దిశ ఘటనపై సినిమా తీస్తున్నా | Ram Gopal Varma announces a film on Disha | Sakshi
Sakshi News home page

దిశ ఘటనపై సినిమా తీస్తున్నా

Feb 2 2020 12:46 AM | Updated on Feb 2 2020 12:46 AM

Ram Gopal Varma announces a film on Disha - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ

నిర్భయ సంఘటన తర్వాత ఇటీవల జరిగిన దిశా అత్యాచారం ఘటన దేశాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు దిశా ఘటనపై సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘దిశా ఘటనలో దిశా శరీరాన్ని పెట్రోల్‌తో కాల్చేసి దారుణానికి పాల్పడ్డారు రేపిస్టులు. ఆ రేప్‌ చేసినవాళ్ల మానసిక స్థితి ఏంటి? దిశను ఎందుకు చంపారు? అని ఈ సినిమాలో చూపించబోతున్నాను. రేపిస్టులందరూ గతంలో జరిగిన రేప్‌ కేసుల్లో జరిగిన తప్పులు చేయకూడదనుకుంటున్నారు కానీ మానభంగం చేయకూడదు అని మాత్రం అనుకోవడం లేదు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement