Mehreen Pirzada
-
ముంబై మ్యూజికల్ ఈవెంట్లో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్ (ఫోటోలు)
-
వేకేషన్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్.. తన గ్యాంగ్ను చూశారా?..ఫోటోలు వైరల్
-
సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్.. కెరీర్ డౌన్ ఫాల్.. మెహ్రీన్ ఇప్పుడేం చేస్తోంది? (ఫొటోలు)
-
కంగు బీచ్ లో హీరోయిన్ మెహరీన్ అందాల హొయలు..
-
హీరోయిన్తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో
ప్రేమించి పెళ్లి చేసుకోవడ ఇండస్ట్రీలో కొత్తేం కాదు. హీరోహీరోయిన్లు ఈ పాటికే చాలామంది ఇలా లవ్ మ్యారేజులు చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలోనే వరుణ్ తేజ్ ఇలానే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఒక్కటయ్యాడు. అయితే ఈ లిస్టులో మెగా హీరో సాయిధరమ్ కూడా చేరబోతున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ మెహ్రీన్తో ఏడడుగులు వేయబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా సాయితేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)'ఊషా పరిణయం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగ్గా.. దీనికి చీఫ్ గెస్ట్గా సాయితేజ్ వచ్చాడు. ఇందులోనే 'మీ లవ్ గురించి చెప్పండి' అని యాంకర్ అడగ్గా.. 'వన్సైడ్ లవ్ ఉంది. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు (నవ్వుతూ). ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి, మాట్లాడేలోపు 'మీకు పెళ్లి అయిపోయిందట కదా' అనే ఆన్సర్ వస్తోంది. నాకు పెళ్లా? అని ఆశ్చర్యపోతుంటే.. మీడియాలో చూశామని అంటున్నారు అని నవ్వుతూ సాయితేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.'త్వరలో మెగా ఇంట పెళ్లి సందడి అంటూ న్యూస్ వస్తోంది. మీ వివాహం విషయంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. నిజమేనా?' యాంకర్ అడగ్గా.. 'నా సినిమాలో 'నో పెళ్లి' (సోలో బ్రతుకే సో బెటర్) అనే పాట ఉంది తెలుసు కదా' అని అసలు విషయాన్ని దాటవేశాడు. సో అదన్నమాట సంగతి. ప్రస్తుతం 'హనుమన్' నిర్మాతలతో సాయితేజ్ ఓ సినిమా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?) -
బంగారు కాంతుల మధ్య మెరిసిపోతున్న మెహరీన్ (ఫొటోలు)
-
18వ ఆటా మహాసభల్లో మెహ్రీన్ సందడి
-
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్లో భారీగా పాపులారిటీ దక్కింది. అయితే, కొద్దిరోజుల క్రితం మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఒక పోస్ట్ పెట్టారు.పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లి దండ్రులకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కొందరు సెలబ్రటీలు కూడా పెళ్లి కాకుండానే తమ అండాలను భద్రపరుచుకుంటున్నారు. ఈ విధానాన్ని ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన యువతులే కాకుండా హీరోయిన్లు కూడా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో మెహరీన్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ను ఎంపిక చేసుకుంది. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది.అయితే, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని మెహరీన్ ఫైర్ అయింది. ఈ అంశం గరించి తప్పుగా వార్తలను ప్రచురించిన వారు వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరింది. ' పలు మీడియా సంస్థల్లో పనిచేసే వారు వారి వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉండాలి. ఇలాంటి అంశాలను అర్థం చేసుకుని వార్తలను అందించండి. ఎవరికితోచినట్లు వారు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో నేను పెట్టిన 'ఎగ్ ఫ్రీజింగ్' పోస్ట్పై కొందరు రకరకాల వార్తలు రాశారు. ఈ విధానంలో అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదు. మొదట ఈ విషయాన్నిఅందరూ తెలుసుకోవాలి. నేను ఒక సెలబ్రిటీగా అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఆ పోస్ట్ పెట్టాను. పిల్లలు అప్పుడే వద్దని భావించే వారందరికీ ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా మీ స్వార్థం కోసం తప్పుడు వార్తలు రాశారు. నేను ప్రెగ్నెంట్ అని ప్రచారం చేశారు. ఇదీ చాలా తప్పుగా అనిపించలేదా..? ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు ఫుల్స్టాప్ పెట్టిండి. మీ తప్పును తెలుసుకొని సరిచేసుకోండి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే నాపై పెట్టిన పోస్ట్లను తొలగించండి. ఆపై బహిరంగ క్షమాపణలు చెప్పండి.' అని మెహరీన్ కోరింది.'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఎందుకు పాటిస్తున్నారంటే..?ఈ కాలంలో మహిళలు తమ కెరీర్, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా వ్యాపారం, సినిమా రంగలో ఉండే మహిళలు పెళ్లి, అమ్మతనాన్ని వాయిదా వేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. లైఫ్లో అనుకున్నంతగా సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటాం అని ఇప్పటికే చాలామంది దంపతులు చెప్పారు కూడా.. ఆ కోవకు చెందిన వారు తీరా పిల్లల్ని కనాలనుకునే సరికి.. వయసు దాటి పోవడం, అండాల నిల్వ, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటి వారికి 'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఒక వరం అని చెప్పవచ్చు. 30 ఏళ్ల వయసులోపు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన తమ అండాల్ని ఇలా భద్రపరుచుకుంటారు. ఆపై వారికి నచ్చినప్పుడు పిల్లల్ని కంటారు. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఎగ్ ప్రీజింగ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్
తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన మెహ్రీన్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేందుకు ప్లానే చేసేసింది. అదేనండి మొన్నీ మధ్య 'ఎగ్ ఫ్రీజింగ్' అని హీరోయిన్ మృణాల్ ఠాకుర్ చెప్పిందిగా. ఇప్పుడు దాన్ని మెహ్రీన్ చేసి చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే దీనికి గల కారణాల్ని కూడా చెప్పుకొచ్చింది.'ఎగ్ ఫ్రీజింగ్' అంటే ఏంటి?ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు పెళ్లి లేటుగా చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అందుకే చాలామంది హీరోయిన్లు.. వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరుచుకుని, కావాల్సినప్పుడు పిల్లల్ని కనే ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని 'ఎగ్ ఫ్రీజింగ్' అంటారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు 'ఎగ్ ఫ్రీజింగ్' చేసుకోగా, ఇప్పుడా లిస్టులోకి మెహ్రీన్ చేరింది.(ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక)మెహ్రీన్ ఏమని చెప్పింది?'గత రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా. చివరకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇది నా వ్యక్తిగత విషయం కదా దీన్ని అందరికి చెప్పాలా? వద్దా? అని ఆలోచించాను. కానీ నాలాంటి చాలామంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. పెళ్లి, బిడ్డని కనే విషయంలో వాళ్లు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నేను మాత్రం భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను. దీని గురించి మనం పెద్దగా మాట్లాడట్లేదు. కానీ టెక్నాలజీ సాయంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం''తల్లి కావడమనేది నా కల. కాకపోతే అది కొన్నేళ్లు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆస్పత్రులంటే భయముండే నాలాంటి వాళ్లకు ఇది సవాలే. ఎందుకంటే ఇంజెక్షన్స్ కారణంగా ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ నేను కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఇక ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే.. కచ్చితంగా మంచిదే అని చెబుతాను. మీరు ఏం చేసినా సరే మీకోసం చేయండి. అలానే ఈ జర్నీలో నాకు అండగా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు థ్యాంక్స్' అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?) -
Mehreen Pirzada: చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మెహరీన్ (ఫోటోలు)
-
Spark Review: 'స్పార్క్' సినిమా రివ్యూ
టైటిల్: స్పార్క్ నటీనటులు: విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్, నాజర్ తదితరులు నిర్మాత: విక్రాంత్ రచన-దర్శకత్వం-స్క్రీన్ప్లే: విక్రాంత్ సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ విడుదల తేది: 2023 నవంబర్ 17 (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) స్కార్క్ కథేంటంటే? లేఖ(మెహరీన్) కలలోకి ప్రతి రోజు ఓ వ్యక్తి వస్తుంటాడు. దీంతో ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. స్నేహితులతో కలిసి అతని కోసం వెతుకుతుంటుంది. ఓ ఆస్పత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతనే ఆర్య(విక్రాంత్ రెడ్డి). లేఖ ఎదురింట్లోనే ఉంటాడు. అతన్ని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆర్య మాత్రం లేఖ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. నగరంలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. సడెన్గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) ఆరోపిస్తాడు. పోలీసులు కూడా అతని కోసం గాలిస్తుంటారు. అసలు సిటీలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు? అమ్మాయిలు సడెన్గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్కు చెందిన జై.. ఆర్యగా పేరు మార్చుకొని హైదరాబాద్కు ఎందుకు వెళ్లాడు? యువతుల మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? జై ప్రియురాలు అనన్య(రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పనిచేసే డాక్టర్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఇదో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. దానికి ట్రయాంగిల్ లవ్స్టోరీని జోడించారు. ఫస్టాఫ్లో ఒకపక్క హీరోహీరోయిన్లతో లవ్ట్రాక్ నడిపిస్తూనే.. మరోపక్క వరుస హత్యలు చూపిస్తూ ఆసక్తిని పెంచేశాడు దర్శకుడు. హత్యలకు సంబంధించిన సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి. లవ్ట్రాక్ మాత్రం రొటీన్గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక అసలు కథ ద్వితీయార్థంలో మొదలవుతుంది. నాజర్,గురు సోమసుందరం పాత్రల ఎంట్రీ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఎదుటి మనిషిలోని మెదడును కంట్రోల్ చేసే ప్రయోగం సఫలం అయితే జరిగే అనార్థాలను గురించి ఇందులో చర్చించారు. హత్యలతో సంబంధం ఉన్నవారిని గుర్తించేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథ చాలా కొత్తది. పాన్ ఇండియా సబ్జెక్టు. ఇలాంటి భారీ కథకు స్టార్ హీరో అయితే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే? విక్రాంత్ కొత్తవాడే అయినా.. తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఒకవైపు దర్శకత్వ బాధ్యతలు చేపడుతూనే.. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఆర్య, జై పాత్రల్లో చక్కగా నటించాడు. కొన్ని చోట్ల నటనలో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ విషయంలో విక్రాంత్ ఇంకాస్త కసరత్తు చేయాల్సింది. లేఖ పాత్రలో మెహరిన్ ఒదిగిపోయింది. ఇక హీరో ప్రియురాలు అనన్యగా రుక్సార్ చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. విలన్గా గురు సోమసుందరం తనదైన నటనతో మెప్పించాడు. సుహాసినీ మణిరత్నం సరికొత్త పాత్రలో నటించింది. నాజర్, రాహుల్ రవీంద్ర, వెన్నెల కిశోర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. హేషం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్గా కనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) -
‘స్పార్క్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ అందరికి గుర్తుంటుంది..!
-
Mehreen Pirzada Birthday: మెహరీన్ బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ
-
అలా విమర్శించేవారికి కూడా అక్కా చెల్లెళ్లు ఉంటారు: హీరోయిన్
తమిళసినిమా: ఆడవారిని విమర్శలతో బాధించడం నీచమైన చర్యగా నటి మెహ్రిన్ పేర్కొంది. ఈ బ్యూటీ తెలుగులో నానీకి జంటగా కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో కథానాయకిగా పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. తమిళం, హిందీ భాషల్లోనూ కథానాయకిగా నటించిన మెహ్రిన్కి ఇప్పటికీ స్టార్ ఇమేజ్ రాలేదని చెప్పాలి. అంతేకాదు ప్రస్తుతం అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తమిళంలో నెంజిల్ తునివిరిందాల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ధనుష్కు జంటగా పటాస్, విజయ్ దేవరకొండ సరసన నోటా చిత్రాల్లో ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాలేదు. అలాంటిది ప్రస్తుతం స్పార్క్ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ అమ్మడు కూడా వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సీరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మెహ్రిన్ బెడ్ రూమ్ సన్నివేశాల్లో హద్దు మీరి ఉందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అశ్లీల సన్నివేశాలలో బరితెగించి నటించింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలపై స్పందించిన మెహ్రిన్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సీరీస్లో చోటుచేసుకున్న మానభంగం సన్నివేశంలో అశ్లీలంగా నటించాలని తనపై విమర్శలు గుర్తిస్తున్నారని ఇది తనను ఎంతగానో బాధకు గురిచేస్తోందని పేర్కొంది. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలనే ఆ వెబ్ సీరీస్లో చూపించినట్లు చెప్పింది అయితే తనను చాలా నీచంగా చిత్రీకరించి ట్రోలింగ్ చేయడం బాధిస్తోందని పేర్కొంది. విమర్శలు చేసే వారికి అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని ఆడవారిని బాధించడం వారిపై రాక్షసంగా ప్రవర్తించడం హేయమైన చర్య అనే భావనను మెహ్రిన్ వ్యక్తం చేసింది. Recently I made my OTT Debut in the web series, “Sultan of Delhi” on Disney Hotstar. I hope my fans have enjoyed watching the series. Sometimes scripts demand certain actions which might go against your own morals. As a professional actor who considers acting an art and at the… — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) October 17, 2023 -
అది శృంగార సీన్ ఎలా అవుతుంది?.. మండిపడ్డ మెహ్రీన్
కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మెహ్రీన్ పీర్జాదా. తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ టాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. గతేడాది ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులను అలరించిన మెహ్రీన్.. ఈ ఏడాదిలో ఓటీటీలోనూ అరంగేట్రం చేసింది. ఇటీవలే ఆమె నటించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. అయితే ఈ సిరీస్లో ఆమె ఓ అత్యాచార సన్నివేశంలో నటించింది. అయితే ఈ సీన్ ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఆ సన్నివేశాన్ని కొందరు శృంగార సీన్గా అభివర్ణించడంపై మెహ్రీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా రాయడం తనకు తీవ్ర బాధ కలిగించిందని ట్వీట్ ద్వారా వెల్లడించింది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) మెహ్రీన్ ట్వీట్లో రాస్తూ.. 'ఢిల్లీ సుల్తాన్లో వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే ఓ సన్నివేశం ఉంది. మనదేశంలో ఇది తీవ్రమైన సమస్య. ఇలాంటి సమస్యను మీడియాలో చాలా మంది శృంగార సీన్గా అభివర్ణించడం నాకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలకు ఇది తీవ్రమైన సమస్య. ఈ విషయాన్ని ఇలా చెప్పడం సమస్యను చిన్నదిగా చూపించినట్లు అవుతుంది. సోషల్ మీడియాలోని వ్యక్తులు ఇలా చేయడం నన్ను కలవరపెడుతోంది. ఇలాంటి వారు తమకు సోదరీమణులు, కుమార్తెలు కూడా ఉన్నారన్న విషయం అర్థం చేసుకోవాలి. వారు తమ నిజ జీవితంలో అలాంటి బాధను ఎప్పటికీ ఎదుర్కోవద్దని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మహిళలపై ఇలాంటి క్రూరత్వం, హింస అనే ఆలోచన చాలా అసహ్యకరమైనది.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా నటుడిగా ఆ పాత్రకు న్యాయం చేయడం నా పని అని తెెలిపింది. మిలన్ లుథ్రియా సర్ నేతృత్వంలోని సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ బృందం చాలా కష్టతరమైన సన్నివేశాల షూటింగ్ సమయంలో నటులుగా మేం చాలా ప్రొఫెషనల్గా ఉన్నామని పేర్కొంది. నేను చేసే పాత్ర మహాలక్ష్మి అయినా, సంజన అయినా, హనీ అయినా నా ఫ్యాన్స్ కోసం ప్రతి పాత్రలోనూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. (ఇది చదవండి: అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్ ఠాకూర్) Recently I made my OTT Debut in the web series, “Sultan of Delhi” on Disney Hotstar. I hope my fans have enjoyed watching the series. Sometimes scripts demand certain actions which might go against your own morals. As a professional actor who considers acting an art and at the… — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) October 17, 2023 -
నా మూడేళ్ల కల స్పార్క్
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం నవంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విక్రాంత్ మాట్లాడుతూ – ‘‘నాకు సినిమాలంటే ఇష్టం. అమెరికాలో జాబ్ చేస్తున్న క్రమంలో సంపాదనలో పడి కలను మర్చిపోకూడదని ఈ సినిమా తీశాను. ఏడాదిన్నర పాటు ‘స్పార్క్’ కథ రాసుకుని, కష్టపడి మరో ఏడాదిన్నర పాటు ఈ సినిమాను నిర్మించాం. ‘స్పార్క్’ నా మూడేళ్ల కల. యాక్షన్, థ్రిల్, లవ్, కామెడీ, డ్రామా.. అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. యూనివర్సల్ అప్పీల్ ఉన్న మల్టీజానర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు తమిళ నటుడు గురు సోమసుందరం. ‘‘టైటిల్కు తగ్గట్లే మా సినిమా ‘స్పార్క్’లా ఉంటుంది’’ అన్నారు మెహరీన్. ‘‘ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్. -
Mehreen Pirzada: తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న మెహరీన్ (ఫోటోలు)
-
బక్కచిక్కిన లుక్ లో మెహరీన్ తిట్టిపోస్తున్న నెటిజన్లు
-
షాకింగ్ లుక్లో హీరోయిన్ మెహ్రీన్
-
హీరోయిన్ మెహ్రీన్కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి?
ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అందం కూడా అంతే ముఖ్యం. అందుకే హీరో,హీరోయిన్లు ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా మెస్మరైజ్ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే సో బెటర్ అంటున్నారు. చదవండి: కమెడియన్ మనోబాల మృతికి కారణం ఇదేనా?.. ఆ వ్యసనం వల్లేనా? తాజాగా ఈ లిస్ట్లో మెహ్రీన్ కూడా చేరింది. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ బ్యూటీ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో బాగా సన్నబడింది. వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్కి వచ్చేసింది. లేటెస్ట్గా తన లుక్కి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసి.. మెహ్రీన్కు ఏమైంది ఇంత సన్నబడింది? అయినా ఒకప్పటిలా బొద్దుగా ఉంటేనే బాగుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్మన్ కుటుంబానికి ఆర్థికసాయం -
జహీరాబాద్ : షాపింగ్ మాల్లో హనీరోజ్, మెహ్రీన్ సందడి (ఫొటోలు)
-
హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది?
కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది మెహరీన్ పిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఇటీవలే ఎఫ్ 3తో ప్రేక్షకులను అలరించిన మెహరీన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేయగా అది కాస్తా నెట్టింట వైరల్గా మారింది. ఇందులో మెహరీన్ ముఖమంతా సూదులతో గుచ్చి ఉంది. ఇది చూసిన మెహరీన్ ఫ్యాన్స్ ముఖానికి సూదులు గుచ్చుకోవడమేంటని కంగారుపడుతున్నారు. అయితే తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసమే ఇలా చేసింది మెహరీన్. తను ఆక్యుస్కిన్లఫ్ట్ అనే థెరపీ చేయించుకుంది. ఈ థెరపీ చేసి నా ముఖాన్ని మరింత కాంతివంతంగా మార్చిన వైద్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) చదవండి: జిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది తుప్పాస్ పని చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ -
నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్
ఓ పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటారు హీరోయిన్లు. సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలకు సంబంధించిన పోస్టులు, వీడియోలు పెడుతూ అభిమానులను, ఫాలోవర్స్ను ఎంటర్టైన్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ పోస్టులతో మూవీ ప్రమోషన్స్ చేస్తూ కొత్త ఫాలోవర్స్, సినిమా అవకాశాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తను పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. 'ఎఫ్3'తో సక్సెస్ జోష్లో ఉన్న బ్యూటిఫుల్ మెహ్రీన్ పిర్జాదా. ఇటీవల తన దగ్గరి బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది హీరోయిన్ మెహ్రీన్. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో నిర్వహించిన బారాత్లో నడిరోడ్డుపై స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మరో అమ్మాయితో కలిసి తీన్మార్ ఉత్సాహంగా చిందులేసింది. పెళ్లి బరాత్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది మెహ్రీన్. ఈ పోస్ట్కు 'పంజాబీ వెడ్డింగ్ సీన్స్' అనే క్యాప్షన్స్ ఇవ్వగా.. ఈ వీడియో అతి కొద్ది సమయంలోనే వైరల్గా మారింది. కాగా 'కృష్ణగాడి వీర ప్రేమకథ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ పంజాబీ భామ. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
హైదరాబాద్లో ప్రారంభమైన మెహరీన్ స్పార్క్ మూవీ
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్పార్క్’. మెహరీన్ హీరోయిన్. సినిమాటోగ్రాఫర్ అరవింద్ కుమార్ రవివర్మ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, దర్శకుడు సురేందర్ రెడ్డి, కెమెరామేన్ రత్నవేలు, నిర్మాత అన్వేష్ రెడ్డి, పారిశ్రామికవేత్త రామరాజు పాల్గొన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రం రూపొందుతోంది. రత్నవేలు దగ్గర అసోసియేట్ సినిమాటోగ్రాఫర్గా చేశారు అరవింద్. దర్శకులు శంకర్, సుకుమార్గార్ల దగ్గర దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
నా కెరీర్లో బెస్ట్ పాత్ర ఇదే!: మెహరీన్
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్కి జోడీగా మెహరీన్ నటించిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్లో ఈ చిత్రానికి సీక్వెల్గా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 3’. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ‘ఎఫ్ 2’లో అల్లరి, అమాయకత్వం నిండిన హనీ పాత్రలో కనిపించిన మెహరీన్ ‘ఎఫ్ 3’లో ఈ రెండు షేడ్స్తో పాటు పరిణతి చెందిన అమ్మాయిలానూ కనిపించనున్నారు. ‘‘మెహరీన్ క్యారెక్టర్ మెచ్యూర్డ్గా డిఫరెంట్ లేయర్స్తో ఉంటుంది. అలాగే పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ‘‘నా కెరీర్లో ఇది బెస్ట్ ఎంటర్టైనింగ్ రోల్’’ అని మెహరీన్ అన్నారు. సోనాల్ చౌహాన్ ఓ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే పార్టీ సాంగ్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి. చదవండి: మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు -
'రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతుంటాయి'.. హీరోయిన్ ఎమోషనల్
Heroine Mehreen Pirzada Opens Up About Troubles In Film Industry: ‘సినిమా ఆర్టిస్టుల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి’ అంటున్నారు హీరోయిన్ మెహరీన్. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ‘‘మేము (ఆర్టిస్టులను ఉద్దేశిస్తూ) అన్నీ తెలిసే అనిశ్చితితో కూడిన జీవితాన్ని ఎంచుకుంటాం. జీవితానికి ఓ గ్యారంటీ ఉండదు. కొన్నిసార్లు సినిమాల్లోని మా పాత్రల లుక్స్ కోసం శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ షెడ్యూల్స్కు తగ్గట్లుగా మా జీవనశైలిలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఇది మా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చలికాలం, వర్షాకాలం, వేసవి.. అనే తేడాలు చూడకుండా సినిమాల కోసం పని చేస్తుంటాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇది చాలా బాధగా ఉంటుంది. మా జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు ఉంటాయి. కెరీర్లో ఓ అద్భుతమైన విజయం దక్కిందనుకునేలోపే మరో వైఫల్యం వస్తుంది. ఒక్కోసారి రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతుంటాయి(సినిమా హిట్ అండ్ ఫెయిల్యూర్లను ఉద్దేశిస్తూ). ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సినిమాను ఓ కళారూపంగానే గౌరవిస్తాను’’ అన్నారు. కాగా తెలుగులో మెహరీన్ ఓ హీరోయిన్గా నటించిన ‘ఎఫ్ 3’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
నాగ్ సరసన మెహరీన్
నాగార్జునకు జోడీగా మెహరీన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్గా కనిపిస్తారు నాగార్జున. ఈ చిత్రంలో హీరోయిన్గా ఫస్ట్ కాజల్ అగర్వాల్ను ఎంపిక చేశారు. కానీ వ్యక్తిగత కారణాలతో కాజల్ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో అమలా పాల్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఫైనల్గా మెహరీన్ ఈ చిత్రంలో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాగా మెహరీన్ ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’, కన్నడంలో శివరాజ్కుమార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
ఓసీడీ ఉంది..ఎప్పటి నుంచో అవి వాడుతున్నా: హీరోయిన్
Mehreen Reveals About Her Real Life Ocd Disease: 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన మెహ్రీన్ ఇటీవలె 'మంచి రోజులు వచ్చాయి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మెహ్రీన్..పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంది. మహానుభావుడు సినిమాలో హీరో శర్వానంద్కు ఓసీడీ ఉంటుంది. అయితే తనకు రియల్ లైఫ్లో అంతకన్నా ఎక్కువ ఓసీడీ ఉందని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.చదవండి: విడాకులపై ఫోటోతో క్లారిటీ ఇచ్చిన ప్రియమణి కరోనా వచ్చిన తర్వాత అంతా శానిటైజర్లు వాడుతున్నారు. కానీ నాకు చాలా ఏళ్లుగా శానిటైజర్లు అలవాటు. అప్పట్లో నా బ్యాగ్ లో 2-3 శానిటైజర్ బాటిళ్లు ఉండేవి. ఇప్పుడు 6-7 ఉంటున్నాయి. నా మేకప్ స్టాఫ్ అయితే చేతులు చేతులు కడుక్కొని, శానిటైజర్ రాసుకున్న తర్వాత నా ఫేస్ టచ్ చేయాలి. మొదటి నుంచి నాకు ఈ ఓసీడీ ఉందని చెప్పుకొచ్చింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. చదవండి: ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు రీసెంట్గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ -
‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రివ్యూ
టైటిల్ : మంచి రోజులు వచ్చాయి నటీనటులు : సంతోష్ శోభన్, మెహరీన్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు నిర్మాణ సంస్థ : యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ నిర్మాత : ఎస్కేఎన్ దర్శకత్వం : మారుతి సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్ విడుదల తేది : నవంబర్ 4, 2021 Manchi Rojulu Vachayi Review: ఒకవైపు పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో తనకు నచ్చిన కాన్సెప్ట్తో చిన్న చిన్న సినిమాలు తీస్తుంటాడు దర్శకుడు మారుతి. అలా ఆయన తెరకెక్కించిన మరో చిన్న చిత్రమే ‘మంచి రోజులు వచ్చాయి’.దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అతి భయస్తుడైన తిరుమలశెట్టి గోపాల్ అలియాస్ గుండు గోపాల్(అజయ్ ఘోష్)కి కూతురు పద్మ తిరుమల శెట్టి అలియాస్ పద్దు(మెహ్రీన్ ఫిర్జాదా) అంటే ప్రాణం. తన కూతురు అందరి ఆడపిల్లలా కాదని, చాలా పద్దతిగా ఉంటుందని భావిస్తాడు. అయితే పద్దు మాత్రం బెంగళూరు సాఫ్ట్వేర్గా పనిచేస్తూ.. సహోద్యోగి సంతోష్(సంతోష్ శోభన్)తో ప్రేమలో పడుతుంది. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సంతోషంగా ఉండే గోపాల్ని చూసి అసూయ పడిన పక్కింటి వ్యక్తులు పాలసీ మూర్తి, కోటేశ్వరరావు.. ఆయనలో లేనిపోని భయాలను నింపుతారు. కూతురు ప్రేమ విషయంలో లేనిపోని అనుమానాలను నింపుతారు. దీంతో గోపాలం కూతురి విషయంలో ఆందోళన చెందడం మొదలుపెడతాడు. ఎలాగైన కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో గోపాల్కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రియురాలు పద్దు ప్రేమను దక్కించుకోవడానికి సంతోష్ చేసిన ప్రయత్నాలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఈ సినిమాకు ప్రధాన బలం అజయ్ ఘోష్ పాత్రే. గుండు గోపాల్గా అజయ్ అదరగొట్టేశాడు. కథ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా తనదైన కామెడీ యాక్టింగ్తో నవ్వించాడు. పద్దుగా మెహ్రీన్, సంతోష్గా సంతోష్ శోభన్ పాత్రల్లో పెద్దగా వైవిద్యం కనిపించదు కానీ.. వారిమధ్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పాలసీ మూర్తిగా శ్రీనివాసరావు అద్భుత నటనను కనబరిచాడు. వెన్నెల కిశోర్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి, రజిత తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. ఎలా ఉందంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కంటనీరు పట్టిస్తున్నాడు. ‘మంచి రోజులు వచ్చాయి’కూడా అలాంటి చిత్రమే. ‘భయం’అనే అంశాన్ని తీసుకొని ఎప్పటిలానే ఎమోషన్స్ జోడిస్తూ హాస్యంతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీనికోసం కరోనా పరిస్థితును కూడా వాడుకున్నాడు. ఫస్టాఫ్ అంతా మారుతి మార్క్ కామెడీ, పంచులతో సరదాగా గడిచిపోతుంది. డాక్టర్గా వెన్నెల కిశోర్ ఫ్రస్ట్రేషన్, సప్తగిరి అంబులెన్స్ సీన్స్, అప్పడాల విజయలక్ష్మీ ఫోన్ కాల్ సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్లో కరోనా పరిస్థితుల సన్నీవేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా రొటీన్గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా సింపుల్గా ఊహకందే విధంగా ఉంటుంది. క్లైమాక్స్లో భయం గురించి సాగిన చర్చ ఆలోచింపజేసేదిగా ఉంటుఉంది. ఇక సాంకెతిక విభాగానికి వస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
గ్లామర్ ఒలకబోస్తోన్న ఎఫ్ 3 భామ..మెహ్రీన్ కౌర్ ఫొటోలు..
-
‘మంచి రోజులోచ్చాయి’ ట్రైలర్ వచ్చేసింది
మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. కామెడీ, ఎంటర్టైన్మెంట్తో రూపొందుతోన్న ఈ మూవీ ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్లు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ‘మై వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్.. నా పేరు సంతోష్.. ఆనందానికి కేరాఫ్ అడ్రెస్.. వీడు అనేది నా ట్యాగ్లైన్’ అంటూ సంతోష్ శోభన్ తనను తాను పరిచయం చేసే సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. ఇక ‘నా కూతురు లాంటి కూతురిని కన్న ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాల్సిందే.. అంటూ అశిష్ ఘోష్ మెహ్రీన్ గురించి చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా ఎస్కేఎన్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. -
హల్చల్ : మూడీగా బుట్టబొమ్మ..క్యాప్షన్ అడిగిన మెహ్రీన్
► హ్యాపీ వీకెండ్ అంటున్న జూనియర్ శ్రీదేవి ► క్యాప్షన్ ఇవ్వమని అడిగిన మెహ్రీన్ ► తండ్రి బర్త్డేకు ఉపాసన లవ్లీ విషెస్ ► చీరలో రష్మీ అందాల పరువాలు ► మూడీ అంటూ ఫోటో షేర్ చేసిన బుట్టబొమ్మ ► ఘని షూటింగ్ స్టిల్ను షేర్ చేసిన వరుణ్తేజ్ ► బ్లాక్ అండ్ వైట్లో టిక్టాక్ స్టార్ భాను ► క్యూట్ లుక్స్తో అలరిస్తున్న కొత్త పెళ్లికూతురు దిశ View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) -
హల్చల్ : మెహ్రీన్ యోగాసనాలు..తమన్నా మెరుపులు
♦ భర్తతో కలిసి రీల్స్ చేసిన షెఫాలి ♦ యోగా ప్రాముఖ్యత తెలియజేస్తున్న మెహ్రీన్ ♦ గ్లామరస్గా మెరిసిపోతున్న తమన్నా ♦ ఈ అందమైన పువ్వులు మీకోసమే అంటున్న సునీతచెర్రీ వైన్లా ఫోజిచ్చిన జాన్వీ కపూర్ ♦ తల్లి ఫిట్గా ఉంటేనే బిడ్డ కూడా ఫిట్గా ఉంటుందన్న మహి View this post on Instagram A post shared by Smriti Irani (@smritiiraniofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) -
అలాంటి మంచిరోజులు త్వరలోనే వస్తాయి!
Manchi Rojulochaie: ‘‘కరోనా సమయంలో అందరం నవ్వుకు దూరం అయిపోయాం. కరోనా రాకపోయినా భయంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు చూసి ‘మంచి రోజలు వచ్చాయి’ సినిమా తీశాను’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎలాంటి భయం లేకుండా థియేటర్లకు వచ్చి మా ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా చూస్తారని, అలాంటి మంచి రోజులు అతి త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్గా జర్నలిస్టులను కూడా చేర్చాలి’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా చిత్రాన్ని చూసి ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు మెహరీన్. ‘‘నా ప్రతిభని నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలు వంశీగారు, విక్రమ్గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు సంతోష్ శోభన్. నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. -
మెహ్రీన్కు ‘మంచి రోజులు వచ్చాయి’..త్వరలోనే అనౌన్స్మెంట్
హీరోయిన్ మెహ్రీన్కు మంచి రోజులు వచ్చాయి. ఆమెకు మంచి రోజులు రావడం ఏంటి అనే కదా మీ సందేహం. మరేం లేదండి..రీసెంట్గా మెహ్రీన్ నటిస్తున్న సినిమాకు ఖరారు చేసిన టైటిల్ అది. ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్లో మంచి క్రేజ్ సంపాదిచుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్తో మెహ్రీన్ జతకట్టింది. తాజాగా ఈ చిత్రానికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిట్ను ఖరారు చేశారు. ఈ మేరకు మూవీ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్లో సందడి చేయనుంది. విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన రానుంది. నిజజీవిత పాత్రలను స్పూర్తిగా తీసుకుని యూత్ఫుల్ ఎంటర్ టైనర్గా ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తుంది. ఎస్కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఎఫ్3 తప్పా పెద్ద సినిమాలు లేవు. మరోవైపు 'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన సంతోష్ చేతిలో నందినీరెడ్డి సినిమాతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
హల్చల్ :దిశ-రాహుల్ల పెళ్లి సందడి.. స్లిమ్ లుక్లో షెహ్నాజ్
♦ స్లిమ్ లుక్తో షాకిచ్చిన షెహ్నాజ్ ♦ ఫుల్ జోష్లో మెహ్రీన్..రోజుకో పోస్టు ♦ వాటికి 100 మార్కులు ఇస్తానంటున్న శివాత్మిక ♦ కష్టమైన పనులు సింపుల్గా ♦ పింక్ అంటే లవ్ అంటున్న కృతి సనన్ ♦ వితికా స్టన్నింగ్ స్టిల్స్ ♦ సంతోషానికి అదే లాంగ్వెజ్ అంటున్న శిల్పా శెట్టి ♦ పెళ్లికి సిద్దమైన దిశ-రాహుల్ View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by DP (@dishaparmar) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) -
హల్చల్ : అనసూయ నవ్వులు.. అరియానా కొటేషన్లు
♦ భర్తతో క్యూట్ ఫోటో షేర్ చేసిన యాంకర్ అనసూయ ♦ 60మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న నేహా కక్కర్ ♦ లాస్యతో బోల్డ్ లేడీ అరియానా నవ్వులు ♦ కూతురికి ప్రేమగా విషెస్ తెలిపిన శ్రీదేవి ♦ బాయ్ ఫ్రెండ్ రియాక్షన్పై రీల్స్ చేసిన టిక్టాక్ బ్యూటీ భాను ♦ క్యాప్షన్స్ కోసం ఆలోచిస్తే సాంగ్స్ వస్తాయేంటో అంటున్న దివ్యాంక ♦ పిట్ట మనుసులో ఏముంది అంటూ అషూ రెడ్డి రీల్స్ ♦ ఫోటో షూట్ షేర్ చేసిన యాంకర్ లాస్య ♦ పానీపూరి బండిని తోలుతున్న తేజస్వి ♦ బీచ్లో సందడి చేస్తున్న ఎఫ్-3 బ్యూటీ మెహ్రీన్ View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by 𝘊𝘩𝘢𝘳𝘭𝘪𝘦 𝘊𝘩𝘢𝘶𝘩𝘢𝘯 🅷🅴🅴🆁 🕉️ (@charliechauhan) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
హల్చల్ : కవ్విస్తున్న హారిక.. ఎంజాయ్ చేస్తోన్న మెహ్రీన్
♦ బీచ్లో ఎంజాయ్ చేస్తోన్న మెహ్రీన్ ♦ అరియానాతో రిల్స్ చేసిన మెహబూబ్ ♦ వెకేషన్ మూడ్లో అశ్మిత ♦ ఉన్నది ఒకటే జిందగీ రీ యూనియన్ ♦ బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న శ్రీముఖి ♦ మిడ్ నైట్ క్రేవింగ్స్ అంటోన్న షెహ్నాజ్ ♦ బ్లాక్ అండ్ వైట్ ఎప్పటికీ మోడ్రన్ అంటున్న సోనమ్ ♦ మూవీ ప్రమోషన్స్లో శిల్పా శెట్టి ♦ బిగ్బాస్ బ్యూటీ హారిక హాట్ స్టిల్స్ View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) -
అత్యంత ప్రమాదకరమైన స్త్రీ ఆ పని చేయదు.. మెహ్రీన్ ఆసక్తికర పోస్ట్
మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నాళ్ల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్తో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న మెహ్రీన్.. ఇటీవల బ్రేకప్ చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చింది. పెళ్లి రద్దు విషయం తన పర్సనల్ అని, ఇకపై దీని గురించి చర్చ జరగకుండా ఉంటే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఈ అంశం మీద స్పందించిన భవ్య కూడా తాను ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే మెహరీన్ ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి మీ కత్తి మీద ఆధారపడడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకే సొంతంగా ఓ కత్తి ఉంటుంది’అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. కొటేషన్ కాస్త గందరగోళంగా ఉన్నా... తాను అత్యంత ప్రమాదకరమైన స్త్రీని అని, రక్షణ కోసం ఇతరులపై ఆధారపడబోనని చెప్పుకోవడానికే ఈ పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
మెహ్రీన్తో పెళ్లి క్యాన్సిల్, స్పందించిన భవ్య బిష్ణోయ్
పంజాబీ ముద్దుగుమ్మ, హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్తో పెళ్లి రద్దు చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. భవ్యతో తన ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకున్నానని, ఇక నుంచి భవ్యతో కానీ అతడి కుటుంబ సభ్యలతో తనకు ఎలాంటి సంబంధం ఉండదని తన పోస్టులో స్పష్టం చేసింది. అయితే దీనికి కారణంగా మాత్రం మెహ్రీన్ వెల్లడించలేదు. అది తెలిసి ఆమె ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురైనా.. ఎదో పెద్ద కారణంగా వల్లే మెహ్రీన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని తనకు మద్దుతుగా నిలుస్తారు. అంతేగాక సోషల్ మీడియాలో భవ్య బిష్ణోయ్, అతని కటుంబానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు. వారిని నిందిస్తు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇవి కాస్తా భవ్య బిష్ణోయ్ కంటపడ్డాయి. వీటిపై అతడు స్పందిస్తూ.. తను, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. ‘పెళ్లి క్యాన్సిల్పై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలా అని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నాపై, నా కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇంతటితో అవి ఆపేయండి. ఎవరైతే తప్పుడు పోస్టులు పెడుతున్నారో వారందరి అకౌంట్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించాడు. కాగా గత మార్చి 13న హీరోయిన్ మెహ్రీన్, భవ్య బిష్ణోయ్ల నిశ్చితార్థం రాజస్థాన్లోని జోధ్పూర్ విల్లా ప్యాలెస్లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ॐ ੴ 🙏 pic.twitter.com/Ko9I1CtM4m — Bhavya Bishnoi (@bbhavyabishnoi) July 3, 2021 -
భవ్య బిష్ణోయ్కు షాకిచ్చిన హీరోయిన్ మెహ్రీన్, పెళ్లి క్యాన్సిల్
Mehreen Pirzada Calls Off Engagement: హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్య బిష్ణోయ్తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు తాజాగా ప్రటించింది. మార్చిలో భవ్య బిష్ణోయ్తో ఆమె నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఈ జంట కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి వాయిదా పడటంతో మెహ్రీన్ తన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉందని అని అందరూ భావిస్తుండగా తన నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకున్నట్లు ప్రకటించి మెహ్రీన్ అందరికి షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మెహ్రీన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. ‘భవ్య బిష్ణోయ్తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఈ రోజు నుంచి నాకు , భవ్య బిష్ణోయ్, అతడి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం నా మనసు చెప్పింది విన్నాను. ప్రతి ఒక్కరు నా నిర్ణయాన్ని, అలాగే నా ప్రైవసీకి గౌరవిస్తారని ఆశిస్తున్న. ఇక యదావిధిగా షూటింగ్పై దృష్టి పెట్టానుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసి తన అభిమానులు, ఫాలోవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమదైనలో మెహ్రీన్ పోస్టుపై స్పందిస్తున్నారు. pic.twitter.com/OD2p8ZKOpJ — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021 -
ఆ వార్తలు నమ్మకండి.. ఏవైనా ఉంటే నేనే చెప్తా: మెహ్రీన్
నానికి జోడీగా ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నటించి టాలీవుడ్లోకి అడుగుపెట్టింది పంజాబీ భామ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. మహానుభావుడు, ఎఫ్ 2 చిత్రాలతో ఈ ముద్దు గుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కాగా ఇటీవల దర్శకుడు గోపిచంద్ మలినేని తన సినిమాలో హీరోయిన్గా మెహ్రీన్తో సంప్రదింపులు జరిపినట్లు, ఆ ఆఫర్ను ఈ అమ్మడు రిజెక్ట్ చేసిందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా దీనిపై మెహ్రీన్ స్పందించింది. ఆ వార్తలను నమ్మకండి.. ప్రస్తుతం ఈ భామ ‘ఎఫ్-3’తో పాటు మరో సినిమాలో నటిస్తోంది. నిశ్చితార్థం అనంతరం తన సినిమాల ఎంపికలో సెలక్టివ్గా ఉంటున్నట్లు తెలుస్తోంది మెహ్రీన్. తనపై వస్తున్న వార్తలకు స్పందిస్తూ.. తెలుగులో కొత్త సినిమాలకు ఇంకా సంతకం చేయలేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ అంగీకరిస్తే తానే స్వయంగా తెలియజేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన ట్విటర్లో.. ‘ ప్రస్తుతం నేను మారుతి దాసరి, సంతోష్ చిత్రంలో బిజీగా ఉన్నాను. నా తదుపరి సినిమాలకు సంబంధించి వస్తున్న వార్తలను నమ్మకండి. ఏవైనా ఉంటే నేనే స్వయంగా మీతో పంచుకుంటా.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ✌️ pic.twitter.com/k2VenjIbnC — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) June 27, 2021 చదవండి: ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? -
సోషల్ హల్చల్: సిగ్గులు ఒలకబోస్తున్న భామలు
► ఫొటో షూట్ చేసిన ఐశ్వర్యా రాజేశ్ ► మన్నారా చోప్రా బ్లాక్ అండ్ వైట్ కళ్లే చూసి కుర్రకారు మతి పోయెనే.. ► టర్కీలో ఎంజాయ్ చేస్తున్న అదితి శర్మ ► చీరలో అందాలను పంచుతోన్న తమిళ హీరోయిన్ శివాని నారాయణన్ ► యోగా లుక్లో షాకిస్తోన్న పునర్నవి భూపాలం ► గాల్లో తేలిపోతున్న నిషా అగర్వాల్ ► కాబోయే భర్త ప్రేమలో తడిసి ముద్దవుతున్న మెహరీన్ ► లాంగ్ డ్రెస్లో యాంకర్ రష్మీ లుక్స్ అదుర్స్ ► బుల్లి గౌను వేసుకున్న శ్రద్ధా కపూర్ ► చీరలో పరువాలు పరుస్తోన్న శ్రద్ధా దాస్ View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mannara❤️ (@memannara) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
భవ్యతో ఘనంగా హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థం
తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాజీ ముఖ్యమంత్రి మనువడికి రింగ్ పెట్టేసింది. మధ్యప్రదేశ్ జైపూర్లోని అలీలా కోటలో శుక్రవారం మెహ్రీన్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఆమెకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్తో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన ఫొటోలను మెహ్రీన్ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. నిశ్చితార్థ వేడుకలో భాగంగా భవ్య బిష్ణోయ్తో కలిసి మెహ్రీన్ పూజలు చేసింది. అనంతరం వీరిరువురు రింగులు మార్చుకున్నారని తెలుస్తోంది. హరియాణా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ బిష్ణోయ్ పని చేశారు. మూడు పర్యాయాలు ఆయన సీఎంగా ఉన్నారు. అతడి మనవడు భవ్య బిష్ణోయ్తో ఆమె వివాహం నిశ్చయమైంది. వీరిది హరియాణాలో రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం. ఈ వేడుకకు రాజస్థాన్లోని జోధ్పూర్ విల్లా ప్యాలస్ వేదిక కానుంది. ఎఫ్ 2, కవచం సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by Gurfateh Singh Pirzada (@gurfatehpirzada) -
సోషల్ హల్చల్: చంపేస్తున్న రష్మీ.. మైండ్ బ్లాక్ చేస్తున్న కాజల్
►రెడ్ ఫ్లేమింగ్ సారీలో అదిరిపోయిన రష్మీ.. ఓర చూపుతో యూత్కు నిద్రలేకుండా చేస్తుంది ► చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న కాజల్ ►శక్తి మనకు ఏమి ఇవ్వదు.. మనమే తీసుకోవాలంటున్న లక్ష్మిరాయ్ ►ఎడారిలో చక్కర్లు కొడుతున్నమెహ్రీన్ ►గొల్డెన్ అవర్ పిక్ అంటూ తన ఫోటోని ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసిన హెబ్బా పటేల్ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) Thank you @AlwaysRamCharan for hosting a great party ❤️❤️❤️ pic.twitter.com/jJf03cRMp0 — Sharwanand (@ImSharwanand) March 6, 2021 View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
మెహ్రీన్ పిర్జాదా బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
‘15-18-24 లవ్ స్టోరీ’ మోషన్ పోస్టర్ రిలీజ్
బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల, కీర్తన, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘15-18-24 లవ్ స్టోరీ’. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్లు నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రంతో త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోబోతోంది. ప్రేమికుల రోజు పురస్కరించుకొని ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను హీరోయిన్ మెహరీన్ విడుదల చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. అదేవిధంగా చిత్ర యూనిట్కు మెహరీన్ బెస్ట్ విషెస్ తెలిపారు. ‘వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యావసనాల మీద అద్భుతమైన కథా, కథనాలతో దర్శకుడు కిరణ్కుమార్ ఈ లవ్ స్టోరీని తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్ర యూనిట్ తెలిపింది. -
యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ట్రైలర్
నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతంగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్లో నెంబర్ వన్ స్థానంలో ఉందని.. చిత్రయూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. బుధవారం రాత్రి విడుదలైన ‘ఎంత మంచివాడవురా!’. ట్రైలర్కు ఇప్పటివరకు 19లక్షలకుపైగా వ్యూస్ రెండు మిలియన్స్ దిశగా దూసుకుపోతోంది. కళ్యాణ్రామ్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణంలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తలు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ట్రైలర్ ‘తాతయ్య దగ్గర శివ, ఊళ్లో శివ, ఈ అమ్మాయి దగ్గర రిషి ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు, రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడు’అంటూ మొదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. రిలేషన్షిప్, ఎమోషన్ అనే పాయింట్కు మాస్, లవ్, కామెడీని చేర్చి అందమైన చిత్రంగా దర్శకుడు తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అంతేకాకుండా సతీష్ వేగేశ్న చిత్రమంటేనే ఆకట్టుకునే డైలాగ్లకు కొదువుండదు. ఈ ట్రైలర్లకూడా పలు డైలాగ్లు పేలాయి. ‘పేరుతో పిలిచేదానికంటే బంధుత్వంతో పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ’, ‘అడిగి ఐలవ్యూ చెప్పించుకోకూడదు’, ‘యస్.. నాకు హీరోలంటే పిచ్చి’, ఎదురించేవాడు రానంతవరకేరా.. భయపెట్టేవాడి రాజ్యం’, ‘ఎవరైనా ఏదైనా ఇస్తే.. తిరిగిచ్చేస్తాను.. అది ప్రేమైనా, భయమైనా’అంటూ వచ్చే డైలాగ్లు పిచ్చెక్కిస్తున్నాయి. తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. -
పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
సాక్షి, హైదరాబాద్: కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ‘క్లీన్ యూ’ సర్టిఫికేట్ లభించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. సకుటుంబసపరివార సమేతంగా చూడదగ్గ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్ టీజర్, సాంగ్స్కు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మరింత ప్రమోషన్ కల్పించేందుకు బుధవారం (8వతేదీన) హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి బరిలో ఉన్న సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో ప్రమోషన్లో దూసుకుపోతూ ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గెస్ట్గా ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండటంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద బాగా కలిసివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు రాజ్ తోట ఫోటోగ్రఫిని అందిస్తుస్తున్నారు. కళ్యాణ్ రామ్, మెహరీన్తోపాటు, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. -
ఎంత మంచివాడవురా!
-
‘చావుకు తెగించినోడు.. బుల్లెట్టుకు భయపడడు’
యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్కు.. సరైన హిట్ తగిలి చాలా కాలమైంది. చివరగా పంతం సినిమాతో పలకరించినా.. హిట్ కొట్టాలనే పంతాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో ‘చాణక్య’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్తో సినిమాపై మంచి బజ్ నెలకొనగా.. ట్రైలర్తో అంచనాలు పెంచేశారు. సీక్రెట్ రా ఏజెంట్, బ్యాంక్ ఉద్యోగిగా డిఫరెంట్ షేడ్స్లో నటించిన గోపిచంద్.. మరోసారి యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసినట్టు కనిపిస్తోంది. గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రిస్క్ చేస్తున్న ‘చాణక్య’
గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘చాణక్య’. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జరీన్ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తిరు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ బ్రహ్మం సుంకర నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను అక్టోబర్ 5న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. అయితే సైరా నరసింహారెడ్డి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం రిలీజ్ అయిన మూడో రోజే గోపిచంద్ సినిమా రిలీజ్ చేయటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. తొలి వారంలోనే సైరాను ఢీ కొంటే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్లపై కూడా భారీగా ప్రభావం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న గోపిచంద్ రిస్క్ చేస్తాడా..? లేక రిలీజ్ డేట్ విషయంలో మరోసారి ఆలోచిస్తాడా? అన్నది చూడాలి. -
‘చాణక్య’ టీజర్ విడుదల
-
ఆకట్టుకుంటోన్న ‘చాణక్య’ టీజర్
హీరో గోపిచంద్ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. విరామం ఎరుగకుండా ప్రయత్నిస్తూ ఉన్న మునుపటిలా విజయాన్ని అందుకోలేకపోతున్నారు. చివరగా లౌక్యం సినిమాతో హిట్ కొట్టగా.. ఆక్సిజన్, గౌతమ్నంద, పంతం లాంటి సినిమాలను చేశాడు. అయినా అనుకున్న విజయాన్ని పొందలేకపోయాడు. మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాణక్యతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రా ఏజెంట్గా అర్జున్ పాత్రలో గోపిచంద్ నటించిన ఈ మూవీ టీజర్ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. టీజర్లో ఉన్న యాక్షన్ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్గా మారనున్నాయి. ఈ మూవీలో మెహ్రీన్, జరీన్ ఖాన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్పై నిర్మించిన ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘చాణక్య’
మ్యాచో హీరో గోపీచంద్, మెహరీన్ జంటగా నటిస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’.. తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా టీజర్ను సెప్టెంబర్ 9 సాయంత్రం గంటలు 4.05 నిమిషాలకు విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. -
దసరా బరిలో ‘చాణక్య’
ఇటీవల వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీ, మిలాన్లో పాటల చిత్రీకరణను జరుగుతోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. -
మెహరీన్ మెరుపు
-
‘ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)’ మూవీ రివ్యూ
టైటిల్ : ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ప్రగతి సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : అనిల్ రావిపూడి నిర్మాత : దిల్ రాజు వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన మరో కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 2. వెంకటేష్, వరుణ్ తేజ్లు హీరోలుగా మల్టీస్టారర్గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో భారీ పోటి మధ్య రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలకు డివైడ్ టాక్ రావటంతో ఎఫ్ 2 ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. చాలా కాలం తరువాత వెంకీ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో కనిపించటం, వరుణ్ తేజ్ తొలిసారిగా మల్టీస్టారర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్ 2 అందుకుందా..? కథ : వెంకీ (వెంకటేష్) ఓ ఎమ్మెల్యే (రఘు బాబు) దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. వెంకీకి అమ్మా నాన్న లతో పాటు అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు కూడా లేకపోవటంతో హారిక (తమన్నా) వెంకీని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తరువాత వెంకీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు తనకు నచ్చినట్టుగా గడిచిపోతున్న వెంకీ జీవితం.. భార్య, అత్తమామల రాకతో నరకంగా తయారవుతుంది. హారిక చెల్లెలు హని (మెహరీన్). కాలేజ్లో చదువుకుంటున్న హనీని వరుణ్ యాదవ్( వరుణ్ తేజ్) ఇష్టపడతాడు. వెంకీ వద్దని వారిస్తున్నా వినకుండా వరుణ్, హనీతో పెళ్లికి రెడీ అయిపోతాడు. వరుణ్ జీవితం పెళ్లి కాకుండానే హనీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో వెంకీ, వరుణ్లలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఎదురింటి వ్యక్తి(రాజేంద్రప్రసాద్) చెప్పిన మాటలు విని వెంకీ తన భార్యను, వరుణ్ తనకు కాబోయే భార్యను వదిలేసి యూరప్ వెళ్లిపోతారు. తాము దూరమైతే భార్యలు కాళ్లభేరానికి వస్తారని అనుకుంటారు. కానీ హారిక, హనీలు యూరప్లోనే ఉండే దొరస్వామి నాయుడు కొడుకులను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతారు. ఈ పరిస్థితుల్లో వెంకీ, వరుణ్లు ఏం చేశారు..? తిరిగి తమ భార్యలకు ఎలా దగ్గరయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : చాలా కాలం తరువాత వెంకటేష్ తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. పర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ, కామెడీ ఇలా ప్రతీ దాంట్లో వెంకీ పర్ఫామెన్స్ సూపర్బ్ అనేలా ఉంది. మరో హీరోగా నటించిన వరుణ్ తేజ్ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. నటన పరంగా మెప్పించినా.. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది. కామెడీ పరంగా మాత్రం మంచి మార్కులే సాధించాడు. హారిక పాత్రలో తమన్నా ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత లీడ్ హీరోయిన్గా అలరించింది. ఫస్ట్ హాఫ్లో మరో హీరోయిన్మెహరీన్ నటన కాస్త అతిగా అనిపించినా తరువాత తరువాత పరవాలేదనిపిస్తుంది. గ్లామర్ షోలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ప్రగతి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్లు తమ వంతుగా నవ్వించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి ఈ పండక్కి ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా కట్టిపడేసే సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వించాడు. ప్రతీ ఇంట్లో రెగ్యులర్గా జరిగే సన్నివేశాలనుంచే కామెడీ జనరేట్ చేశాడు. భార్య భర్తల మధ్య జరిగే గొడవలు, వాటి పరిణామాలు, పుట్టింటి వారి మాటలు ఇలా ప్రతీది ఎంతో ఫన్ క్రియేట్ చేసింది. రచయితగానూ అనిల్ రావిపూడి ఫుల్ మార్క్ సాదించాడు. అనిల్ రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. తొలి భాగాన్ని ఏమాత్రం పట్టు తప్పకుండా ఫన్ రైడ్లా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంలో కాస్త నెమ్మదించాడు. క్లైమాక్స్లో నాజర్ ఎంట్రీ, ఆయన చెప్పే డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. ముఖ్యంగా యూరప్ అందాలను చాలా బాగా తెర మీద ఆవిష్కరించారు. ఎడిటింగ్,నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన సినిమాటోగ్రఫి డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : ద్వితీయార్థంలో కొన్ని సీన్స్ పాటలు సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘ఐలవ్ యూ తిరుపతి’
తిరుపతి కల్చరల్: తిరుపతి వీవీ మహల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన సీఎంఆర్ షాపింగ్మాల్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్జెట్టి, తుడా కార్యదర్శి మాధవీలత, జీఎస్టీ డెప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి, గౌరవ అతిథులుగా హాజరై షాపింగ్ మాల్ మొదటి బ్లాక్ను ప్రారంభించారు. ప్రముఖ హీరోయిన్లు మెహరీన్, రాశీఖన్నాలు ప్రత్యేక అతిథులుగా హాజరై మాల్ రెండవ బ్లాక్తో పాటు జ్యువెలరీ కలెక్షన్స్ను జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరంలోని ప్రజలకు సీఎంఆర్ షాపింగ్మాల్ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. ఆధునిక హంగుల పోకడల ఫ్యాషన్ దస్తులు, సంప్రదాయ దుస్తులతో పాటు ఆధునిక డిజైన్ల బంగారు ఆభరణాలు మాల్లో లభ్యమవుతాయన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేతలు చందన మోహన్రావు, మావూరి వెంకటరణ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవంతో జిల్లాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ను ఏర్పాటుచేశామన్నారు. వీవీ మహల్ ప్రొప్రయిటర్ పురంధర్, పసుపర్తి సూపర్ మార్కెట్ చైర్మన్ పసుపర్తి రఘురామ్ పాల్గొన్నారు. ‘ఐలవ్ యూ తిరుపతి’ సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీతారలు మెహరీన్ , రాశిఖన్నా నగరంలో సందడి చేశారు. అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ ‘ఐ లవ్యూ తిరుపతి’ అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. మెహరీన్ మాట్లాడుతూ సంక్రాంతికి ఎఫ్–2 సినిమాతో మీ ముందుకు వస్తున్న తనను ఆదరించాలని కోరారు. రాశీఖన్నా మాట్లాడుతూ తిరుపతి అభిమానులు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. సినీ తారలను చూసేందుకు అభిమానులు సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద గుమిగూడారు. హీరోయిన్లతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. -
తిరుపతిలో మెహరీన్, రాశీఖన్నా సందడి
-
సందడి చేసిన మెహరీన్
-
‘కవచం’ టీజర్ విడుదల వేడుక
-
‘నోటా’ తొలిరోజు వసూళ్లెంతంటే..?
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నోటా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాను ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సంచలనం సృష్టించిన విజయ్, మరోసారి భారీ వసూళ్లతో సత్తా చాటాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నోటా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 14 కోట్ల వసూళ్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 7 కోట్ల వసూళ్లు సాధించిన నోటా, తమిళ నాడులో 2.6 కోట్లు, కర్ణాటకలో 1.55 కోట్లు, అమెరికాలో 1.85 కోట్లు ఇతర ప్రాంతాల్లో 1.2 కోట్ల వసూళ్లు సాదించింది. విజయ్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నాజర్, సత్యరాజ్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
పబ్లిక్మీట్లో నోటా చిత్ర బృందం
-
‘నోటా’ సందడి
-
విజయ్ దేవరకొండ ‘నోటా’పై వివాదం
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘నోటా’ చిత్రంపై వివాదం చోటు చేసుకుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు రచన హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్ వెన్నలకంటి పోలీసులను ఆశ్రయించాడు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ టైటిల్పై కూడా వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి కాకుండా నోటాకు ఓటెయ్యమనేలా ప్రేరేపించేలా ఈ మూవీ టైటిల్ ఉందని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. విజయ్ దేవరకొండ పొలిటికల్ లీడర్గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 4న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సుధీర్బాబు కొత్త చిత్రం ప్రారంభం
-
సుధీర్బాబు కొత్త చిత్రం ప్రారంభం
‘సమ్మోహనం’ చిత్రం తరువాత సుధీర్ బాబు మంచి ఫామ్లోకి వచ్చాడు. ఈ సినిమా ఇచ్చిన కిక్లో వరుసగా ప్రాజెక్ట్లు ఓకే చేసేస్తున్నాడు. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్స్లో ‘నన్ను దోచుకుందువటే’ సినిమాను చేస్తున్నారు. తాజాగా మరో ప్రాజెక్ట్ను ప్రారంభించారు. సుధీర్ బాబు, మెహ్రీన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్... శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వివి వినాయక్, పరుచూరి గోపాలకృష్ణ, దిల్ రాజు విచ్చేశారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. -
‘ఎఫ్2’లో ఎంట్రీ ఇచ్చిన భామలు
హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టిస్టారర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్లు షూటింగ్లో జాయిన్ కాగా, నేడు జరిగిన షూటింగ్లో ఇద్దరు భామలు కూడా ఎంట్రీ ఇచ్చారు. వెంకీకి జోడిగా తమన్నా, వరుణ్కు జోడిగా మెహ్రీన్ నటిస్తుండగా.. వీరిద్దరు కూడా ప్రస్తుతం షూటింగ్లో పాల్గొన్నారు. షూటింగ్ విరామ సమయంలో తమన్నాతో కలిసి దిగిన ఫోటోను మెహ్రీన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఎఫ్2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. Fun begins with this beauty 😍😘 @tamannaahspeaks #F2 pic.twitter.com/aTSdZvBc9j — Mehreen Pirzada (@Mehreenpirzada) July 10, 2018 -
‘పంతం’ మొదటి రోజు వసూళ్లు
గోపిచంద్ చాలాకాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. లౌక్యం సినిమాతో చివరగా విజయాన్ని అందుకున్న గోపిచంద్ పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ అండ్ మెసెజ్ ఓరియెంటెడ్గా తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయని తెలుస్తోంది. ఈ సినిమా గురువారం (జూలై 5) విడుదలైంది. ట్రైలర్తో అంచనాలు పెంచిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. మొదటి రోజే దాదాపు 5కోట్ల షేర్ను, 3 కోట్ల గ్రాస్ను రాబట్టిందని సమాచారం. ఇక వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ సినిమా పూర్తి రిపోర్ట్ వస్తుంది. ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహ్రీన్ జోడిగా నటించారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందిచగా, కేకే రాధామోహన్ నిర్మించగా, కె చక్రవర్తి దర్శకత్వం వహించారు. #Pantham starts off with a STRONG OPENING!!! The film collects a gross of ₹5.2cr and a share of ₹3.22cr in its day 1 in worldwide on a THURSDAY. | @YoursGopichand @Mehreenpirzada | pic.twitter.com/bDf9u1PxHt — VamsiShekar (@UrsVamsiShekar) July 6, 2018 -
‘పంతం’ మూవీ రివ్యూ
టైటిల్ : పంతం జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : గోపిచంద్, మెహరీన్, సంపత్ రాజ్, ముఖేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : కె.చక్రవర్తి నిర్మాత : కె.కె. రాధామోహన్ యాక్షన్ హీరో గోపిచంద్కు కొద్ది రోజులుగా కాలం కలిసిరావటం లేదు. వరుసగా ప్రతీ సినిమా బోల్తా పడుతుండటంతో కెరీర్ కష్టాల్లో పడింది. కామెడీ సినిమాలతో మంచి విజయాలు సాధించిన గోపి మాస్ యాక్షన్ హీరోగా సత్తా చాటడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ టైంలో ఓ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు చక్రవర్తి తెరకెక్కించిన ‘పంతం’ గోపిచంద్ కెరీర్ను గాడిలో పెడుతుందా..? మాస్ హీరోగా గోపిచంద్ సక్సెస్ సాధించాడా..? కథ; ఆనంద్ సురానా (ముఖేష్ రుషి) లండన్లో ఉండే భారతీయ వ్యాపారవేత్త. వేల కోట్ల ఆస్తులకు అధిపతి. మినిస్టర్లకు కూడా సురానాను కలవాలంటే నెలల సమయం పడుతుంది. అలాంటి సురానా ఫ్యామిలీ వారసుడు విక్రాంత్ సురానా (గోపిచంద్). ఆనంద్ సురానాకు దానధర్మాలు చేయటం ఇష్టం ఉండదు. (సాక్షి రివ్యూస్) తన భార్య దుర్గాదేవి (పవిత్రా లోకేష్) అలా దాన ధర్మాల కోసం డబ్బు ఖర్చు చేస్తుందని ఇండియా నుంచి వ్యాపారాలను ఫ్యామిలినీ లండన్ తీసుకెళ్లిపోతాడు. కానీ విక్రాంత్ మాత్రం తల్లి బాటలోనే నడుస్తాడు. తల్లి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కోసం తిరిగి ఇండియా వస్తాడు. అలా ఇండియాకు వచ్చిన విక్రాంత్కు ఎదురైన పరిస్థితులేంటి..? ఆ పరిస్థితులపై విక్రాంత్ ఎలా పోరాటం చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; మాస్ యాక్షన్ రోల్లో తనకు తిరుగులేదని గోపిచంద్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. యాక్షన్ సీన్స్లో మంచి ఈజ్ చూపించాడు. ఫస్ట్ హాప్లో కామెడీ టైమింగ్తోనూ అలరించాడు. ముఖ్యంగా కోర్టు సీన్లో గోపిచంద్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. హీరోయిన్ మెహరీన్ పాత్ర కేవలం పాటలకే పరిమితమైంది. ఉన్నంతలో తన వంతుగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్)విలన్గా సంపత్ రాజ్ రొటీన్ పాత్రలో కనిపించారు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా తనదైన స్టైల్లో మెప్పించారు. ఇతర పాత్రల్లో జయప్రకాష్, పృథ్వీ, షియాజీ షిండే, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ప్రకటించే సాయం ఎంత మంది బాధితులకు చేరుతుంది.? మధ్యలో మంత్రులు, అధికారులు ఆ డబ్బును ఎలా దోచేస్తున్నారు అన్న పాయింట్కు కమర్షియల్ ఎలిమెంట్స్తో తెరకెక్కించాడు దర్శకుడు చక్రవర్తి. గోపిచంద్ మాస్ ఇమేజ్కు తగ్గట్టు వరుస యాక్షన్ సీన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నంలో లాజిక్లను కాస్త పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది.(సాక్షి రివ్యూస్) విలన్ క్యారెక్టర్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. గోపిసుందర్ సంగీతం పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కథనం మధ్యలో పాటలు స్పీడు బ్రేకర్లల ఇబ్బంది పెడతాయి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్ రిచ్గా, స్టైలిష్గా ప్రజెంట్ చేశారు. నిర్మాత రాధామోహన్ ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. ప్లస్ పాయింట్స్ ; గోపిచంద్ నటన కోర్టు సీన్ యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ ; హీరోయిన్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. మరిన్ని సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
ఆ వార్తల్లో నిజంలేదు
చికాగో సెక్స్ స్కాండల్ వివాదం టాలీవుడ్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై అప్పట్లో కథానాయిక మెహరీన్ స్పందించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘పంతం’. గోపీచంద్ హీరోగా చక్రవర్తి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. చికాగో వివాదంలోకి అనవసరంగా ఆమెను మీడియా లాగుతోందని ‘పంతం’ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న మెహరీన్ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘‘ప్రచారంలో ఉన్నట్లుగా చికాగో వివాదం గురించి నేను ఎవ్వరికీ ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మీడియాతో నాకు మంచి రిలేషనే ఉంది. ముంబైలో ఉన్న నేను వైరల్ ఫీవర్ వల్ల చివరిగా జరిగిన ‘పంతం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొనలేకపోయాను’’ అని అన్నారు. ఇంకా యూఎస్లో జరిగిన సంఘటన గురించి చెబుతూ– ‘‘మా ఫ్యామిలీతో వీకెండ్ హాలీడే కోసం లాస్ ఏంజిల్కి వెళ్లాను. ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు నన్ను టాలీవుడ్కి చెందిన హీరోయిన్గా గుర్తించారు. చికాగో సెక్స్ స్కాండల్ గురించి చెప్పారు. నిజానికి చికాగో వివాదం గురించి నేను ఫస్ట్ టైమ్ అప్పుడే విన్నాను. ఆ తర్వాత ఈ ఇష్యూతో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాను. వాళ్లు నాకు క్షమాపణలు చెప్పి, నా ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు. ఇష్యూ తీవ్రతను అర్థం చేసుకోవడమే కాకుండా, మరే ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని ఈ విషయంపై పబ్లిక్గా మాట్లాడాను. నిజానికి ఈ అనుభవం నాకు ఇబ్బంది కలిగించింది. ఎవరో కొందరి వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు రావడం, ఇమేజ్ దెబ్బ తినడం నాకు బాధగా ఉంది. ఈ విషయంలో తప్పు చేసిన దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను. ఈ సంఘటన గురించి నేను చివరి సారిగా చెబుతున్నాను. అలాగే నన్ను సంప్రదించకుండా నా గురించిన కథనాలను ప్రచురించవద్దని మీడియా వారిని రీక్వెస్ట్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
రైలు ప్రయాణంలో చేదు అనుభవం
తమిళసినిమా: సినిమా తారలను ముఖ్యంగా హీరోయిన్లు సగటు ప్రేక్షకుడికి కలల రాణులు. కార్లు, బంగ్లాలు, సమాజంలో వారికున్న పేరు ఇత్యాధి వారి జీవన విధానాలు సామాన్యుడిని అబ్బురపరుస్తాయి. అయితే పీత కష్టాలు పీతవి అన్న సామెత మాదిరి హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హీరోయిన్లు ఒక్కోసారి అనుకోని ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు. నటి మెహరీన్ కూడా ఇటీవల అలాంటి ఇక్కట్లనే ఎదుర్కొంది. ఈ బ్యూటీ టాలీవుడ్లో యువ స్టార్స్ సరసన నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. కోలీవుడ్లో నోటా అనే చిత్రంలో నాయకిగా నటిస్తోంది. అర్జున్రెడ్డి చిత్రం ఫేమ్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్నారు. దీంతో తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్ అంటూ విమానాల్లోనే తిరిగేస్తున్న మెహరీన్ నోటా చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ దొరకపోవడంతో రైలు ప్రయాణం చేయడానికి సిద్ధమైంది. అయితే నిర్మాతలు తన కోసం బుక్ చేసిన బెర్త్ను అప్పటికే ఒక వ్యక్తి ఆక్రమించుకోవడం, అతను పుల్గా మద్యం తాగి ఉండడంతో నటి మెహరీన్ భయంతో వణికిపోయింది. చాలా సమయం అలానే రైలులో నిలబడే ప్రయాణం చేసింది. ఆ తరువాత పరిస్థితిని నిర్మాతకు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఒక కారులో తన మనుషులను పంపి ఆమెను అదే కారులో చెన్నైకి తీసుకురావడానికి ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నోటా చిత్ర వర్గాలు తెలిపాయి. నిజం చెప్పాలంటే సెలబ్రిటీలకు రైలు ప్రయాణమే కాదు, ఫ్లైట్ ప్రయాణాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే నడిగర్ సంఘ నిర్వాహకులు హీరోహీరోయిన్ల ప్రచారంలో తగిన భద్రత కల్పించాలని నిర్మాతలకు సూచిస్తున్నారు. అయినా నటి మెహరీన్కు ఎదురైన లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. -
ఎఫ్-2పై మరో అప్ డేట్
టాలీవుడ్లో క్రేజీ మల్టీస్టారర్కు ముహూర్తం కుదిరింది. హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్-2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అగ్రహీరో వెంకటేష్-మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్లు ఎఫ్-2లో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం రేపు(శనివారం) అంటే జూన్ 23 నుంచి లాంఛ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్కు పెయిర్గా మెహ్రీన్ నటించనున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఎఫ్-2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. We have a date and time. #F2LaunchTomorrow at 9AM.. #VenkateshDaggubati @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @ThisIsDSP pic.twitter.com/AHMoMQqZDa — Sri Venkateswara Creations (@SVC_official) 22 June 2018 -
జూలై 5న గోపిచంద్ ‘పంతం’
ఒకప్పుడు వరుస హిట్స్తో దూసుకుపోయిన హీరో గోపిచంద్. కానీ గత కొంత కాలం పాటు సరైన విజయాలు లేక వెనుకపడ్డారు. గోపిచంద్ ప్రస్తుతం పంతం సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. నేడు (జూన్ 12) గోపిచంద్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పంతం టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్లోని డైలాగ్ సోషల్మీడియాలో వైరల్గా మారుతోంది. ఈ సినిమాను జూలై 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను శ్రీసత్య సాయి బ్యానర్పై కె.కె.రాధామోహన్ నిర్మించగా, కె. చక్రవర్తి దర్శకత్వం వహించారు. గోపిచంద్కు పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. -
వెంకీకి జోడిగా మిల్కీ బ్యూటీ
గురు సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు విక్టరీ వెంకటేశ్. కానీ ఈ మూవీ వచ్చి ఏడాది గడుస్తున్నా... వెంకీ నుంచి కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆచితూచి స్ర్కిప్ట్స్కు ఓకే చెప్పడమే దీనికి కారణం అని తెలుస్తోంది. డైరెక్టర్ తేజతో ఓ సినిమా ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మల్టిస్టారర్లో వరుణ్తేజ్,వెంకటేశ్లు నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ తాజాగా దిల్ రాజు అధికారికంగా ప్రకటించేశారు. వెంకీకి జోడిగా మిల్కీ బ్యూటిని, వరుణ్కు జోడిగా మెహరీన్ను తీసుకున్నుట్లు సోషల్మీడియా ద్వారా తెలిపారు. జూన్లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను ఆద్యంతం వినోదంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. -
క్లైమాక్స్కు చేరుకున్న ‘పంతం’
గోపీచంద్ సక్సెస్ రుచి చూసి చాలా కాలమైంది. ఆక్సిజన్, గౌతమ్నంద అంటూ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినా... ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆరడుగుల బుల్లెట్ సినిమా సంగతి మాత్రం ఎవరికీ తెలియకుండా పోయింది. ఇలాంటి సమయంలో గోపీచంద్కు ఒక హిట్ సినిమా పడాలి. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రంగా ‘పంతం’ను ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో క్లైమాక్స్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. గోపీచంద్కు ఇది 25వ సినిమా కాగా, అతడికి జంటగా మెహరిన్ నటిస్తోంది. రాధమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చక్రి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆయన మ్యారేజ్ లైఫ్ బాగుండాలి: హీరోయిన్
మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి హిట్ లు అందుకున్న హీరోయిన్ మెహరీన్. ఆమె ఓ పెళ్లికి వెళ్లిన సందర్భంగా దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. శర్వానంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం మహానుభావుడు. ఆ మూవీకి అసోసియేట్ డైరెక్టర్గా రాము పనిచేశారు. ఆయన పెళ్లి వేడుకకు హాజరైన ఈ నటి ఆయన వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగాలని ఆకాంక్షించారు. 'తాను నటించిన మూవీ మహానుభావుడు మూవీకి పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్లలో ఒకరైన రాము వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటూ' నటి మెహరీన్ ట్వీట్ చేశారు. Ramu Garu - One of the finest Associate Director I’ve worked with on one of my best film #Mahanubhavudu Wishing him a very Happy & Prosperous Married Life! 🎉 pic.twitter.com/cxcoLm0eDY — Mehreen Pirzada (@Mehreenpirzada) 28 April 2018 -
మెహరీన్ భలే కౌంటర్ ఇచ్చింది
దేశాన్ని కుదిపేసిన కథువా ఘటన.. ఎనిమిదేళ్ల బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్దు ఎత్తున్న ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మెహరీన్ పిర్జాదా కూడా తన ట్వీటర్లో ఓ పోస్ట్ చేసింది. ‘నేను హిందుస్థానీని.. నేను సిగ్గుపడుతున్నా. 8 ఏళ్ల చిన్నారి ఆలయంలో సామూహిక అత్యాచారం.. హత్యకు గురైంది అంటూ ఫ్లకార్డుతో ఫోటోను మెహరీన్ పోస్ట్ చేసింది. దీనికి స్పందించిన ఓ వ్యక్తి.. నీకు అంత సిగ్గుగా అనిపిస్తే దేశాన్ని విడిచి వెళ్లు. నేను హిందుస్థానీని అయినందుకు గర్వపడుతున్నా అంటూ రీట్వీట్ చేశాడు. దానికి స్పందించిన మెహరీన్.. నీలాంటోళ్ల గురించే నేను పోస్ట్ చేసింది అంటూ బదులిచ్చింది. భలే కౌంటర్ ఇచ్చావ్ మెహరీన్ అంటూ పలువురు ఆమెను అభినందిస్తున్నారు. I Am Hindustan I Am Ashamed 8 Years Old ! Gang Raped ! Murdered in Devi-Stan Temple #KATHUA #justiceforasifa pic.twitter.com/0SP6mrBNLz — Mehreen Pirzada (@Mehreenpirzada) 15 April 2018 @Mehreenpirzada If you really ashamed of being a #Hindustani ...... Just leave the country. We are proud of being #Hindustani. Atrocities on children happens in developed nations to.... They have never overacted like you. — Adikrishna (@adikrishnaraju) 15 April 2018 Wow! This is what I’m talking about. People like you 🤷♀️ https://t.co/vLkUfWhzLp — Mehreen Pirzada (@Mehreenpirzada) 15 April 2018