్చలూ జరపబోమని తేల్చి చెప్పారు. సమ్మెకు దిగిన కార్మికులు, ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోబోమని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. ఈ సందర్భంగా సంచలన నిర్ణయాలు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాపంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు. -
‘కేసీఆర్.. ఫ్రంట్, టెంట్ ఎక్కడ పోయింది?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సభలో పచ్చి అబద్దాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. శాసనసభను టీఆర్ఎస్ పార్టీ సభగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను అబద్దాలకు అంబాసిడర్గా మారిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. చేసిన అప్పును కూడా ఆదాయంగా చూపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. దాదాపు 3లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ప్రజలపై భారం మోపారని లక్ష్మణ్ మండిపడ్డారు. కాగ్ రిపోర్టు కేసీఆర్ ప్రభుత్వాన్ని అనేక అంశాలపై తప్పు పట్టిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. దీనిపై లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పింది వేరు.. ప్రస్తుతం చేస్తోంది వేరు. ప్రజలు నమ్మి కేసీఆర్కు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని అప్పుల పాలుగా చేశారు. మన దగ్గర ఆర్థిక మాంద్యం లేదు. మాంద్యం ముసుగులో రాష్ట్రంలో నిధులు లేని అంశాన్ని కప్పిపుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం తెలంగాణకు 3లక్షల కోట్ల నిదులు ఇచ్చింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను కేంద్రానికి పంపలేదు. ఈ విషయం పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రులే ప్రకటించారు. తెలంగాణలో రైతులకు ఎందుకు రైతుబంధు ఇవ్వడం లేదు. రైతు రుణమాఫీ లేదు. ఒక్క శాతం కూడా అక్షరాస్యత పెరగని రాష్ట్రం ఏదైనా ఉంటే అది తెలంగాణ మాత్రమే. విద్య వ్యవస్థను నాశనం చేసారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ప్రొఫెసర్ జయశంకర్ గారిని వ్యక్తిగతంగా దూషించిన చరిత్ర కేసీఆర్ ది. కేసీఆర్ ప్రభుత్వం పాలనే అయినా ఎంఐఎం అజెండా కొనసాగుతుంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ పోయింది. ఢిల్లీలో చక్రం తిప్పుతామన్నారు. కారు సారు సర్కారు అన్నారు. ఇప్పుడు మీ ఫ్రంట్ ,టెంట్ ఎక్కడ పోయింది. ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చే పీఏసీ ఛైర్మెన్ పదవి అక్బరుద్దీన్కు ఇవ్వడం చూస్తే తెలుస్తోంది తెలంగాణ లో ఎలాంటి పాలన ఉందో’ అని వ్యాఖ్యానించారు. -
కేసీఆర్ వారి చరిత్రను తొక్కిపెడుతున్నారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. విపక్షంలో ఉన్నపుడు విమోచన దినోత్సవాన్ని జరుపుతామంటూ అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాటల తీరుతో ఊసరవెల్లి సైతం తలదించుకుంటుందని విమర్శించారు. మాటమార్చిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ కారులను విస్మరిస్తున్నారని, వారి చరిత్రను తొక్కిపెడుతున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ్ , డీకే అరుణ , జితేందర్ రెడ్డి, ఆకుల విజయ, ఇంద్రసేనా రెడ్డి, పెద్దిరెడ్డి, వివేక్లు శనివారం గవర్నర్ తమిళిసైను కలిశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల చరిత్ర వెలుగులోకి రావాలనే ఉద్యమ కారుల చరిత్రను తొక్కిపెడుతున్నారని అన్నారు. సెప్టెంబర్ 17న ఊరు నిండా జాతీయ జెండా.. తిరంగా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పటాన్ చెరువులో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబం తీరుకు వ్యతిరేకంగా సమర శంఖం పూరిస్తున్నామని చెప్పారు. ప్రజలంతా తమతో కలిసి రావాలని కోరారు. 20 ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు. -
యాదద్రిలో టెన్షన్ వాతావరణం
-
ఆందోళనలతో అట్టుడికిన యాదాద్రి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి ఆలయ ప్రాకార మండపాల్లో సీఎం కేసీఆర్, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల చిత్రాలను చెక్కడాన్ని నిరసిస్తూ వివిధ రాజకీయ పార్టీలు శనివారం ఇక్కడ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో పార్టీలు, ధార్మిక సంస్థలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదాలు జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, విశ్వహిందూ పరిషత్ సంస్థ ప్రతినిధులు ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించారు. ఉదయం ఆలయాన్ని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజాసింగ్ 10 మంది కార్యకర్తలతో వెళ్లి ఆలయా న్ని పరిశీలించారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి భారీ ర్యాలీతో కొండపైకి వెళ్లెందుకు యత్నించగా ఆయనను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ముఖ్యమైన నేతలను పంపిం చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు పార్టీ కార్యకర్తలతో రావడంతో పోలీసులు పరిమి త సంఖ్యలో కొండపైకి అనుమతినిచ్చారు. మధ్యాహ్నం సమయంలో వీహెచ్పీ, బజరంగ్దళ్కు చెందిన సుమారు 60 మంది కార్యకర్తలు కొండపైకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీహెచ్పీ, బజరంగ్దళ్ కార్యకర్తలను అరెస్టుచేసి అడ్డగూడూరు పోలీస్స్టేషన్కు తరలించారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కార్యకర్తలతో వచ్చారు. దీంతో పోలీసులు వారి కాన్వాయ్ను నిలిపివేశారు. అప్పటికే పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వా దం జరిగింది. సహనం కోల్పోయిన పోలీసులు.. బీజేపీ నేతలను అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కించారు. కోపోద్రికులైన బీజేపీ నేతలు భారీకేడ్లు నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. అనంతరం పోలీసులు వారిని కొండపైకి పంపారు. లక్ష్మణ్తోపాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా కొండపై శిల్పాలను పరిశీలించారు. పార్టీల ఆందో ళన నేపథ్యంలో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు ఏసీపీలు, 12 మంది సీఐలు, 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యం లో బుధవారం ఢిల్లీ వెళ్లిన నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మురళీధర్రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా.. లక్ష్మణ్ పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనపై పోరాడే సత్తా ఒక్క బీజేపీకే ఉందని, రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందనేందుకు నేతల వరుస చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. ఓర్వలేక తప్పుడు కేసులు: లక్ష్మణ్ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి బీజేపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి కేంద్ర ప్రభుత్వంపై నెపంనెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. యూరియా డిమాండ్ను అంచనా వేయ డంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, వ్యవసా య ప్రణాళిక లేకపోవడంతో కరీంనగర్, నిజామా బాద్లో రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కాగా, టీడీపీని వీడి బీజేపీలో చేరే ముందు చంద్రబాబుతో మాట్లాడినట్టు రేవూరి తెలిపారు. రవీంద్రనాయక్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో ప్రజల కలలు నెరవేరడం లేదన్నారు. -
కేంద్రమే నిర్వహిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: భారత్లో హైదరాబాద్ స్టేట్ విలీనమైన చారిత్రక సందర్భాన్ని కేంద్రమే అధికా రికంగా నిర్వహించనుందా? 1948 సెప్టెంబరు 17న జరిగిన ఈ సందర్భాన్ని కేంద్రమే జాతీయస్థాయిలో అధికారికంగా నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్ స్టేట్లో భాగమైన కొన్ని జిల్లాలు మహా రాష్ట్ర, కర్ణాటకలో కలవగా ఆయా జిల్లాల్లో ఈరోజును అధికారికంగా నిర్వహిస్తున్న విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కేంద్రం దీన్ని నిర్వహించకపోతే పార్టీపరంగా పెద్ద ఎత్తున నిర్వహణకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కార్యాచరణను రూపొందిస్తోంది. టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకేనా? టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా సుముఖతను వ్యక్తం చేయనందున, తెలంగాణ సెంటి మెంట్ను ఉపయోగించుకుని టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు ఇదొక మంచి అవకాశంగా బీజేపీ భావిస్తోంది. ఈ విషయంలో జాతీయపార్టీ నుంచి, నాయకత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు, మద్దతు అందుతుండటంతో ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పార్టీ మరింత విస్తరించవచ్చని వ్యూహాలు, కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. వచ్చే నెల 17న కరీంనగర్ లేదా నిజామాబాద్లో నిర్వహించే హైదరాబాద్ విమోచన దినోత్సవాల్లో కేంద్ర మంత్రి అమిత్షా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ రెండుచోట్లా కూడా బీజేపీ ఎంపీలు గెలవడంతో, తమ నియోజకవర్గ కేంద్రంలో సభ జర పాలని ఇరువురు ఎంపీలు పోటీపడుతున్నారు. ఈ ఏడాది యాత్ర? హైదరాబాద్ స్టేట్ విలీన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా జిల్లాల యాత్ర చేపట్టా లని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో ఈ ఉద్యమంలో పాల్గొన్న వారితోపాటు కవులు, కళా కారులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు తెలంగాణ పోరాటంలో కీలకమైన భైరన్పల్లి ఇతర చారిత్రక ప్రదేశాల సందర్శన, ప్రాధాన్యత సంతరించుకున్న ఆయా ప్రాంతాల గురించి ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది. -
తెలంగాణలో నీళ్లకన్నా బార్లే ఎక్కువ: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆ నలుగురి పాలవుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ కె.లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ‘తెలంగాణ సమస్యలను పరిష్కరించలేని నువ్వు రాయలసీమను రతనాలసీమగా మారుస్తాననడం విడ్డూరంగా ఉంద’ని కేసీఆర్ను ఎద్దేవా చేశారు. బార్లు తెరిచి, బీర్లు తాగండి తన్నుకు చావండన్న ధోరణిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిందెల్లో నీళ్లు దొరకడం లేదు కానీ పల్లెల్లో బీర్లు దొరుకుతున్నాయని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తుంటే కేసీఆర్ మాత్రం ట్రెజరీలో డబ్బులను దాస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని, ఆయుష్మాన్ భారత్ను సరిగ్గా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని విమర్శించారు. అవినీతి, అప్పుల్లో తెలంగాణ నెంబర్వన్ అని కేసీఆర్ ను ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహులమవుతామా అని అన్నారు. అమిత్ షాని అభినవ సర్దార్ పటేల్గా అభివర్ణిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. అందరం కలిసికట్టుగా తెలంగాణను కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ తండ్రీకొడుకుల పార్టీ, కాంగ్రెస్ తల్లీ కోడుకుల పార్టీ అని ఇరు పార్టీలను లక్ష్మణ్ తూర్పారబట్టారు. -
మీవి విద్వేష రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్ష్యం బీజేపీది అని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన బీజేపీకి బహిరంగ లేఖ రాశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా చిల్లిగవ్వ ఇవ్వని మీ పార్టీతో బంగారు తెలంగాణ సాధ్యమా అని నిలదీశారు. ‘కాళేశ్వరానికి నిధులివ్వాలని, జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నెత్తీనోరూ కొట్టుకున్నా రూపాయి కూడా విదల్చని మీరు బంగారు తెలంగాణ చేస్తారంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? యూపీఏ–2 ప్రభు త్వం ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మూలన పడేసింది మీ ప్రభుత్వం కాదా? రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను కేంద్ర సర్కారు బుట్టదాఖలు చేసిందనే విషయం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి తెలియదా? విభజన హామీలను గత ఐదేళ్లలో ఏనాడూ కేంద్రం పరిశీలించలేదు. వీటిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎప్పుడైనా కేంద్రాన్ని అడిగిందా? అలాంటి మీరు బంగారు తెలంగాణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది’ అని సుమన్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలేవి? తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం అడుగడుగునా వివక్ష చూపించిందని బాల్క సుమన్ అన్నారు. విభజన చట్టంలోని ట్రైబల్, హార్టీకల్చర్ యూనివర్సిటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ‘ఖమ్మం జిల్లా బయ్యారంలో నిర్మించతలపెట్టిన ఉక్కు పరిశ్రమ ఏమైంది? ఖాజీపేటలో పెడతామ న్న కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తామన్న గ్రాంట్లు ఏమయ్యాయి? తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ప్రతి జిల్లాకు ఇవ్వాల్సిన కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు ఎక్కడ’ అని నిలదీశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోగా అడుగడుగునా తెలంగాణపై విషం చిమ్ముతూ అబద్దాలు చెబుతూ వచ్చారని మండిపడ్డారు. -
టీఆర్ఎస్కు తోక పార్టీగా కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో తోక పార్టీగా మారిపోతున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్కు తోక పార్టీగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్ సోమ వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వివేక్తో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిడ్డల బలిదానాలతో ఏర్పడిన టీఆర్ఎస్ ఒక కుటుంబానికే పరిమితం అయిందన్నారు. టీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ లాలూచీ రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది పోయి ప్రధాన అనుచర పార్టీగా మారిపోయిందన్నారు. కేటీఆర్, ఉత్తమ్కుమార్రెడ్డి ఇద్దరు కలిసి ఒకేలా మాట్లాడుతున్నారని, తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2023లో బీజేపీ గెలుపును ఉత్తమ్, కుంతియా, కేసీఆర్, కేటీఆర్ అంతా ఏకమైనా అడ్డుకోలేరన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని విస్మరిస్తున్న టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని బీజేపీ భావిస్తోందని, అమిత్ షా నేతృత్వంలో సెప్టెంబర్ 17ను నిర్వహించి తీరుతామన్నారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. తెలంగాణ రావడం బీజేపీకి ఇష్టం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, సుష్మాస్వరాజ్ పార్లమెంటులో ఏం మాట్లాడారో ఉత్తమ్కి తెలియదా? అని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణ నుంచి ఒక్క ఎంపీ లేకున్నా బీజేపీ ఎంపీలు ప్రత్యేక తెలంగాణ బిల్లుకు మద్దతుగా ఓటు వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ప్రాంతాలుగా విడిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ తెలంగాణ సెంటిమెంటుతో పబ్బం గడుపుకోవ డం లేదా? రజాకార్ల వారసత్వంతో ఉన్న మతోన్మా ద మజ్లిస్ పార్టీని భుజానికి ఎత్తుకోవడం లేదా అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లపై, దేవతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే టీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపలేదని, కనీసం కట్టడి చేయ డం లేదన్నారు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చి తప్పింది మీ తండ్రి కాదా అని కేటీఆర్ను ప్రశ్నించారు. లౌకిక రాజ్యం అంటు న్న మీరు వందేమాతరం పాడను.. అంటున్న ఒవైసీ సోదరులను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణను మరచిన కేసీఆర్ మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ అందరం కలిసి తెలంగాణ కోసం పోరాడామన్నారు. కానీ ఇప్పు డు కేసీఆర్ ప్రజాస్వామ్య తెలంగాణను మరిచిపోయారన్నారు. కల్వకుంట్ల తెలంగాణ ఎలా చేసుకోవాలో ఆలోచిస్తున్నారన్నారు. ఉద్యమ సమయం లో ప్రజల గురించి మాట్లాడిన కేసీఆర్ గెలిచాక కొడుకు, కూతురు గురించి మాట్లాడడం మొద లు పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన హరీశ్, కోదండరాం, జితేందర్రెడ్డిని అప్ప ట్లోనే పక్కనపెట్టాలని చూశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. -
బలగం కోసం కమలం పావులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బలపడేందుకు కమలదళం వేగంగా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా చేరికలను ముమ్మరం చేసింది. పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులను పార్టీలో చేర్పించే కార్యక్రమాన్ని చేపట్టింది. టీడీపీ, కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకొని పార్టీలో చేర్చుకుంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తదితరులు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఇంటికి శనివారం వెళ్లి మరీ ఈ మేరకు మాట్లాడగా లక్ష్మణ్ తదితరులు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ ఇంటికి ఆదివారం వెళ్లి మరీ ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మరికొంత మంది టీడీపీ ముఖ్య నేతలను బీజేపీలో చేర్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, చాడ సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులను బీజేపీలో చేర్చుకోగా తాజాగా మాజీ ఎంపీ వివేక్ను చేర్చుకు న్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్వయంగా వివేక్ను షా వద్దకు తీసుకెళ్లారు. భవిష్యత్తులో పార్టీలో వారికి ఇదే గౌరవం కొనసాగుతుందన్న హామీలను ఇస్తూ చేరికలను వేగవంతం చేస్తున్నారు. టీడీపీ నేతలు పూర్తిగా బీజేపీలోకి వచ్చేలా.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని పదేపదే చెబుతున్న బీజేపీ... గ్రేటర్ హైదరాబాద్పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీడీపీ నేతలను అందరినీ బీజేపీలో చేర్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించేందుకు బీజేపీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. -
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే
దోమలగూడ/అల్వాల్: తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, రాజరిక, కుటుంబ పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు విశ్రమించేది లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అల్వాల్లోని శుభశ్రీ గార్డెన్స్లో జరిగిన మేడ్చల్ జిల్లా కార్యవర్గ సమావేశం, కార్పొరేట్ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బీజేవైఎం తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ఎదుట జరిగిన నిరసన దీక్షలో ఆపార్టీ నేతలు మురళీధర్రావు ఇతర నాయుకులు పాల్గొన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు జి. భరత్గౌడ్, జాతీయ కార్యదర్శి మహిపాల్రెడ్డి, నగర అధ్యక్షుడు వినయ్కుమార్ తదితరులతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కార్పొరేట్ ఫీ‘జులుం’, నిరుద్యోగ సమస్యపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీ‘జులుం’ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు ‘చదువుకొనాల్సిన’ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. 2016లో టీఆర్టీ పేరుతో నియామక నోటిపికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి మూడేళ్లు అవుతున్నా టీచర్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. ఆరేళ్లుగా ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని కేసీఆర్కు సీఎంగా కొనసాగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయాలను కూల్చివేయడం ప్రజాధనా న్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్రానికే కళంకం: మురళీధర్రావు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణకే కళంకమని, దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థను శిక్షించకపోవడం శోయనీయమన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై బీజేవైఎం పెద్ద ఎత్తున ఉద్యమించినా ప్రభుత్వం స్పందించలేదని, 27 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, బీజేపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, నాయకులు మల్లారెడ్డి, పాపారావు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, కార్యదర్శి రవిచారి, అధికార ప్రతినిధి రాంరెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి శివాజీ, నాయకులు కల్యాణ్, రమ్య, హైదరాబాదు స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు రాష్ట్రాల సీఎంల నిర్ణయం భేష్
సాక్షి, హైదరాబాద్: ఆలస్యమైనా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలనుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ స్వాగతించారు. అయితే, ఈ ఆలోచన గతంలో ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్ర పచ్చగా ఉండాలంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆ ధ్యాస అప్పుడెందుకు లేకపోయిందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నగరంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ గతంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యపూర్వకంగా చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలన్న కేంద్రం సూచనను సీఎం కేసీఆర్ పెడచెవిన పెట్టడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలకు సమృద్ధిగా తాగునీరు, సాగునీరు, పారి శ్రామిక అవసరాలకు నీటి సదుపాయం ఉండాలన్నదే బీజేపీ అభిమతమని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుతో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం భద్రమేనా అని కె.లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 34 లక్షల క్యూసె క్కుల వరదతోనే భద్రాచలంలో 43 అడుగుల వరకు నీరు చేరుకొని రాములవారి పాదాల వరకు నీరు వస్తుందని హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు 50 లక్షల క్యూసెక్కులతో వరద వస్తే భద్రాచలం పరిస్థితేంటని నిలదీశారు. ఆ పిటిషన్ ఉట్టిదేనా... ‘పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయమంటూ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ ఉట్టిదేనా, ఇప్పుడు ఆ ప్రాజెక్టుతో ప్రజలకెలా న్యాయం జరుగుతుంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టేందుకే పిటిషన్లు వేశారా’అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇద్దరు సీఎంల సమావేశంలో పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల విషయంలో ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరికిందా.. తెలంగాణకు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలకు న్యాయం జరిగేలా ఒప్పందాలు కుదిరాయా.. అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి, గోషామహల్కు చెందిన ఇతర పార్టీల నాయకులు కె.రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్వీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిరాంగౌడ్, సామాజిక కార్యకర్త భండారి, సుదేష్ణిదేవి, టీఆర్ఎస్ యూత్ వింగ్ లీడర్ కమలాకర్రెడ్డి, సాయిరాం గౌడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పృథ్వీరాజ్తోపాటు శేరిలింగంపల్లి, గోషామహల్ నుంచి 100 మందికిపైగా నాయకులు, ప్రముఖులు, ఇతర పార్టీ కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. -
‘అన్ని పార్టీల నేతలు టచ్లోఉన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అన్ని పార్టీల నుంచి నేతలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చినవారిని ఆహ్వానిస్తామని అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో పలువురు బీజేపీ సీనియర్లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సీనియర్ల సలహాలు, ఆశీస్సులు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఎల్కే అద్వానీ, కేంద్ర మాజీమంత్రి సుష్మాస్వరాజ్తో దీనిపై చర్చించినట్లు వెల్లడించారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించినందుకు పార్టీ పెద్దలు అభినందంచారని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అద్వానీ సహా పలువురు నేతలను కలిశాం. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సీనియర్ నేతల ఆశీస్సులు తీసుకున్నాం. తెలంగాణ రావాలని కూడా అద్వానీ ని కోరాం. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా నిధులు కేటాయించింది.కేంద్రం ఆయుష్మాన్ భారత్ కింద పేదలకు వైద్య సహాయం అందిస్తోంది. ఆరోగ్య శ్రీ బకాయిలు పెరుకుపోయాయి. లక్షా 80 వేల కోట్లకు రాష్ట్రాన్ని కేసీఆర్ చేర్చారు. తెలంగాణలో ఈబీసీ 10 రిజర్వేషన్లు కేసీఆర్ అమలు చేయడం లేదు. వారికి ఒవైసీ కోసం ముస్లిం రిజర్వేషన్లు కావాలి. ఈబీసీ లకు 10 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేసేలా బీజేపీ పోరాటం చేస్తుంది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఐఆర్, సీపీఎస్ రద్దు వంటివి చేస్తే ఇక్కడ కేసీఆర్ ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు. మోదీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం’’ అని అన్నారు. -
‘మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి జిల్లాలో బీజేపీ జెండా ఎగిరిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలకు గెలుచుకున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల విజయోత్సవ సభను శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ.. జీఎస్టీ అమలుపర్చిన ప్రపంచ నాయకుల్లో గెలిచింది కేవలం మోదీనే అని గుర్తుచేశారు. రాజకీయ విశ్లేషకులందరూ బీజేపీపై మానసిక ఒత్తిడి పెట్టారని, మోదీ ముందు కేసీఆర్ పనికిరారని తెలంగాణ ప్రజలు తేల్చారని పేర్కొన్నారు. మోదీని, బీజేపీని విమర్శిస్తే బాగుండదని ఆయన హెచ్చరించారు. మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలని మురళీధర రావు హితవు పలికారు. కేటీఆర్కు మాటలు రావడంలేదు.. నరేంద్రమోదీ హఠావో అన్న విపక్షాలకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సమావేశంలో లక్షణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీనే తమకు అంబేద్కర్ అని అన్నారు. తెలంగాణ దాటితే టీఆర్ఎస్ చెల్లని రూపాయని ఆయన ఎద్దేవా చేశారు. ఫలితాలు చూసిన తరువాత కేటీఆర్కు మాటలు రావడంలేదని, రైతులు కవితను సాగనంపారని పేర్కొన్నారు. తెలంగాణలో చరిత్ర సృష్టించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమను అభినందించినట్లు లక్ష్మణ్ తెలిపారు. నియంత పాలన సాగదు: సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాష్ట్రంలోని ముఖ్యమైన స్థానాల్లో బీజేపీ గెలిచింది. టీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు వ్యతిరేకించారు. అక్రమ కేసుల ద్వారా ప్రజాసంఘాల నాయకులను కేసీఆర్ బయపెట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ మజ్లీస్ పార్టీని నమ్ముకున్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నియంత పాలన సాగదు. నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బొందుగాళ్లకు స్థానం లేదు: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కార్యకర్తలందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా. ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ అహంకారం గురించే మాట్లాడుతున్నారు. ప్రజలకి కేంద్ర పథకాలు తప్ప రాష్ట్ర పథకాలు ఒక్కటీ కూడా అందడం లేదు. టిఆర్ఎస్కి సెంటిమెంట్ అయిన కరీంనగర్లో ప్రజలు బీజేపీకే పట్టాం కట్టారు. తెలంగాణలో హిందువులకు తప్ప, బొందుగాళ్లకు స్థానం లేదని ప్రజలు తేల్చారు. -
‘చంద్రబాబుది విచిత్ర మెంటాలిటీ..’
హైదరాబాద్: ‘పుల్వామా ఉగ్రదాడి’అనంతరం దేశం అంతా ఒక్కటిగా నిలవాల్సిన సమయంలో కొన్ని పార్టీలు పాకిస్తాన్ అనుకూల భాషను వాడటంతోనే ప్రజలు తిరగబడ్డారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నవభారత నిర్మాణం కోసం పనిచేస్తుంటే.. ప్రతిపక్షపార్టీలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ పనితీరు, అవినీతి రహిత పాలన, అభివృద్ది, సాహసోపేతమైన నిర్ణయాలు, దేశ అంతర్గత భద్రతలో ఎక్కడ రాజీపడని తీరుతోనే ఎన్డీఏకు మరోసారి ప్రజల కట్టం కట్టనున్నారని అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ ఫలితాలకు మించి ఎన్డీఏకు సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుది విచిత్ర మెంటాలిటీ అంటూ లక్ష్మణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. రుజువులు కావాలా? ‘సైనికులు ఎంతో సాహసోపేతంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తే ప్రతిపక్షాలు రుజువులు అడిగాయి. ఆ దాడిలో దోమలు కూడా చావలేదని ఆరోపించాయి. దేశ సైనికుల మీద కన్నా.. ఉగ్రవాది మసద్ అజార్పైనే ప్రతిపక్ష పార్టీలు నమ్మకం ఉంచాయి. దేశంలో రామరాజ్యం రాబోతుంది. మోదీ ఓటమికి కూటమి కట్టి అజెండా లేకుండా వెళ్లారు. జైల్ నుంచి బెయిల్ మీద ఉన్న వాళ్లంతా కూటమి కట్టారు. ఈ కూటమిలను ప్రజలు నమ్మలేదు. ఎన్డీఏకు గతం కన్నా ఎక్కువ సీట్లే వస్తాయి. పశ్చిమబెంగాళ్లో మమతా బెనర్జీ నియంతృత్వ పాలన సాగించింది. మమత కోటలకు బీటలు పడుతున్నాయి. బెంగాళ్లో కాషాయ జెండా ఎగరేస్తాం ‘ట్యాంపరింగ్ అన్నావ్.. ఐనా గెలుస్తా అంటున్నావ్?’ ఓటమికి చంద్రబాబు సాకులు వెతుకుతున్నారు. ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు.. మళ్లీ నేనే గెలుస్తానని పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేశాయి. కానీ ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి వచ్చే సరికి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి అంటున్నావు. అందుకే బాబును యూటర్న్ మహానుభావుడు అనేది. చంద్రబాబు విచిత్ర మెంటాలిటీలో ఉన్నారు’అంటూ లక్ష్మణ్ మండిపడ్డారు. -
ఎన్డీఏకు 300కు పైగా సీట్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణాలు వీడనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నరేంద్ర మోదీ ప్రధాని మరోసారి కావాలని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ శ్యామల యాగంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్డీఏకు 300లకు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు చంద్రులతో సహా దేశంలోని చిన్నాచితకా ప్రాంతీయ పార్టీ ల నాయకు లంతా ఎవరికి వారు ప్రజాభీష్టం చూరగొనకుండానే తానే ప్రధాని కావాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, తానే చక్రం తిప్పుతానని చెప్పిన తెలంగాణ చంద్రుడు.. ప్రస్తుతం బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలుస్తామని చెబుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని గురించి ఆలోచిద్దామని కాంగ్రెస్ నేతలు ముందే ఓటమిని అంగీకరించారని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాము ఉన్న సీట్లతో పాటు అదనంగా మరిన్ని సీట్లు గెలుచుకుంటామని, ఏడెనిమిది స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్తుందని జోస్యం చెప్పారు. ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ çశూన్యత ఏర్పడుతుందని, టీఆర్ఎస్ వ్యతిరేకులంతా బీజేపీ వైపు వస్తారని అన్నారు. ఎన్ని ఫిరాయింపులు చేసినా టీఆర్ఎస్ మనుగడ సాధించలేదని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుందని, ప్రభుత్వం మధ్యలోనే కూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది
-
లక్ష్మణ్ దీక్ష భగ్నం, అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ, బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ సోమవారం ఉదయం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లక్ష్మణ్ను అరెస్ట్ చేసి నిమ్స్కు తరలించారు. తొలుత ఇంటి వద్దే లక్ష్మణ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వారి కళ్లుగప్పి ఆయన క్యాబ్లో పార్టీ కార్యాలయానికి చేరుకొని దీక్ష ప్రారంభించారు. దీంతో అక్కడ దీక్ష ›ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులు రావడంతో అరెస్ట్లను అడ్డుకునేందుకు నాయకులు, కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో అక్కడ తోపులాట జరగ్గా పార్టీ తరఫున చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన షెహజాది సొమ్మసిల్లారు. అనంతరం లక్ష్మణ్ను అరెస్ట్ చేసి నిమ్స్కు, పార్టీ నాయకులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్స్టేషన్కు తరలించారు. అంతకుముందు దీక్ష ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ అనుభవం లేని గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థకు ఇంటర్ ఫలితాల ప్రాసెసింగ్ బాధ్యతను ప్రభుత్వం ఎలా అప్పగించిందని ప్రశ్నించారు. బోర్డు నిర్వాకం వల్ల 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మనోస్థైర్యాన్ని కల్పించేందుకే దీక్ష నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులూ.. ఆత్మహత్యలొద్దు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. పోలీసులు తనను బలవంతంగా నిమ్స్కు తరలించినా దీక్ష ఆగదని, నిరశనను కొనసాగిస్తానని చెప్పారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారికి అండగా బీజేపీ ఉంటుందన్నారు. ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం నైతిక బాధ్యత వహించాలి: రాంమాధవ్ ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి సీఎం కేసీఆర్, విద్యామంత్రి జగదీశ్రెడ్డి, బోర్డు కార్యదర్శి అశోక్ నైతిక బాధ్యత వహించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కల్పించకపోగా అహంకారం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇంటర్ బోర్డు అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని ఎంపీ దత్తాత్రేయ డిమాండ్ చేశారు. బాధ్యులపై సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారతాయని ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తు స్వరాష్ట్రంలో అంధకారంలో మునిగిపోయిందని డీకే అరుణ విమర్శించారు. 24 మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఆత్మహత్యలు వద్దంటూ ట్వీట్లు చేసే కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడలేరా అని ప్రశ్నించారు. నేడు ప్రగతిభవన్ ముట్టడి: మురళీధర్రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ఖండించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్న లక్ష్మణ్ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా లక్ష్మణ్ దీక్ష చేపట్టారని తెలిపారు. పోలీసుల తీరుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతిభవన్ ముట్టడి సహా రేపటి అన్ని కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయని మురళీధర్రావు స్పష్టం చేశారు. దీక్షకు పలువురి సంఘీభావం... లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు మురళీధర్రావు, రాంమాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, జాజుల శ్రీనివాస్గౌడ్ తదితరులు సంఘీభావం తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావులను పోలీసులు వారి ఇళ్లలోనే గృహ నిర్బంధంలో ఉంచారు. -
ఇంటర్’ వ్యవహారంపై 2న బీజేపీ రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకల అంశాన్ని ఉద్యమంగా మార్చేదిశగా బీజేపీ అడుగులేస్తోంది. మే 2వ తేదీన బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆదివారం(28న) అన్ని జిల్లాకేంద్రాల్లో నిరాహార దీక్ష, 29న విద్యార్థులు, మేధావులతో హైదరాబాద్లో రౌండ్టేబుల్ సమావేశం, 30న ప్రగతిభవన్ను ముట్టడించాలని నిర్ణయించినట్టు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈలోపు మంత్రి జగదీశ్రెడ్డిని బర్తరఫ్ చేయాలని, బోర్డు కార్యదర్శి అశోక్ను తొలగించాలని, అవకతవకలపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తాము పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే మే 2న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఫలితాల్లో భారీస్థాయిలో లొసుగులు చోటుచేసుకోవటం తో ఇప్పుడు ఈ అంశం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ‘టెన్త్’పై కూడా ఆరోపణలు... ఇంటర్ వ్యవహారంలో తీవ్ర తప్పిదాలు దొర్లిన నేపథ్యంలో పదోతరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనంపై కూడా ఆరోపణలు వస్తున్నట్టు లక్ష్మణ్ చెప్పారు. ఇంటర్ వ్యవహారంలో ఫలితాలకు ముందే ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదని, ఇప్పుడు పదో తరగతి విషయంలో ఎలా జరగబోతోందన్న అనుమానాలున్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష లాది మంది విద్యార్థులను ఆగం చేసినందున పదో తరగతి ఫలితాల విషయంలో జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. అనాలోచిత నిర్ణయంతో గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, ప్లాన్ బి లేకుండా గందరగోళం చేశారన్నారు. 23 మంది పిల్లల ఆత్మ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాం డ్ చేశారు. పరీక్షలు, ఫలితాలపై కనీసం సమీక్ష చేయలేకపోయిన విద్యాశాఖ మంత్రి ‘పుండు మీద కారం చల్లినట్టు’సమస్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. -
‘నిజామాబాద్లో బీజేపీ గెలవబోతోంది ’
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలవబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా పెరుగుతాయన్నారు. సీఎం కేసీఆర్ మీద రైతులు తిరుగుబాటు చేశారని, నిజామాబాద్లో సీఎం కూతురు కవిత కచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్లు హిందూవులను కించపరిచి వారి మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఓవైసీని మచ్చిక చేసుకోవడం కోసం హిందూవులను అవమానించారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ చొరబాటుదారులకు మతం రంగు పులుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అబద్దపు పునాదుల మీద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అవార్డుల వాపసి, అసహనం బ్యాచ్తో పాటు ఇప్పుడు రిటైర్డ్ సైనికులతో సంతకాల సేకరణ అంటూ కొత్త నాటకాలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరిస్తోందని, ఎన్నికల ఫలితాల తార్వత పెనుమార్పులు వస్తాయన్నారు. రాజకీయ పార్టీ గుర్తులతో జరగాల్సిన పరిషత్ ఎన్నికలను ఆదరా బాదరాగా చేస్తున్నారని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికలపై పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
వర్షిణి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిపింది..
యశవంతపుర : రౌడీ లక్ష్మణ్ హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. హత్య కేసులో ప్రధాన నిందితురాలు వర్షిణిగా గుర్తించారు. హత్యలో ఆమె పాత్ర ఎక్కువగా ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. హత్య గురైన లక్ష్మణ్పై అభిమానం, మరోవైపు రూపేశ్తో ప్రేమ నడిపింది. ఇద్దరి బర్త్డేలలో కేక్ను తినిపించింది. ఇద్దరు ఆమె మాయలో పడ్డారు. ఈ డబుల్ గేమ్ కారణంగా లక్ష్మణ్ను హత్య చేయించిన రూపేశ్ పథకం వేసి దొరికిపోయాడు. వర్షిణి, లక్ష్మణ్ల మధ్య నడుస్తున్న ప్రేమ పురాణం రూపేశ్కు తెలియదు. లక్ష్మణ్, రూపేశ్లతో ప్రేమ రాయభారం నడిపింది. వర్షిణి అసలు విషయం తెలియక రూపేశ్ లక్ష్మణ్ను హత్య చేయించినట్లు సీసీబీ విచారణలో తెలిసింది. తన విలాసాలకు మాత్రమే లక్ష్మణ్ నుండి డబ్బులు తీసుకోని ఎంజాయ్ చేసింది. వర్షిణి అకౌంట్లో లక్ష్మణ్ లక్షల్లో డబ్బులు వేసిన వివరాలను కూడా సీసీబీ పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన రోజు వర్షిణి బెంగళూరులో ఉన్నట్లు చెప్పింది. దీంతో లక్ష్మణ్ ఆర్జీ రాయల్ హోటల్లో ఒక గదిని ఆమె కోసం బుక్ చేశాడు. అయితే అతను వెళ్లినా వర్షిణి ఎంతసేపటికి హోటల్కు రాలేదు. దీంతో లక్ష్మణ్ వాట్సాప్ కాల్ చేసి మాట్లాడారు. తను ఇస్కాన్ ఎదురు ఉన్న టోయోటా షోరూం వద్ద ఉన్నట్లు షోరూం ఫొటోను తీసి పంపింది. నీవే వచ్చి తీసుకెళ్లాలని సూచించింది. ఫోటో ఆధారంగా లక్ష్మణ్ ఆమెను తీసుకురావటానికి కారులో బయలుదేరాడు. మార్గం మధ్యలోనే కాపుకాచిన రౌడీల ముఠా హత్య చేసి చేశారు. హత్య జరిగిన మరుసటి రోజు వర్షిణి లండన్ నుండి బెంగళూరుకు వచ్చినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. -
వినరా సోదరా...
శ్రీనివాస సాయి, ప్రియాంక జైన్ హీరోహీరోయిన్లుగా సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో లక్ష్మణ్ క్వాదారి నిర్మించిన చిత్రం ‘వినరా సోదరా వీరకుమారా’. ఈ చిత్రంలోని తొలిపాటను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూశాను. చాలా ఆసక్తికరంగా ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ చిత్రం హిట్ సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రనిర్మాత లక్ష్మణ్తో కలిసి ‘మేం వయసుకి వచ్చాం’ అనే సినిమా చేశాం. ఇప్పుడు తను నిర్మించిన ఈ సినిమా చూశాం. బాగుంది. చిత్రబృందం కొత్త ప్రయత్నం చేశారు. దర్శకుడు అనిల్తో సాంగ్ లాంచ్ కావడం శుభపరిణామం’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘మా సినిమా మొదటి పాటను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు లక్ష్మణ్. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. -
అమిత్ షా మార్గదర్శకంలో పని చేస్తాం : లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా మార్గదర్శకంలో పని చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వెయ్యి మందితో 9న అసెంబ్లీ ఇంఛార్జ్లు, కన్వీనర్లతో రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఐటీ అధిపతులు, నిపుణులతో హోటల్ ట్రీడెంట్లో సమావేశం కానున్నట్టు తెలిపారు. 13న మహబూబ్ నగర్లో జరిగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ల పార్లమెంట్ క్లస్టర్ సమావేశానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరవుతారని చెప్పారు. 14న కరీంనగర్లో జరిగే భారత్ కీ మాన్ కీ బాత్ మోదీకీ సాత్ కార్యక్రమంలో రాంమాధవ్ పాల్గొంటారని తెలిపారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో అమిత్ షా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో 43ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. మేరా పరివార్ భాజపా పరివార్ పేరుతో ఫిబ్రవరి 12నుంచి మార్చి 2వరకు బూత్ స్థాయిలో కార్యకర్తల ఇళ్లపై బీజేపీ జెండా ఎగుర వేస్తామన్నారు. కమలజ్యోతి కార్యక్రమంలో భాగంగా మోదీ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందినవారి ఇళ్లలో జ్యోతి వెలిగిస్తామని చెప్పారు. మార్చి 2న మోదీ సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ విజయ్ సంకల్ప పేరుతో 119అసెంబ్లీ నియోజకవర్గల్లో బైకు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. -
ఇది నవభారత బడ్జెట్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నవభారత నిర్మాణం కోసం ఉద్దేశించినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం ఇక్కడ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో తాజా కేంద్ర బడ్జెట్పై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. లక్ష్మణ్ మాట్లాడుతూ నోట్లరద్దు, జీఎస్టీ వల్ల కోటిమంది అదనంగా ఐటీ పరిధిలోకి వచ్చారని, ఆదాయపన్ను ద్వారా దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు సమకూరాయన్నారు. కోటి 53 లక్షల మంది పేదలకు సొంతింటి కల సాకారం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. డబుల్బెడ్ రూమ్ పథకం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ రక్షణ రంగానికి మొదటిసారిగా రూ.మూడు లక్షల కోట్ల భారీ కేటాయింపులు జరిగాయన్నారు. ఇది పీపుల్స్ బడ్జెట్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మాట్లాడుతూ మునుపెన్నడూలేని విధంగా ఐదేళ్లకోసారి జరిగే సర్వే ఇప్పుడు క్వార్టర్లీగా జరుగుతోందంటూ దాని లాభాలను వివరించారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ను పీపుల్స్ బడ్జెట్గా అభివర్ణించారు. 33 కోట్ల కుటుంబాలకు ఈ బడ్జెట్ లాభదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ జనాకర్షణ, శాస్త్రీయత రెండూ సమపాళ్లలో ఉన్నాయని, ఇదొక ప్రాక్టికల్ బడ్జెట్ అని ప్రశంసించారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం తదితరులు పాల్గొన్నారు. -
అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అంటే కమీషన్– కరప్షన్– కలెక్షన్గా పేరుగాంచిందని, సోనియాగాంధీ, మన్మోహన్సిం గ్, రాహుల్ నేతృత్వం అంతా కుంభకోణాలమయమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి దేశ, ప్రజల రక్షణ పట్ల ఏ మాత్రం బాధ్యత లేదని, వారి డీఎన్ఏలోనే దోపిడీ ఉందన్నారు. అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ నిందితుడిని భారత ప్రభుత్వం ఇటీవల పట్టుకొని దేశానికి తీసుకొచ్చిందన్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, సోనియా, రాహుల్ ఇతర నాయకులు బెంబేలెత్తిపోతున్నారన్నారు. వారు ఊచలు లెక్కించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. హెలికాప్టర్ల కొను గోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయని మొదట ఇటలీ కోర్టు తెలిపిందని, ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేసిందన్నారు. ఇటలీ కోర్టులో పలుమార్లు సోనియా పేరు వచ్చిందని, నిందితుడు మిషల్ కూడా సోనియా పేరు ప్రస్తావించారని ఈడీ డిసెంబరు 29న పాటియాలా కోర్టుకు తెలిపిందన్నారు. -
‘కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అహంకారంతో, అవివేకంగా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు కేసీఆర్ గండికొట్టారని, బీసీ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. ప్రజాసమస్యలను పక్కనపెట్టి ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో కుటుంబ ప్రయోజనాల కోసమే కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. మాటల గారడితో కాలం వెళ్లదీసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, గెలుపు అహంకారంతో ఇలా ఇతరులపై అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తొలిసారి కేసీఆర్ సీఎం అయ్యాక దళితులను మోసం చేస్తే.. రెండోసారి బీసీలను మోసం చేశారని విమర్శించారు. 2013, 2016 ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఇప్పుడు తగ్గించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రివ్వూ పిటిషన్ ఎందుకువెయ్యలేదన్నారు. ఢిల్లీలో ప్రధానికి వంగి వంగి దండాలు పెట్టి ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కేసీఆర్ బీసీలకు వెన్నుపోటు పొడిచారు
-
వాజ్పేయి సేవలు స్ఫూర్తిదాయకం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలు నేటి తరానికి, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యా లయంలో మంగళవారం వాజ్పేయి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలను నడిపిన వ్యక్తిగా వాజ్పేయి చరిత్రలో నిలిచిపోతారన్నారు. సిద్ధాంతాలతో రాజీ పడకుండా, అధికారం కోసం అర్రులు చాచకుండా దేశానికి, ప్రజలకు సేవలందించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారం కోసం విలువలకు తిలోదకాలు ఇచ్చి, పార్టీలు మారే ప్రస్తుత నాయకులకు వాజ్పేయికి ఎంతో తేడా ఉందన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టకుండా ఒక్క ఓటుతో అధికారానికి దూరమై ప్రజల్లోకి వెళ్లిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని కితాబిచ్చారు. అలాంటి విలువలతో కూడిన రాజకీయాలను నడపాల్సిన అవసరం ప్రస్తుతం ఉందన్నారు. తెలంగాణలో అధికార పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫిరాయింపులను ప్రోత్స హించిన టీఆర్ఎస్ తీరును ఆయన తప్పుబట్టారు. ఫలితాలు వచ్చినప్పటికీ గెలిచిన శాసనసభ్యులతో ప్రమా ణ స్వీకారం చేయించకపోవడం, మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం వంటి వి కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా నిలిచాయన్నారు. దేశహితమే ప్రధానంగా పనిచేసిన వ్యక్తి వాజ్పేయి అని మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారు దేశహితం కంటే తమ స్వార్థ రాజకీయాలే ముఖ్యంగా భావించడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, పార్టీ సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, జి.కిషన్రెడ్డి, బద్దం బాల్రెడ్డి, యెడ్ల గీత, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్రెడ్డి, మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
24న నగరానికి అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఘోర పరాజ యం పాలవ్వడంపై రాష్ట్ర కార్యవర్గంతో అంతర్గత సమీక్ష, వచ్చే పార్లమెంటు ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 24న హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా పర్యటన ఖరారైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉనికిని చాటుకునేలా వ్యూహరచన చేసి రాష్ట్ర నాయకత్వానికి అమిత్షా దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో పొందిన సీట్లను కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోవడంపై తెలంగాణ బీజేపీ నేతలపై షా తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీస ప్రభావం చూపించలేకపోవడంపై రాష్ట్ర నేతల పనితీరుపై షా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ వైఫల్యానికి కారణాలు గుర్తించి వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు షా తన పర్యటనలో మార్గదర్శనం చేయనున్నట్టు సమాచారం. అలాగే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి ఉన్న లక్ష్యాలను వివరించి క్లస్టర్ల వారీగా విభజించిన లోక్సభ స్థానాలపై సమీక్షలు జరపనున్నట్లు తెలుస్తోం ది.రాష్ట్ర కార్యవర్గంలో పలు మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా పర్యటన అనంతరం ఈ నెలాఖరున లేదా జనవరి తొలి వారంలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. సెంటిమెంట్ ప్రభావం అధికంగా ఉంది.. తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రభావం అధికంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విశ్లేషించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పోటీ చేయడం, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంలో పాల్గొనడంతో ఈ ఎన్నికలు తెలంగాణ వాదులు, వ్యతిరేకుల మధ్య పోటీగా మారిందని, దీని వల్ల ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారని అన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బు ప్రభావం, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల ఓటమిపాలయ్యామని ఆయన విశ్లేషించారు. పార్టీ వైఫల్యాలను గుర్తించి వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకొని సత్తాచాటుతామని ఆయన తెలిపారు. -
ఏం చేద్దాం: ఓటమిపై బీజేపీ అంతర్మథనం
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో.. ఆ పార్టీ అధినాయకత్వంలో అంతర్మథనం మొదలైంది. తాజా పరాభవాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రాల పధాధికారుల సమావేశం ఢిల్లీలో గురువారం ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్తోపాటు మురళీధర్రావు, ఇతర రాష్ట్రాల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తాజాగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలు విశ్లేషించడం, పార్టీ నాయకత్వంలో, శ్రేణుల్లో మళ్లీ నైతిక ఉత్తేజాన్ని నింపి రానున్న లోక్సభ ఎన్నికల కోసం సిద్ధం చేయడం లక్ష్యంగా అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఎందుకీ పరిస్థితి... మారదా ఈ స్థితి
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రయత్నం చేసినా అంత దారుణంగా దెబ్బతినడానికి గల కారణాలపై బీజేపీ ఆలోచనల్లో పడింది. హైదరాబాద్తోపాటు జిల్లాల్లోనూ ఈసారి మరిన్ని స్థానాలను గెలుచుకోవాలని భావించినా ఫలితం అందుకు విరుద్ధంగా రావడంతో పార్టీ మొత్తం గందరగోళంలో పడింది. హైదరాబాద్లోని ఒక్క గోషామహల్ మినహా ఖైరతాబాద్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్ స్థానాలను కూడా దక్కించుకోలేని పరిస్థితికి గల కారణాలను పార్టీ వర్గాలు అన్వేషిస్తున్నాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేక మంది ప్రచారం చేసినా కేవలం ఒకే ఒక్క స్థానానికి ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో విశ్లేషిస్తున్నాయి. పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు అనేక అవకాశాలు ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం, క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు అధ్యక్షుడిగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారన్న అపవాదు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడం, చివరి క్షణంలో టికెట్లు ఇచ్చినా ప్రచారానికి సమయం సరిపోలేదన్న వాదన వ్యక్తమవుతోంది. అయితే పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఈ అంశాలను కొట్టిపారేస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం తెలంగాణ సెంటిమెంట్పైనే జరిగాయని, ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయడం, కూటమిలో ఆయన పార్టీ ఉన్న కారణంగా ప్రజల్లో మళ్లీ చంద్రబాబు పెత్తనం ఏంటన్న అభిప్రాయం వచ్చిందని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్సహా ముఖ్యనేతలంతా విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలు కావడంతో బుధవారం పార్టీ ముఖ్యనేతలు పార్టీ కార్యాలయానికి వెళ్లకపోవడంతో కార్యాలయం బోసిపోయినట్లు అయింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజీనామా చేస్తారన్న వదంతులు వచ్చాయి. అయితే వాటిని పార్టీ ముఖ్య నేత ఒకరు కొట్టిపారేశారు. అలాంటిదేమీ ఉండదన్నారు. స్థానాలను పెంచుకోకపోగా, ఉన్న స్థానాలను కాపాడుకోలేని పరిస్థితి వల్ల ఐసీయూలోకి వెళ్లినట్లు అయిందని, దానినుంచి బయటకు రావాలంటే కొంత సమయం పడుతుం దని ఓ నేత వ్యాఖ్యానించడం కొసమెరుపు. బీజేపీలో సంజయ్కి అత్యధిక ఓట్లు సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు 14,50,456 (7 శాతం) మంది ప్రజలు ఓట్లు వేశారు. పార్టీ తరఫును 118 స్థానాల్లో పోటీ చేస్తే అందులో ఒక్క గోషామహల్లో 61,854 ఓట్లతో రాజాసింగ్ గెలుపొందారు. పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో ఆయనకంటే ఎక్కువ ఓట్లు వచ్చినా, రెండో స్థానానికే పరిమితమయిన అభ్యర్థులు ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉండి అత్యధిక ఓట్లు లభించిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ మొదటి వరుసలో ఉన్నారు. ఆయనకు 66,009 ఓట్లు రాగా, అంబర్పేట్ నుంచి పోటీ చేసిన కిషన్రెడ్డికి 60,542 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తిలో తల్లోజు ఆచారికి 59,445 ఓట్లు, ఆదిలాబాద్లో పాయ ల్ శంకర్కు 47,444 ఓట్లు, ముథోల్లో రమాదేవికి 40,602 ఓట్లు, కార్వాన్లో అమర్సిం గ్కు 35,709 ఓట్లు, ఖైరతాబాద్లో చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు, మల్కాజిగి రిలో రాంచందర్రావుకు 22,932 ఓట్లు వచ్చా యి. ముషీరాబాద్లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు 30,813 ఓట్లు వచ్చాయి. ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో కూడా బీజేపీకి ఓటు వేసి ఆదరించిన రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు నిరంతరం కృషి చేస్తూ.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు ముషీరాబాద్ నుంచి గెలిపించి ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ, ముషీరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానన్నారు. -
కమలానికి దెబ్బ మీద దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: భారీ ఆశలు, అంచనాలతో ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి దారుణమైన దెబ్బ తగిలింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రీతిలో పార్టీ చతికిలపడిపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనలో పడేసింది. ప్రధాని నరేంద్రమోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బీజేపీ తన ప్రచారాన్ని హోరెత్తించినా రాష్ట్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోలేకపోయింది. ఫలితంగా ఒక్కటి మినహా గతంలో ఉన్న స్థానాలను కూడా ఈసారి తిరిగి దక్కించుకోలేకపోయింది. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, గతంలో పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభలో పార్టీ పక్ష నేతగా ఉన్న కిషన్రెడ్డి కూడా ఓడిపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్, మిజోరం, రాజస్తాన్లో ఆ పార్టీ పరాజయం పాలుకావడం, మధ్యప్రదేశ్లో పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో పడ్డాయి. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత మేర ఓటుబ్యాంకును పెంచుకొని ఎక్కువ స్థానాలు గెలుపొంది సత్తా చాటాలనుకున్న పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో డీలా పడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగవచ్చని ఆశలు పెట్టుకున్న కొంతమంది నేతలు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు. 60కి పైగా స్థానాల్లో డిపాజిట్ గల్లంతు 118 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను పోటీలో నిలిపినా 60కి పైగా స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు దిపాజిట్ దక్కలేదు. 2014 ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరో 10 స్థానాల్లో అప్పుడు రెండోస్థానంలో ఉంది. ఈసారి అంతకంటే దారుణమైన స్థితిలో పడిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికంగా 15 స్థానాలను మహిళలకు కేటాయించినా ఒక్క మహిళా అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. ముగ్గురు తాజామాజీలైన కుంజ సత్యవతి(భద్రాచలం), బొడిగె శోభ (చొప్ప దండి), అరుణతార (జుక్కల్)లకూ ఓటమి తప్ప లేదు. గజ్వేల్లో పోటీ చేసిన మహిళామోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ కూడా ఓడిపోయారు. బీజేపీలో ఏక్ నిరంజన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు సిట్టింగుల్లో గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ మాత్రమే గెలుపొంది ఏక్ నిరంజన్గా నిలిచారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. దీంతో ఆ పార్టీకి అంసెబ్లీలో ఒక్కస్థానంతో ప్రాతినిథ్యం దక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్సహా తాజా మాజీలైన కిషన్రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తోపాటు సీనియర్ నేతలు ఎన్.రాంచందర్రావు, బద్దం బాల్రెడ్డి, యెండల లక్ష్మినారాయణ, తల్లోజు ఆచారి ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ కోలుకోలేని పరిస్థితిలో పడింది. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పేర్కొన్నారు. తనను ఓడించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టారని, అయినా ప్రజలు తన పక్షానే ఉన్నారని అన్నారు. -
వందల కోట్లతో ఆ పార్టీల హంగామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి, టీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంగామా సృష్టించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. అయినా ఆ పార్టీలను రాష్ట్ర ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చాన్నాళ్ల తర్వాత బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తూ హోరాహోరీ ప్రచారం నిర్వహించిందని అన్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, 4 రాష్ట్రాల సీఎంలు, 40 మంది కేంద్ర మంత్రులు, జాతీయ నేతలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా కూటమి ఓ విషకూటమి అని, దానికి సిద్ధాంతం అంటూ ఏమీ లేదన్నారు. పరస్పర విరుద్ధ్దమైన పార్టీలు టీఆర్ఎస్, మజ్లీస్ కలసి పనిచేస్తున్నాయన్నారు. -
తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోంది
-
సీబీఐని రాష్ట్రంలోకి రావద్దంటే ఎలా?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి, చట్టాలు మార్పు చేసి, అక్రమ సంపాదనను బయటకు తెస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. దీనిలో భాగంగానే ఆదాయపన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు దాడులు చేస్తూ అక్రమ సంపాదనను వెలికితీస్తున్నాయని.. సీబీఐ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయన్నారు. అలాంటి సంస్థలను రాష్ట్రంలోకి రాకూడదనడం పద్ధతి కాదన్నారు. టీయూడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన మంగళవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. దీనికి ఐజే యూ ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు లక్ష్మణ్ సమాధానమిచ్చారు. ‘పన్ను ఎగవేతదారులను వెనకేసుకొచ్చే పార్టీలు ఈ దేశంలో ఉన్నాయంటే దారుణం. పన్ను కట్టకుండా టీడీపీ వారు తప్పు చేస్తే వారిని వెనుకేసుకొస్తారు. సీబీఐ వంటి సంస్థలను ఎలా వద్దంటారు.. తప్పు చేసిన వారిపై దాడులు చేస్తే మంచిది కాదా.. ఇతర పార్టీల వారిపై దాడులు చేస్తే మంచిదా..’ అని ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. బాబు మాటలు ఎవరు నమ్మరు.. చంద్రబాబు చెప్పేవి ఎవరు నమ్మబోరని లక్ష్మణ్ చెప్పారు. పన్ను ఎగవేతదారులను వెనుకేసుకొస్తూ రాజకీయం చేస్తామనడం సరికాదన్నారు. తప్పు చేసి న టీడీపీ వారిని వెనుకేసుకురావడమే బాబు రాజకీయమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని, ఆయన చెప్పే మాటలు విని మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. తెలంగాణను శాసిం చాలనుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే బాబుకు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర ప్రజలు తన చెప్పు చేతల్లో ఉండాలనుకునే ఫీట్లు ఇక చెల్లవన్నారు. అది ఓ విఫల కూటమి మహాకూటమి ఒక విఫల కూటమి అని, కాంగ్రెస్ చచ్చిన పాము వంటిదని లక్ష్మణ్ అన్నారు. ‘కూట మికి అమరావతి అడ్రస్గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం బీజేపీనేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా రెండు, మూడ్రోజుల్లో తమ పీపుల్స్ మేనిఫెస్టో విడుదల చేస్తాం. హెదరాబాద్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో, నియోజకవర్గానికో మేనిఫెస్టో ఉంటుంది. రైతుబంధు పథకానికి మేం వ్యతిరేకం కాదు.. కౌలు రైతులు, పోడు సాగు చేసుకునే గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదనే అడుగుతున్నాం’ అని చెప్పారు. అది మీడియా సృష్టే.. బీజేపీ, టీఆర్ఎస్లకు మధ్య అవగాహన అనేది మీడియా సృష్టేనని, అది చంద్రబాబు మైండ్గేమ్ అని లక్ష్మణ్ విమర్శించారు. ‘ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. కేంద్రం పథకాలతో ప్రజలకు చేరువయ్యాం, దానికితోడు మోదీ చరిష్మాతో గెలుపు తథ్యం. ఓటు బ్యాంకు లేని త్రిపుర, మణిపూర్, అసోం రాష్ట్రాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అలాంటిది తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు. అధికారంలోకి వస్తే ఏటా లక్ష ఇళ్లు కడతాం. జాబితాలో పేరుండి ఇళ్లు రాకపోతే ఇళ్లు కట్టిచ్చే వరకు వారికి నెలకు రూ.5 వేల ఇంటి అద్దె చెల్లిస్తాం’ అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ది కుటుంబపాలన.. టీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా మారిందని లక్ష్మణ్ విమర్శించారు. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇవ్వమని చెప్పిన కేసీఆర్ కుటుంబం నుంచి ప్రభుత్వంలో నలుగురు ఎందుకని ప్రశ్నిం చారు. ‘అధికారంలోకి వచ్చాక అమరులను విస్మరించారు. శ్రీకాంతాచారి, యాదిరెడ్డి కుటుంబాల కు న్యాయం జరగలేదు. నిరసన వ్యక్తం చేసిన రైతులకు బేడీలు వేశారు. నేరెళ్లలో దళితులపై థర్డ్డిగ్రీ ప్రయోగించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్ల యింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు’ అని అన్నారు. -
‘అస్సాంలో సాధ్యమైంది తెలంగాణలో ఎందుకు కాదు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశంలో ఇచ్చి చూడండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రజలను కోరారు. ఇప్పటికే అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని.. ఈ సారి తమకు అవకాశం ఇస్తే అభివృద్ధిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసమే తెలంగాణ అన్నట్లుగా రాష్ట్రాన్ని మార్చేశారని ఎద్దేవా చేశారు. ఏప పక్ష పాలన, నియంతృత్వ పాలనపై ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ సమాజం అంటే కేసీఆర్ ప్రభుత్వానికి చులకనయిందన్నారు. కేవలం బర్రెలు, గొర్రెలు ఇస్తూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. సీట్ల పంపిణీలో సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టోని విడుదల చేస్తామని తెలిపారు. తమ మేనిఫెస్టోని కేవలం ఎన్నికల కోసమే కాకుండా 20 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తుకు విజనల్ డాక్యుమెంటరీలా తయారు చేశామన్నారు. టీఆర్ఎస్ తో బీజేపీ లోపాయికారీ ఒప్పందం అనేది ఒక మైండ్గేమ్ అన్నారు. ప్రభుత్వాన్ని నిర్భయంగా ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. లాలూచీ పడాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. దమ్ముంటే ఎంఐఎం అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని సవాల్ విసిరారు. మహాకూటమి పేరుతో కాంగ్రెస్ తెలంగాణను అమరావతికి తాకట్టు పెట్టాలని చూస్తోందన్నారు. అనేక కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యామని.. అదే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు లేని త్రిపుర, మణిపూర్, అస్సాం రాష్ట్రాలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. అలాంటిది తెలంగాణలో సాధ్యం కాదని తాము అనుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
రూ. 10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి
సాక్షి, హైదరాబాద్: పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను భారీగా పెంచి దానికి అదనంగా బోనస్ ఇచ్చేలా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. పంట సేకరణ సమయంలోనే ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని ముసాయిదా మేనిఫెస్టోలో పేర్కొంది. ఇందుకోసం కోసం రూ. 10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది. అలాగే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాల నిరోధానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారుల కమిటీలు, ప్రజలు, రైతులు, రైతు కూలీలకు రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా, విద్యార్థులకు సైకిళ్లు, 50 శాతం సబ్సిడీతో స్కూటీలు, ఉద్యోగుల కనీస వేతనం రూ. 26 వేలు చేయడం, నిరుద్యోగులకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి వంటి అంశాలతో సిద్ధం చేసిన ముసాయిదా మేనిఫెస్టోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్కు మేనిఫెస్టో కమిటీ ఇటీవల అందజేసింది. వాటిపై త్వరలోనే మరోసారి చర్చించి ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది. ముసాయిదా మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు - రైతులకు రూ . 2 లక్షల వరకు రుణమాఫీ. ప్రతి పొలంలో ఉచిత బోరుబావి. - నాణ్యమైన విత్తనాలు ఉచితంగా పంపిణీ - సన్న, చిన్నకారు రైతులు, రైతు కూలీలకు రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య, జీవిత బీమా - ప్రత్యేక వ్యవసాయ వార్షిక బడ్జెట్, కూరగాయల ధరల స్థిరీకరణ నిధి. - కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు కోయిల్ సాగర్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం - పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సిన వనరులను కేటాయించి మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం. - అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటన. - ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 25 వేల మంది విద్యార్థులకు ఉచితంగా జేఈఈ, నీట్, పోటీ పరీక్షల శిక్షణ - రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు. - రాష్ట్రంలో కనీస వేతనం రూ. 26 వేలు చేయడం. - సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం కొనసాగింపు. ్ఞ నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి. ్ఞ అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ విధానం ఎత్తివేత, పరీక్ష ఫీజుల రద్దు. - 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు హామీ లేని రుణాలు - ఇళ్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్ల నిర్మాణం, అవి నిర్మించి వరకు నెలకు రూ 5 వేలు అద్దె చెల్లింపు. - బీపీఎల్ కుటుంబాల్లో 58 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 2 వేల పెన్షన్, వితంతువులకు రూ. 3 వేల పెన్షన్. - వెనుకబడిన కులాల కార్పొరేషన్కు ఏటా రూ. 5 వేల కోట్లు కేటాయింపు. - రజకులను ఎస్సీల్లో, గంగపుత్రులు, వడ్డెర కులస్తులను ఎస్టీల్లో చేర్చేందుకు చర్యలు. - నేత, గీత, రజక, క్షార, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు తదితర కులవృత్తుల్లో 55 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 3 వేల పెన్షన్ - జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్ల పెంపు. - క్రీడారంగం అభివృద్ధికి రూ. 1,000 కోట్లతో క్రీడా నిధి ఏర్పాటు. వెయ్యిమంది క్రీడాకారులకు ఏటా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు స్కాలర్షిప్ మంజూరు. - జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పెన్షన్. - కల్యాణలక్ష్మి పథకంతోపాటు పేద మహిళలకు వివాహ సమయంలో ఒక తులం బంగారు మంగళసూత్రం. - వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కేటాయింపులు రూ. 2 వేల కోట్లకు పెంపు. - ఖాయిలాపడిన సంస్థల పునరుద్ధరణకు రూ. 2 వేల కోట్ల నిధి ఏర్పాటు. ్ఞ జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఏటా రూ. 100 కోట్ల బడ్జెట్. - రూ. 5 వేల కోట్లతో వెంచర్ కేపిటల్ ఫండ్ ఏర్పాటు చేసి స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం. - వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మంలలో ఐటీæ ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు. - జనగామ, భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, మంచిర్యాల, సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, నిర్మల్, జగిత్యాల పట్టణాల్లో బీపీవోల ఏర్పాటు. - జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటన - సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహణ. - పెట్రోల్, డీజిల్పై ధరలు కనీసం రూ. 20 తగ్గింపు - గ్రామ పంచాయతీలు, నగరాలు, పట్టణాల్లో నెలకు రూ. 6కే çనల్లాల ద్వారా రక్షిత తాగునీటి సరఫరా. -
చంద్రుల గ్రహణం త్వరలో వీడనుంది
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రుల గ్రహణం త్వరలోనే వీడనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఆదివారం ముషీరాబాద్ బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్న కుమారుడు కాసాని వీరేశం లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ నలుగురు కుటుంబ సభ్యులు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం పంపిన నిధులను కాజేసి తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు నేడు బీజేపీపై విమర్శలు చేస్తున్నార న్నారు. గత నాలుగున్నర ఏళ్లలో సంపాదించిన అక్రమ సంపాదన ద్వారా ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. మద్యం, ధనప్రవాహాన్ని పారించాలనుకుంటున్నారని.. దీని పట్ల ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండి ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో చంద్రబాబు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా సీబీఐకి ఉన్న సాధారణ అనుమతిని ఉపసంహరించారని ఆరోపించారు. ఏపీలో అక్రమార్కులపై సీబీఐ కొరడా ఝులిపిస్తే టీడీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. సీబీఐ దాడుల్లో వెలుగుచూసిన అక్రమాలపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాలకు చంద్రగ్రహణం పట్టిందని, త్వరలోనే ఇది వీడి కమలం వికసిస్తుందన్నారు. 20న అమిత్షా.. ఇప్పటివరకు బీజేపీ 114 మంది అభ్యర్థులను ప్రకటించిందని మరో ఐదుగురిని సోమవారం ఉదయం ప్రకటిస్తుందని లక్ష్మణ్ తెలిపారు. ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మంగళవారం (20న) తెలంగాణకు వస్తున్నారని, రెండు బహిరంగ సభలు రోడ్షోలో పాల్గొంటారని తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెల 3, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. 3న మూడు బహిరంగ సభలు, 5న రోడ్షోలు ఉంటాయన్నారు. మరో రెండు సభలకు రావాలని ప్రధాని మోదీని కోరుతున్నట్లు తెలిపారు. వీరితో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. 25 మందితో బీజేపీ ఐదో జాబితా సాక్షి, న్యూఢిల్లీ: తెలంగా ణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 25 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఐదో విడత జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జేపీ నడ్డా ఈ మేరకు ఆదివారం సాయంత్రం జాబితా విడుదల చేశారు. ఇటీవలే టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అరుణతార ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇప్పటివరకు 118 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నియోజక వర్గాలవారీగా అభ్యర్థుల వివరాలు జుక్కల్(ఎస్సీ): అరుణ తార, బాన్స్వాడ: నాయుడు ప్రకాష్, బాల్కొండ: ఆర్.రాజేశ్వర్, మంథని: రెండ్ల సనత్కుమార్, చొప్పదండి(ఎస్సీ): బొడిగె శోభ, మహేశ్వరం: అందెల శ్రీరాములు యాదవ్, వికారాబాద్(ఎస్సీ): రాయిపల్లి సాయికృష్ణ, జడ్చర్ల: డాక్టర్ మధుసూదన్ యాదవ్, కొల్లాపూర్: సుధాకర్ రావు, దేవరకొండ(ఎస్టీ): డాక్టర్ జరుప్లవత్ గోపి (కల్యాణ్ నాయక్), మిర్యాలగూడ: కర్నాటి ప్రభాకర్, హుజూర్నగర్: బొబ్బ భాగ్యరెడ్డి, కోదాడ: జల్లెపల్లి వెంకటేశ్వరరావు, తుంగతుర్తి(ఎస్సీ): కడియం రాంచంద్రయ్య, జనగామ: కె.వి.ఎల్.ఎన్.రెడ్డి(రాజు), డోర్నకల్(ఎస్టీ): జి.లక్ష్మణ్ నాయక్(లచ్చిరాం), వరంగల్ ఈస్ట్: కుసుమ సతీశ్, ములుగు(ఎస్టీ): బానోత్ దేవీలాల్, కొత్తగూడెం: బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, మంచిర్యాల: వి.రఘునాథ్రావు, బోధన్: అల్జాపూర్ శ్రీనివాస్, నర్సాపూర్: ఎస్ గోపి, కుత్బుల్లాపూర్: కాసాని వీరేశ్, పరిగి: కరణం ప్రహ్లాద్రావు, కంటోన్మెంట్: శ్రీగణేశ్. -
బీజేపీలో చేరిన అరుణ తార
-
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కామారెడ్డి : టీఆర్ఎస్, కాంగ్రెస్లు రెండూ కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని, దళిత, బలహీన వర్గాలను మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ దళితుల పట్ల చూపిస్తున్న ప్రేమతో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తారలాంటి వాళ్లు బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. బలహీన, దళితుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ పంచ సూత్రాల పేరుతో పాటు పడుతున్నారని కొనియాడారు. అంబేద్కర్ను పార్లమెంట్లో అడుగుపెట్టనివ్వకుండా కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. నెహ్రు కోసం అంబేద్కర్ను అవమానించారని ఆరోపించారు. 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని అరుణ తార అన్నారు. తమలాంటి దళితులకు న్యాయం చేస్తామని, అబద్దాలు చెప్పిన పార్టీలకు బుద్ది చెప్పే రోజులు వచ్చాయని చెప్పారు. దళితులని సీఎం చెయ్యకుండా కేసీఆర్ ఎలా ప్రజల దగ్గరకు వెళ్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదన్నారు. మోదీ చేసిన మంచి పనులను చూసి బీజేపీలో చేరుతున్నాని చెప్పారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. -
మాది భవిష్యత్తును నిర్ధారించే ప్రజా మేనిఫెస్టో
హైదరాబాద్: బీజేపీ మేనిఫెస్టో కేవలం 5 ఏళ్ల కోసం రూపొందించినది కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ధారించే ప్రజా మేనిఫెస్టో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ మల్లారెడ్డి, సుహాసిని ముషీరాబాద్ బీజేపీ ఎన్నికల కార్యాలయంలో లక్ష్మణ్ను కలసి మేనిఫెస్టో ప్రతిని అందజేశారు. లక్ష్మణ్ మాట్లాడుతూ రెండు నెలలుగా సుమారు 50 మంది మేనిఫెస్టో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయి, ఆన్లైన్ లో వందలాది మంది అభిప్రాయాలను సేకరిం చారని, అనంతరం వివిధ వర్గాల ప్రజల సమస్యల్ని నిపుణులతో చర్చించి మేనిఫెస్టో రూపొం దించారని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టోలోని అంశాల్ని ప్రజలకు వివరిస్తామన్నారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతుల సమస్యలు, విద్యా, వైద్య రంగం పట్ల దృష్టి సారించినట్లు చెప్పారు. రాష్ట్ర మేనిఫెస్టోతో పాటు అసెంబ్లీ స్థానాల వారీగా సమస్యలను తీసుకుని నియోజకవర్గ మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ఈ మేని ఫెస్టో ఉపయోగపడుతుందని లక్ష్మణ్ అన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ సకల జనులు సాధిం చుకున్న తెలంగాణ ఆ నలుగురి కోసమే అన్నట్లు సాగిందని విమర్శించారు. బీజేపీ మేనిఫెస్టోలో సకల జనుల సంక్షేమం ఇమిడి ఉందన్నారు.