రాజకీయ చిత్రంలో శ్వేతామీనన్
సంచలనాలకు కేంద్రబిందువైన శ్వేతామీనన్ కరిమన్ను అనే చిత్రంలో తన నిజ ప్రసవ దృశ్యాల చిత్రీకరణకు అనుమతించింది. దీనిపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇటీవల కేరళ ఎంపీ అసభ్యంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేసి ఆ తరువాత ఆయన క్షమాపణ కోరడంతో ఫిర్యాదును వాపస్ తీసుకుని వార్తల్లో కెక్కారు.
తాజాగా ఈ కేరళ బ్యూటీ తమిళంలో ఒక రాజకీయ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. సినిమాగా దర్శక నటుడు కె.భాగ్యరాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి తురై మొదలవర్ అనే పేరును నిర్ణయించారు. రాజకీయ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో భాగ్యరాజ్ సరసన శ్వేతామీనన్ హీరోయిన్గా నటించనున్నారు. ఇది సమకాలీన రాజకీయాలపై సెటైరికల్నెస్ కథా చిత్రం అని తెలిసింది. శ్వేతామీనన్ పాత్ర చర్చనీయాంశంగా ఉంటుందని సమాచారం. అందువల్లనే భాగ్యరాజ్ ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు కోడంబాక్కం టాక్. ఈ చిత్రం త్వరలో సెట్పైకి రానుంది.