Kathua Rape Case
-
చలికాలంలో చెమటలు.. అతన్ని పట్టించాయి
కశ్మీర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార కేసులో కోర్టు ఆరుగురు నిందితులకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. వీరిలో జీవిత ఖైదు పడిన సాంజి రామ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అధికారులు. ఆర్కే జల్లా అనే అధికారి మాట్లాడుతూ.. కేసు విచారణ నిమిత్తం సాంజీ రామ్ ఇంటికి వెళ్లినప్పుడు అతని ప్రవర్తన చాలా విచిత్రంగా తోచింది. మా నుంచి ఏదో దాచడానికి ప్రయత్నించాడని తెలిపాడు. ‘అప్పటికే అతని మైనర్ అతని మేనల్లుడిని జువైనల్ హోమ్కు తరలించాం. సాంజీని,అతని కుమారుడు విశాల్ని విచారించే నిమిత్తం అతని ఇంటికి వెళ్లినప్పుడు మమ్మల్ని చూడగానే చాలా కంగారు పడ్డాడు. భయంతో కంపించిపోయాడు. దర్యాప్తులో భాగంగా అతన్ని ప్రశ్నిస్తుండగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు’ అని గుర్తు చేసుకున్నాడు. ‘అతని కొడుకు గురించి ప్రశ్నించగా.. మీరట్లో చదువుతున్నాడని.. కావాలంటే తన కాల్ రికార్డ్ డాటా(సీఆర్డీ)ను పరిశీలించుకోవచ్చని తెలిపాడు. అప్పుడు నాకు రెండు విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఒకటి సీఆర్డీ చెక్ చేసుకోమంటూ మాకే సలహా ఇవ్వడం.. రెండు చలి విపరీతంగా ఉండే జనవరిలో అతనికి చెమట పట్టడం. దాంతో మాకు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా కలిగింది. అతని మీద బెనిఫిషరి ఆఫ్ డౌట్ కింద కేసు నమోదు చేసి.. తదుపరి విచారణను పూర్తి చేశామని వెల్లడించారు. సాంజీ తన కుమారున్ని కాపాడుకోవడానికి అన్నివిధాల ప్రయత్నం చేశాడని జల్లా పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో తమ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదని జల్ల స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు సేకరించేందుకు తాము చేసిన కృషిని హై కోర్టు గుర్తించి ప్రశంసించిందని తెలిపారు. (చదవండి : సరైన తీర్పు) -
‘తను పదే పదే జ్ఞాపకం వస్తోంది’
కశ్మీర్ : ఏడాదిన్నర క్రితం కథువాలో జరిగిన దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. కోర్టు తీర్పు తమకు సంతృప్తినివ్వలేదని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా భావించిన వ్యక్తినే నిర్దోషిగా విడుదల చేయడం పట్ల వారు నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘నా కూతుర్ని గుర్తు చేసుకోకుండా ఒక్క రోజు కూడా గడవడంలేదు. తను నాకు పదే పదే గుర్తుకొస్తుంటుంది. నా కళ్ల ముందే ఉన్నట్లు అన్పిస్తుంది. సోమవారం తీర్పు వస్తుందని నాకు చెప్పారు. కానీ కోర్టుకు వెళ్లి కూర్చోవాలనిపించలేదు. పదే పదే జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకోవాలంటే నాకు ధైర్యం సరిపోవడం లేదు. అందుకే కోర్టుకు వెళ్లలేదు. అయితే తీర్పు గురించి విన్నప్పుడు నాకు సంతోషం కలగలేదు. ఏడగురు నిందితులకు మరణ శిక్ష పడాలని భావించాను. కానీ తీర్పు అందుకు భిన్నంగా వచ్చింది. సంపూర్ణ న్యాయం జరిగినట్లు అనిపించడం లేద’న్నారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘రెండు నెలల క్రితం నా చిట్టితల్లి సమాధి దగ్గరికి వెళ్లాను. దుఃఖం ఆగలేదు. నేటికి కూడా తనను తల్చుకోని ఏడుస్తూనే ఉన్నాను. నా శోకం ఇప్పట్లో తీరదు. కనీసం తీర్పు అయినా మేం కోరుకున్న విధంగా వస్తే సంతోషించే వాళ్లం. కానీ అలా జరగలేదు. నిందితులందరిని ఉరి తీస్తేనే నా చిట్టితల్లి ఆత్మకు శాంతి చేకూరుతుంది. న్యాయం జరుగుతుంద’న్నారు. నిరుడు జనవరిలో జమ్మూలోని కథువాలో అసిఫా అనే ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు సాంజీ రాం, మరో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించడంతోపాటు సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మరో ముగ్గురికి అయిదేళ్ల జైలు శిక్ష, రూ. 50,000 చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సాంజీరాం కుమారుడు విశాల్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించగా, ఆయనకు సమీప బంధువైన మైనర్ బాలుడు జువెనైల్ కోర్టులో విచారణనెదుర్కొంటున్నాడు. ఆ దురంతం సాధారణమైనది కాదు. అసిఫాను దారుణంగా హింసించి మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగు రోజులపాటు అత్యాచారం జరిపారు. చివరికామెను రాళ్లతో కొట్టి చంపారు. -
సరైన తీర్పు
దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన అత్యంత అమానుషమైన దురంతంలో నేరగాళ్లకు కఠిన శిక్షలు విధిస్తూ సోమవారం పంజాబ్లోని పఠాన్కోట్ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. నిరుడు జనవరిలో జమ్మూలోని కఠువాలో అసిఫా అనే ఎనిమిదేళ్ల బాలికను అపహ రించి, అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు సాంజీ రాం, మరో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించడంతోపాటు సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిం చిన మరో ముగ్గురికి అయిదేళ్ల జైలు శిక్ష, రూ. 50,000 చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సాంజీరాం కుమారుడు విశాల్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించగా, ఆయనకు సమీప బంధువైన మైనర్ బాలుడు జువెనైల్ కోర్టులో విచారణనెదుర్కొంటున్నాడు. ఆ దురంతం సాధారణమైనది కాదు. అసిఫాను దారుణంగా హింసించి మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగు రోజులపాటు అత్యాచారం జరిపారు. చివరికామెను రాళ్లతో కొట్టి చంపారు. అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు బయటికొచ్చినప్పుడల్లా సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబకడం రివాజే. కానీ కఠువా అత్యాచారం విషయంలో జరిగింది ఇది కాదు. ఆరోపణలెదుర్కొంటున్న నిందితులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. అప్పటి పీడీపీ–బీజేపీ ప్రభుత్వంలో మంత్రు లుగా ఉన్న ఇద్దరు ఆ ర్యాలీలో పాల్గొనడం మాత్రమే కాదు... ‘ఒక బాలిక మృతిపై ఇంత రాద్ధాంతం చేస్తారా?’ అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఎంతమంది మహిళలు ఈ ప్రాంతంలో మరణించడం లేదంటూ ప్రశ్నించారు. చివరకు బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని ఆ మంత్రులిద్దరితోనూ రాజీనామాలు చేయించింది. కఠువా బార్ అసోసియేషన్, హిందూ ఏక్తా మంచ్ వంటి సంస్థలు జాతీయ పతాకంతో ర్యాలీలు నిర్వహించాయి. ఇందులో స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. చార్జ్షీటు దాఖలు చేయడానికొచ్చిన అధి కారులను అక్కడి బార్ అసోసియేషన్ అడ్డగించింది. చివరకు బాధితులు అక్కడైతే న్యాయం దక్క దని సుప్రీంకోర్టును ఆశ్రయించాక కేసు విచారణ పంజాబ్కు బదిలీ అయింది. రాజకీయాలు నేరమయం అవుతున్నాయని అందరూ ఆందోళనపడుతున్నారు. కానీ కఠువా ఉదంతం విషయంలో ఇది తిరగబడింది. అక్కడ నేరం రాజకీయమయం కావడం కనిపిస్తుంది. మతపరమైన కోణంలో నిందితులకు మద్దతు పలకడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా న్యాయ మూర్తి తేజ్విందర్సింగ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హమైనవి. నేరగాళ్లు ఈ సమాజంలో ఆటవిక రాజ్యం ఉన్నదన్న రీతిలో చెలరేగిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నేరాల విష యంలో నిజానికి సమాజం మొత్తం ఒక్కటి కావాలి. నిందితుల నేరం రుజువు కావడానికి అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని పట్టుబట్టాలి. కానీ జమ్మూలోనూ, కథువాలోనూ అక్కడి సమాజం ఏకమై నిందితులను సమర్థించింది. నేరాన్నిబట్టి, దాని తీవ్రతనుబట్టి కాకుండా బాధిత వర్గం ఎవరో, నేరగాళ్లెవరో చూసుకుని సమర్థించాలో, వ్యతిరేకించాలో నిర్ణయించుకునే ధోరణి చివరకు సమాజాన్ని ధ్వంసం చేస్తుంది. తమ ప్రాంతంలో ఉంటున్న సంచార తెగవారిలో ఒకరు తమ బంధువును కొట్టారన్న ఆగ్రహంతో ప్రధాన నిందితుడు కక్షగట్టి అసిఫాను కిడ్నాప్ చేయించి ఈ మొత్తం దురంతానికి సూత్రధారిగా మారాడు. దిక్కూమొక్కూలేని సంచార తెగవారు ఈ ఉదంతం తర్వాత ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతారని, ఈ నేరం అక్కడితో సమసిపోతుందని అతగాడు భావించాడు. దీనంతటికీ ప్రార్థనా స్థలాన్ని వినియోగించుకున్నాడు. లైంగిక నేరాలకు దోహదపడుతున్న అంశాలేమిటో సక్రమంగా అవగాహన చేసుకున్నప్పుడే సరైన పరిష్కారం సాధ్యమవుతుంది. జరుగుతున్న నేరాలపై సత్వర దర్యాప్తు మొదలుపెట్టి, వెనువెంటనే దోషులను శిక్షించే ప్రక్రియ అమలైతే అవి చాలావరకూ తగ్గుతాయి. అయితే దీంతో పాటు చేయాల్సింది చాలా ఉంది. లైంగిక నేరాలకు మూలం ఆధిపత్య ధోరణిలో ఉంది. ఆ ఆధిపత్య ధోరణిలో ఒక్క జెండర్ అంశం మాత్రమే కాదు... కుల, మతాలవంటివి బలంగా ఉన్నాయని... అణగారిన వర్గాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు. కఠువాలో అది బాహాటంగా వెల్లడైంది. అసిఫాకు న్యాయం జరగాలని పట్టుదలతో కృషి చేసిన మహిళా న్యాయ వాది దీపికా సింగ్ రజావత్ను సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషించడం, చంపేస్తామని బెదిరించడం మాత్రమే కాదు...సాంఘిక బహిష్కరణ అమలు చేశారు. న్యాయ స్థానంలో ఆమె సహచరులు ఆమెతో మాట్లాడటం మానుకున్నారు. ఇరుగుపొరుగు, బంధువులు దీపికా సింగ్ను దూరం పెట్టారు. ఆమెపై ‘జాతి వ్యతిరేకి’ ముద్ర వేశారు. ఇవన్నీ గమనించాక ఆమె కుటుంబసభ్యులు హడలెత్తి ఈ కేసు నుంచి తప్పుకోమంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఒక నిస్స హాయ సంచార తెగ బాలిక అన్యాయంగా బలైపోయిందని భావించి, మానవతా దృక్పథంతో ఈ కేసును స్వచ్ఛందంగా స్వీకరించిన ఒక మహిళా న్యాయవాది సమాజంలో ఏకాకిగా మారడం ఊహకందనిది. ఇలాంటివి లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో జరిగాయని విన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయేవారు. అది మనకు సైతం సాధారణ విషయంగా అనిపించే స్థితి ఏర్పడటం ప్రమా దకరమైంది. నిజానికి మిలిటెంట్ల ఆగడాలతో కశ్మీర్లో ఉండలేక అక్కడినుంచి వలస వచ్చిన కశ్మీరీ పండిట్ల కుటుంబానికి చెందినవారు దీపికాసింగ్. ఆమెను వ్యతిరేకించినవారి అభ్యంతరం అదే. అన్ని బాధలకు కారణమైనవారికి ‘ఏదో జరిగితే’ ఎందుకు పట్టించుకోవాలన్నది వారి ప్రశ్న. ఈ కేసు విచారణ ఏడాది వ్యవధిలో పూర్తయి దోషులకు శిక్షపడటం ఊరటనిస్తుంది. సహజంగానే ఈ కేసు అప్పీల్కు వెళ్తుంది. ఉన్నత న్యాయస్థానాల్లో సైతం ఇదే వేగంతో విచారణ కొనసాగి నేరగాళ్లకు కఠిన శిక్షలు పడాలని ఆశించాలి. -
మరణించేవరకు జైలు జీవితమే..
పఠాన్కోట్: ఏడాదిన్నర క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన కఠువా సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సంజీరామ్ కొడుకు అయిన విశాల్ను కోర్టు సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేసిందని బాధితురాలి కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఫరూఖీ ఖాన్ చెప్పారు. పంజాబ్లోని పఠాన్కోట్లోని సెషన్స్ కోర్టు ఈ కేసును సంవత్సరంపాటు విచారించిన అనంతరం న్యాయమూర్తి తేజ్వీందర్ సింగ్ సోమవారం తీర్పు చెప్పారు. ఈ కేసును జమ్మూ కశ్మీర్లో కాకుండా బయటి కోర్టు విచారించాలని గతేడాది మే 7న సుప్రీంకోర్టు ఆదేశించడంతో పఠాన్కోట్ కోర్టు ఈ కేసును విచారించింది. రణ్బీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) కింద కోర్టు వారిని దోషులుగా తేలుస్తూ, బయట మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో వేచి ఉండగా తీర్పు వెల్లడించింది. కోర్టులోకి విలేకరులను అనుమతించలేదు. జమ్మూ కశ్మీర్లోని కఠువాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఆలయంలో సామూహిక అత్యాచారం, హత్య జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. బాలికను అపహరించి, ఆలయంలో బంధించి, నాలుగురోజుల పాటు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన అనంతరం బండరాళ్లతో మోదీ హత్య చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కోర్టు ఈ కేసులో మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చగా, వారిలో నలుగురు పోలీసులే కావడం గమనార్హం. మరణించేవరకు జైలు జీవితమే.. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆలయ సంరక్షకుడు సంజీరామ్, ప్రత్యేక పోలీస్ అధికారి (ఎస్పీవో) దీపక్ ఖజూరియాతోపాటు మరో వ్యక్తి ప్రవేశ్కుమార్లను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురూ అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వచ్చిన ఆరోపణలు రుజువైనట్లు కోర్టు తెలిపింది. వీరిని దోషులుగా ప్రకటిస్తూ జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదు అంటే మరణించేంత వరకు జైలులో ఉండాల్సిందేనని కోర్టు స్పష్టంగా వివరించింది. అలాగే మరో ఎస్పీవో సురేంద్ర వర్మ, ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్లు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోతే మరో ఆరునెలలు ఎక్కువగా జైలు జీవితం గడపాలని ఆదేశించింది. ఆనంద్ దత్తా, తిలక్ రాజ్లు కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు సంజీరామ్ నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. బాలిక సంచార జాతికి చెందిన అమ్మాయి కాగా, వారి మైనారిటీ జాతిని పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా పకడ్బందీగా కుట్ర పన్ని ఈ నేరానికి ఒడిగట్టారని చార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. తీర్పుపై మెహబూబా హర్షం.. కోర్టు తీర్పు పట్ల జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు హర్షం వ్యక్తం చేశారు. ‘నేరస్తులను చట్టానికి లోబడి వీలైనంత కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నేరస్తులకు మద్దతు తెలిపిన రాజకీయ నేతలను ఏదైనా అనడానికి అసలు పదాలు లేవు’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. బీజేపీ నాయకులు గతంలో నిందితులకు మద్దతుగా నిలవడం తెలిసిందే. దోషులకు అత్యంత కఠిన శిక్ష పడేలా చేయాలని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. దోషులందరికీ మరణశిక్ష వేయాలంటూ హైకోర్టులో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్మన్ రేఖా శర్మ కోరారు. మరణశిక్ష పడుతుందనుకున్నాం.. ‘నేరస్తులకు మరణశిక్ష పడుతుందని మేం ఆశించాం. నిర్దోషిగా బయటపడిన వ్యక్తీ.. ప్రధాన నిందితుడేనని మేం వింటున్నాం. అలాంటప్పుడు అతణ్ని ఎందుకు విడుదల చేశారు’అని బాలిక తండ్రి అన్నారు. బాధిత కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఓ ప్రకటన విడుదల చేస్తూ, తాము కోర్టు తీర్పును పరిశీలించిన అనంతరం పై కోర్టుకు వెళ్తామనీ, నిర్దోషిగా విడుదలైన విశాల్ను దోషిగా తేల్చాలని అప్పీల్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఓ బాలనేరస్థుడితో సహా మొత్తం ఎనిమిది మందిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయగా, ఏడుగురిపై విచారణను ఈ కోర్టు చూసుకుంది. ఎప్పుడేం జరిగిందంటే.. ► 2018 జనవరి 10: కఠువా జిల్లాలోని రసనా గ్రామంలో బకర్వాల్ సంచార జాతికి చెందిన 8 ఏళ్ల బాలిక గుర్రాలను మేపుతుండగా ఆమె ఆచూకీ గల్లంతు. ► జనవరి 12: బాలిక తండ్రి ఫిర్యాదుతో హీరానగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. ► జనవరి 17: బాలిక మృతదేహం లభ్యం. గ్యాంగ్రేప్ తర్వాత చంపేసినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడి. ► జనవరి 22: దేశవ్యాప్త నిరసనలతో జమ్మూ కశ్మీర్ క్రైం బ్రాంచ్కు కేసు బదిలీ. ► ఫిబ్రవరి 16: నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన హిందూ ఏక్తా మంచ్. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. ► మార్చి 1: ప్రధాన నిందితుడు, ఆలయ సంరక్షకుడు సంజీరామ్ను బంధువైన బాల నేరస్తుడి అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ ఏక్తా మంచ్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు. ► ఏప్రిల్ 9: మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా తేల్చి, వారిలో ఏడుగురిపై అభియోగపత్రాన్ని కఠువా కోర్టులో దాఖలు చేసిన పోలీసులు ► ఏప్రిల్ 10: బాల నేరస్తుడినని చెప్పుకున్న ఎనిమిదో వ్యక్తి పైనా అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు. ► ఏప్రిల్ 14: మంత్రివర్గం నుంచి తప్పుకున్న చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. బాధితులకు న్యాయం చేయాలన్న ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్. ► ఏప్రిల్ 16: కఠువాలో ప్రధాన సెసన్స్ కోర్టు జడ్జి ముందు విచారణ ప్రారంభం. ► మే 7: కఠువా నుంచి పంజాబ్లోని పఠాన్కోట్కు విచారణను మార్చిన సుప్రీంకోర్టు. విచారణను రహస్యంగా, వేగవంతంగా, మీడియాకు దూరంగా చేపట్టాలని ఆదేశించిన సుప్రీం కోర్టు. ► 2019 జూన్ 3: విచారణను ముగించిన పఠాన్ కోట్ సెషన్స్ కోర్టు. ► జూన్ 10: దోషులుగా తేల్చుతూ తీర్పు వెల్లyì ంచిన కోర్టు. సాంజీ రామ్ కఠువా దోషులు దీపక్ ఖజురియా ఎస్సై ఆనంద్ దత్తా, సురేందర్ వర్మ, తిలక్ రాజ్ -
కథువా కేసు: ఆ చిన్నారికి న్యాయం జరిగింది!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో చిన్నారి బాధితురాలికి న్యాయం చేకూరడం తనకు ఆనందం కలిగించిందని ఈ కేసు విచారణకు నేతృత్వం వహించిన జమ్మూకశ్మీర్ మాజీ పోలీసు అధికారి రమేశ్కుమార్ జల్లా తెలిపారు. ‘ఆ చిన్నారి ఆత్మకు న్యాయం జరగడం ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. కథువా రేప్ కేసులోని ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా నిర్ధారిస్తూ.. పఠాన్కోట్ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, ప్రవేష్కుమార్లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో దోషులుగా తేలిన ముగ్గురు పోలీసు అధికారులు సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఆనంద్ దత్తాలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కథువా అత్యాచార కేసు.. అప్పుడు అధికారంలో ఉన్న పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర విభేదాలకు కారణమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో తమ బృందానికి ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఎదురుకాలేదని రమేశ్కుమార్ జల్లా మీడియాతో పేర్కొన్నారు. క్రైమ్ బ్రాంచ్ సీనియర్ సూపరింటెండెంట్గా వ్యవహరించిన ఆయన గత నెలలో పదవీ విరమణ తీసుకున్నారు. ‘నేను ఇప్పుడు రిటైరయ్యాను. ఇప్పుడు నన్ను ఎవరూ ఏమీ చేయలేను. నమ్మండి నేను చెప్పేది నిజం. ఏ వర్గం నుంచి మాకు ఒత్తిడి ఎదురుకాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ, పీడీపీ ఇలా ఏ ఒక్కరి నుంచి మాకు ఒత్తిడి రాలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అత్యాచార కేసుకు మతపరమైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారని, కానీ, అప్పటి మంత్రుల నుంచి కానీ, అధికార వ్యవస్థ నుంచి కానీ ఎలాంటి ఒత్తిళ్లు ఎదురవ్వలేదని ఆయన వివరించారు. మీడియాలో విభిన్నమైన కథనాలు రావడం తమను ఒత్తిడికి గురిచేసిందని, అయినా దానిని తాము పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే అత్యాచారం చేసి.. హత్య చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్రాజ్, సబ్ ఇన్సిపెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేసింది. -
కథువా హత్యాచార కేసు : ముగ్గురికి జీవిత ఖైదు
చండీగఢ్ : దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన పఠాన్కోట్ స్పెషల్ కోర్టు సోమవారం మధ్యాహ్నం వారిలో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, ప్రవేష్కుమార్లకు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో దోషులుగా తేలిన ముగ్గురు పోలీసు అధికారులు సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఆనంద్ దత్తాలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా ఖరారు చేస్తూ ప్రత్యేక న్యాయస్ధానం తుదితీర్పు వెలువరించింది. కాగా, జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్రాజ్, సబ్ ఇన్సిపెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేసింది. -
ఉపశమనం లభించింది; ఇది సరిపోదు!
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచారం కేసులో పఠాన్కోర్టు వెలువరించిన తీర్పును జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఎనిమిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్థారించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి స్పందించారు. ‘ కథువా కేసులో తీర్పుతో కాస్త ఉపశమనం లభించింది. ఈ గొప్పదనమంతా.. క్రైమ్బ్రాంచ్ టీమ్ను ముందుండి నడిపించిన ఐజీపీ ముజ్తాబా, ఎస్ఎస్పీ జాలా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు నవీద్, శ్వేతాంబరి, లాయర్ దీపికా రజావత్, తాలిబ్లకే దక్కుతుంది. వీరంతా ప్రాణాలు పణంగా పెట్టిమరీ నిజాలను వెలుగులోకి తెచ్చారు. చిన్నారికి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ తీర్పును స్వాగతిస్తున్నా. ఎనిమిదేళ్ల చిన్నారికి మత్తు పదార్థాలు ఇచ్చి, పలుమార్లు అత్యాచారం జరిపి, పాశవికంగా హత్య చేసిన క్రూరులకు చట్టంలోని లోపాలు ఆయుధం కాకూడదు. హేయమైన నేరానికి పాల్పడిన వాళ్లకు కచ్చితంగా శిక్ష అమలు కావాలి అని ఆమె పేర్కొన్నారు. ఈ శిక్ష సరిపోదు.. ‘ఈ తీర్పును స్వాగతిస్తున్నా. అయితే దోషులకు జీవిత ఖైదు సరిపోదు. అంతకంటే కఠినమైన శిక్షను అమలు చేయాలి. నిందితులకు మద్దతుగా నిలిచిన కొంతమంది రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి. బాధిత కుటుంబాన్ని, పోలీసులు, లాయర్లను బెదిరించిన వారిని ఏమనాలో అర్థం కావడం లేదు’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. చదవండి : ఏదో ఒకరోజు నన్ను కచ్చితంగా చంపేస్తారు కాగా కశ్మీర్లోని కథువాలో గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలికపై కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారం జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే. గతేడాది జనవరిలో బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో బాధితురాలి తరఫున వాదిస్తే చంపేస్తామని బెదిరింపులు రావడంతో..ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో దీపికా సింగ్ రజావత్ చిన్నారి తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. అయితే నిందితులకు కొంతమంది బీజేపీ నాయకులు మద్దతు తెలపడం, ఈ క్రమంలో జమ్మూకశ్మీర్లో ఉద్రిక్తతలు చెలరేగడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. -
కథువా అత్యాచారం, హత్య కేసులో తుది తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో పంజాబ్లోని పఠాన్కోట్ స్పెషల్ కోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్ల, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్థారించింది. అయితే సాంజీ రామ్ కుమారుడు విశాల్ను నిర్దోషిగా చెబుతూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దోషులకు న్యాయస్థానం మధ్యాహ్నం శిక్షలు ఖరారు చేయనుంది. చదవండి: కథువా కేసు.. వాళ్ల పనే! కాగా జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్రాజ్, సబ్ ఇన్సిపెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేసింది. మొత్తం ఎనిమిదిమంది నిందితులు ఉండగా.. వారిలో ఏడుగురిపై అత్యాచారం, హత్య అభియోగాలపై ఛార్జ్షీట్ దాఖలైంది. మైనర్ మాత్రం ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో పఠాన్కోట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టు వద్ద అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు నిందితులకు ఉరిశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
కథువా కుటుంబానికి మరో షాక్
కశ్మీర్ : డిజిటల్ బ్యాంకింగ్ వంటి నూతన పోకడల వల్ల నిరక్షరాస్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ వార్త మన కళ్లకు కడుతుంది. గతేడాది జనవరిలో కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఆలయంలో బంధించి సామూహిక అత్యాచారం జరిపి హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కన్న బిడ్డను పోగొట్టుకున్న బాధ నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోనేలేదు. అప్పుడే వారికి మరోక షాక్ తగిలింది. బిడ్డ మరణంతో కుమిలి పోతున్న వారిని ఆదుకోవాడానికి విరాళాలు ఇచ్చారు కొందరు మానవతా వాదులు. కానీ జనాలు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారంటే.. అలా వచ్చిన సొమ్మును కూడా కాజేశారు. అది కూడా దర్జాగా బ్యాంక్ ఖాతా నుంచి కొట్టేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది లక్షల రూపాయలను బ్యాంక్ ఖాతా నుంచి ఖాతాదారునికి తెలియకుండా డ్రా చేశారు. వివరాలు.. కథువా సంఘటన తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు విరాళాల సేకరణ ప్రారంభించాయి. అలా వచ్చిన సొమ్మును బాధితురాలి తండ్రితో పాటు వారి కుటుంబానికి చెందిన అస్లాం ఖాన్ అనే వ్యక్తి పేరు మీద తీసిన జాయింట్ అకౌంట్లో వేశారు. ప్రస్తుతం ఈ అకౌంట్ నుంచి తనకు తెలియకుండా ఎవరో ఏకంగా 10 లక్షల రూపాయలను విత్డ్రా చేశారని బాధితురాలి తండ్రి వాపోతున్నాడు. తనకు చదువు రాదని.. ఈ మోసం ఎలా జరిగిందో తనకు తెలియదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.అంతేకాక ఈ విషయం గురించి అస్లాం ఖాన్ను ప్రశ్నించినప్పుడు అతడు సరిగా స్పందించలేదని బాధితురాలి తండ్రి తెలిపాడు. తనకు అతని మీద అనుమానం ఉందని పేర్కొన్నాడు. గత నెల జనవరి నుంచి నేటి వరకు తన అకౌంట్ నుంచి రూ. 22 లక్షలు డ్రా చేశారని తెలిపాడు. వాటిలో ఓ పది లక్షల రూపాయలు మాత్రమే తాను తీసుకున్నానని.. మిగతా మొత్తం గురించి తనకు తెలీదని వాపోతున్నాడు. ఈ విషయం గురించి బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా.. చెక్కులు తీసుకొచ్చి సొమ్ము డ్రా చేశారని.. వాటిలో అన్ని వివరాలు సరిగా ఉండటంతో సొమ్ము ఇచ్చామన్నారు. కొన్ని ట్రాన్సాక్షన్లు అస్లాం ఖాన్ పేరు మీద జరగ్గా.. మరి కొన్ని ట్రాన్సాక్షన్లు నజీమ్ అనే వ్యక్తి పేరు మీద జరిగినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. బ్యాంక్ ఖాతా వివరాలు పూర్తిగా తెలిసిన వారే ఈ పని చేసుంటారని అధికారలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
2018 : కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం
కొండగట్టు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో కన్నీటిని మిగిల్చింది.. కథువా ఘటన మనిషిలో కనుమరుగైన మానవత్వాన్ని చూపింది.. ఉన్నావ్ దుర్ఘటన రాజకీయ ఒత్తుడులను చవిచూసింది.. సమాజానికి సిగ్గుచేటుగా దాచేపల్లి ఘటన.. ప్రేమికుడి కోసం భర్తను హత్య చేయించడం మానవ సంబంధాల ఉనికిని చూపెడుతోంది.. ఈ ఏడాది సంచలనం రేపిన ఘటనలను ఓ సారి చూద్దాం.. సంచలనం రేపిన కథువా దుర్ఘటన (జనవరి 10-17) జమ్మూకశ్మీర్లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కథువా గ్రామానికి కిలోమీటరు దూరంలో గుర్తించారు. ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విషాదం మిగిల్చిన విమానం ఆఫ్రికాలోని అల్జీరియాలో ఏప్రిల్ 11న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 257 మంది దుర్మరణం చెందారు. రాజధాని అల్జీర్స్ నుంచి టేకాఫ్ అయిన విమానం కొద్ది సేపటికే సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. మృతుల్లో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఉలిక్కిపడేలా చేసిన ఉన్నావ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లోని ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలి తండ్రిని ఏప్రిల్ 5వ తేదీన అక్రమ ఆయుధాల చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆయన అదే రాత్రి మృతి చెందడం కలకలం రేపింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరగడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మానవత్వానికి సిగ్గుచేటు.. దాచేపల్లి ఘటన (మే 3-5) గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అన్నం సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడు గురజాల మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమికుడు కోసం భర్త హత్య (మే 7)విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి మండలంలో సరస్వతి అనే వివాహిత పెళ్లైనా వారం రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని ప్రేమించిన సరస్వతి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ హత్య దుండగులు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సరస్వతిని నిందితురాలిగా తేల్చారు. పడవ బోల్తా.. 26మంది మృతి (మే 15) పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో లాంచీ మునిగిపోయిన ఘటన ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందారు. మే 15 సాయంత్రం దేవిపట్నం నుంచి కొండమొదలు బయలుదేరిన లాంచీ సుడిగాలుల తీవ్రతకు బోల్తాపడింది. మేనమామే.. మృగంలా మారి! (జూన్ 15) మానసిక వికలాంగులైన చిన్నారులను సొంత మేనమామే దారుణంగా హత్య చేశాడు. మిర్యాలగూడలోని తన అక్క వద్ద నుంచి పిల్లల్ని తన రూమ్కు తీసుకువచ్చిన మల్లికార్జునరెడ్డి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. చివరకు నిందితుడు మృతదేహాలను అర్ధరాత్రి కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. ఎనిమిదేళ్ల బాలికపై.. (జూన్ 26) మధ్యప్రదేశ్లోని మంద్సౌర్లో ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారనికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా మహిళలు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది.. (జూలై 1) దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మూఢ నమ్మకాలపై విశ్వాసంతో.. మోక్షం పొందడం కోసమే వారంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి ఇంట్లో లభించిన ఆధారాలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతు.. (జూలై 14) తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో నాటుపడవ గోదావరి నది పాయలో బోల్తా కొట్టిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతయ్యారు. చిన్నారులు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనాథ శరణాలయంలో దారుణం! (జూలై) బిహార్లోని ముజఫర్పూర్లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్ బాలికలపై నిర్వాహకుడు బ్రజేష్ లైంగిక దాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముంబైకి చెందిన ‘టిస్’ చేపట్టిన సోషల్ ఆడిట్తో ఈ దారుణం బయటపడింది. ఈ ఘటనలో బాధిత బాలికలు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కరక్కాయతో కాటువేశాడు! (జూలై) హైదరాబాద్ కేపీహెచ్బీలో కరక్కాయ పొడి పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగుచూసింది. బాధితులకు వేల రూపాయలు ఎరగా చూపిన నిందితులు కోట్లాది రూపాయలతో ఉడాయించారు. ధర్మపురి సంజయ్పై ఆరోపణలు (ఆగస్టు) ప్రముఖ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో సంజయ్ 20 రోజలు పాటు సారంగపూర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం (సెప్టెంబర్ 11) జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా ఇది నిలిచింది. ఆర్టీసీ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తాయి. మిర్యాలగూడ పరువు హత్య! (సెప్టెంబర్ 14) మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్లు ఈ ఏడాది జనవరిలో ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురి ప్రేమ వివాహన్ని తట్టుకోలేకపోయిన మారుతి రావు ప్రణయ్ను అంతమొందించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల చేతిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హతం! (సెప్టెంబర్ 23) మన్యంలో మాటు వేసిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే కిడారి సోములను దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. మిస్టరీగా ఖషోగ్గి హత్య (అక్టోబర్ 2) ఇస్తాంబుల్లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయానికి వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు గురికావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కనీసం ఆయన మృతదేహాం కూడా లభించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఖషోగ్గీ హత్య వెనుక ఉంది సౌదీ అరేబియా ఉందనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొంది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్ చంపించారనే ఆరోపణలు వచ్చాయి. రావణాసురుడి దహణం.. 59మంది దుర్మరణం (అక్టోబర్ 19) పంజాబ్ అమృత్సర్లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జోడా ఫాటక్ ప్రాంతంలో రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అండమాన్లో అమెరికన్ టూరిస్ట్ హత్య (నవంబర్) అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా, అలెన్ క్రైస్తవ మత ప్రచారం కోసం అక్కడికి వెళ్లారు. ఆలయంలో విష ప్రసాదం.. 15మంది మృతి (డిసెంబర్ 14) కర్ణాటక చామరాజనగర జిల్లా సుళ్వాడిలోని చిక్క మారమ్మ ఆలయంలో విష ప్రసాదం తిని 15 మంది మృతి చెందటం సంచలనంగా మారింది. ఆధిపత్య పోరు ముసుగులో పగతో ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి తన మనుషులతో ప్రసాదంలో మోనోక్రోటోఫాస్ అనే పురుగుల మందు కలిపి ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలింది. -
మూకోన్మాదం, కథువాపై రచ్చ
న్యూఢిల్లీ: రాజస్తాన్లోని అల్వార్లో ఇటీవల జరిగిన మూకోన్మాద ఘటనపై సోమవారం లోక్సభ దద్దరిల్లింది. జీరో అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ఎంపీ కరణ్ సింగ్ రాజస్తాన్లో ఇటీవలి కాలంలో జరిగిన నాలుగో మూక హత్య ఇదని పేర్కొన్నారు. దీని వెనక గోరక్షకుల హస్తముందన్నారు. దీనిపై బీజేపీ మండిపడింది. పలువురు బీజేపీ ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి కాంగ్రెస్ ఎంపీ ప్రసంగానికి అడ్డుతగలడంతో వాగ్వాదం జరిగింది. అంతకుముందు, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కథువా ఘటనను, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నావ్లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. రాహుల్పై హక్కుల ఉల్లంఘన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో రాఫెల్ ఒప్పందంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలంటూ బీజేపీ ఎంపీలు పెట్టిన సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఇచ్చారు. రాఫెల్ ఒప్పందంలో బూటకపు జాతీయవాదం చాటున నక్కేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మాజీ రక్షణ మంత్రి ఆంటోనీ విమర్శించారు. కాగా, యూపీఏ హయాంలో కోట్ చేసిన దానికంటే 9 శాతం తక్కువకే తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని న్యాయశాఖ మంత్రి చెప్పారు. గృహ కొనుగోలుదారులకు సాధికారత కల్పించేలా దివాళా చట్టం – 2018లో ప్రభుత్వం తీసుకురానున్న సవరణలను ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఎంపీలు ఆన్లైన్లోనే ప్రశ్నలు అడిగేలా, నోటీసులిచ్చేలా ‘ఈ–నోటీసెస్’ యాప్ను ప్రారంభించారు. అటు, చెక్ బౌన్సుల కేసులో త్వరగా విచారణ జరిగే నెగోషియేబుల్ ఇన్స్ట్రుమెంట్ (సవరణ) బిల్లుకు లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఇలాంటి కేసుల విచారణలో చెక్ ఇచ్చిన వ్యక్తి ముందుగా చెక్ మొత్తంలో 20శాతాన్ని పరిహారంగా చెక్ తీసుకున్న వ్యక్తికి ఇవ్వాలి. -
కథువా కేసు.. వాళ్ల పనే!
ఎనిమిదేళ్ల చిన్నారి కిరాతకంగా హత్యాచారానికి గురైన కేసులో నిందితుడి తరపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘోరం వెనుక ఉంది జిహాదీలే తప్ప.. తన క్లైయింట్లు కాదని వ్యాఖ్యానించాడు. పథాన్కోట్ జిల్లా మరియు సెషన్స్ న్యాయస్థానంలో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు సాంజీ రామ్ స్టేట్మెంట్ను నమోదు చేయగా.. ఆ మరుసటి రోజే సాంజీరామ్ తరపు న్యాయవాది అంకుర్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. (నోరు విప్పిన సాంజిరామ్.. అందుకే చంపా!) ‘ఇది ముమ్మాటికీ జిహాదీల పనే. జమ్ము కశ్మీర్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం వాళ్ల ఎజెండా. అందుకే బాలికను క్రూరంగా చంపి అక్కడ పడేశారు. నా క్లైయింట్లకు ఏ పాపం తెలీదు. కుట్రపూరితంగా వారిని ఇరికించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపడితే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ మేరకు గవర్నర్ వోహ్రాను కలిసి విజ్ఞప్తి చేస్తాం’ అని అంకుర్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ ఘటన తర్వాత నోమాదిక్ తెగ వారికి ప్రభుత్వ స్థలాల్లో ఆశ్రయాలను ఏర్పాటు చేసుకునేందుకు అప్పుడు సీఎంగా ఉన్న మెహబూబా ముఫ్తీ ఇచ్చిన ఆదేశాలు.. ఇప్పటికీ కొనసాగటంపై అంకుర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. తక్షణమే ఆ ఆదేశాలను రద్దు చేయాలని గవర్నర్ను కోరనున్నట్లు అంకుర్ తెలిపాడు. (‘కథువా’ బాలిక తల్లి సంచలన వ్యాఖ్యలు) అయితే న్యాయ నిపుణులు మాత్రం అంకుర్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై నేరారోపణలు నమోదు అయ్యాక.. (నిందితుడి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు కూడా...) న్యాయవాది అంకుర్ ఇలా ఎలా వ్యాఖ్యలు చేయగలుగుతున్నారని వారు మండిపడుతున్నారు. కథువాకు సమీపంలోని ఓ గ్రామంలో నోమాదిక్ తెగకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి.. వారంపాటు పైశాచికంగా లైంగిక దాడి చేసి మరీ హతమార్చారు. ఈ ఘటన కథువా కేసుగా ప్రప్రంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
కథువా నిందితులపై అభియోగాల నమోదు
సాక్షి, పఠాన్కోట్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూ కశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసును విచారిస్తున్న న్యాయస్థానం ఎనిమిది మంది నిందితులకు గాను ఏడుగురిపై అభియోగాలు నమోదు చేసింది. దీంతో నిందితులపై విచారణ ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసిందని అధికారులు పేర్కొన్నారు.నిందితులపై నేరపూరిత కుట్ర, హత్య, సామూహిక లైంగిక దాడి నేరాలను నమోదు చేసినట్టు జిల్లా సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేకే చోప్రా చెప్పారు. నిందితులు సంజీ రామ్, ఆయన కుమారుడు విశాల్, ప్రత్యేక పోలీసు అధికారులు దీపక్ ఖజురియా, దీపు, సురీందర్ వర్మ, పర్వేష్ కుమార్ అలియాస్ మన్ను, హెడ్కానిస్టేబుల్ తిలక్ రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ దత్తాలపై అభియోగాలు నమోదయ్యాయి. బాలికను అపహరించే కుట్రకు ప్రధాన సూత్రధారిగా సంజీరామ్ను భావిస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి మైనారిటీ వర్గాన్ని తరిమికొట్టే కుట్రలో భాగంగా ఇతర నిందితులతో కలిసి సంజీ రామ్ పకడ్భందీగా ఈ నేరానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. కథువా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. -
కథువా కేసు...గూగుల్, ఫేస్బుక్లకు షాక్!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘కథువా అత్యాచార’ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో గూగుల్, ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ సంస్థలకూ నోటిసులు జారీ చేసింది. వివరాల ప్రకారం...‘కథువా అత్యాచార’ ఘటనలో బాధితురాలి వివరాలను వెల్లడి చేసినందుకు గాను వివరణ ఇవ్వాల్సిందిగా గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్ సంస్థలకు అంతకముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలకు సమాధానం చెప్పే అధికారం తమకు లేదంటూ ఆయా కంపెనీల భారతీయ అనుబంద సంస్థలు తెలిపాయి. దాంతో కోర్టు ఈ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. మీడియా సంస్థలు అత్యాచార బాధితురాలి వివరాలు వెల్లడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) దాఖలు చేసిన పిటీషన్ విచారించడానికి ఢిల్లీ హైకోర్టు ఒక బెంచ్ను ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ గూగుల్తో పాటు ఇతర ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా సైట్లు మైనర్ అత్యాచార బాధితురాలి వివరాలను బహిర్గతం చేసాయని తెలిపింది. కానీ ఇటువంటి పనులు చేయడానికి సదరు కంపెనీలకే కాక ఎవరికి ఎటువంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు గత నెల 12 మీడియా సంస్థలకు, ఒక్కొక్క సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఇలా బాధితురాలి వివరాలను వెల్లడించడం వల్ల ఆ కుటుంబానికే కాక సమాజంలోని మహిళలపై కూడా దీర్ఘకాలంలో ఈ అంశాలు ప్రభావం చూపుతాయని తెలిపింది. చట్టాన్ని అతిక్రమించినందుకు గాను సదరు కంపెనీలు ఐపీసీ సెక్షన్ 228 - ఏ కింద శిక్షార్హులని తెలిపింది. -
కథువా కేసులో కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: కథువా కేసులో సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బాధిత కుటుంబానికి, న్యాయవాదికి, సాక్ష్యులకు రక్షణ కల్పించాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ‘కథువా కేసును పఠాన్కోట్ జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నాం ఈ కేసులో ప్రతీరోజు వాదనలు జరగాలి. కేసు విచారణ త్వరగతిన పూర్తి కావాలి. కోర్టు విచారణను రహస్య విచారణ చేపట్టాలని ఆదేశించింది(ఇన్-కెమెరా ప్రోసీడింగ్స్). ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించుకునేందుకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి అనుమతిస్తున్నాం’ అని బెంచ్ తెలిపింది. ఈ కేసులో తదుపరి వాదనను జూలై 9కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మమ్మల్ని కాల్చిచంపండి:‘కథువా’ బాలిక తల్లి అందుకే చిన్నారిని చంపాం: సాంజిరామ్ 8 ఏళ్ల చిన్నారిని ఆలయంలో బంధించి అత్యాచారం చేసి, ఆపై అత్యంత దారుణంగా హతమార్చిన ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సాంజీరామ్ అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగితోసహ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును జమ్ము కశ్మీర్ నుంచి ఛండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధిత బాలిక తండ్రి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసింది. మరోపక్క నిందితులు మాత్రం ఆ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగానే దర్యాప్తు జరుపుతున్నారంటూ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తాజాగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కథువా కేసు; షమీ భార్య షాకింగ్ కామెంట్స్ కామాంధులకు మరణశిక్ష.. ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం -
‘కథువా’ బాలిక తల్లి సంచలన వ్యాఖ్యలు
బనిహాల్(జమ్ముకశ్మీర్): ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి కీలక తీర్పులు వెలువడనున్నాయి. కేసు విచారణను జమ్ముకశ్మీర్ నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలన్న బాధిత కుటుంబం అభ్యర్థన, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాన్న నిందితుల డిమాండ్.. ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం ప్రకటించనుంది. కాగా, తమ కుటుంబానికి జరిగిన దారుణాన్ని తలుచుకుంటూ మృతురాలి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని కాల్చిచంపండి: కథువాలో దారుణ సంఘటన, అనంతర పరిణామాల తరువాత బాధిత కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది. ప్రస్తుతం వారు కథువాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనిహాల్(రంబాన్ జిల్లా)లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. కనీస అవసరాలు కూడా లేని చిన్న గుడారంలో కాలం వెళ్లదీస్తోన్న ఆ కుటుంబం.. ఇప్పటికీ భయంతో వణికిపోతున్నది. ‘‘నా బిడ్డను పొట్టనపెట్టుకున్న ఆ దుర్మార్గులు బయటికొస్తే మిగిలిన మా నలుగురినీ(తను, భర్త, ఇద్దరు పిల్లు) చంపేస్తారు. మాకు కావాల్సిందల్లా న్యాయమే. ఒకవేళ న్యాయం చేయలేరనుకుంటే మమ్మల్ని కాల్చిచంపేయండి’’ అని కన్నీటిపర్యంతం అయిందా తల్లి. అమాయకులు కాదు.. దుర్మార్గులు: రసానాలో తాము గడిపిన రోజులు నిజంగా భయంకరమైనవని, సాంజీరామ్(బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు) కుటుంబీకులు చాలా క్రూరంగా ప్రవర్తించేవారని మృతురాలి తల్లి గుర్తుచేశారు. ‘‘ ఊరి బయట పచ్చికలోనూ మా పశువుల్ని మేపనిచ్చేవారు కాదు. చివరికి నా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు. అక్కడ(రసానాలో) మాకున్న ఇల్లు, ఆస్తి అంతా ధ్వంసమైపోయింది. కోర్టులో చెప్పుకున్నట్టు వాళ్లేమీ(నిందితులేమీ) అమాయకులు కాదు. పచ్చి దుర్మార్గులు. వాళ్లను ఉరితీయాల్సిందే. పొరపాటున బయటికొస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు’’ అని బాలిక తల్లి అన్నారు. పశువుల పెంపకమే వృత్తిగా జీవించే బకర్వాల్ సంచార తెగకు చెందిన కుటుంబాలు.. చాలా కాలం కిందటే కథువా ప్రాంతంలో శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. విశాలమైన పచ్చకబయళ్లున్న ఆ ప్రాంతంలో తమ గొర్రెలు, మేకలు, గుర్రాలను మేపేవారు. ముస్లిం తెగల వ్యాప్తిని జీర్ణించుకోలేని స్థానికులు కొందరు.. బకర్వాల్లను అక్కడి నుంచి వెళ్లగొట్టాలనుకున్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే.. ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి, కొద్దిరోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారం జరిపి, చివరికి కొట్టిచంపేశారు. జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఈ విషయాలను పేర్కొన్నారు. అయితే, తాము అమాయకులమని, చిన్నారి మరణంతో ఎలాంటి సంబంధంలేదని నిందితులు వాదిస్తున్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని, ఆమేరకు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. అటు బాధిత కుటుంబం సైతం కేసును జమ్ముకశ్మీర్ నుంచి బయటికి తరలించి విచారించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
‘ఆ చిన్నారికి తాతలాంటోడిని..’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన కథువా కేసులో ప్రధాన నిందితుడు సాంజిరామ్ ట్విస్ట్ ఇచ్చాడు. తాను అమాయకుడినని, తనకే పాపం తెలీదని.. కుట్రపన్ని పోలీసులు ఈ కేసులో ఇరికించారని ఆరోపణలకు దిగాడు. ఈ మేరకు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో శుక్రవారం ఓ అఫిడవిట్ దాఖలు చేశాడు. అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు... ‘ఆ చిన్నారికి నేను తాతలాంటోడ్ని. పోలీసులు కుట్ర పన్ని ఈ కేసులో మమల్ని ఇరికించారు. బాధితురాలికే కాదు.. ఈ కేసులో మాకు కూడా న్యాయం జరగాల్సిందే. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే అసలు నేరస్థులు ఎవరన్నది తేలుతుంది. ఛండీగఢ్ కోర్టుకు కేసును బదిలీ చేయాలన్న డిమాండ్ హేతుబద్ధమైంది కాదు. కానీ, ఈ కేసులో 221 మంది సాక్ష్యులు ఉన్నారు. వారందరినీ కథువా నుంచి ఛండీగఢ్ తరలించటం చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా బాధిత కుటుంబానికి ప్రాణహాని ఉందన్న నేపథ్యంలోనే కేసును బదిలీ చేయాలని కొందరు వాదిస్తున్నారు. కానీ, దీనివెనుక వేరే ఉద్దేశం ఉంది. మా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. మమల్ని చంపాలని చూస్తున్నారు. అందుకే అనుమతించొద్దు’ అని సాంజీరామ్, అతని తనయుడు విశాల్ తరపున న్యాయవాది అఫిడవిట్లో విజ్ఞప్తి చేశారు. కథువా కేసు.. దిగ్భ్రాంతికర విషయాలు ఇక ఈ కేసులో బాధితురాలి తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రజావత్ను కూడా సాంజీ రామ్ వదల్లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టులో ఆమె వాదనలు వినిపించలేదు. అలాంటప్పుడు ప్రాణ హాని ఉందని ఆమె ఎలా అంటున్నారు. ఆమె కోసం నియమించిన భద్రతా సిబ్బందిని వెంటనే తొలగించాలి’ అని సాంజీ రామ్ విజ్ఞప్తి చేశాడు. కాగా, తన కొడుకును రక్షించుకునేందుకే ఆ చిన్నారిని చంపాల్సి వచ్చిందన్న సాంజీరామ్ వాంగ్మూలాన్ని పోలీసులు ఇదివరకే నమోదు చేశారు. నేను కూడా ‘కథువా’ బాధితురాలినే... ‘కథువా’ నిరసన; మోదీకి చేదు అనుభవం -
కథువా ఘటన : న్యాయవాదికి ఎమ్మా వాట్సన్ మద్దతు
లాస్ ఏంజెల్స్ : జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కుతున్న సంగతి తెలిసిందే. అత్యంత కిరాతకమైన ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా హ్యారీ పోర్టర్ నటి ఎమ్మా వాట్సన్ స్పందించారు. అత్యాచార బాధిత తరుఫున వాదిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రజావత్కు ఆమె మద్దతు తెలిపారు. దీపికా సింగ్ రజావత్కు మద్దతు తెలుపుతూ ఎమ్మా వాట్సన్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ఓ ఆర్టికల్ను షేర్ చేస్తూ... దీపికా సింగ్ రజావత్కే అన్ని అధికారాలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మా వాట్సన్ ఐక్యరాజ్యసమితిలో మహిళల గుడ్విల్ అంబాసిడర్గా ఉన్నారు. యువతుల్లో సాధికారిత కలిగించేందుకు ఆమె క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఎమ్మా వాట్సన్ షేర్చేసిన ఆర్టికల్లో రజావత్ నమ్మకాన్ని, వృత్తి పట్ల ఆమెకున్న వైఖరిని పేర్కొన్నారు. కథువా అత్యాచార ఘటనకు సంబంధించి మొట్టమొదట రిట్ పిటిషన్ వేసిన లాయర్ దీపికా సింగ్ రజావత్. చిన్నారిపై జరిగిన ఘాతుకానికి చలించి కథువాలోని ఆ పాప తండ్రిని కలిసి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును చేపట్టిన వెంటనే ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ఆమె భయపడకుండా.. హంతకులకు శిక్షపడి, ఆ పాప తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు వెనక్కితగ్గేది లేదని కరాఖండిగా చెప్పారు. కశ్మీరీ పండిట్ అయిన 38 ఏళ్ల దీపికా సింగ్ రజావత్ స్వస్థలం కశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని సరిహద్దు జిల్లా కుప్వారాలో కరిహామా గ్రామం. ఈ చిన్నారి తరుఫున వాదిస్తున్న రజావత్కు బెదిరింపులు ఎక్కువ అవడంతో, ఆమెకు సెక్యురిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. రజావత్తో పాటు, చిన్నారి కుటుంబానికి, బాధిత కుటుంబానికి సాయంగా ఉన్న బకర్వాల్ కమ్యూనిటీ సభ్యుడు తలీబ్ హుస్సేన్కు కూడా సెక్యురిటీ ఏర్పాటు చేయాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్ హైకోర్టులో ఈ కేసు వాదనలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. All power to Deepika Singh Rajawat ✊🏻https://t.co/sZzDVcIFNo — Emma Watson (@EmmaWatson) May 3, 2018 -
కశ్మీర్ కేబినెట్లోకి ‘కథువా’ ఎమ్మెల్యే
సాక్షి, జమ్మూ : జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంలో సోమవారం మంత్రి పదవులు స్వీకరించిన ఆరుగురు బీజేపీ శాసన సభ్యుల్లో ఒకరు కథువా శాసన సభ్యుడు రాజీవ్ జస్రోటియా కూడా ఉన్నారు. కథువాలో సంచారజాతి ముస్లిం కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా రేప్ చేసి, హత్య చేసిన సంఘటనలో నిందితులకు మద్దతుగా జరిపిన ర్యాలీలో ఈ జస్రోటియా కూడా పొల్గొన్నారు. అంతేకాకుండా ఆ సంచార జాతి ముస్లింలను తరిమేసేందుకు వారిపై హింసను ప్రోత్సహించడమే కాకుండా ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన దారుణాన్ని కూడా బహిరంగంగా సమర్థించారు. కథువా దారుణంలో నిందితులకు మద్దతుగా జనవరి 17వ తేదీన ‘హిందూ ఏక్తా మంచ్’ నిర్వహించిన ర్యాలీలో పొల్గొన్నారన్న కారణంగానే పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ శాసన సభ్యులు లాల్ సింగ్, చందన ప్రకాష్ గంగాలను బీజేపీ అధిష్టానం తొలగించింది. అదే ర్యాలీలో పాల్గొన్న కథువా బీజేపీ ఎమ్మెల్యే జస్రోటియాకే ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టింది. డిప్యూటీ ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ సహా మరికొంత మంది బీజేపీ మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ బీజేపీ అధిష్టానం దష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపిన పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది మంది మంత్రుల్లో ఎనిమిది మందిని తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు వారు రాజీనామా చేశారు. ఆ స్థానంలో సోమవారం ఆరుగురు బీజేపీ శాసన సభ్యులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో ఒకరు సహాయ మంత్రి హోదా నుంచి పదోన్నది లభించిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ముఫ్తీ సూచన మేరకు రాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రి పదవి నుంచి నిర్మల్ సింగ్ను పార్టీ అధిష్టానం తొలగించలేదని, ముఫ్తీకి చెక్ పెట్టేందుకు మరింత కరుడుగట్టిన ఆరెస్సెస్ నాయకుడు కవీందర్ గుప్తాను ఆయన స్థానంలో తీసుకొచ్చిందని స్థానిక బీజేపీ వర్గాలు తెలియజేస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కవీందర్ గుప్తా విలేకరులతో మాట్లాడుతూ కథువా సంఘటన చాలా చిన్న విషయమని, దాన్ని అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కవీందర్ సింగ్ మొదటి నుంచి వివాదాస్పద నాయకుడే. 2015లో ఆయన రాష్ట్ర అసెంబ్లీలో స్వీకర్ బాధ్యతలు స్వీకరిస్తూ, తాను ఆరెస్సెస్ సభ్యుడిని అయినందుకు అత్యంత గర్వపడుతున్నానని, ఇక్కడ కేవలం స్పీకర్నేనని అన్నారు. ఇదిలా ఉండగా, కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో ఇద్దరికి నేరస్థులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. వారే కిష్టావర్ ఎమ్మెల్యే సునీల్ శర్మ, దోడా ఎమ్మెల్యే శక్తి పరిహార్లు. 2013లో ఈద్ నాడు ఓ ముస్లింను హత్యచేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పరారీలో ఉన్న హరి కషన్తో కలిసి వీరిద్దరు 2016, మార్చి నెలలో ఫొటో దిగారు. అప్పటికే కోర్టు హరి కషన్ను ‘పరారీలో ఉన్న నిందితుడి’గా ప్రకటించింది. ఉధంపూర్ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ నివాసంలో ఈ ముగ్గురు కలిసి ఫొటో దిగారు. సింగ్, శర్మల తరఫున కశ్మీర్ ఎన్నికల్లో హరి కషన్ బహిరంగంగానే ప్రచారం చేశారు. ఓ ముస్లింను సజీవంగా దహనం చేసిన మరో కేసులో ప్రధాన నిందితుడు రోషన్ లాల్తో కూడా శర్మకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. కిష్టావర్లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ను ఇరువురు కలిసి చూశారు. టీవీ ప్రసారాల్లో వారు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
కఠువా రేప్ ఓ చిన్న ఘటన
జమ్మూ: జమ్మూకశ్మీర్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కొన్నిగంటలు కూడా గడవకముందే బీజేపీ నేత కవీందర్ గుప్తా(59) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కఠువాలో అసిఫా(8) అనే బాలికను అత్యాచారం చేసి, హత్యచేయడం చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ సత్పాల్ శర్మ, గుప్తాతో పాటు మరో ఆరుగురు సోమవారం బీజేపీ–పీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేరారు. ఈ సందర్భంగా కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించినందుకే బీజేపీ నేతల్ని తప్పించారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. ‘కఠువాలో జరిగింది ఓ చిన్న ఘటనే. ఇలాంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలో మనం ఆలోచించాలి. ఇలాంటి చాలా సమస్యల్ని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ ఒక్క ఘటనకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు’ అని గుప్తా పేర్కొన్నారు. కాగా, కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజీవ్ జస్రోటియాకు మంత్రివర్గంలో చోటుదక్కడం గమనార్హం. -
పోక్సో చట్టంతో బాలురకూ రక్షణ!
న్యూఢిల్లీ: లైంగిక దాడులకు గురవుతున్న బాలురకూ రక్షణ కల్పించేలా పోక్సో (లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను రక్షించే చట్టం) చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కఠువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ వారికి గరిష్టంగా మరణశిక్ష విధించేలా కేంద్రం ప్రతిపాదించిన పోక్సో చట్ట సవరణ ఆర్డినెన్స్కు ఇటీవల రాష్ట్రపతి ఓకే చెప్పడం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోక్సోకు తాజాగా మరో సవరణ తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. బాలురపై లైంగిక వేధింపులను పట్టించుకోవడం లేదని నిర్మాత, సామాజిక కార్యకర్త ఇన్సియా దరివాలా ఆన్లైన్లో చేసిన ఫిర్యాదుకు మంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు. -
కథువా కేసు.. విస్మయపరిచే కోణం
శ్రీనగర్: సంచలనం సృష్టించిన కథువా హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాంజి రామ్ ఎట్టకేలకు నోరు మెదిపాడు. విచారణలో పోలీసులకు అతను దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడించాడు. కుమారుడిని రక్షించుకునేందుకు ఆ బాలికను చంపినట్లు సాంజి రామ్ తెలిపాడు. హిందూ ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతం నుంచి నోమాదిక్ గుజ్జర్, బకర్వాల్ తెగలను తరిమికొట్టాలన్న ఉద్దేశంతోనే తాము ఈ ఘటనకు పాల్పడినట్లు సాంజి రామ్ వివరించాడు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... జనవరి 7వ తేదీ నుంచే బాలిక కిడ్నాప్ కోసం సాంజి రామ్ ప్రణాళిక అమలు చేశాడు. జనవరి 10న మత్తుమందు ఇచ్చి బాలికను అపహరించి ఆలయానికి తరలించారు. అదే రోజు సాంజిరామ్ మేనల్లుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే లైంగిక దాడి జరిగిన విషయం 13వ తేదీన తనకు తెలిసిందని సాంజిరామ్ వివరించాడు. తన కుమారుడితోపాటు అల్లుడు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని.. వారిని రక్షించుకునేందుకే ఆ బాలికను చంపేసినట్లు సాంజి రామ్ దర్యాప్తు బృందానికి చెప్పారు. జనవరి 13 అర్ధరాత్రి విశాల్(సాంజిరామ్ కొడుకు), అతని స్నేహితుడు పర్వేశ్ కుమార్(మన్ను).. ఆలయం నుంచి బాలికను బయటకు తీసుకొచ్చారు. చంపేముందు మరోసారి అత్యాచారం చేస్తానని పోలీసాధికారి దీపక్ ఖజూరియా నిందితులతో చెప్పాడు. కానీ, పరిస్థితులు సహకరించకపోవటంతో బాలికను తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు అంటే.. జనవరి 14న బాలికను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. తర్వాత బాలిక మృతదేహాన్ని హీరానగర్ కాలువ వద్ద పడేయాలని పథకం రచించారు. విశాల్, ఖజూరియా, పర్వేశ్ కుమార్, మైనర్ బాలుడు అంతా కలిసి బాలిక మృతదేహాన్ని ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. రామ్ బయట కాపలాకాశాడు. చివరకు కారు దొరక్కపోవటంతో జనవరి 15వ తేదీ మధ్యాహ్నం విశాల్, సాంజిరామ్ మేనల్లుడు కలిసి సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృత దేహాన్ని పడేసి వచ్చారు. అయితే సాంజిరామ్ స్టేట్మెంట్పై స్పందించేందుకు అతని తరపు న్యాయవాది నిరాకరించారు. ఛార్జీ షీట్ వివరాలు... మైనర్ బాలుడితోపాటు, సాంజిరామ్, అతని తనయుడు విశాల్, సాంజిరామ్ అల్లుడు, పోలీస్ అధికారులు ఖజూరియా, సురేందర్ వర్మ, పర్వేశ్ కుమార్ పేర్లతో ఛార్జీషీట్ దాఖలు చేశారు. సాంజిరామ్పై హత్య, అపహరణ, ఆధారాలను మాయం చేయటం.. పర్వేశ్ కుమార్(మన్ను)పై అపహరణ కింద కేసు నమోదు చేశారు. సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు తీసుకుని ఆధారాలు మాయం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దత్తాల పేర్లను కూడా ఛార్జ్షీట్లో చేర్చారు. జనవరి 17న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు జనవరి 23న కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేయగా.. సిట్ను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ 8 మందిని అరెస్ట్ చేసింది. సుప్రీం కోర్టు జోక్యంతో ఏప్రిల్ 16న కేసులో విచారణ ప్రారంభం.. తదుపరి విచారణ ఏప్రిల్ 28కి వాయిదా. ఈ కేసు విచారణ జమ్ము కశ్మీర్ కోర్టులో చేయవద్దని.. ఛండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధితురాలి తండ్రి సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ కేసును విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని దిగువ న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది. -
కథువా ఘటన; ఆ సినిమాను చూడకండి
సాక్షి, ముంబై: బాలీవుడ్ చిత్రం వీరె ది వెడ్డింగ్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ఉద్యమం మొదలైంది. కథువా ఘటనపై స్పందిస్తూ ఈ చిత్రంలోని హీరోయిన్లు ఫ్లకార్డ్లతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే వారి చేష్టలు సమంజసంగా లేవంటూ ఆ సమయంలో విమర్శలు.. ట్రోలింగ్ ఎదురుకాగా... ఇప్పుడు ఆ ప్రభావం వాళ్లు నటించిన చిత్రంపై పడింది. ‘హిందువుల అత్మగౌరవం నిలవాలంటే ఈ చిత్రాన్ని(వీరె ది వెడ్డింగ్) బహిష్కరించండి. కరీనా, సోనమ్, స్వరభాస్కర్లు బీగ్రేడ్ హీరోయిన్లు. హిందువులపై అపవాదులు వేసే అలాంటి వాళ్ల చిత్రాలను ఆదరించాల్సిన అవసరం హిందువులకు లేదు. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే’ అంటూ ప్రముఖ కాలమిస్ట్ షెఫాలీ వైద్యా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీటర్లో బాయ్కాట్వీర్దేవెడ్డింగ్ పేరిట యాష్ ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు. ఇక హిందువులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఈ హీరోయిన్లంతా ఎక్కడికి పోయారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కథువా చిన్నారిపై ఘటనను తామూ ఖండిస్తున్నామని.. కానీ, సరిగ్గా సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలోనే వీళ్లు ఇలా డ్రామాలు ఎంతవరకు సరైందని మరికొందరు రీట్వీట్లు చేస్తూ షెఫాలీ నినాదానికి మద్ధతు ఇస్తున్నారు. హిందుస్థాన్లో పుట్టినందుకు సిగ్గు పడుతున్నామని.. ఆలయంలో హత్యాచారానికి గురైన 8 ఏళ్ల చిన్నారికి న్యాయం జరగాలంటూ ఈ ముగ్గురు ఫ్లకార్డ్లతో తమ ఫోటోలను ట్వీటర్లో పోస్ట్ చేసి ట్రోలింగ్ను ఎదుర్కున్నారు. -
కథువా కేసు; షమీ భార్య షాకింగ్ కామెంట్స్
కోల్కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ షాకింగ్ కామెంట్లు చేశారు. తన వ్యవహారాన్ని కథువా హత్యాచార ఘటనతో ఆమె పోల్చుకుంది. బుధవారం సాయంత్రం కథువా బాధిత చిన్నారి కోసం ఓ ఎన్జీవో నిర్వహించిన శాంతి ర్యాలీలో హసిన్ పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కథువా కేసులో నిందితులు ఎంతటి వారైనా సరే శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా. ఒక రకంగా నేను కూడా కథువా తరహా బాధితురాలినే. కానీ, ఆ చిన్నారి చనిపోతే.. నేనింకా బతికున్నా. కథువా ఘటనలో ఏవేం జరిగాయో.. నాక్కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. నన్ను అత్యాచారం చేయాలని షమీ కుటుంబ సభ్యులు యత్నించారు. ఆపై చంపి నా శవాన్ని చెత్తకుప్పలో పడేయాలని వారు ప్రయత్నించారు. రెండు నెలలపాటు షమీ కుటుంబ సభ్యులతో పోరాడి నేను ప్రాణాలతో బతికి బయటపడ్డాను’ అని జహాన్ మీడియాతో తెలిపింది. కాగా, గతంలో భర్త షమీపై సంచలన ఆరోపణలు చేసిన జహాన్.. ఇప్పుడు చేసిన ఈ కామెంట్లు అతన్ని మరిన్ని చిక్కుల్లోని నెట్టేసేలా కనిపిస్తున్నాయి. ఇక గృహ హింస చట్టం కింద కేసు నమోదు కావటంతో షమీని, అతని సోదరుడిని ప్రశ్నించిన కోల్కతా పోలీసులు.. వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. షమీతోపాటు అతని సోదరుడు, తల్లి కూడా తనని హింసించి చంపాలని చూశారంటూ ఆరోపించిన ఆమె.. తనకు-కూతురి పోషణ కోసం భరణం కోరుతూ షమీపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఉరి వల్ల రేప్లు ఆగుతాయా?
న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారానికి పాల్పడే కీచకులకు మరణదండన విధించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్(పోక్సో చట్టంలో సవరణ)పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవున్నాయి. పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కేంద్ర నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు ఆగుతాయా? ఆర్డినెన్స్ జారీ చేయడానికి ముందు కేంద్రం శాస్త్రీయ అధ్యయనం చేసిందా? అత్యాచారానికి, హత్యకు శిక్ష ఒకటే అయినప్పుడు.. రేప్ చేసిన నిందితుడు బాధితురాలిని బతకనిస్తాడా?’’ అని జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరిశంకర్లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అత్యాచార ఉదంతాలకు సంబంధించి గతంలో చేసిన ఐపీసీ చట్టసవరణ దుర్వినియోగం అవుతోందం’టూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నిర్భయ చట్టం తర్వాత ఏంజరిగింది?: కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అకృత్యం, ఉన్నావ్లో మైనర్ బాలికపై అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన దరిమిలా కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసింది. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిపితే ఖచ్చితంగా మరణశిక్ష విధించాలన్నది ఆ సవరణ ఉద్దేశం. కాగా, గతంలో నిర్భయ ఉదంతం తర్వాత కూడా ఇదే మాదిరిగా కఠిన చట్టాలను రూపొందించడం, వాటి వల్ల నేరాలు అదుపులోకి రానివిషయాన్ని సామాజిక, న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. నిర్భయ చట్టం తర్వాత లైంగిక నేరాలు అదుపులోకొస్తాయని జాతి యావత్తూ విశ్వసించినా, వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది. పోర్న్ సైట్లను నిషేధించండి: బీజేపీ మంత్రి దేశంలో లైంగికనేరాల పెరుగుదలకు పోర్న్ వెబ్సైట్లే ప్రధాన కారణమని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. యువతపై అశ్లీల సైట్ల ప్రభావం అధికంగా ఉందని, కాబట్టి వెంటనే వాటిపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖరాశారు. (చదవండి: కఠిన చట్టాలే పరిష్కారమా?) -
పోక్సో చట్ట సవరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోక్సో(లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం) చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ సవరణలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్టానికి సవరణలు చేసే ముందు కేంద్రం పూర్వాపరాలను పరిగణలోకి తీసుకోలేదని.. ఎటువంటి పరిశోధన జరపకుండానే హడావిడిగా ఆర్డినెన్స్ జారీ చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను చల్లార్చేందుకు మాత్రమే కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసినట్టుగా ఉందంటూ ఢిల్లీ హైకోర్టు బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు లేనందున కేంద్రం ప్రతిపాదించిన పలు ఆర్డినెన్స్లపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. అత్యాచార దోషులకు కఠిన శిక్షలతోపాటు, రుణ ఎగవేత దారుల ఆస్తుల జప్తు, శిక్షల విధింపునకు సంబంధించిన ఆర్డినెన్స్లను అత్యవసరమైనవిగా భావించి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రానున్నాయి. -
రేప్ ఘటనలపై రాద్ధాంతం వద్దు
లక్నో: భారత్లాంటి పెద్ద దేశంలో జరిగే ఒకటీ రెండు అత్యాచార ఘటనలపై అతిగా స్పందించవద్దనీ కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ వ్యాఖ్యానించారు. కఠువా, ఉన్నావ్ ఘటనలతో దేశంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బరేలీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘ఇలాంటివి జరగటం దురదృష్టకరం.. కొన్ని సార్లు వీటిని ఆపడం సాధ్యం కాదు.. భారత్ లాంటి పెద్దదేశాల్లో ఇలాంటి ఘటనలు ఒకటీ రెండు జరిగినప్పుడు వాటిపై రాద్ధాంతం చేయటం తగదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటోంది..’అని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన బరేలీ ఎంపీ సంతోష్ గంగ్వార్ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. -
ఆర్డినెన్స్లకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: అత్యాచార దోషులకు కఠిన శిక్షలతోపాటు, రుణ ఎగవేత దారుల ఆస్తుల జప్తు, శిక్షల విధింపునకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన ఆర్డినెన్స్లపై రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరగడం లేనందున, ఈ ఆర్డినెన్స్లను అత్యవసరమైనవిగా భావించి.. రాజ్యాంగంలోని 123 ఆర్టికల్ ప్రకారం వీటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని గెజిట్ నోటిఫికేషన్ తెలిపింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్లను కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదించిన రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ ప్రకారం.. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. అలాగే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు మరో ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. -
అత్యాచారాలను ఆపలేం: కేంద్ర మంత్రి
సాక్షి,న్యూఢిల్లీ: చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తతున్నవేళ కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలను అడ్డుకోలేమని, ప్రభుత్వాలు తమ వంతుగా పనిచేస్తున్నా ఇలాంటివి జరుగుతుండటం దురదృష్టకరమని అన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతపెద్ద దేశంలో ఒకటి రెండు జరిగితే!: భారత్ చాలా పెద్ద దేశమని, ఏదో ఒక మూలన ఒకటో, రెండో రేప్లు జరిగితే, వాటికి విపరీతమైన ప్రచారం కల్పించి, రాద్ధాంతం చేయాల్సిన అవసరంలేదని కేంద్ర మంత్రి గంగ్వార్ అన్నారు. ‘‘అత్యాచారాలు జరగడం దుదృష్టకరమే. అయితే కొన్ని సార్లు రేప్లను ఆపలేం. అవసరమైన మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇంత పెద్ద దేశంలో ఒకటో రెండో, రేప్లు జరిగితే, ఆ విషయాన్ని రచ్చ చేయాల్సిన అవసరంలేదు’’ అని గంగ్వార్ అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పెనుదుమారం రేగుతున్నది. -
చిన్నారులపై రేప్కు మరణశిక్ష; రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినేట్ వినతి మేరకు పోక్సో చట్టం సవరణ ఆర్డినెన్స్పై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతకం చేశారు. 12 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టే వారికి మరణశిక్ష విధించేలా అత్యవసరంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ఆమోదించారని ఆదివారం రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలికాలంలో చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో.. కఠిన శిక్షల అమలుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిన సంగతి తెలిసిందే. (చదవండి: చిన్నారులపై రేప్కు మరణశిక్షే) -
పోక్సో చట్టసవరణకు కేబినెట్ ఆమోదముద్ర
-
చిన్నారులపై రేప్కు మరణశిక్షే
న్యూఢిల్లీ: చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో.. కఠిన శిక్షల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నడుం బిగించింది. కఠువా, సూరత్ల్లో మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య.. ఉన్నావ్లో బాలికపై అత్యాచార ఘటనల నేపథ్యంలో 12 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టే వారికి మరణశిక్ష విధించేలా అత్యవసరంగా ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ భేటీలో క్రిమినల్ చట్టాల్లో సవరణలు చేస్తూ రూపొందించిన ఈ ఆర్డినెన్స్కు ఓకేచెప్పారు. అత్యాచార కేసుల విచారణకు కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కేసుల దర్యాప్తు కోసం అన్ని పోలీసు స్టేషన్లు, ఆస్పత్రులకు ప్రత్యేక ఫోరెన్సిక్ కిట్లను ఇవ్వనున్నారు. రాష్ట్రపతి సంతకంతో ఈ ఆర్డినెన్స్ తక్షణం అమల్లోకిరా నుంది. ఆర్డినెన్స్లోని సవరణల్ని బిల్లు రూపంలో ఆమోదం కోసం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గరిష్టంగా మరణించేంత వరకూజైలు లేదా మరణశిక్ష తాజా ఆర్డినెన్స్ ప్రకారం 12 ఏళ్లు, 16 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తారు. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి గరిష్టంగా మరణశిక్షను ఖరారు చేశారు. 12 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారానికి పాల్పడితే కనిష్ట శిక్ష 20 ఏళ్లు కాగా గరిష్టంగా దానిని యావజ్జీవంగా(మరణించే వరకూ జైలుశిక్ష అనుభవించడం) పొడిగించడం లేదా మరణశిక్ష అమలు చేయవచ్చు. 12ఏళ్లలోపు బాలికను గ్యాంగ్రేప్ చేస్తే మరణించేంతవరకూ జైలుశిక్ష లేదా మరణశిక్ష విధిస్తారు. 16 ఏళ్ల లోపు బాలికను రేప్ చేసే వారికి ప్రస్తుతం విధిస్తున్న 10 ఏళ్ల కనిష్ట శిక్షను 20 ఏళ్లకు పెంచారు. శిక్షను గరిష్టంగా యావజ్జీవ కారాగారంగా (మరణించే వరకూ జైలుశిక్ష అనుభవించడం) పొడిగించవచ్చు. 16 ఏళ్ల లోపు బాలికను గ్యాంగ్రేప్ చేస్తే యావజ్జీవ శిక్ష(మరణించే వరకూ జైలుశిక్ష అనుభవించడం) విధిస్తారు. మహిళను రేప్చేస్తే కనిష్ట శిక్షను పదేళ్లకు పెంచారు. గరిష్టంగా జీవిత ఖైదు వేస్తారు. ఆర్డినెన్స్ను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించగానే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), ద ఎవిడెన్స్ యాక్ట్, ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్(సీఆర్పీసీ), లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ(పోక్సో) చట్టాల్లో చేసిన సవరణలు అమల్లోకి వస్తాయి. కఠిన శిక్షల కోసం ఆర్డినెన్స్లో పలు నిబంధనలు రేప్ కేసుల్లో కఠిన శిక్షల కోసం న్యాయవ్యవస్థ అధికారాల్ని విస్తృతం చేస్తూ ఈ ఆర్డినెన్స్లో అనేక చర్యల్ని కేబినెట్ రూపొందించింది. విచారణ వ్యవస్థల్ని బలోపేతం చేయడం, రాష్ట్రాలు, హైకోర్టుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుంటూ ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాట్లు మొదలైనవి అందులో ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 524 ఫాస్ట్ట్రాక్ కోర్టులుండగా అందులో అత్యధికంగా యూపీలో 183, మహారాష్ట్రలో 100, తమిళనాడులో 39, ఏపీలో 39, తెలంగాణలో 34 ఉన్నాయి. దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 1800 ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని 14 వ ఆర్థిక సంఘం గతంలో సూచించింది. కేసుల దర్యాప్తు కోసం సుశిక్షితులైన సిబ్బంది కొత్తగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవుల్ని ఏర్పాటు చేయడంతో పాటు అత్యాచార కేసుల కోసం దీర్ఘకాలంలో అన్ని పోలీసు స్టేషన్లు, ఆస్పత్రులకు అధునాతన ఫోరెన్సిక్ కిట్లను అందచేస్తారు. నిర్దేశిత గడువులోగా దర్యాప్తును పూర్తి చేసేలా సుశిక్షితులైన అంకిత భావంతో పనిచేసేవారిని ఈ కేసుల కోసం ప్రత్యేకంగా నియమిస్తారు. రేప్ కేసుల కోసమే ప్రతీ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రత్యేక ఫోరెన్సిక్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తారని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ చర్యలన్నీ యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల్లోపు ప్రారంభంకానున్న ప్రాజెక్టులో భాగమని వెల్లడించారు. ‘నిర్భయ’ తర్వాత అమల్లోకి కఠినశిక్షలు అత్యాచారం కారణంగా మహిళ చనిపోయినా లేదా జీవచ్ఛవంగా మారిన సందర్భాల్లో దోషులకు మరణ శిక్ష విధించేలా 2012 నాటి నిర్భయ ఘటన తర్వాత ప్రభు త్వం చట్టం తెచ్చింది. 12 ఏళ్లలోపు వయస్సున్న చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణ శిక్షను విధించే ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తున్నామని శుక్రవారం కేంద్రం సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది. ఆ 8 దేశాల సరసన భారత్ లైంగిక నేరగాళ్లకు సంబంధించిన వారి వివరాలను సేకరించి తర్వాత వారిపై ఓ కన్నేసి ఉంచే 8 దేశాల జాబితాలో భారత్ చేరనుంది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్ టొబాగో దేశాలు ప్రస్తుతం లైంగిక నేరగాళ్ల కదలికలపై నిఘా పెడుతున్నాయి. వీటిలో లైంగిక నేరగాళ్ల వివరాలు అమెరికాలో బహిరంగంగానే అందుబాటులో ఉండగా మిగిలిన దేశాల్లో న్యాయ, విచారణ సంస్థలకు మాత్రమే ఆ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మంత్రివర్గం నిర్ణయంతో ఇకపై భారత్లోనూ లైంగిక నేరగాళ్లపై నిఘా పెట్టనున్నారు. అయితే ఇది లైంగిక నేరగాళ్లపై సామాజికంగా చెడు ముద్ర వేస్తుందనీ, పునరావాసం అనే ప్రక్రియకు అర్థం లేకుండా పోతుందని పలువురు వ్యతిరేకిస్తున్నారు. నాలుగు నెలల చిన్నారిని చిదిమేశాడు ఇండోర్: కఠువా, ఉన్నావ్ దారుణ ఘటనల్ని మర్చిపోకముందే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మృగాడు రెచ్చిపోయాడు. తల్లిదండ్రులతో నిద్రపోతున్న నాలుగు నెలల పసిపాపను ఎత్తుకెళ్లిన నీచుడు.. ఆమెపై అత్యాచారం చేసి ఎత్తైన భవనం పైనుంచి విసిరేశాడు. దీంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ప్రధాన నిందితుడు, బాధితురాలి తల్లి బంధువైన నవీన్ గాడ్గే(24)ను అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఇండోర్ డీఐజీ హెచ్సీ మిశ్రా మాట్లాడుతూ.. ‘కొద్దిరోజుల క్రితమే నవీన్ భార్య అతని నుంచి విడిపోయింది. దీంతో రజ్వాడా ప్రాంతంలో ఉంటున్న బాధితురాలి తల్లి వద్దకు నిందితుడు గురువారం వెళ్లాడు. తన భార్యను కాపురానికి రావాల్సిందిగా ఒప్పించాలని తన బంధువైన బాలిక తల్లిని కోరాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో నవీన్ వెళ్లిపోయాడు. తిరిగి శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు అక్కడికి చేరుకున్న నిందితుడు.. రోడ్డుపక్కనే తల్లిదండ్రులతో నిద్రపోతున్న బాలికను భుజాలపై ఎత్తుకుని 50 మీటర్ల దూరంలో ఉన్న ఓ వాణిజ్య భవనం బేస్మెంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం చిన్నారిని అదే భవనం పైనుంచి విసిరేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని గుర్తించాం’ అని తెలిపారు. కాగా, చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశారనీ, ఆమె మర్మాంగాలతో పాటు తలపై గాయాలయ్యాయని పోస్ట్మార్టం నిర్వహించిన ఎంవై ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదును స్వీకరించడంలో అలసత్వం వహించిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ త్రిలోక్ సింగ్ను సస్పెండ్ చేసినట్లు మిశ్రా పేర్కొన్నారు. కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లైంగిక నేరాలకు పాల్పడే వారి సమగ్ర సమాచారం, వ్యక్తిగత వివరాల్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో భద్రపరుస్తుంది. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు పర్యవేక్షణ, దర్యాప్తు కోసం ఆ వివరాల్ని క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకుంటారు. అలాగే లైంగిక నేరాలకు పాల్పడిన వారి గత ప్రవర్తనను పోలీసుల ద్వారా నిర్ధారించుకుంటారు. బాధితురాలికి సాయం అందించేందుకు ప్రస్తుతం అమల్లోకి ఉన్న ‘వన్ స్టాప్ సెంటర్ల’ను దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తారు. ‘అత్యాచార ఘటనల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ ఉత్తమ మార్గం. దీనిని బిల్లుగా మార్చేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల(జూలై) వరకూ వేచి ఉండాలి’ అని కేంద్ర న్యాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మోదీజీ మౌనమేల? కఠువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 600 మంది విద్యావేత్తలు, స్కాలర్స్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఈ దారుణ నేరాలకు ఒడిగట్టిన వారిని సంబంధిత రాష్ట్రాలు రక్షించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ అకృత్యాలపై స్పందించకుండా చాలా రోజులు మౌనం వహించారంటూ ప్రధాని మోదీని వారు తప్పుపట్టారు. లేఖ రాసిన వారిలో న్యూయార్క్ వర్సిటీ, హార్వర్డ్ వర్సిటీ, కొలంబియా వర్సిటీల విద్యావేత్తలు ఉన్నారు. తీర్పుపై అప్పీళ్లను ఆరు నెల్లలోపు పరిష్కరించాలి వేగవంతమైన దర్యాప్తు, విచారణ కోసం ఆర్డినెన్స్లో ప్రమాణాల్ని పొందుపరిచారు. అన్ని రేప్ కేసుల్లో దర్యాప్తును తప్పనిసరిగా రెండు నెలల్లోగా పూర్తి చేయాలి. అలాగే రేప్ కేసుల్లో కోర్టు విచారణ రెండు నెలల్లో ముగించాలి. దోషిగా శిక్ష ఎదుర్కొనే వ్యక్తి అప్పీళ్లను ఆరునెల్లలోపు పరిష్కరించాలి. 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం, సామూహిక అత్యాచారం పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలాంటి ముందస్తు బెయిల్ ఇవ్వరు. 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం కేసులో బెయిల్ దరఖాస్తును నిర్ణయించే ముందు.. పబ్లిక్ ప్రాసిక్యూటర్, బాధితురాలి తరఫు ప్రతినిధికి కోర్టు 15 రోజుల నోటీసు ఇవ్వాలి. -
కథువాలో మరో కీలక పరిణామం
కథువా : దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన కథువా ఉదంతంపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, హత్య కేసుపై విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే కథువా ఎస్పీని మార్చేశారు. కథువా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు(ఎస్పీ)గా ఉన్న సులేమాన్ చౌదరి స్థానంలో శ్రీధర్ పాటిల్ నియమించారు. దీంతో కొత్త కథువా ఎస్పీగా శ్రీధర్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కథువాలో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. చిన్నారులపై అత్యాచారం ఒడిగట్టిన వారికి మరణ శిక్ష విధించేందుకు ఆమోదిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ను సైతం తీసుకొచ్చింది. ఈ ఘటనలో స్థానిక పోలీసులదే కీలక పాత్ర కావడంతో, ఈ కేసును స్థానిక పోలీసులు విచారణ చేపట్టడాన్ని ఆందోళనకారులు వ్యతిరేకించారు. దీంతో ఈ కేసును జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో జమ్మూకశ్మీర్ క్రైమ్ బ్రాంచు పోలీసులు ఈ కేసుపై ఛార్జ్షీటు కూడా దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీటులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. బక్వారా ముస్లింలను గ్రామం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా కుట్రలు చేసి, పాపపై అకృత్యం జరగడానికి అసలు సూత్రధారి, రిటైర్డ్ ఉద్యోగి సాంజీ రామ్ను ఏ1గా పేర్కొన్నారు. సాంజీరామ్ మేనల్లుడు( మైనర్), మైనర్ నేరస్తుడి స్నేహితుడు పర్వేశ్ కుమార్, సాంజీరామ్ కొడుకు విశాల్, మీరట్ స్పెషల్ పోలీసులు దీపక్ ఖజూరియా, సురేంద్ర వర్మలు కూడా బాలికపై అత్యాచారం జరిపారన్న ఆధారాలు లభించడంతో వీరిని ప్రధాన నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ప్రస్తుతం కథువా కేసు విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే కొత్త ఎస్పీని నియమించడంపై చర్చనీయాంశంగా మారింది. -
అత్యాచారం చేస్తే ఉరిశిక్షే..
సాక్షి, న్యూఢిల్లీ: ‘పసిపిల్లలపై అకృత్యాలకు ఒడిగట్టే వారికి సమాజంలో బతికే అర్హత ఉండొద్ద’న్న వాదనకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదని తేల్చిచెప్పింది. ఈ మేరకు లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం(పోక్సో)కు సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమైంది. నిర్ణయం అనంతరం చట్టసవరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేసిన పిదప ఆర్డినెన్స్ వెలువడనుంది. ఇటీవల కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
‘కథువా’ కేసు; సంచలన ఆధారాలు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలిచివేసిన కథువా బాలిక హత్యాచారానికి సంబంధించి బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. చిన్నారి శరీర భాగాలు, దుస్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, నిందితుల డీఎన్ఏతో సరితూగాయని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్(డీఎఫ్ఎల్) నివేదికలో వెల్లడైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేర్కొంది. దీంతో చార్జిషీట్లో పేర్కొన్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైందని, కోర్టు విచారణలోనూ ఇవే అంశాలు కీలకం కానున్నాయని సిట్ అధికారులు అన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 28న జరగనుంది. చిన్నారిపై అకృత్యం జరిగింది ఆలయంలోనే!: కథువా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన వేళ ఘటన జరిగిన ప్రదేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘జరిగింది ఆలయంలో కాదంటూ’ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంకూడా సాగింది. అయితే ప్రాధమిక దశలోనే ఆలయం నుంచి సేకరించిన రక్తనమూనాలు, వెంట్రుకలు.. ఇటీవల అరెస్టైన నిందితుల డీఎన్ఏతో సరితూగాయని ఫోనెన్సిక్ నివేదికలో తేలింది. హత్య తర్వాత దుస్తులు ఉతికారు!: రోజుల పాటు చిన్నారికి నరకం చూపించి, హత్యచేసిన తర్వాత సంబంధిత ఆధారాలను చెరిపేసేందుకు నిందితులు యత్నించారు. ‘హత్య తర్వాత బాధితురాలి దుస్తులు ఉతికారు, తల నుంచి పాదాల దాకా తుడిచేశారు. దీంతో ఆధారాలను నిర్ధారించడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆలయంలో లభించిన రక్తనమూనాలు, వెంటుక్రలు ఎవరివనేవి తేల్చలేకపోయాం. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ (డీఎఫ్ఎల్) సహాయాన్ని తీసుకున్నాం. అత్యాధునిక విశ్లేషణా పద్ధతులను అవలంబించే డీఎఫ్ఎల్.. మృతురాలి శరీరభాగాలు, ఒంటిపై లభించిన రక్తపు నమూనాలను విశ్లేషించి, వాటిని నిందితుల డీఎన్ఏతో సరిపోల్చగా దాదాపు ఖచ్చితమైన ఆధారాలు లభించినట్లైంది’’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. కథువా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా నిరసనలు జరిగాయి. -
రేప్ చేస్తామంటూ కాల్స్.. ఆర్టిస్ట్ ఆందోళన!
తిరువనంతపురం: కథువా హత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఆర్టిస్ట్ దుర్గా మాలతి ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనంతో పాటు ఇంట్లో వస్తువులు ధ్వంసమయ్యాయని పట్టాంబి పోలీస్ స్టేషన్లో ఆర్టిస్ట్ ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పలక్కడ్ జిల్లా పట్టాంబిలో ఆర్టిస్ట్ దుర్గా మాలతి కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నారు. అయితే జమ్మూకశ్మీర్లోని ఉన్నావాలో 8 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆపై హత్య ఘటన దుర్గను కలచివేసింది. దీంతో బాలికపై దారుణానికి పాల్పడ్డ నిందితులు హిందువులు కావడంతో.. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఆమె కొన్ని పెయింటింగ్స్ వేశారు. వాటిని తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మర్మాంగం బొమ్మకు తమ దేవుళ్లను లింక్ చేసి అవమానించిందని.. తమ మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు చేసిందన్న కారణంగా కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఆమె ఇంటిపై రాళ్లదాడి చేసి కొన్ని వస్తువులు ధ్వంసం చేశారు. అత్యాచారం చేస్తామని, హత్య చేస్తామని బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయని ఆర్టిస్ట్ దుర్గా మాలతి ఆందోళన వ్యక్తం చేశారు. రేప్ చేస్తామని కొందరు, హత్య చేస్తామని మరికొంత మంది నెటిజన్లు తన పోస్టులకు కామెంట్లు చేస్తున్నారని తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. -
కథువా ఘటన: ఆ డబ్బును కూడా వదలడం లేదు
శ్రీనగర్ : కథువా ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ ప్రభుత్వం ఆ సంభాషణపై విచారణ జరపాల్సిందిగా దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై, హత్య గావించబడిన ఎనిమిదేళ్ల చిన్నారి కుటుంబానికి సాయం చేసేందుకు కొంత మంది వ్యక్తులు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ‘పెద్ద మొత్తంలో సేకరించిన డబ్బు ఆమె కుటుంబానికి చేరడంలేదని.. దుర్వినియోగం అవుతుందనేది’ ఆ సంభాషణలోని సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్ విన్న వెంటనే, దర్యాప్తు సంస్థలకు పంపించానని కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు. అత్యంత హేయమైన మృగాళ్ల చర్య వల్ల కశ్మీర్ పరువు పోవడంతో పాటు ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ట దిగజారిందని ఆయన పేర్కొన్నారు. దోషులకు కచ్చితంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. హేయమైన ఈ చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో చూడాల్సిన ఈ ఘటనకు కొందరు మత రంగు పులుముతున్నారని విమర్శించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, వారి కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువాకు చెందిన ఎనిమిదేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. -
భారత మహిళకు భద్రత చాలా అవసరం
వాషింగ్టన్: కశ్మీర్లోని కఠువాలో బాలికపై హత్యాచార ఘటనను అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ దురదృష్టకరంగా అభివర్ణించారు. దీన్ని నిరసిస్తూ భారత్లో జరుగుతున్న నిరసనలపై స్పందిస్తూ ‘భారత్తో జరుగుతున్న ఆందోళనలు ప్రతిఘటనకు సూచన. భారత అధికారులు, ప్రధాని మోదీ దీనిపై దృష్టి సారిస్తారని భావిస్తున్నాను. భారత మహిళకు భద్రత చాలా అవసరం’ అని ఆమె అన్నారు. భారత్లో కొనసాగుతున్న సంస్కరణ జోరు వచ్చే ఎన్నికల సంవత్సరంలో కొనసాగటం కష్టమేనని తెలిపారు. ‘భారత్లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణ వేగం వచ్చే కొద్ది నెలల్లో ఇలాగే కొనసాగుతుం దని చెప్పలేం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సంస్కరణలు తగ్గుతాయి’ అని గురువారం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో జరిగిన సమావేశంలో ఆమె తెలిపారు. జీఎస్టీ, దివాళా చట్టం వంటివి చాలా గొప్ప సంస్కరణలని ఆమె ప్రశంసించారు. -
సంక్లిష్టంగా కథువా కేసు!
శ్రీనగర్ : కథువా హత్యాచార కేసులో దర్యాప్తు చాలా కష్టతరంగా మారిందని డీఎస్పీ శ్వేతాంబరి శర్మ ప్రకటించారు. ఆధారాలను సేకరించటం చాలా కష్టతరంగా ఉందన్న ఆమె.. ఈ కేసు చాలా సంక్లిష్టంగా మారిందని తెలిపారు. బుధవారం సాయంత్రం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె కేసు పురోగతి విషయాలను వెల్లడించారు. (మోదీకి షాకిచ్చారు) ‘మైనర్ బాలిక హత్యాచార కేసులో ప్రత్యక్ష సాక్ష్యులు లేకపోవటంతో కేసులో దర్యాప్తు చాలా సంక్లిష్టంగా మారింది. నిందితులను విచారణ చేపట్టినా.. ఆధారాలను సేకరించటంలో చాలా కష్టాలు ఎదుర్కుంటున్నాం. ఈ ఘటన అత్యంత పాశవికమైందని ప్రతీ ఒక్కరికీ తెలుసు. కానీ, కావాల్సింది ఆధారాలు. ప్రకటనలు చేసినంత సులువు కాదు కేసు దర్యాప్తు చేయటం’ అని ఆమె వ్యాఖ్యానించారు. బాధితుల తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ దీపికా సింగ్ రజావత్ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. డిఫెన్స్ లాయర్ ఆరోపణలపై... ఇక ఈ కేసులో డిఫెన్స్ లాయర్ అంకుర్ శర్మ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘ ఒక మహిళను ఇలా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం సరికాదు. అలాంటి వ్యాఖ్యలపై నేను స్పందించను. దేశ ప్రజలే బదులిస్తారు’ అంటూ శ్వేతాంబరి వెల్లడించారు. ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యానికి తాను చలించిపోయానన్న ఆమె.. తర్వాత కోలుకుని దర్యాప్తును వేగవంతం చేశానని ఆమె తెలిపారు. ‘మన న్యాయ వ్యవస్థ చాలా శక్తివంతమైంది. దానిపై అనుమానాలు అక్కర్లేదు’ అని ఆమె అన్నారు. కథువా కేసులో నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్న అంకుర్ శర్మ తాజాగా సిట్ పర్యవేక్షకురాలు డీఎస్పీ శ్వేతాంబరి శర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మేధాశక్తిపై అనుమానాలు ఉన్నాయన్న ఆయన.. బృందంలో ఉన్న మిగతా సభ్యుల ప్రభావంతోనే ఆమె దర్యాప్తు చేస్తున్నారంటూ అంకుర్ ఆరోపించారు. Special Investigation Team formed in #Kathuacase has faced a lot of difficulties in collecting evidence in the rape and murder of an eight-year-old girl as told by Deputy Superintendent of Police (DSP) #ShwetambariSharma Read @ANI story | https://t.co/ld8j9KKU9b pic.twitter.com/q8UmcLPfY3 — ANI Digital (@ani_digital) 18 April 2018 -
‘కథువా’ నిరసన; మోదీకి చేదు అనుభవం
లండన్: కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన విదేశీ పర్యటనల్లో ఇదివరకెప్పుడూ లేని విధంగా నిరసనలు చవిచూడాల్సివచ్చింది. భారత్ను కుదిపేసిన కథువా హత్యాచార ఘటనను నిరసిస్తూ, ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు హక్కుల సంఘాలు ఆందోళనలు చేశాయి. సౌత్ ఏసియా సాలిడారిటీ గ్రూప్ ఆధ్వర్యంలో వాహనాలపై పెద్దపెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు. వాటిపై ‘మోదీ నాట్ వెల్కమ్..’, ‘జస్టిస్ ఫర్ ఆసిఫా’ రాతలను ప్రదర్శించారు. థేమ్స్ తీరంలోని బ్రిటన్ పార్లమెంట్ ఎదుట, చుట్టుపక్కల వీధుల్లో ఆ వాహనాలను తిప్పారు. బ్రిటన్లో భారతీయ మహిళా సంఘాలు పార్లమెంట్ స్క్వేర్ వద్ద మౌన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఆందోళనల నేపథ్యంలో భారత ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో లండన్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే మరొకొన్ని చోట్ల మోదీ.. భారతీయు సమూహాలతో కరచాలనం చేస్తూ సందడి చేశారు. జమ్మూకశ్మీరులోని కథువా జిల్లా రసానలో గుర్రాలు మేపుతోన్న ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, రోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి, చివరికు కొట్టి చంపిన ఘటనను ప్రపంచమంతా ఖండించింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఐక్యరాజ్యసమితి సైతం భారత ప్రభుత్వానికి సూచించింది. చిన్నారి హత్యాచారం కేసులో దర్యాప్తు చేసిన సిట్ ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేయగా, సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైంది. అటు ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కథువా, ఉన్నావ్ ఘటనలపై గత శుక్రవారం స్పందించిన ప్రధాని మోదీ.. ఇటువంటి సంఘటనలు మన దేశానికి సిగ్గు చేటని, నేరస్థులను ఉపేక్షించేది లేదని అన్నారు. -
ప్రధాని మోదీకి మన్మోహన్ హితబోధ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావో అత్యాచార ఘటనలపై ప్రధాని మోదీ ఆలస్యంగా స్పందిచడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పుబట్టారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగిన వెంటనే ఖండించకపోవడం వల్ల నేరస్తులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక జాతీయ చానెల్తో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధాని మోదీని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటికైనా ప్రధాని మోదీ మౌనం వీడటం నాకు సంతోషంగా ఉంది. మౌనంగా ఉండకుండా తరచుగా మాట్లాడాలంటూ గతంలో నాకు ఇచ్చిన సలహాను ఆయన తప్పకుండా పాటించాలి. మౌనంగా ఉంటాననే కారణంగా పత్రికా ముఖంగా ఆయన నన్ను విమర్శించేవారు. ఇతరులకు సలహాలు ఇవ్వడమే కాదు. వాటిని తప్పక పాటించాలి’ అంటూ మన్మోహన్ సింగ్ హితబోధ చేశారు. కథువా ఘటన గురించి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో నెటిజన్ల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీ నోరు విప్పక తప్పలేదు. ‘నేరం చేసిన వారిని ఉపేక్షించేది లేదు. మన ఆడబిడ్డలకు తప్పక న్యాయం జరుగతుందంటూ’ ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఎయిర్పోర్టులో భారత్ పరువుకు భంగం
ఇస్తాన్బుల్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ ఘటణలు ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నాయి. టర్కీ ఆర్థిక రాజధానిగా పేరొందిన ఇస్తాన్బుల్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు ‘ఇండియాలో ఆవులకు ఉన్న విలువ అక్కడి మనుషులకు, ముఖ్యంగా మహిళలకు లేదు’ అంటూ టీషర్ట్లపై కొటేషన్లను ముద్రించి వాటిని ధరించి ప్రదర్శిస్తున్నారు. ఇంకా కొంతమంది ‘మీ ఆడవారిని ఇండియాకు పంపించాలనుకుంటున్నారా? అయితే కొంచెం ఆలోచించండి’ అంటూ టీషర్ట్లపై ముద్రించు కున్నారు. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడింది. అంతర్జాతీయంగా భారత్ పరువు పోవడానికి కారణమైన ఆ అత్యాచార నిందితులను వెంటనే ఉరి తీయాలని కొంతమంది నెటిజన్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారంటూ టీషర్ట్ ధరించిన వారిపై మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి మహిళలపై లైంగిక దాడులను అరికట్టనంత వరకు ఇలాంటి అవమానాలను ఎదుర్కొనక తప్పదు. -
అసిఫా కుటుంబానికి రక్షణ ఇవ్వండి
న్యూఢిల్లీ/కఠువా: కఠువాలో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి అసిఫా కుటుంబానికి, ఈ కేసులో బాధితులకు సాయపడుతున్న న్యాయవాదితో పాటు వారి కుటుంబ స్నేహితుడికి రక్షణ కల్పించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కేసు విచారణను కఠువా నుంచి చండీగఢ్ మార్చాలన్న బాధితురాలి తండ్రి పిటిషన్ను కూడా సుప్రీం సోమవారం పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కశ్మీర్ ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో జమ్మూ కశ్మీర్ పోలీసుల దర్యాప్తు పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని బాధితురాలి తండ్రి సుప్రీంకు వెల్లడించడంతో పాటు, సీబీఐ విచారణను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. ‘ఈ స్థితిలో కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై జోక్యం చేసుకునే ఉద్దేశ్యం మాకు లేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం పేర్కొంది. ‘బాధితురాలి కుటుంబానికి, న్యాయవాది దీపక్ సింగ్ రజావత్, కుటుంబ స్నేహితుడు తలిద్ హుస్సేన్కు భద్రతను పెంచాలని జమ్మూ కశ్మీర్ పోలీసులను ఆదేశిస్తున్నాం. జమ్మూలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో కేసు విచారణను బదిలీ చేసే అంశంపై ఏప్రిల్ 27లోగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుతో సంబంధమున్న మైనర్కు తగిన భద్రత కల్పించాలనీ ఆదేశించింది. కేసుతో సంబంధమున్న వారి పిటిషన్లను మాత్రమే విచారిస్తామంది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రస్తావించిన పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది. విధులకు హాజరైన జమ్మూ న్యాయవాదులు కఠువా కేసును సీబీఐకి అప్పగించాలని కోరడంతో పాటు పలు డిమాండ్లతో 12 రోజులుగా విధులు బహిష్కరించిన జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం విధుల్లో చేరారు. బార్ అసోషియేషన్ సమావేశంలో నిర్ణయం అనంతరం వారు కోర్టుకు హాజరయ్యారు. సీబీఐకి అప్పగించండి: నిందితులు తాము ఎలాంటి తప్పు చేయలే దని, తమకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని కఠువా కేసులోని 8మంది నిందితులు కఠువా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జికి విజ్ఞప్తి చేశారు. విచారణ నిమిత్తం సోమవారం వారిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నిందితుల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు.. చార్జిషీట్ కాపీలు సమర్పిం చాలని పోలీసుల్ని జడ్జి ఆదేశించారు. అనంతరం విచారణను ఏప్రిల్ 28కు వాయిదావేశారు. మరోవైపు విచారణ జరుగుతుండగా.. ప్రధాన నిందితుడు సంజీరామ్ కుమార్తె మధు శర్మ సీబీఐ దర్యాప్తు కోరుతూ కోర్టు బయట ఆందోళన నిర్వహించింది. -
మన బిడ్డల్ని కాపాడుకోలేకపోయాం: వైఎస్ జగన్
సాక్షి, మైలవరం: ఆడబిడ్డలను కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం విఫలం చెందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కథువా, ఉన్నావ్లో చోటుచేసుకున్న ఘోరాలు మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలని పేర్కొన్నారు. మున్ముందు ఇలాంటి నేరాలు చేయాలన్న తలంపు కూడా ఏ ఒక్కరికీ రాని విధంగా నిందితులను కఠిన శిక్షించాలని అభిప్రాయపడ్డారు. సోమవారం ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేసిన ఆయన.. ఆంధ్రప్రదేశ్లోనూ మహిళలకు భద్రత కరువైన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘మానవత్వం మంటగలిసిందనడానికి కథువా, ఉన్నావ్ ఘటనలకన్నా వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. ఆడపిల్లల్ని కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం వైఫల్యం చెందాం. బాధకరమైన విషయమేమిటంటే ఆంధ్రప్రదేశ్లోనూ పరిస్థితి అంతకు తీసిపోలేదు. గతేడాది అక్టోబర్ 17న వైజాగ్ రైల్వే కాలనీలో ఓ మహిళపై పట్టపగలే లైంగికదాడి జరిగింది. డిసెంబర్లో పెందుర్తిలో మరో దళిత మహిళను వివస్త్రను చేసి దాడిచేశారు. ఈ సారి నిందితులను అస్సలు విడిచిపెట్టొద్దు. ఏఒక్కరు కూడా ఇలాంటి నేరానికి పాల్పడాలన్న ఆలోచన రాకుండా భయం పుట్టేలా కఠిన శిక్షలు విధించాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. Only in Oct'17,a woman was raped in broad daylight in Railway Colony Vizag. In Dec,a Dalit woman was publicly stripped & assaulted in Pendurthi.This time it cannot be business as usual.This time the punishment must be exemplary so no perpetrator can even dream of such a crime! — YS Jagan Mohan Reddy (@ysjagan) 16 April 2018 -
సుప్రీం జోక్యంతో ‘కథువా’ కేసులో విచారణ ప్రారంభం
-
‘బీజేపీ అంటే బలత్కార్ జనతా పార్టీ’
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమలానాథ్ విమర్శించారు. యూపీలోని ఉన్నావ్.. కశ్మీర్లోని కథువా అత్యాచార ఘటనలకు కారణం బీజేపీ నాయకులేనన్నారు. వరుస అత్యాచార కేసుల్లో 20మందికి పైగా బీజేపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. బీజేపీ అంటే బలత్కార్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు. కఠువా, ఉన్నావో అత్యాచార ఘటనలను నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది. బీజేపీ ప్రభుత్వంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుస అత్యాచారాలు జరుగుతున్నా.. ప్రధాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం అని కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ రేపిస్టులకు రక్షణ కల్పించి, బాధిత కుంటుంబాలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కాగా కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ సున్నితమైన అంశాలతో కూడా రాజకీయం చేస్తుందని ఆరోపించింది. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడమే పనిగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. మరోవైపు కథువా, ఉన్నావో బాధితులకు న్యాయం చేయాలంటూ స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ‘మౌనం సమస్యకి పరిష్కారం కాదు’ , ‘పురుషుల హింసపై నిశ్శబ్దాన్ని వీడండి,’ బెయిల్ వద్దు, ఉరే కరెక్ట్ ’ అనే ప్లకార్డులతో వేలాది మంది ఢిల్లీలో రోడ్లపైకి వచ్చారు. -
‘మెహబూబా ముఫ్తీ వైదొలగాలి’
శ్రీనగర్: కథువా ఘటనకు బాధ్యత వహిస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత, మాజీ మంత్రి లాల్సింగ్ డిమాండ్ చేశారు. కథువా కేసులో నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బీజేపీ మంత్రులు లాల్ సింగ్, చంద్ర ప్రకాశ్ గంగలు పాల్గొన్నారని బీజేపీ అధిష్టానం వారిచే రాజీనామా చేయించిన విషయం తెలిసిందే. అయితే తాము కేవలం రాష్ట్రంలో శాంతి నెలకొల్పడం కోసమే రాజీనామా చేశామన్నారు.అసిఫా అదృశ్యమైన ఏడు రోజుల తర్వాత ఆమె మృత దేహన్ని గుర్తించారని, ఇది పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. హోం శాఖ బాధ్యతలు మెహబూబా వద్దే ఉన్నాయని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘సీఎంజీ.. హోం శాఖ మీ వద్దే ఉంది.. రాష్ట్రంలో లైంగిక దాడులు జరిగితే ఏం చేస్తున్నారు. మేం ఏ తప్పు చేయలేదు. మేం కూడా అసిఫా శ్రేయోభిలాషులమే. అసిఫాకు న్యాయం జరగాల’ని లాల్ సింగ్ అన్నారు. -
కథువా కేసు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : కథువా హత్యాచారం కేసు విచారణను చండీగఢ్ కోర్టుకు బదలాయించాలని దాఖలైన పిటిషన్పై ఏప్రిల్ 27లోగా బదులివ్వాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలో లైంగిక దాడి, హత్యకు గురైన ఎనిమిదేళ్ల చిన్నారి తరపు న్యాయవాదికి, బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్దానం ఆదేశించింది. బాధిత బాలిక తండ్రి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఈ మేరకు స్పందించింది. జమ్మూకశ్మీర్ వెలుపల తమ కేసును విచారించాలని, తమ కుటుంబంతో పాటు కేసును వాదిస్తున్న తమ న్యాయవాదులకు భద్రత కల్పించాలని పిటిషన్లో బాధితురాలి తండ్రి కోర్టును కోరారు. ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన మైనర్ బాలుడిని ఉంచిన జువెనిల్ హోంలో భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించాలని కూడా ఆయన కోరారు. అయితే కశ్మీర్ పోలీసులు బాగా పనిచేశారని సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయస్థానానికి విన్నవించారు. సాక్ష్యాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా.. సైంటఫిక్ ఆధారాలు కూడా సేకరించారని తెలిపారు. తన కుమార్తెపై లైంగిక దాడి, హత్యోదంతంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించాలని ఆయన సర్వోన్నత న్యాయస్ధానాన్ని అభ్యర్థించారు. మరోవైపు ఈ కేసు విచారణను కథువా జిల్లా కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది. నేటి విచారణకు నిందితులందరూ హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో కథువా జిల్లాలోని రసన గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికను గుడిలో నిర్భందించి వారంరోజుల పాటు దుండగులు లైంగిక దాడి చేసి దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. -
‘కథువా’ కేసు: మీడియా అత్యుత్సాహం
సాక్షి, న్యూఢిల్లీ : 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ రేప్, హత్య కేసులో బాధితురాలు అసలు పేరు వెల్లడించకుండా, ఆమె ఫొటోను ప్రచురించకుండా మీడియా ఎంతో సంయమనం పాటించింది. తమ కూతురు తప్పు చేయనప్పుడు పేరు వెల్లడిస్తే తప్పేమిటంటూ నిర్భయం తల్లిదండ్రులు ఆంగ్ల మీడియాకు అసలు పేరు వెల్లడించినప్పటికీ మీడియా ఆ పేరును బహిర్గతం చేయకుండా సంయమనం చూపింది. అదే కశ్మీర్లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహికంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన సంఘటనలో మీడియా ఆ పాప ఫొటోతో సహా ఆమె పేరును బహిర్గతం చేసింది. ఈ విషయంపై దేశంలోని పలు దినపత్రికలు, టీవీ ఛానళ్లను వివరణ ఇవ్వాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతామిట్టల్, హరి శంకర్లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఎవరు ఫిర్యాదు చేయకపోయినా ఆ బెంచీ ఈ విషయాన్ని ‘సూమోటా’గా విచారణకు స్వీకరించింది. బాధితుల పేర్లను ముఖ్యంగా మైనర్ల పేర్లను వెల్లడించకుండా భారతీయ శిక్షాస్మృతిలోని 228ఏ ఆంక్షలు విధించింది. బాధితుల పేర్లను వెల్లడించాలంటే వారి అతి దగ్గరి రక్త సంబంధికుల నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకోవాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఏదైనా రిజస్టర్డ్ ప్రజా సంక్షేమ సంస్థ లేదా సంఘం ప్రధాన కార్యదర్శి లేదా చైర్మన్ల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. కథువా దారుణ, రేప్ హత్య కేసులో బాధితురాలి ఫొటోను ఇచ్చి పేరు వెల్లడించిందీ ఆ పాప తండ్రే. అయితే ఆయన నుంచి ఎవరు కూడా లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకున్నట్లు దాఖలాలు లేవు. నీలిరంగు సెల్వార్ కమీజ్ దుస్తుల్లో కెమేరావైపే చూస్తున్న కథువా బాధితురాలి ఫొటోను వివరాలను ముందుగా ‘రైజింగ్ కశ్మీర్, గ్రేటర్ కశ్మీర్’ అనే స్థానిక ఆంగ్ల పత్రికలు ప్రచురించాయి. ఆ తర్వాత రెండు నెలలకు జాతీయ మీడియా స్పందించి ఆ పాప ఫొటోను, జరిగిన ఘటనపై ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. బాధితురాలి పేరు వెల్లడించకుండా కశ్మీర్ మీడియా సంయమనం పాటించక పోవడానికి కారణం ‘మతం’ దృష్టితో సంఘటనను చూడడమేనని స్పష్టం అవుతుంది. బాధితుల పేర్లను వెల్లడించినందుకు గతంలో ఒక్క జర్నలిస్టులపైనే కాకుండా పోలీసులు, ఇతరులపై కూడా కేసులు నమోదయ్యాయి. బాధితురాలి పేరును వెల్లడించినందుకు 2016లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతిమలివాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు పంపించిన నోటీసులోనే ఆమె 14 ఏళ్ల బాధితురాలి పేరును బహిర్గతం చేశారు. ఓ రేప్ కేసులో బాధితురాలి పేరు వెల్లడించినందుకు గతేడాది ఢిల్లీ కోర్టు, ఢిల్లీ పోలీసులను తీవ్రంగా మందలించింది. 2017 సంవత్సరంలో జరిగిన రేప్ సంఘటనల్లో 34 కేసుల్లో జాతీయ పత్రికలు పేర్లు, వివరాలను వెల్లడించాయని ఓ నివేదిక తెలియజేస్తోంది. వాటిల్లో దళితులపై జరిగిన రేప్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. కథువా కేసులో పాప ఫొటోను ప్రచురించడం వల్లనే ఆ వార్త ఎక్కువ సంచలనం సృష్టించిందనే వాదన కూడా ఉంది. అయితే మరి, ఢిల్లీ నిర్భయ కేసు కూడా ఇంతకన్నా ఎక్కువ సంచలనమే సృష్టించిందికదా! ఇక్కడ సంచలనానికి పేర్లు, ఫొటోలకన్నా జరిగిన దారుణం తీరు కారణంగానే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. -
ఆడబిడ్డలను కాపాడుకోవడంలో విఫలం చెందాం
-
‘కథువా’ కేసు; కోర్టు విచారణ ప్రారంభం
జమ్ము: ‘ఆ పసిమొగ్గను చిదిమేసిన కీచకులను కఠినంగా శిక్షించాలం’టూ నినాదాలు మిన్నంటుతున్నవేళ కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, హత్య కేసుపై సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏడుగురు నిందితులపై మోపిన అభియోగాలను పరిశీలించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేశారు. ఎనిమిదో నిందితుడు.. బాలికపై అకృత్యంలో ప్రధాన పాత్రధారి అయిన బాలనేరస్తుడిపై విచారణను విడిగా చేపట్టనున్నారు. ఇక ఇదే కేసుకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను నేడు సుప్రీంకోర్టు ముందుకురానున్నాయి. నిందితులు వివరాలివే: బాలికపై కీచకపర్వం కేసును దర్యాప్తు చేసిన జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. బక్వారా ముస్లింలను గ్రామం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా కుట్రలు చేసి, పాపపై అకృత్యం జరగడానికి అసలు సూత్రధారి, రిటైర్డ్ ఉద్యోగి సాంజీ రామ్ను ఏ1గా పేర్కొన్నారు. చిన్నారిని అపహరించి, తొలుత అత్యాచారం చేసిన సాంజీరామ్ మేనల్లుడు మైనర్(15 ఏళ్లు) కావడంతో అతనిని విడిగా విచారించనున్నారు. నాలుగు రోజుల నరకం తర్వాత బాలికను కర్రతో కొట్టి చంపిందికూడా ఈ బాలనేరస్తుడే కావడం గమనార్హం. ఇక మైనర్ నేరస్తుడి స్నేహితుడు పర్వేశ్ కుమార్, సాంజీరామ్ కొడుకు విశాల్, మీరట్ స్పెషల్ పోలీసులు దీపక్ ఖజూరియా, సురేంద్ర వర్మలు కూడా బాలికపై అత్యాచారం జరిపారన్న ఆధారాలు లభించడంతో వారినీ ప్రధాన నిందితులజాబితాలో చేర్చారు. లంచం తిన్న ఆ ఇద్దరు పోలీసులు కూడా: కథువా బాలికపై అకృత్యం జరిగింది జనవరిలోనే అయినా ఆ కేసును బయటికి రానీయకుండా తొక్కిపెట్టడంలో పోలీసులదే కీలక పాత్ర. బాలిక హత్యకు గురైన తర్వాత కేసు నమోదు కాకుండా ఉండేందుకు సాంజీరామ్.. ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్కానిస్టేబుల్ తిలక్ రాజ్లకు రూ.4 లక్షలు లంచం ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న పోలీసులు.. కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నీ క్రైమ్ బ్రాంచ్ విచారణలో తేటతెల్లం అయ్యాయి. దీంతో ఎస్సై, హెడ్కానిస్టేబుల్ ఇద్దరిని కూడా నిదితుల జాబితాలో చేర్చారు. అడ్వొకేట్ దీపికకు మళ్లీ బెదిరింపులు: హిందూ-ముస్లిం విబేధాల పొడచూసిన నేపథ్యంలో కథువా బాలిక హత్యాచారం కేసు విచారణ కోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఇద్దరు సిక్కు మతస్తులైన లాయర్లను పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. కాగా, బాధితురాలి కుటుంబ తరఫున వాదిస్తానని అడ్వొకేట్ దీపికా సింగ్ రజావత్ ఇదివరకే ముందుకొచ్చారు. సోమవారం నాటి విచారణలో ఆమె వాదనే కీలకం కానుంది. దీపికా ఈ కేసును అంగీకరించింది మొదలు ఆమెకు పెద్ద ఎత్తున బెదింపులు వస్తుండం తెలిసిందే. ఆదివారం కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేశారని, ఈ కేసు వాదిస్తే రేప్చేసి చంపేస్తామని బెదిరించారని ఆమె మీడియాతో చెప్పారు. ‘బహుశా ఈ విచారణ పూర్తయ్యేలోపు నేను ప్రాణాలు కోల్పోవచ్చు లేదా మరొకటి జరగొచ్చు. అయితే బెదిరింపులకు భయపడి విచారణనుంచి మాత్రం తప్పుకోబోను. నాకు, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆశ్రయిస్తా’ అని దీపిక తెలిపారు. -
‘చీకటి రోజులు.. మోదీ విఫలం’
సాక్షి, న్యూఢిల్లీ : మైనర్ బాలికలపై అత్యాచారాలు, హత్య ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్న వేళ.. వేలాది మంది రోడ్డెక్కి.. లక్షలాది మంది సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రిటైర్డ్ ఉన్నతాధికారుల బృందం కథువా-ఉన్నావ్ ఘటనలపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. ‘దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ప్రజలకు కనీస భద్రత కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామిక, లౌకికవాద, స్వేచ్ఛా విలువలు నానాటికీ క్షీణించిపోతున్నాయి. ఎనిమిదేళ్ల చిన్నారిపై కొందరు పశువుల్లా హత్యాచారానికి పాల్పడటం.. పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో తెలియజేస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత మేం చూస్తున్న చీకటి రోజులు ఇవే. ఈ పరిస్థితులపై ప్రభుత్వం, బలహీనమైన రాజకీయ పార్టీలు, నేతలు స్పందించకపోవటం మేం గమనించాం’ అని లేఖలో వారు పేర్కొన్నారు. సుమారు 49 మంది సివిల్ సర్వీసెస్ మాజీ అధికారులు ఈ లేఖ రాసినట్లు సమాచారం. కథువా ఘటన.. పూర్తి కథనాలు అంతేకాదు ప్రస్తుత అధికార గణంపై వారు లేఖలో విరుచుకుపడ్డారు.‘వారు వారి విధులను సక్రమంగా నిర్వహించటంలో విఫలం అయ్యారు’అని లేఖలో మాజీ అధికారులు ప్రస్తావించారు. ఉన్నావ్, కథువా, అస్సాం, సూరత్.. ఇలా వరుస ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు మెట్రో నగరాలతోపాటు పలు పట్టణాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా నిరసనలు చేపడుతున్నారు. -
బీజేపీ మంత్రుల రాజీనామాల ఆమోదం
శ్రీనగర్: కఠువా హత్యాచార కేసులో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రుల రాజీనామాలను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదివారం ఆమోదించి గవర్నర్కు పంపారు. కఠువాలో చిన్నారి అసిఫాపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బీజేపీ మంత్రులు లాల్ సింగ్, చంద్ర ప్రకాశ్ గంగలు పాల్గొనడంతో పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వారిద్దరి చేత బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించింది. సీబీఐ విచారణ జరపాలి.. కఠువా హత్యాచార కేసులో సీబీఐ చేత విచారణ జరిపించాలని నిందితుల కుటుంబం డిమాండ్ చేసింది. క్రైం బ్రాంచ్ విచారణపై తమకు నమ్మకం లేదని, తమ తండ్రి, సోదరుడు దోషులని తేలితే ఉరి తీయాలని నిందితుడు సంజీరామ్ కూతుళ్లు చెప్పారు. ఈ కేసు విషయమై జమ్మూ హైకోర్టు, కఠువా న్యాయవాదులు చేస్తున్న సమ్మెను విరమించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆదేశించింది. -
కట్టలు తెంచుకున్న ఆక్రోశం
న్యూఢిల్లీ: వరసగా వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికాయి. రాజధాని ఢిల్లీ, అహ్మదాబాద్, అమృత్సర్, మొరాదాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై తదితర నగరాల్లో ఆదివారం నిరసనలు మిన్నంటాయి. ఉన్నావ్, కఠువా ఉదంతాల్లో దోషులకు శిక్ష విధించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ నినాదాలు మార్మోగాయి. ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్లో ‘నాట్ ఇన్ మై నేమ్’ పేరిట నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, కళాకారులు రేప్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ను కాపాడటానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కఠువా కేసులో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు భద్రత పెంచాలని, వారి తరఫున వాదించేందుకు ప్రభుత్వమే సమర్థవంతమైన లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అహ్మదాబాద్లో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మదరసా విద్యార్థులు -
నెక్లెస్రోడ్డులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
-
నేనూ బాధితురాలినే..! నటి
మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సమాజంలో స్త్రీలకు భద్రత కరువైంది. కామాంధుల పసివాళ్లను కూడా వదలడం లేదు. జమ్మూ కశ్మీర్లోని కథువా అనే ప్రాంతంలో చిన్నారిపై జరిగిన అత్యాచార దుర్ఘటన దేశంలో సంచలనం రేపింది. ఈ దురాఘాతాన్ని చాలా మంది ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అదే విధంగా అత్యాచారాలపై పలువురు సినీతారలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్లో హీరోయిన్గా ఎదుగుతున్న నివేథా పేతురాజ్ నేనూ అత్యాచార బాధితురాలినే అని పేర్కొంది. ఆమె ఏమన్నారంటే..‘తమిళనాడులో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అందులో కొన్ని సమస్యలు జాగ్రత్త వహిస్తే మనం అడ్డుకోవచ్చు. అలాంటి వాటిలో స్త్రీల రక్షణ. చిన్నతనంలోనే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ బాధింపుకు నేను ఐదేళ్ల వయసులోనే గురయ్యాను. ఆ విషయాన్ని అప్పుడు అమ్మానాన్నలకు ఎలా చెప్పగలను. అసలు ఎం జరిగిందో తెలియని వయసు’ అని చెప్పారు. ‘తల్లిదండ్రులకు నేను చెప్పెదేమిటంటే.. మీ పిల్లలతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అనే విషయంపై శ్రద్ధ చూపండి. పిల్లల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. మనం పోలీసులను నమ్మి ఉండలేం. మీ వీధిలో యువకులు చర్యలపైనా ఒక కన్నేసి ఉండాలి. ఏమైనా తప్పు జరుగుతుంటే అడ్డుకోవాలి. ఇప్పుడు కూడా నాకు బయటకు వెళ్లాలంటే భయం. అత్యాచార చర్యలు బాలా బాధాకరం. ఇలాంటి వాటిని అణచివేస్తేనే ప్రశాంతంగా జీవించగలం’ అని నటి నివేథా పేతురాజ్ పేర్కొన్నారు. -
కథువా కేసు: సందిగ్ధంలో వారి పెళ్లి
జమ్మూ: ‘అతడి కళ్లలోకి సూటిగా చూస్తూ.. నువ్వు నేరం చేశావా అని అడుగుతాను. నాపై అతడికి నమ్మకముందని నాకు తెలుసు. తను నేరం చేయలేదని చెబితే అతడు తిరిగొచ్చే వరకు వేచి చూస్తాను. ఒకవేళ అతడు నేరం చేశాడని చెబితే మరో సంబంధం చూడమని మా అమ్మానాన్నతో చెబుతాన’నని 24 ఏళ్ల రేణు శర్మ అనే పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థిని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా హత్యాచార ఘటన కేసులో ప్రధాన నిందితుడు దీపక్ ఖాజురియాకు కాబోయే భార్య ఆమె. గతేడాది డిసెంబర్ 7న వీరిద్దరికీ వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈనెల 26న పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. రసన గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి చంపిన కేసులో దీపక్ జైలు పాలవడంతో వీరి పెళ్లి సందిగ్ధంలో పడింది. క్రైం బ్రాంచ్ పోలీసుల చార్జిషీటు ప్రకారం ఈ కేసులో దీపక్ ప్రధాన నిందితుడు. అయితే తనకు కాబోయే భర్త ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే నమ్మలేకపోతున్నారని రేణుక పేర్కొన్నారు. బాలికను రేప్ చేసి చంపేంత క్రూరుడు కాదని ఆమె చెబుతున్నారు. అతడితో ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి ఈ అంచనాకు వచ్చినట్టు చెప్పారు. ‘ నిశ్చితార్థం రోజున అతడిని ఒకసారి మాత్రమే అతి సమీపం నుంచి చూశాను. తర్వాత మేము ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. పోలీసులు చెబుతున్నట్టుగా అతడికి ప్రవర్తన నాకెపుడూ కనబడలేదు. వీడియో చాట్ చేద్దామని అతడు కోరినప్పుడు నేను తిరస్కరిస్తే మళ్లీ బలవంతం చేయలేద’ని రేణుక వెల్లడించారు. దీపక్ను తప్పుబట్టడం కానీ సమర్థించడం కానీ చేయబోనని అన్నారు. ‘వాస్తవమేంటో నాకు తెలియదు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపడితేనే నిజాలు వెల్లడవుతాయ’ని ఆమె అభిప్రాయపడ్డారు. దీపక్ నాలుగేళ్ల క్రితం పోలీసు ఉద్యోగంలో చేరారు. తర్వాత అతడికి హీరానగర్ పోలీసు స్టేషన్లో ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్పీఓ)గా నియమించారు. రసన గ్రామంలో బాలిక దారుణ హత్యాచారానికి గురైనప్పుడు అతడు పరిసర ప్రాంతాల్లో సంచరించినట్టు గుర్తించారు. మెలితిరిన మీసాలు, కత్తిరించిన గడ్డంతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై రసన గ్రామం దాటుతుండగా అతడిని చూసినట్టు సాక్షులు చెబుతున్నారు. ఈ కిరాతక ఘటన జరగడానికి ముందు బకర్వాల్ ముస్లిం మహిళలతో దీపక్ రెండుసార్లు గొడవ పడినట్టు అతడి తల్లి దర్శనాదేవి, సోదరి శివాని వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. హత్యాచారం కేసులో అరెస్టైన నలుగురు పోలీసుల్లో దీపక్ ఒకరు. మిగిలిన ముగ్గురు నిందితులు లంచం కోసం కేసును తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో దీపక్ ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు. పరీక్షల్లో పాసయ్యేందుకు సాయం చేస్తానని నమ్మబలికి 15 ఏళ్ల బాలుడి సహాయంతో బాలికను దీపక్ కిడ్నాప్ చేశాడని క్రైం బ్రాంచ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. -
మెహరీన్ భలే కౌంటర్ ఇచ్చింది
దేశాన్ని కుదిపేసిన కథువా ఘటన.. ఎనిమిదేళ్ల బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్దు ఎత్తున్న ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మెహరీన్ పిర్జాదా కూడా తన ట్వీటర్లో ఓ పోస్ట్ చేసింది. ‘నేను హిందుస్థానీని.. నేను సిగ్గుపడుతున్నా. 8 ఏళ్ల చిన్నారి ఆలయంలో సామూహిక అత్యాచారం.. హత్యకు గురైంది అంటూ ఫ్లకార్డుతో ఫోటోను మెహరీన్ పోస్ట్ చేసింది. దీనికి స్పందించిన ఓ వ్యక్తి.. నీకు అంత సిగ్గుగా అనిపిస్తే దేశాన్ని విడిచి వెళ్లు. నేను హిందుస్థానీని అయినందుకు గర్వపడుతున్నా అంటూ రీట్వీట్ చేశాడు. దానికి స్పందించిన మెహరీన్.. నీలాంటోళ్ల గురించే నేను పోస్ట్ చేసింది అంటూ బదులిచ్చింది. భలే కౌంటర్ ఇచ్చావ్ మెహరీన్ అంటూ పలువురు ఆమెను అభినందిస్తున్నారు. I Am Hindustan I Am Ashamed 8 Years Old ! Gang Raped ! Murdered in Devi-Stan Temple #KATHUA #justiceforasifa pic.twitter.com/0SP6mrBNLz — Mehreen Pirzada (@Mehreenpirzada) 15 April 2018 @Mehreenpirzada If you really ashamed of being a #Hindustani ...... Just leave the country. We are proud of being #Hindustani. Atrocities on children happens in developed nations to.... They have never overacted like you. — Adikrishna (@adikrishnaraju) 15 April 2018 Wow! This is what I’m talking about. People like you 🤷♀️ https://t.co/vLkUfWhzLp — Mehreen Pirzada (@Mehreenpirzada) 15 April 2018 -
‘ఆజాద్ వ్యాఖ్యలు విడ్డూరం’
సాక్షి, ఢిల్లీ : కథువా హత్యాచార బాధితురాలికి న్యాయం జరగుతుందని.. దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులు బయటే ఉన్నారన్న గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రతి సమస్యను పెద్దది చేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అత్యాచార ఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. గులాం నబీ ఆజాద్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదనే బీజేపీ మంత్రులను రాజీనామా చేయించామని పేర్కొన్నారు. కాగా, బీజేపీ ఆరోపనలను కాంగ్రెస్ గట్టిగా తిప్పికొట్టింది. సమస్యలను ఎత్తి చూపడం ప్రతిపక్షాల విధి అని కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా అన్నారు. గత 14రోజుల వ్యవధిలో ఉత్తర్ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్లో మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రతిపక్షాలు, సోషల్ మీడియా చొరవ చూపడంతోనే ప్రధాని స్పందించారన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు -
కథువా కిరాతకం; కఠిన వాస్తవం
జమ్మూ: ‘ఎనిమిదేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఎంత నేల కావాలి? అత్యాచారానికి గురై కిరాతంగా హత్య చేయబడిన పాప మృతదేహం మా చేతుల్లో ఉంది. ఇలాంటి సమయంలో గ్రామస్తులు మా మీద కనికరం చూపాల్సింద’ని కథువా హత్యాచార బాధితురాలి తాత వేడుకున్నారు. జమ్మూకశ్మీర్ కథువా జిల్లా, రసన గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన చిన్నారి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె పెంపుడు తండ్రి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అంత్యక్రియల కోసం ఎంచుకున్న స్థలం గుజ్జార్–బకర్వాల్ ముస్లిం కుటుంబానికి చెందనది కాదంటూ అడ్డుపడ్డారు. ‘అప్పటికే సమయం సాయంత్రం 6 గంటలైంది. అంత్యక్రియల కోసం సగం గొయ్యి తీయడం పూర్తైంది. అదే సమయంలో గ్రామస్తులు అక్కడికి వచ్చారు. ఖననం చేయడానికి కుదరదని అడ్డుచెప్పారు. ఆ స్థలం మాది కాదంటూ పత్రాలు చూపించార’ని మృతురాలి తాత ఆరోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ భూమి వాళ్లదే.. ‘అంత్యక్రియలు జరిపాలకున్న స్థలం మృతురాలి పెంపుడు తండ్రిదే. దశాబ్దం క్రితమే ఓ హిందూ కుటుంబం నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో గ్రామస్తులు అవకాశంగా తీసుకుని ఈ భూమి మా దగ్గర నుంచి లాక్కోవాలనుకుంటున్నార’ని అంత్యక్రియలం కోసం భూమి ఇచ్చిన వ్యక్తి తెలిపారు. మేము అంగీకరించం ఈ భూమి మృతురాలి కుటుంబానిది కాదని హిందువులు వాదిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని అక్రమంగా ఇక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ‘బకర్వాల్ ముస్లింలు ఒక్కొక్కటిగా మా భూములను ఆక్రమించేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మేము అంగీకరించబోము. బాలిక అంత్యక్రియలకు ప్రత్యామ్నాయం చూపించామ’ని రసన గ్రామస్తుడు రోహిత్ ఖజూరియా తెలిపారు. వణికించే చలిలో.. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేదిలేక చిన్నారి మృతదేహాన్ని వణికించే చలిలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కణాహ్ గ్రామానికి తరలించారు. చీకటిలో పర్వత ప్రాంతం మీదకు మోసుకెళ్లి ఖననం చేశారు. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆసిఫా పెంపుడు తల్లిదండ్రులు తెల్లవారుజామున 3 గంటలకు వరకు అక్కడే ఉన్నారని వారి బంధువు ఒకరు వెల్లడించారు. రెండుమూడు రోజులకొకసారి సమాధి వద్దకు వెళ్లి గంటల తరబడి మృతురాలి పెంపుడు తల్లి శోకిస్తోందని, ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకురావాల్సి వస్తోందని తెలిపారు. తల్లికి తీరని శోకం రసన గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో గోధుమ పంట ఉన్న పొలంలో 5 అడుగుల గొతిలో బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. సమాధిని ఇంకా సిమెంట్ చేయంచలేదు. సమాధికి రెండు చివరల పెద్ద రాళ్లను ఉంచారు. ‘మా మతాచారం ప్రకారం సమాధిని వెంటనే సిమెంట్ చేయించం. తమ పశువులను తోలుకుని పర్వత ప్రాంతాల్లో సంచారానికి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులు తిరిగొచ్చిన తర్వాత సమాధిని సిమెంట్ చేస్తామ’ని వారి బంధువొకరు వెల్లడించారు. కాగా, కఠువా బాధితురాలికి న్యాయం చేయాలని, నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి. -
ఇరకాటంలో పీడీపీ,బీజేపీ సంకీర్ణ సర్కార్!
-
శ్రీరెడ్డిపై పవన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నటి శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసన, లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోల వ్యవహారంపై జన సేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. శ్రీరెడ్డి అలా(అర్ధనగ్న నిరసన) చేయడం సరికాదని, ఏదైనాసరే చట్టబద్ధంగా ముందుకు వెళ్లుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలను నిరసిస్తూ శనివారం నెక్లెస్రోడ్డు వద్ద జనసేన చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీరెడ్డి వ్యవహరించిన తీరు ముమ్మాటికీ సరికాదు. ఏదైనా వివాదం ఉంటే, వేధింపులు ఎదుర్కొని ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్లాలి. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం, టీవీ ఛానెళ్లకు వెళ్లి ఫొటోలు, వీడియోలు లీక్ చేయడంకాదు.. అయినా మీడియాలో ఎంతమాట్లాడినా ఒక మెసేజ్ వెళుతుంది కానీ అంతకంటే ఉపయోగం ఉండదు. కేవలం సెన్సేషనలిజం తప్ప సాధించేది లేదు. ఇలా చేస్తే వాళ్లకూ ఇబ్బందులు తలెత్తుతాయి’’ అని పవన్ అన్నారు. గతంలో చేసిన ఫిర్యాదులు ఏమయ్యాయి?: శ్రీరెడ్డి నిరసనను తప్పుపట్టిన పవన్కు మహిళా విలేకరుల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. మీడియా: ‘సార్.. మీరేమో చట్టపరంగా వెళ్లాలంటున్నారు. కానీ గతంలో చలపతిరావు వ్యాఖ్యాల దగ్గర్నుంచి చాలా వివాదాల్లో పోలీసు కేసులు నమోదయినా చర్యలు తీసుకోలేదుకదా?’ పవన్:‘‘అవును, అలాంటప్పుడిక ఏం చేస్తాం? మనమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది’’ మీడియా: ‘మరి అలా చూస్తే శ్రీరెడ్డి కూడా న్యాయం కోసమే రోడ్డుపైకి వచ్చానన్నారు కదా.. చాలా రోజుల నుంచి మీ మద్దతు కూడా ఆమె కోరారు కదా..’ పవన్: ‘‘సరే, నేను ఆమెకు మద్దతు ఇచ్చాననుకోండి, ఏం జరుగుతుంది? నేనేమైనా పోలీసునా, లాయర్నా, ఎవరైనాసరే చట్ట ప్రకారం ముందుకెళ్లాలి’’ పవన్: ‘‘ఇండస్ట్రీలో పరిస్థితులు నాకు కూడా తెలుసు. షూటింగ్స్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు చాలామంది అభిమానులొచ్చి, ఆడపిల్లలపై పడుతున్నప్పుడు నేనే కర్ర పట్టుకుని తరమాల్సిన సందర్భాలున్నాయి. ‘తమ్ముడు’ షూటింగ్ అప్పుడైతే బీహెచ్ఈఎల్లో పెద్ద వివాదమే జరిగింది. ఇలాంటివి పరిష్కరించడం మనందరి సమిష్టి బాధ్యత. న్యాయం ఎందుకు జరగట్లేదని అడగాలి. కానీ టీఆర్పీ రేటింగ్స్ కోసం చేయకూడదు’’ మీడియా: ‘టీఆర్పీ కాదు సార్.. వాళ్ల ఇష్యూస్ని రేజ్ చేస్తున్నాం’ పవన్: ‘కరెక్టే, మీరు పోలీస్ స్టేసన్లకు వెళ్లి నిలబడితే, అలాంటి సంఘాలేవైనా ఆమెకు అండగా నిలబడితే సరే, లేదంటే ఇష్యూ పక్కదారిపట్టే ప్రమాదం ఉంటుంది’’ ఆతర్వాత ఆ మహిళా విలేకరిని పక్కకి వెళ్లిపోవాలని పవన్ అభ్యర్థించారు. కేసీఆర్, చంద్రబాబులూ ఖండించాలి: కథువా, ఉన్నావ్లలో చోటుచేసుకున్న ఘటనలు తనను తీవ్రంగా కలిచివేశాయని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయా కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడాలని, ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్పందించాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతోపాటు దక్షిన భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులూ దీనిని ఖండించాలని పవన్ అన్నారు. బాధితులకు అండగా ఉండనట్లైతే రాజ్యాంగం గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్న వ్యర్ధమేనని అభిప్రాయపడ్డారు. -
మోదీజీ..ఆడబిడ్డలకు న్యాయం ఎప్పుడు చేస్తారు?
-
ఇంట్లో బాలికలున్నారు.. మా ఓట్లు అడగొద్దు!
తిరువనంతపురం : జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో బాలికపై జరిగిన హత్యాచార ఘటనతో దేశవ్యాప్తంగా నిరసన సెగలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో బీజేపీపై పూర్తి వ్యతిరేకత మొదలైంది. ఎంతలా ఉంటే.. మా ఇంటికి ఓట్లు అడిగేందుకు రావొద్దు.. అసలే బాలికలు, అమ్మాయిలు ఉన్నారని నేరుగా ఇంటికే బోర్డులు తగిలించారు. కేరళలోని ఛెగన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. సీపీఐ (ఎం) ఎమ్మెల్యే కేకే రాంచంద్రన్ నాయర్ మృతిచెందడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కశ్మీర్, కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారికి కొన్ని మృగాలు డ్రగ్స్ ఇచ్చి కొన్నిరోజులపాటు అత్యాచారం చేయడంతో పాటు దారుణహత్య చేయడం కలకలం రేపుతోంది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), బీజేపీ భాగస్వాములుగా జమ్మూకశ్మీర్లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు జరుగుతాయని కేరళ ప్రజలు భగ్గుమంటున్నారు. 'మా ఇంట్లో బాలికలున్నారు. బీజేపీ నేతలు ఓట్లు అడిగేందుకు మాత్రం మా ఇంటికి రావొద్దు. మీకు ఓట్లడిగే అర్హతే లేదని' ఛెగన్నూర్ స్థానికుల ఇళ్ల వద్ద, సీపీఐ (ఎం) కార్తకర్తల నివాసాలకు ఇలాంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు ఆత్మరక్షణధోరణిలో పడిపోయినట్లు కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్లు కసరత్తులు చేస్తున్నాయి. ఛెగన్నూర్ ఉప ఎన్నికే తమకు తొలి పరీక్షగా భావిస్తున్నాయి. అలప్పుఝాలోని ఛెగన్నూర్ను టెంపుల్ టౌన్గా ప్రసిద్ధి. -
‘కథువా’ మృగాలను ఉరి తీయండి: ఐక్యరాజ్యసమితి
న్యూయార్క్ : కథువా చిన్నారి హత్యాచార ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. దీనిని భయానక ఘటనగా అభివర్ణించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్.. ఘాతుకానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘మీడియాలో వచ్చిన కథనాలు నన్ను కదిలించాయి. ఓ పసి ప్రాణాన్ని అతి భయంకర రీతిలో చిత్రవధలకు గురి చేసి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలాంటి మానవ మృగాలను క్షమించకూడదు. చట్టపరిధిలో వారిని(గరిష్ఠ శిక్ష ఆధారంగా..) కఠినంగా శిక్షించి ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరోసారి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని కోరుకుంటున్నా’ అని గుటెర్రెస్ తన సందేశంలో పేర్కొన్నారు. దీనిని ఆయన ప్రతినిధి స్టీఫెన్ దుజ్జారిక్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. కథువా జిల్లాలో నొమాదిక్ బకర్వాల్ ఇస్లాం తెగకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి జనవరి 10న అదృశ్యం కాగా.. వారం తర్వాత ఆమె మృత దేహం ఛిద్రమై కనిపించింది. పోస్ట్ మార్టం నివేదికలో ఆమెను అతిక్రూరంగా చెరిచి చంపినట్లు నిర్ధారణ కావటంతో కశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో మరిన్ని వివరాలు ఇప్పుడు వెలుగులోకి రావటంతో.. దేశవ్యాప్తంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
ప్రామిస్ చేస్తున్నా.. కదిలిస్తున్న సన్నీ సందేశం
దేశంలో అఘాయిత్యాల పర్వాలపై చర్చ కొనసాగుతున్న వేళ.. కథువా ఘటన మాత్రం ప్రతీ ఒక్కరినీ కదిలించి వేస్తోంది. ప్రముఖులంతా తమకు తోచిన రీతిలో ఘటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి సన్నీ లియోన్ చేసిన ఓ ట్వీట్ కదిలించి వేస్తోంది. తన కూతురు(దత్త పుత్రిక) నిషా కౌర్ ను ఒడిలో పెట్టుకుని ఓ ఫోటో దిగి.. ఓ సందేశంతో ఆమె ట్వీటర్లో పోస్ట్ చేసింది. ‘తల్లీ.. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా. నా హృదయం, ఆత్మ, దేహం... ఇవన్నీ నిన్ను రక్షించుకునేందుకే. ఈ లోకంలో చెడు పెరిగిపోయింది. అందుకే నీ కోసం నేను ఎల్లవేళలా కృషి చేస్తుంటా. నీ రక్షణ కోసం నా ప్రాణాలైన పణంగా పెడతా. ప్రస్తుతం చిన్నారులకు సైతం రక్షణ అనేదే లేకుండా పోయింది. కాబట్టి వారిని జాగ్రత్తగా సంరక్షికోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అంటూ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్కు సానుకూలంగా స్పందన వస్తోంది. I promise with every ounce of my heart,soul&body 2protect u from everything&everyone who is evil in this world.Even if that means giving my life for ur safety.children should feel safe against evil hurtful people.Let's hold our children a little closer to us!Protect at all costs! pic.twitter.com/d9xijmD6kF — Sunny Leone (@SunnyLeone) 14 April 2018 -
మోదీజీ.. చేతల్లో చూపించండి
సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేస్తున్న అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కౌంటర్కు దిగింది. హామీలు ఇవ్వటం కాదని.. తీవ్ర చర్యలు తీసుకున్నప్పుడే ఏదైనా ఫలితం ఉంటుందని చెబుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్వీటర్లో ఈ ఉదయం ట్వీటేశారు. (సమాజానికి సిగ్గుచేటు) ‘ప్రియమైన ప్రధానిగారూ.. ఇప్పటికైనా మీరు స్పందించినందుకు కృతజ్ఞతలు. మన దేశంలో ఆడకూతుళ్లకి న్యాయం జరిగేలా చూస్తానని మీరు హామీ ఇచ్చారు. కానీ, అది ఎప్పటికీ నెరవేరుతుంది? ఇది యావత్ దేశం తెలుసుకోవాలనుకుంటోంది’ అంటూ రాహుల్ ఓ సందేశం ఉంచారు. మరోవైపు ప్రధాని స్పందనపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రధానిగారు ఇప్పటికైనా పెదవి విప్పినందుకు సంతోషం. కాంగ్రెస్తోసహా పలు పార్టీలు చేసిన పోరాటం ఫలించి.. ఆ డిమాండ్ మేరకే ఆయన స్పందించారు. కానీ, ఆ మాటలు కార్యరూపం దాలిస్తే దేశం మొత్తం ఇంకా సంతోషిస్తుంది. ఘటనలకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే’ అని అభిషేక్ కోరారు. Dear Prime Minister, Thank you for breaking your long silence. You said “our daughters will get justice”. India wants to know: when?#SpeakUp — Rahul Gandhi (@RahulGandhi) 13 April 2018 -
నెటిజన్ల ఆగ్రహం.. స్పందించిన కొటక్ మహీంద్రా
తిరువనంతపురం : సోషల్ మీడియాలో తమ బ్యాంక్ ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తటంతో కొటక్ మహీంద్రా స్పందించింది. ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కొచ్చిలోని పలారివట్టోమ్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ విష్ణు నందకుమార్ ఈ మధ్య ఫేస్బుక్లో మళయాళంలో ఓ పోస్ట్ చేశాడు. అందులో కథువా హత్యాచార ఘటనపై స్పందించిన విష్ణు.. ‘చిన్నారిపై జరిగిన ఘాతుకం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పడు ఆమె చావటం సరైందే. లేకపోతే భవిష్యత్లో మానవ బాంబుగా మారి వందల మందిని బలితీసుకునేదేమో’ అని ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. దీనిపై సోషల్ మీడియాలో ఆగ్రహజ్వాలలు వ్యక్తం అయ్యాయి. విష్ణును బండబూతులు తిడుతూ పలువురు పోస్టులు చేశారు. పనిలో పనిగా కొటక్ మహీంద్రా బ్యాంక్కు కూడా కొందరు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని.. లేకపోతే బ్యాంకులపై దాడులు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బ్యాంక్ యాజమాన్యం.. ‘ఏప్రిల్ 11న విష్ణు నందకుమార్ను ఉద్యోగం నుంచి తొలగించేశాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా ఉపేక్షించేది లేదు’ అని పేర్కొంది. అయితే పనిలో మెరుగైన నైపుణ్యం ప్రదర్శించని కారణంగానే అతన్ని తొలగించినట్లు ఆ ప్రకటన పేర్కొనటం గమనార్హం. విష్ణు నందకుమార్.. పక్కనే అతను చేసిన పోస్ట్ -
సీఎంతో ఎలాంటి సమస్యల్లేవు : బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : కథువా హత్యాచార ఘటన.. బీజేపీ మంత్రుల రాజీనామాలు.. తదితర పరిణామాల నేపథ్యంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)తో పొత్తు సంగ్ధిగ్ధంలో పడ్డట్లు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రామ్ మాధవ్ స్పందించారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఎలాంటి సమస్యల్లేవని ఆయన ప్రకటించారు. (నోరువిప్పిన మోదీ) శుక్రవారం రాత్రి ఢిల్లీలో రామ్ మాధవ్ ఓ జాతీయ న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ.. ‘కూటమి విషయంలో ఎలాంటి సమస్యల్లేవు. మంత్రుల రాజీనామా పూర్తిగా బీజేపీ నిర్ణయమే. సీఎం మెహబూబా ముఫ్తీ మాపై ఒత్తిడి తెచ్చినట్లు వస్తున్న కథనాలు నిజం కాదు. ఈ కేసులో సరైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ కూడా ఆమెకు సూచించారు. పీడీపీతో పొత్తు కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల బాలికను కొందరు అహరించి.. బంధించి.. డ్రగ్స్ ఇచ్చి.. ఆపై అత్యాచారం.. కిరాతకంగా హింసించి చంపిన ఘటన తెలిసిందే. జనవరిలో జరిగిన ఈ దాష్టీకంలో విస్మయకర విషయాలు ఆలస్యంగా వెలుగులోకి రావటంతో ఈ ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో నిందితులకు మద్ధతుగా నిర్వహించిన ఓ ర్యాలీలో బీజేపీకి చెందిన మంత్రులు చంద్ర ప్రకాశ్ గంగా, లాల్ సింగ్లు పాల్గొనటం.. అది కాస్త తీవ్ర విమర్శలకు దారితీయటంతో చివరకు శుక్రవారం సాయంత్రం వారిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించి బీజేపీ అధిష్ఠానం వారి భవితవ్యం నిర్ణయించనుంది. కథువా కేసులో వరుస పరిణామాల కోసం క్లిక్ చేయండి -
మన బిడ్డలకు న్యాయం జరుగుతుంది
న్యూఢిల్లీ: కఠువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్రమోదీ ఎట్టకేలకు శుక్రవారం పెదవి విప్పారు. ఇలాంటి ఘటనలు సిగ్గుచేటన్న ఆయన.. నేరస్తులనెవ్వరినీ వదిలిపెట్టబోమనీ, బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీనిచ్చారు. ఈ రెండు ఘటనలు దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిపై మోదీ మాట్లాడుతూ ‘గత రెండు రోజులుగా దేశం మొత్తాన్నీ కుదిపేస్తున్న ఘటనలు అసలు ఓ నాగరిక సమాజంలో జరగాల్సినవే కావు. ఇంతటి ఘోరం జరిగినందుకు ఈ దేశంలో, ఈ సమాజంలో భాగమైన మనమంతా సిగ్గుపడాలి. తమ జీవితాలను ధారపోసి మన స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులకు ఇది అవమానం. దోషులు ఎవ్వరూ తప్పించుకోలేరని నేను దేశానికి భరోసా ఇవ్వదలచుకున్నా. బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుంది. మన బిడ్డలకు తప్పక న్యాయం దక్కుతుంది’ అని మోదీ చెప్పారు. శనివారం రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా శుక్రవారం మోదీ ఢిల్లీలో అంబేడ్కర్ స్మారకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘మహిళలపై లైంగిక హింస, అత్యాచారం తదితర దురాగతాలు జరగకుండా చూసేందుకు ప్రజలంతా కలసి పనిచేయాలి. అందుకోసం కుటుంబ సభ్యులే పిల్లలకు సామాజిక విలువలను అలవర్చాలి. మన కుటుంబ వ్యవస్థను, సామాజిక విలువలను మనం పటిష్టపరచుకోవాలి’ అని మోదీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారనివ్వం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగారిపోనివ్వబోమని మోదీ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత బలోపేతం చేసింది తమ ప్రభుత్వమేనని మోదీ పేర్కొన్నారు. ఈ చట్టం కింద జాబితాలో ఉన్న నేరాల సంఖ్యను 22 నుంచి తమ ప్రభుత్వం 47కు పెంచిందన్నారు. అంబేడ్కర్ను కాంగ్రెస్ ఆయన బతికున్నప్పుడు, చనిపోయాక కూడా అవమానించిం దనీ, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పేరును వాడుకుంటోందని మోదీ ఆరోపించారు. -
మనదేశం ఎటు పోతోంది? తమన్నా
మనదేశం ఎటు పోతుందని మిల్కీ బ్యూటీ తమన్నా చాలా వేదనతో ప్రశ్నిస్తోంది. జమ్మూ కశ్మీరులోని కథువా జిల్లాలో 8ఏళ్ల బాలికపై అత్యాచార దుర్ఘటన ఈ మిల్కీ బ్యూటీని కలత చెందేలా చేసింది. ఆసిఫా అనే బాలికను 6గురు వ్యక్తులు అత్యంత పైశాచికంగా లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసిన ఘటన ప్రస్తుతం దేశాన్ని కదిలిస్తోంది. ఈ సంఘటనపై పలువురు ప్రముఖులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ ఘటనపై హీరోయిన్ తమన్నా స్పందిస్తూ.. జమ్మూ కశ్మీరులో 8ఏళ్ల బాలిక, మరో చోట 16ఏళ్ల యువతి అత్యాచారానికి గురయ్యారు. ‘దీనిపై పోరాడిన ఆమె తండ్రిని దారుణంగా కొట్టి చంపేశారు. నేరస్తులను కాపాడటానికే ఈ విధంగా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘోరాలను చూస్తుంటే మనదేశం ఎటు పోతోందని ప్రశ్నించింది. స్త్రీలకు రక్షణ కల్పించలేని దేశం తిరోగమన దశకు చేరుతోంది. దీనికి చాలా తోందరగా చికిత్స చేయాల’ని తమన్నా పేర్కొన్నారు. ఈ అత్యాచారాలను పలువురు ప్రముఖులు కూడా ఖండించారు. -
నోరువిప్పిన మోదీ.. బీజేపీ దిద్దుబాట
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు స్పందించారు. ఇలాంటి ఘటనలు సమాజానికి సిగ్గుచేటని, బాధితులకు న్యాయం దక్కేలా చూస్తానని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో అంబేద్కర్ స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. కాగా, ఆయా ఘటల్లో నిందితులకు వత్తాసు పలికి, అభాసుపాలైన బీజేపీ.. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇద్దరు బీజేపీ మంత్రుల రాజీనామా: జమ్ముకశ్మీర్లోని కథువాలో 8 ఏళ్ల బాలిక ఆసిఫాను అతి కిరాతకంగా అత్యాచారం చేసి, చంపేసిన కేసులో నిందితులకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వత్తాసుపలకడం, నిందితులకు అనుకూలంగా చేపట్టిన ర్యాలీలో జాతీయ జెండాలు ప్రదర్శించడం, భారత్ మాతాకీ జై నినాదాలు ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఘటన వెలుగు చూసిన తొలినుంచీ నిందితులను సమర్థిస్తూ పలు ప్రకటనలు చేసిన ఇద్దరు మంత్రులు శుక్రవారం అనూహ్యంగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ ఘటనకు సంబంధించి మాత్రం ఏ ఒక్క నేతా రాజీనామా చేయకపోవడం గమనార్హం. అంబేద్కర్ను అవమానించారు: అంబేద్కర్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఆ మహనీయుడి వారసత్వాన్ని దెబ్బతీసింది’’ అని మోదీ అన్నారు. -
కథువా రేప్ కేసు లాయర్కు బెదిరింపులు
-
మోదీ.. మాట్లాడు
న్యూఢిల్లీ: అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ ఆలయంలో బంధించి ఎనిమిది రోజులపాటు గ్యాంగ్ రేప్ చేసి చివరికి కొట్టిచంపేసిన దారుణ ఘటన దేశాన్ని కదిలిస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ‘మోదీ.. మాట్లాడు’ అంటూ సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతున్నది. జమ్మూ కశ్మీరులోని కథువా జిల్లా హీరానగర్ మండల పరిధిలోని రస్సానాలో ఆసిఫా అనే ఎనిమిదేళ్ల బాలిక హత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా సంచలనంగా మారింది. అన్ని మాట్లాడతారుగా ఇప్పుడేమైంది మోదీజీ?: ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. మీ మౌనం ఏమాత్రం అంగీకారం కాదు. చిన్నపిల్లలు, మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దురాగతాల గురించి మీరేమనుకుంటున్నారు? దారుణాలకు పాల్పడిన నిందితులకు ప్రభుత్వాలు అండగా నిలవడం ఎంతవరకు సమంజసం?’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మరో అడుగు ముందుకేసి మోదీని తూర్పారబట్టారు. ‘‘మన్కీ బాత్ అనో, ఇంకో పేరుతోనో నిత్యం మీ ఆలోచనలను, మాటలను దేశ ప్రజలతో పంచుకుంటారే.. మరి ఎనిమిదేళ్ల చిన్నారిని దారుణంగా చిదిమేస్తే, నిందితులను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కాపాడుతుంటే మీరు నోరు తెరవకపోవడం ఏమైనా బాగుందా? ఎప్పుడూ మీకు అవసరమైన విషయాలమీదే మాట్లాడతారా? ఇతరులకు అత్యవసరమైన విషయాలమీద నోరు మెదపరా?’’ అని అబ్దుల్లా ఫైరయ్యారు. అసలేం జరిగింది?: జనవరి 11న కథువాకు చెందిన ముస్లిం బాలిక ఆసిఫా(8) ఇంటి పరిసరాల్లో గుర్రాలను మేపుతుండగా అదృశ్యమైంది. పాప తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. జనవరి 17న సమీపంలోని అడవిలో పాప మృతదేహం దొరికింది. బాలికకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసినట్లు పోస్ట్మార్టంలో తేలింది. అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సాంజీరామ్.. ఆసిఫాపై అత్యాచారం చేయాలంటూ తన కుటుంబీకులను ఉసిగొల్పాడు. బాలికను క్రూరమృగాలకంటే దారుణంగా చిదిమేసినవారిలో పోలీసులు కూడా ఉండటం గమనార్హం. సాంజీరామ్కే చెందిన ఆలయంలో పాపను బంధించి మత్తుమందు ఇస్తూ ఒకరితర్వాత మరొకరు అత్యాచారం చేశారు. తొలుత సాంజీరామ్ మేనల్లుడు, వాడి స్నేహితుడు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత మీరట్(యూపీ) నుంచి వచ్చిన సాంజీరామ్ కుమారుడు విశాల్, పోలీసు అధికారి దీపక్ ఖజూరియా, మరో ఇద్దరు స్పెషల్ పోలీసులూ చిన్నారిపైకి ఎగబడ్డారు. చివరికి జనవరి 14న సాంజీ మేనల్లుడు.. పాపను కర్రతో కొట్టి చంపేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురిని నిదితులుగా చేర్చారు. ఘటన జరగడానికి కొద్దిరోజుల ముందు.. : ఆసిఫాపై అకృత్యానికి కొద్దిరోజుల ముందు కథువా గ్రామంలో నివసిస్తోన్న బకర్వాల్ వర్గానికి చెందిన ముస్లింలను అక్కడి నుంచి తరిమేయాలని గ్రామపెద్దలు తీర్మానించారు. ముస్లింలు గోవధ, డ్రగ్స్ స్మగ్లింగ్ తదితర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దానివల్ల తమ పిల్లలు చెడిపోతున్నారన్నది గ్రామపెద్దల ఆలోచన. ఈ క్రమంలోనే ముస్లిముల గుర్రాలను పొలాల్లో మేపనివ్వరాదని, వాళ్లకు భూములు సైతం అమ్మకూడదని సాంజీరామ్, ఇంకొందరు సూచనలు చేశారు. తీర్మానాలు జరిగిన కొన్ని గంటలకే.. తన ఇంటి బయట గుర్రాలను మేపుతున్న ఆసిఫా అపహరణకు గురైంది. -
కథువా రేప్ కేసు లాయర్కు బెదిరింపులు
జమ్మూ : ‘న్యాయ వ్యవస్థపై, లాయర్లపై ప్రజలకు విశ్వాసం పోకుండా ఉండాలంటే వారి చేతుల్లో కూడా న్యాయదండాలు ఉండాలేమో!’ అని కశ్మీర్లోని కథువా జిల్లాలో దారుణంగా సామూహిక అత్యాచారానికి, ఆపై హత్యకు గురైన ఎనిమిదేళ్ల ముస్లిం బాలిక తరఫున కేసును వాదిస్తున్న దీపికా సింగ్ రజావత్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య ఇది. బాలిక కేసును వాదించకుండా, ఆ కేసులో చార్జిషీటు దాఖలు కాకుండా ఆమెకు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ఆమె అసహనంతో ఈ వ్యాఖ్య చేశారు. ఆమెకు బెదిరింపులు ఎదురైనవి ఎవరి నుంచో కావు. సాక్షాత్తు జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ సతాథియా నుంచి. ఈ కేసులో చార్జిషీటు దాఖలు కాకుండా మొదటి నుంచి అడ్డుకుంటున్న భూపిందర్ సింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన తనను తీవ్రంగా బెదిరించినట్లు, అవమానకరంగా మాట్లాడినట్లు ఆమె ఆ తర్వాత తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించారు. తాను ఎవరి పక్షం కానని, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు... అందరి కేసులను వాదిస్తానని చెప్పారు. పిల్లలకు జరిగే అన్యాయం ఎంత దారుణంగా ఉంటుందో తాను ఊహించగలనని, తనకు ఓ ఐదేళ్ల పాప ఉందని, భూపిందర్ సింగ్కు కూడా ఓ పాప ఉండే ఉంటుందని ఆమె అన్నారు. బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బుధవారం నాడు జమ్మూలో బంద్ నిర్వహించిన హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం నాడు కూడా తన ఆందోళనను కొనసాగించింది. బాలిక రేప్ కేసును స్థానిక క్రైమ్బ్రాంచ్ పోలీసులు సవ్యంగానే దర్యాప్తు జరుపుతున్నారని, కేసును మసిపూసి మారేడు కాయ చేయడం కోసమే నేడు కేసును సీబీఐకి అప్పగించాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నదని రజావత్ ఆరోపించారు. తనను బెదిరించడంపై తాను జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. -
కథువా రేప్ కేసులో ఎవరి పాపం ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, వారం రోజుల పాటు రేప్ చేసి, చివరకు హత్య చేసిన దారుణ సంఘటనల క్రమంలో ఒళ్లు విరుచుకుంటూ మూడు నెలల తర్వాత జాతీయ మీడియా మేల్కొంది. దాంతో తప్పనిసరై రాజకీయ పార్టీల హడావిడి మొదలైంది. పరస్పరం బురద చల్లుకోవడం మొదలైంది. ఈ దారుణ రేప్ సంఘటనకు వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద గురువారం రాత్రి జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తన టార్గెట్ అయిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మహిళలకే కాకుండా పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మైనర్ బాలికలను రేప్ చేసిన సంఘటనల్లో నేరస్థులకు ఉరిశిక్షలు విధించే చట్టాన్ని తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ముఫ్తీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న బీజేపీలో ఇద్దరు మంత్రులు రేప్ నిందితులకు మద్దతుగా నిర్వహించిన పలు ర్యాలీలో పాల్గొన్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్య తీసుకునేందుకు ముఖ్యమంత్రి ముఫ్తీ ధైర్యం చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దారుణ రేప్ ఘటనపై ఇప్పటి వరకు పెదవి విప్పకుండా మౌనం వహిస్తూ వస్తోంది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు కశ్మీర్ రాష్ట్ర పాలకులైన బీజేపీ, ముఫ్తీలతోపాటు కేంద్రంలోని బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ దారుణంలో పాపం ఉంది. జనవరి 11వ కథువా జిల్లా, రసన గ్రామంలో గుజ్జార్–బకర్వాల్ ముస్లిం కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలిక ఇంటి పరిసరాల్లో అదృశ్యమైంది. వెంటనే ఆ పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి పెద్దగా స్పందన లేదు. జనవరి 17వ తేదీన సమీపంలోని అటవి ప్రాంతంలో ఆ పాప మృతదేహం దొరికింది. దాన్ని పోస్ట్మార్టమ్కు పంపించగా, ఆ పాపకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా రేప్ చేసినట్లు తేలింది. దీనిపై దర్యాప్తు జరిపిన స్థానిక పోలీసులు దీపు భయ్యా అనే 15 ఏళ్ల బాలుడిని ప్రధాన నిందితుడిగా కేసు దాఖలు చేశారు. ఆ బాలుడు అమాయకుడని స్థానికులు చెప్పడం, మొదట పోలీసుల చిత్రహింసలకు నేరాన్ని తనపై వేసుకున్న ఆ బాలుడు ఆ తర్వాత తాను కాదని చెప్పడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసును క్రైమ్బ్రాంచ్కి అప్పగించాల్సిందిగా స్థానిక బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు గొడవ చేశారు. సీఎం ముఫ్తీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కేసును అప్పగించారు. జనవరి 23వ తేదీన ఈ కేసును టేకప్ చేసిన ఆ పోలీసులు మూడు రోజుల్లోనే కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక భద్రతా దళానికి చెందిన దీపక్ కజారియా, సురీందర్ వర్మలను అరెస్ట్ చేశారు. వారు ఎక్కడి వారో, ఏ బెటాలియన్కు చెందిన వారో, వారి హోదా ఏమిటో ఇంతవరకు దర్యాప్తు అధికారులు వెల్లడించలేదు. వీరిద్దరు కూడా అగ్రవర్ణానికి చెందిన హిందువులవడంతో వీరికి మద్దతుగా ఫిబ్రవరి 14, 17 తేదేల్లో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రదర్శనలు జరిపారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే కొత్తగా ‘హిందూ ఏక్తా మార్చ్’ను ఏర్పాటు చేసిన కశ్మీర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది విజయ్ వర్మ ఫిబ్రవరి 17న నిందితులకు మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో కథువా బీజేపీ అధ్యక్షుడు విజయ్ శర్మతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు హాజరయ్యారు. నాలుగువేల మంది పాల్గొన్న ఈ ర్యాలీలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం ఆశ్చర్యం. ఇదే ర్యాలీలో ‘భారత మాతాకీ జై, పాకిస్తాన్ మురదాబాద్’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా జాతీయ జెండాలను ప్రదర్శించడం మరింత ఆశ్చర్యం. ఫిబ్రవరి 17వ తేదీనే కథువా జిల్లా హీరానగర్లో కొంత మంది అగ్రవర్ణాలకు చెందిన హిందూ పెద్దలు సమావేశమై గుజ్జార్ బకర్వాల్ ముస్లిం కుటుంబాలను వెలివేయాలని తీర్మానించారు. ఆ కుటుంబాల్లో ఎవరిని వ్యవసాయ కూలీలుగా కూడా తీసుకోరాదని కట్టుబాటు విధించారు. ఆ సమావేశానికి రాష్ట్ర బీజేపీ మంత్రి రష్పాల్ వర్మ, హీరానగర్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ వర్మతోపాటు కథువా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ గుప్తా కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా రేప్ కేసును నీరుకార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినా రాహుల్ గాంధీ సదరు నాయకులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కథువా రేప్ కేసు తనకు తెలియనట్లుగానే నటిస్తూ వచ్చారు. మీడియా వార్తలతో ఇప్పుడు వీధిలోకి వచ్చారు. జమ్మూలోని హిందూ మెజారిటీ, కశ్మీర్లోని ముస్లిం మెజారిటీ నాటకాలకు తెరపడనంత కాలం ఈ రాజకీయ పార్టీల తీరు ఇంతే! (గమనిక: సాక్షి వెబ్సైట్ కథువా రేప్ ఘటనపై ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తూ వస్తోంది. ‘ఇంతటి దారుణంలో నిజమైన నేరస్థులెవరో’ చదవండి)