రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట; ఇద్దరి మృతి | 2 dead, 17 injured in stampede at railway station in Kolkata | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట; ఇద్దరి మృతి

Published Wed, Oct 24 2018 1:30 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

2 dead, 17 injured in stampede at railway station in Kolkata - Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో ఉన్న సంత్‌రాగాఛీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. స్టేషన్‌లోని వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపైకి మూడు రైళ్లు ఒకేసారి వస్తున్నాయని ఆనౌన్స్‌మెంట్‌ వినిపించింది.

వెంటనే తమ రైలు మిస్సవ్వకూడదనే తొందరలో ప్రయాణికులంతా రెండో, మూడో ప్లాట్‌ఫామ్‌లను కలిపే ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిపైకి చేరారు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఇద్దరు ప్రయాణికులు చనిపోయారని, 15 మంది గాయపడ్డారని వాయవ్య రైల్వే అధికార ప్రతినిధి సంజయ్‌ ఘోష్‌ వెల్లడించారు.  మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.1 లక్ష చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రకటించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement