
సస్పెన్స్ థ్రిల్లర్
కథానాయిక ఆర్తి అగర్వాల్ ముఖ్యపాత్రలో నటించిన ఆఖరి చిత్రం ‘ఆమె ఎవరు’. అనీల్ కల్యాణ్, మిత్ర జంటగా రమేశ్ ముగడ దర్శకత్వంలో వీర గణేశ్, లక్ష్మీ సరోజ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘‘సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ఫణీంద్ర, ఓం ప్రసాద్ వాకాటి, సంగీతం: చిన్నికృష్ణ.