ఉగ్రవాద దాడులు జరగొచ్చు: హై ఎలర్ట్ | 5 SIMI men may be planning terror strike, alerts IB | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద దాడులు జరగొచ్చు: హై ఎలర్ట్

Published Mon, Dec 8 2014 7:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

5 SIMI men may be planning terror strike, alerts IB

మధ్యప్రదేశ్ జైలు నుంచి 2013లో పారిపోయిన ఐదుగురు సిమి ఉగ్రవాదులు.. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు మనదేశంలోభారీగా ఉగ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఐబీ హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు హై ఎలర్ట్ పంపింది. మహ్మద్ ఐజాజుద్దీన్, మహ్మద్ అస్లాం, అమ్జాద్ ఖాన్, జాకిర్ హుస్సేన్ సాదిక్, మహబూబ్ గుడ్డు.. ఈ ఐదుగురికి ఈ ఉగ్రదాడులు చేసే బాధ్యతను అప్పగించినట్లు తెలిసినట్లు అధికార వర్గాలు చెప్పాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఎలర్ట్ పంపినా.. ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలపై దృష్టిపెట్టారు. ఇక్కడే ఉగ్రవాదులు దాక్కుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఐఎస్ఐ హ్యాండ్లర్లు పంపిన ఓ సందేశాన్ని భారత నిఘా వర్గాలు ఇంటర్సెప్ట్ చేశాయి. అందులో.. ''వాళ్లకు మంచి ప్రాజెక్టు ఇచ్చాం. కొన్ని రోజులు వేచి చూడు'' అని ఉంది. చిట్టచివరి సారిగా ఈ ఐదుగురు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది. వీళ్ల గ్యాంగ్ లీడర్ ఫైజల్తో కలిసి ఈ ఐదుగురు 2013 అక్టోబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుంచి 14 అడుగుల ఎత్తున్న గోడ దూకి పారిపోయారు. వీళ్లు కొంతకాలం తెలంగాణ, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న జరిగిన బ్యాంకు దోపిడీలో కూడా వీళ్ల పాత్ర ఉందని అనుమానం వ్యక్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement