![మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లిన ఎయిర్ ఇండియా వన్ విమానం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71429033525_625x300.jpg.webp?itok=UBK3WD5e)
మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లిన ఎయిర్ ఇండియా వన్ విమానం
న్యూఢిల్లీ: మూడు దేశాల పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోదీని తీసుకువెళ్లిన 'ఎయిర్ ఇండియా వన్' బోయింగ్ 747-400 విమానం ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మోదీ ఆ విమానంలో న్యూఢిల్లీ నుంచి బయలుదేరి పారిస్, తౌలౌజ్, హనోవర్లలో ఆగి, అనంతరం బెర్లిన్కు వెళ్లారు. ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబైలో సిద్ధంగా ఉన్న మరో 'ఎయిర్ ఇండియా వన్' మంగళవారం తెల్లవారు జామున బెర్లిన్ బయల్దేరి వెళ్లింది.
మోదీ తన మిగతా పర్యటనను ఇందులోనే ముగించి, భారత్కు తిరిగివస్తారు. ఈ నెల 9న పారిస్ వెళ్లిన ప్రధాని మోదీ 18 ఉదయం తిరిగి ఇక్కడికి వాస్తారు.