న్యూఢిల్లీ: తమకు సంబంధించిన వారికి పార్సిల్ ఇచ్చేందుకు నిరాకరించాడని ఓ బస్ కండక్టర్ను ఇద్దరు కానిస్టేబుళ్లు చితకబాదారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వద్ద చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను వేరే చోటుకి బదిలీ చేశారు.
అయితే, వారిపై కేసు నమోదుకావడంగానీ, ఆ కండక్టర్ కేసు పెట్టడంగానీ జరగలేదు. తమకు సంబంధించిన వారికి పార్సిల్ పంపించడం కోసం నీరజ్, నీరజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ బస్సు కండక్టర్ వద్దకు వెళ్లి అడిగారు. వాళ్లు ఎలా అడిగారో.. అతడు ఏ సమాధానం చెప్పాడో తెలియదుగానీ వెంటనే గొడవ ప్రారంభమైంది. ఆ ఇద్దరు కలిసి బస్ కండక్టర్ని కొట్టడం ప్రారంభించారు. ఓ బాటసారి ఆ దృశ్యాన్ని తన మొబైల్లో బంధించాడు. ఏడు సెకన్ల నిడివితో కూడిన ఆ వీడియో బయటకు రావడంతో వారిద్దరికి సమన్లు పంపించి అక్కడి నుంచి జిల్లా విభాగంలోకి వారిని బదిలీ చేశారు.
కండక్టర్పై కానిస్టేబుళ్ల క్రౌర్యం
Published Thu, Jun 30 2016 12:55 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- దుమ్ము రేపుతున్న చిన్న మూవీ.. అప్పుడే సెంచరీ క్లబ్లోకి..
- పెరగనున్న టూ వీలర్స్ ధరలు.. జులై 1నుంచే అమలు
- టీజీలో కొనసాగుతున్న జూడాల సమ్మె..రోగుల ఇక్కట్లు
- హైదరాబాద్లో మళ్లీ కాల్పుల కలకలం.. ఎక్కడంటే?
- బీఆర్ఎస్కు 11 ఎకరాలెందుకు?: షబ్బీర్ అలీ
- TG: ఒక్క క్లిక్తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు
- స్టార్టప్ ట్రబుల్స్: ఈ బెంగళూరు కంపెనీలో 80% తొలగింపు
- 34 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత్రలో విజయశాంతి
- మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
- యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Advertisement