మెహరీన్‌ భలే కౌంటర్‌ ఇచ్చింది | Mehreen Pirzada Counter To Man on Kathua Post | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 15 2018 7:22 PM | Last Updated on Sun, Apr 15 2018 7:44 PM

Mehreen Pirzada Counter To Man on Kathua Post - Sakshi

దేశాన్ని కుదిపేసిన కథువా ఘటన.. ఎనిమిదేళ్ల బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్దు ఎత్తున్న ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నటి మెహరీన్‌ పిర్జాదా కూడా తన ట్వీటర్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ‘నేను హిందుస్థానీని.. నేను సిగ్గుపడుతున్నా. 8 ఏళ్ల చిన్నారి ఆలయంలో సామూహిక అత్యాచారం.. హత్యకు గురైంది అంటూ ఫ్లకార్డుతో ఫోటోను మెహరీన్‌ పోస్ట్‌ చేసింది.

దీనికి స్పందించిన ఓ వ్యక్తి.. నీకు అంత సిగ్గుగా అనిపిస్తే దేశాన్ని విడిచి వెళ్లు. నేను హిందుస్థానీని అయినందుకు గర్వపడుతున్నా అంటూ రీట్వీట్‌ చేశాడు. దానికి స్పందించిన మెహరీన్‌.. నీలాంటోళ్ల గురించే నేను పోస్ట్‌ చేసింది అంటూ బదులిచ్చింది. భలే కౌంటర్‌ ఇచ్చావ్‌ మెహరీన్‌ అంటూ పలువురు ఆమెను అభినందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement