ఇదో అమానవీయ సంఘటన. సిగ్గుతో తలదించుకునే విషయం. మానవత్వం రోజుకింత దిగుజారుతుందా అని అనుమానం కలిగించే అవకాశం.
భీవాండి: ఇదో అమానవీయ సంఘటన. సిగ్గుతో తలదించుకునే విషయం. మానవత్వం రోజుకింత దిగుజారుతుందా అని అనుమానం కలిగించే అవకాశం. ఇప్పటి వరకు పసిపాప నుంచి పండుముసలమ్మ వరకు మృగాళ్లు లైంగికదాడులకు పాల్పడుతుండగా ఇప్పుడు ఓ మృగాడు మాత్రం మరింత రెచ్చిపోయి.. ఏడేళ్ల బాలుడుపై లైంగికదాడికి పాల్పడటంతోపాటు అతడికి నిప్పంటించాడు. మహారాష్ట్రలో భీవాండిలో చోటుచేసుకున్నఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ బాలుడికి 30శాతం కాలినగాయాలయ్యాయి. ఈ దారుణానికి పాల్పడింది తెలిసినవారేనని పోలీసుల ప్రాథమిక సమాచారం. ఇంటివద్ద బాలుడిని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ బాలుడు ఆ కర్కశుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై 307, 377 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.