ఇప్పట్లో ఎవరుంటారు? | Romantic comedy thriller | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో ఎవరుంటారు?

Published Tue, Feb 2 2016 1:40 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM

ఇప్పట్లో ఎవరుంటారు? - Sakshi

ఇప్పట్లో ఎవరుంటారు?

‘‘రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఓ హత్య మిస్టరీ ఉంటుంది’’ అని దర్శకుడు కె.వెంకటేష్ అన్నారు. ప్రశాంత్, మహిధర్, ఇషిత, లలిత ప్రధాన పాత్రల్లో బేబీ అముక్త సమర్పణలో లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశ్నాథ్ నిర్మించిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ’. రమేష్.డి అందించిన ఈ చిత్రం పాటలను నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ - ‘‘ఈ చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు మా నియోజకవర్గానికి చెందినవారే.

ఈ చిత్రం సూపర్ హిట్టయి వారిద్దరూ మంచి స్థాయికి ఎదగాలి’’ అన్నారు. ‘‘వెంకటేష్ నాకు పదేళ్లుగా తెలుసు. కథ వినగానే నిర్మించాలనుకున్నా’’ అని నిర్మాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement