మిగిలింది ఇక ఎనిమిది రోజులే... | 9 days to go for exchanging your pre-2005 issued banknotes | Sakshi
Sakshi News home page

మిగిలింది ఇక ఎనిమిది రోజులే...

Published Mon, Jun 22 2015 1:24 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

మిగిలింది ఇక ఎనిమిది రోజులే...

మిగిలింది ఇక ఎనిమిది రోజులే...

2005 సం.రానికి ముందు ముద్రించబడిన 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఇంక 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

న్యూఢిల్లీ:    2005 సంవత్సరానికి ముందు  ముద్రించిన 500, 1000 రూపాయల నోట్లను  మార్చుకోవడానికి ఇక 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది.  కొన్ని భద్రతా కారణాల రీత్యా 2005కు ముందు ఉన్నఈ కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు గతంలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)  ప్రకటించింది. ఆయా నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు వీలుగా 13 నెలల గడువు విధించింది. అయితే జనవరి 1 ముగిసిన ఈ గడువున జూన్‌ 30 వరకు పొడిగించారు. ఈ నెలాఖరు లోపు తమ సమీప బ్రాంచీల్లో మార్చుకోవాలని  సూచించింది.  ఎవరి దగ్గరైనా  అలాంటి నోట్లు ఉంటే దేశవ్యాప్తంగా ఉండే  ఏ  ప్రభుత్వం బ్యాంకులోనైనా సమర్పించి, దానికి సమానమైన నోట్లను పొందవచ్చని తెలిపింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇక  సదరు నోట్లు చెల్లవని స్పష్టం చేసింది.

కాగా  విచ్చలవిడిగా చెలామణి అవుతున్న నకిలీ నోట్లను నిరోధించేందుకు రిజర్వు బ్యాంకు ఈ నిబంధన ప్రవేశపెట్టింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను సునాయాసంగా గుర్తించవచ్చునని పేర్కొంది. వాటి వెనుకవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉండదని, ఇక ముందు ముద్రించే  నోట్లకు కింద సంవత్సరం ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement