berlin
-
‘సిక్లీవ్’ పెడుతున్నారా..?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు. అసలేం జరిగిందంటే..జర్మనీలోని బెర్లిన్లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.సిక్లీవ్లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్లీవ్లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్లీవ్లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్లీవ్లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్లైన్లు, ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్లీవ్లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి. జర్మన్ కార్ల ప్లాంట్లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు. -
జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు!
జర్మనీలోని శ్రీ గణేష్ ఆలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో దాదాపు 200 కుటుంబాలు దాక పాల్గొన్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జర్మనీ రాయబారి హెచ్ఈ పర్వతనేని హరీష్ విచ్చేశారు. ఈ ఉగాది కార్యక్రమాలు తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి సారథ్యంలో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యక్షులు వెంకట రమణ బోయినపల్లి, కార్యదర్శి అలేక్య బోగ, సాంస్కృతిక కార్యదర్శులు శరత్ రెడ్డి, యోగానంద్, కోశాధికారి బాలరాజ్ అందె, సోషల్ మీడియా కార్యదర్శులు నరేష్, నటేష్ గౌడ్, వాలంటీర్ టీమ్ సహాయ సహకారాలతో జయప్రదం చేశామని డాక్టర్ రఘు అన్నారు. ఈ సంప్రదాయ కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శనలు సమాజా స్ఫూర్తికి అర్థానిచ్చేలా విజయవంతంగా జరిగాయని నిర్వాహకులు వెల్లడించారు. అంతేగాదు ఈ ఉగాది కార్యక్రమాలు ఇంతలా గుర్తుండిపోయేలా విజయవంతం చేసినందుకు వాలంటీర్లకు, సహకరించిన వారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుక కొత్త ఏడాదిని మాత్రమే కాకుండా, బెర్లిన్లో తెలుగు ప్రవాసులలో బలమైన సమాజ బంధాలను, సాంస్కృతిక వారసత్వాన్ని హైలెట్ చేసిందని నిర్వాహకులు కొనియాడారు. (చదవండి: సింగపూర్లో తమిళ భాష వైభవం.. ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!) -
ఓటీటీకి రియల్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఓటీటీ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ను సినీ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్తోనే చూసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రోజు రోజుకు కొత్త కొత్త కంటెంట్ను ఓటీటీలు అందిస్తున్నాయి. అదే సమయంలో క్రైమ్ థ్రిల్లర్ లాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా కంటెంట్తోనే యధార్థ సంఘటనల ఆధారంగా సరికొత్త క్రైమ్ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్ లైఫ్ కిల్లర్ అనే పేరుతో బెర్లిన్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ రహస్యమైన, విచిత్రమైన హత్యల కేసుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ రియల్ క్రైమ్ కథకు జాన్ జాబీల్, కరోలిన్ షాపర్ దర్శకత్వం వహించారు. ఈ ఆసక్తికర డాక్యుమెంటరీ సిరీస్ త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే 2012లో జరిగిన చీకటి సంఘటనల గురించి అవగాహన కల్పించడానికి ఈ సిరీస్ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మేకర్స్. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్లైఫ్ కిల్లర్లో కేవలం మూడు సీజన్లు మాత్రమే ఉన్నాయి. ఈ సిరీస్లో రిక్ హబ్నర్, ట్రిస్టన్ బమ్, కార్నెలియా వెర్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. -
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్కు బన్నీ
-
ఎర్ర సముద్రంలో అలజడి.. టెస్లాకు గట్టి దెబ్బ!
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎర్ర సముద్రంలో హౌతీలు సృష్టిస్తున్న అలజడుల దెబ్బ అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా (Tesla)కు గట్టిగా తగిలింది. తన బెర్లిన్ ఫ్యాక్టరీలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 11 వరకు చాలా కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టెస్లా ప్రకటించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఎర్ర సముద్రంలోని నౌకలపై జరుగుతున్న దాడుల ప్రభావం సరకు రవాణాపై తీవ్రంగా పడింది. దీంతో కంపెనీకి విడిభాగాల సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ఉత్పత్తిని నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్-మద్దతుగల హౌతీ మిలిటెంట్లు గాజాలోని హమాస్కు సంఘీభావంగా ఎర్ర సముద్రంలో నౌకలు లక్ష్యంగా చేస్తున్న దాడులకు పర్యవసానంగా తగిలిన గట్టి దెబ్బగా దీన్ని భావిస్తున్నారు. ఎర్ర సముద్రంలో జరుగుతున్న సాయుధ దాడుల కారణంగా కేప్ ఆఫ్ గూడ్ హోప్ ద్వారా యూరప్, ఆసియా మధ్య రవాణా మార్గాలలో మార్పులు జరగడం తమ బెర్లిన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్లు టెస్లా ఒక ప్రకటనలో తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఉత్పత్తి నిలిపోవడానికి నిర్దిష్ట కారణాలను వెల్లడించనప్పటికీ ఫిబ్రవరి 12న పూర్తి ఉత్పత్తిని పునఃప్రారంభించనున్నట్లు టెస్లా పేర్కొంది. ఎర్ర సముద్రంలో అలజడి కారణంగా ఇతర వాహన తయారీదారులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవచ్చని ఆటో పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెస్లాతోపాటు చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ గీలీ, అతిపెద్ద ఫర్నీచర్ కంపెనీ ఐకియా సహా అనేక కంపెనీలు డెలివరీ ఆలస్యం గురించి ఇప్పటికే హెచ్చరించాయి. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. మీరు చూశారా?
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే ఒకరకంగా ఓటీటీల యుగమనే చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిస్తోన్న చిత్రాలు సైతం ఇంట్లో కూర్చోనే చూసేస్తున్నాం. ఇక వెబ్ సిరీస్ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. గంటల తరబడి ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీలు సైతం ఆసక్తికరమైన స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక ఎక్కువ మంది యువత ఆసక్తిగా చూసిన సిరీస్లలో మనీ హైస్ట్ ఒకటి. స్పానిష్లో రూపొందిన ఈ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ దక్కించుకుంది. యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్ పలు స్థానిక భాషల్లోనూ అలరించింది. ఈ సిరీస్ మొదటి రెండు పార్టుల్లో కనిపించే కీలక పాత్ర బెర్లిన్. అయితే మనీ హైస్ట్కు ముందు అతడు చేసిన మరో దోపిడీతో తాజాగా బెర్లిన్ అనే వెబ్ సిరీస్ను రూపొందించారు. అయితే తాజాగా ఈ సిరీస్కు ప్రీక్వెల్గా తెరకెక్కించిన బెర్లిన్ అనే వెబ్ సిరీస్ ఇటీవలే రిలీజైంది. ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇలాంటి సిరీస్లు ఇష్టపడే ప్రేక్షకులకు మంచి కిక్ను అందిస్తాయి. మరీ ముఖ్యంగా మనీహైస్ట్ అభిమానులు ఇలాంటి వాటికి బాగా కనెక్ట్ అవుతారు. మీలో ఎవరైనా మనీ హైస్ట్ లాంటి సిరీస్లు నచ్చేవారుంటే తప్పకుండా బెర్లిన్ సిరీస్ ఓసారి ట్రై చేయండి. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా.. సిరీస్ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అసలేంటి బెర్లిన్ స్టోరీ.. మనీ హెయిస్ట్ సిరీసులో చూపించే దొంగతనాల వెనుక ఫ్రొఫెసర్, అతని సోదరుడు బెర్లిన్ ఇద్దరూ మాస్టర్ మైండ్స్ ఉంటారు. వీరిలో ఇద్దరికి సూపర్ క్రేజ్ వచ్చింది. వీరిలో ఒకరైన బెర్లిన్ మనీ హైస్ట్ కన్నా ముందు చేసిన దోపిడీ ఏంటి? అనే విషయాన్ని ఈ సిరీస్లో తెరకెక్కించారు. కాగా బెర్లిన్ పాత్రలో పెడ్రో అలోన్సో అద్భుతంగా నటించాడు. ఆయనతో పాటు సమంత సిక్వోరోస్, ట్విస్టన్ ఉల్లోవా, మిచెల్ జెన్నర్, బెగోనా వర్గాస్, జూలియో పెనా ఫెర్నోండోజ్, జోయెల్ శాంఛైజ్ కీలక పాత్రలు పోషించారు. -
చరిత్ర సృష్టించిన భారత మహిళా ఆర్చర్లు.. జ్యోతి సురేఖకు హ్యాట్సాఫ్!
World Archery Championships 2023- Berlin: భారత మహిళా ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. తద్వారా.. వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్స్లో దేశానికి తొలి పసిడి పతకం అందించిన ఆర్చర్లుగా రికార్డులకెక్కారు. కాగా జర్మనీలోని బెర్లిన్లో శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు మెక్సికన్ టీమ్పై 235-229తో గెలిచింది. డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెర్రాలపై పైచేయి సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్స్లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక బుధవారం నాటి ఈవెంట్లో రెండో సీడ్గా నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన జ్యోతి సురేఖ బృందం 230–228తో తుర్కియే జట్టుపై గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో 228–226తో చైనీస్ తైపీపై గెలిచి సెమీస్ చేరింది. సెమీఫైనల్లో 220–216తో కొలంబియాపై నెగ్గి ఫైనల్లోకి అడుగు పెట్టి.. మెక్సికోను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. మన అమ్మాయి బంగారం కాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఇది ఆరో పతకం కావడం విశేషం. 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఇప్పటి వరకు టీమ్ విభాగంలో రెండు రజతాలు (2021, 2017), ఒక కాంస్యం (2019)... వ్యక్తిగత విభాగంలో ఒక రజతం (2021), ఒక కాంస్యం (2019) తన ఖాతాలో జమచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జ్యోతి పసిడి పతకం గెలవడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. HISTORIC win for India 🇮🇳🥇 New world champions at the Hyundai @worldarchery Championships.#WorldArchery pic.twitter.com/8dNHLZJkCR — World Archery (@worldarchery) August 4, 2023 -
క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లిన జ్యోతి సురేఖ
బెర్లిన్ (జర్మనీ): గురి తప్పని ప్రదర్శనతో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. క్వాలిఫయింగ్లో రెండో ర్యాంక్లో నిలిచిన జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్కు ‘బై’ కేటాయించారు. మూడో రౌండ్ మ్యాచ్లో జ్యోతి సురేఖ 139–136తో లికోఅరెలో (అమెరికా)పై, నాలుగో రౌండ్లో 148–145తో ఓ యూహున్ (దక్షిణ కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ధీరజ్ పరాజయం పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6తో రికార్డో సాటో (చిలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. -
రెండో సీడ్గా జ్యోతి సురేఖ, ధీరజ్
World Archery Championship Qualifications- బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ మెరిశారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్లో మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ 701 పాయింట్లు... పురుషుల రికర్వ్ విభాగంలో ధీరజ్ 683 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచారు. ఫలితంగా నాకౌట్ దశలో రెండో సీడింగ్ పొందిన జ్యోతి సురేఖ, ధీరజ్లకు నేరుగా మూడో రౌండ్కు ‘బై’ లభించింది. ప్రిక్వార్టర్స్లో గాయత్రి జోడీ సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ తొలి రౌండ్లో... సిక్కి రెడ్డి–ఆరతి సారా సునీల్ జంట క్వాలిఫయింగ్లో నిష్క్రమించాయి. తొలి రౌండ్ మ్యాచ్లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 21–17తో కేథరీన్ చోయ్–జోసెఫిన్ వు (కెనడా)లపై గెలిచారు. అశి్వని–తనీషా 11–21, 21–14, 17–21తో ఫెబ్రియానా కుసుమ–అమాలియా ప్రతవి (ఇండోనేసియా) చేతిలో... సిక్కి రెడ్డి–ఆరతి 14–21, 17–21తో సు యిన్ హుయ్–లీ చి చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. -
ఆమె పోరాడింది.. టాప్లెస్ సమానత్వం సాధించింది
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్లోని బహిరంగ ప్రదేశాల్లోని స్విమ్మింగ్ పూల్స్లో ఇకపై ఆడామగా తేడా లేకుండా టాప్లెస్గా ఈత కొట్టొచ్చు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీనికి ఓ మహిళ చేసిన పోరాటమే కారణం. తాజాగా నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద టాప్లెస్గా సన్బాత్ చేసింది ఒకావిడ. అది గమనించిన నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో ఆమె సెనేట్ ఆంబుడ్స్పర్సన్ ఆఫీస్ను సంప్రదించింది. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లను చూడాలని.. టాప్లెస్గా ఈతకు అనుమతించాలని పోరాటానికి దిగింది. ఆమె డిమాండ్కు అధికారులు దిగొచ్చారు. వివక్షకు పుల్స్టాప్ పెడుతున్నట్లు బెర్లిన్ అధికారులు ప్రకటించారు. బెర్లిన్లో స్మిమ్మింగ్ పూల్స్ నిర్వాహణ చూసుకునే బెర్లినర్ బేడర్బెట్రీబే.. తమ నిబంధనలను సవరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ మహిళ వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. జర్మనీ సాధారణంగా న్యూడిటీ విషయంలో పెద్దగా పట్టింపులు లేని దేశం. కాకపోతే పూర్తి నగ్నత్వాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు. -
నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలివే.. ఇలా చేశారంటే..
బెర్లిన్.. జర్మనీ రాజధాని నగరం. యూరోపియన్ యూనియన్లోకెల్లా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే నగరం. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పంటలు సాగు చేసుకోవడానికి అనువైన కాలం. మిగతా నెలల్లో మంచుకురుస్తూంటుంది. అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాల సంప్రదాయం బెర్లిన్ నగరానికి కొత్తేమీ కాదు. కమ్యూనిటీ గార్డెన్లు, కిచెన్ గార్డెన్లలో కూరగాయలు, పండ్ల సాగు సుదీర్ఘకాలంగా జరుగుతున్నదే. అయితే, నగరవాసులకు అవసరమైన కూరగాయలు మాత్రం ఎక్కడి నుంచో నగరానికి తరలించక తప్పటం లేదు. ఈ పరిస్థితిని మార్చలేమా? వ్యాపకంగా సాగుతున్న అర్బన్ అగ్రికల్చర్ను మరింత సీరియస్గా తీసుకొని ఖాళీ జాగాల్లో పండిస్తే నగర కూరగాయల అవసరాలు ఎంత మేరకు తీరుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో భాగంగా మొట్ట మొదటిసారిగా ఇటీవల సమగ్ర అధ్యయనం జరిగింది. బెర్లిన్ కూరగాయల వినియోగంలో 82 శాతం వరకు నగరంలోనే పండించుకోవచ్చని ఈ అధ్యయనంలో తేలింది! 200 కమ్యూనిటీ గార్డెన్లు.. పోట్స్డ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్లో పరిశోధకుడిగా ఉన్న డియెగో రిబ్స్కీ బృందం ఈ అధ్యయనం చేసింది. నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగుకు పేదలకు కేటాయించిన తోటలు, భవనాలపై బల్లపరుపుగా ఉన్న పై కప్పులు, సూపర్ మార్కెట్ పార్కింగ్ స్థలాలతో పాటు మూసివేసిన శ్మశానవాటిక స్థలాల్లో ఎంత మేరకు కూరగాయలు సాగు చేయొచ్చో అధ్యయనం చేశారు. బెర్లిన్లో ఇప్పటికే 200 కంటే ఎక్కువ కమ్యూనిటీ గార్డెన్లు ఉన్నాయి. పేదలు కూరగాయలు పండించుకోవడానికి ప్రభుత్వ స్థలాల్లో కేటాయించిన చిన్న ప్లాట్లు 73,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. వీటికి తోడుగా, భవనాల పైకప్పులు, నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, పెద్ద గృహ సముదాయాల మధ్య పచ్చటి ప్రదేశాలలో కూడా కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే గొప్ప అవకాశం ఉందని ఈ అధ్యయనం ద్వారా గుర్తించారు. కార్ల సంఖ్యను తగ్గించే ప్రణాళికలు రచిస్తున్నందున పార్కింగ్ స్థలాలను కూడా కూరగాయలు పండించడానికి ఉపయోగించుకోవచ్చని రిబ్స్కీ అన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలు.. బెర్లిన్లోని మొత్తం 4,154 హెక్టార్లలో కూరగాయలు పండించవచ్చని అధ్యయనంలో తేలింది. నగర వైశాల్యంలో ఇది దాదాపు 5 శాతం. ఈ భూమి మొత్తంలో కూరగాయలు పండిస్తే బెర్లిన్ కూరగాయల డిమాండ్లో 82 శాతం స్థానికంగా తీరిపోతుందని రబ్స్కీ పేర్కొన్నారు. అయితే, ఈ కల సాకారమవ్వాలంటే నీరు, మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 75.3 కోట్ల యూరోల పెట్టుబడి అవసరం. వినటానికి అంతా డబ్బా అనిపిస్తుంది గానీ.. 2020వ సంవత్సరంలో బెర్లిన్ స్థూల దేశీయోత్పత్తిలో ఇది దాదాపు 0.5 శాతం మాత్రమే. సవాళ్లు అనేకం.. నగరంలో తోట పనిని ప్రోత్సహించి ఈ కలను సాకారం చేయాలంటే అధిగమించాల్సిన సవాళ్లు తక్కువేమీ కాదు. ‘స్థలం ఉంది, కానీ ఇంకా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, తోట పనిని ఎవరు చేయబోతున్నారు? ప్రైవేట్ తోటమాలులను నియమించి సాగు చేయిస్తామా? లేదా వ్యాపార నమూనా అవసరమా? పేదలకు కేటాయించిన తోటల్లో ఉత్పత్తిని పెంచగలమా? నగరంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి పరిస్థితులను సృష్టించగలం? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంటుందని అధ్యయనకారులు అంటున్నారు. ‘స్థానికంగా కూరగాయల సాగు బహుశా చాలా ఖరీదైన పని కావచ్చు. అయితే, సేంద్రియంగా పండిస్తాం. కాబట్టి, కొత్త బ్రాండ్ను సృష్టించుకోవచ్చు. అందుకని సూత్రప్రాయంగా ఇది సానుకూల పరిణామమని నేను నమ్ముతున్నాను’ అన్నారు పోట్స్డ్యామ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మారియన్ డి సిమోన్. నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలు.. సేంద్రియ కూరగాయల లభ్యత పెరగడంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి వారుగా ఉండిపోయిన నగర ప్రజలను కమ్యూనిటీ గార్డెన్లు ఒకచోటకు చేర్చుతాయి. పచ్చని ప్రదేశాలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణం, జీవవైవిధ్యానికి మేలు చేస్తాయి. స్థానిక ఆహార ఉత్పత్తితో దూరం నుంచి కూరగాయల రవాణా వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న అర్బన్ గార్డెనింగ్పై సీరియస్గా దృష్టి పెట్టడం బెర్లిన్కే కాదు, మన నగరాలకూ ఎంతో అవసరం. కానీ, మన పాలకులు గుర్తించేదెన్నడో కదా?! -పంతంగి రాంబాబు చదవండి: ఫంగల్ వ్యాధుల్ని నివారించే తెల్లముల్లంగి! -
బెర్లిన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
-
బెర్లిన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
బెర్లిన్: సంక్రాంతి పండుగను దేశదేశాల్లోని తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో సంక్రాంతి పర్వదినాన్ని తెలుగువారు సంప్రదాయబద్దంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (టాగ్) ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గణేష్ ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు భారత రాయబారి పర్వతనేని హరీష్, ఆయన సతీమణి నందిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఆట పాటలతో సాగిన వేడుకల్లో పిల్లాపాపలతో కలిసి పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు. అమికల్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంజనా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శార్వరి పనంగిపల్లి కూచిపూడి నృత్య ప్రదర్శన, సర్వాణి గురజాడ శాస్త్రీయ గానం సభికులను అలరించాయి. పిల్లల కోసం డ్రాయింగ్ పోటీలు.. మహిళలకు రంగోళి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. బెర్లిన్లో సంక్రాంతి సంబరాలు జరపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు వారికి దౌత్యపరంగా ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధమని కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. వేడుకల నిర్వహణలో మద్దతుగా నిలిచిన శివమ్ భాయ్, కృష్ణ మూర్తి, జైరాం నాయుడు, శ్రీనివాస్లకు ‘టాగ్’ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. ‘టాగ్’ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి, ఉపాధ్యక్షుడు రామ్ బోయినపల్లి, కార్యదర్శి అలేఖ్య భోగ, కోశాధికారులు బాల్రాజ్ అందె, యోగానంద్ నాంపల్లి, సాంస్కృతిక కార్యదర్శులు శరత్ కమిడి, నరేష్ తౌతం, సోషల్ మీడియా సెక్రటరీలు శ్రీనాథ్, శివరామ్.. కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. (క్లిక్ చేయండి: వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు) -
అక్వేరియం బద్దలైంది..!
బెర్లిన్: గిన్నిస్ రికార్డులకెక్కిన ప్రపంచంలోకెల్లా అతి పెద్ద అక్వేరియం ఉన్నట్టుండి బళ్లున బద్దలైంది. అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు ఏకంగా 10 లక్షల లీటర్ల పై చిలుకు నీళ్లు అక్వేరియమున్న హోటల్తో పాటు పరిసర వీధులనూ ముంచెత్తాయి! అక్వాడాం అని పిలిచే సిలిండర్ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎల్తైన అక్వేరియం జర్మనీలోని బెర్లిన్లో రాడిసన్ బ్లూ హోటల్లో ఉంది. 2003 నుంచీ సందర్శకులను అలరిస్తోంది. దీని నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగా రూపాయలు ఖర్చయింది. ఇది బెర్లిన్లో అతి పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది. ఇందులో 10 నిమిషాల లిఫ్ట్ ప్రయాణం అద్భుతమైన అనుభూతి అని సందర్శకులు చెబుతుంటారు. రెండేళ్ల క్రితం దీన్ని ఆధునీకరించారు. ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 10 డిగ్రీలకు పడిపోయినందుకే అక్వేరియం బద్దలై ఉంటుందని భావిస్తున్నారు. -
మిర్చీ భార్గవి.. పరుగుల రాణీ..!
హాయ్.. హలో అంటూ సాక్షి టీవీలో బ్యాండ్ బాజా ప్రోగ్రాంను పరుగులెత్తించిన మిర్చీ భార్గవి నిజ జీవితంలో పరుగుల రాణీగా మారింది. హైదరాబాద్లో రేడియో జాకీగా బిజీగా ఉంటూనే వివిధ ప్రాంతాల్లో మారథాన్లలో పాల్గొంటోంది భార్గవి. ఫిట్నెస్ అంటే తనకు ప్రాణమని చెప్పుకునే భార్గవి.. మన జీవితం ఒకే సారి ఉంటుందని, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన విధనాంతో మరింత సంతోషంగా ఉండవచ్చని చెబుతోంది. మెరుగైన ఫిట్ నెస్ కోసం పరుగెత్తడం మొదలెట్టిన భార్గవి కొన్నాళ్లలోనే ప్రొఫెషనల్ రన్నర్గా మారిపోయింది. భార్గవి ఖాతాలో మూడు ప్రపంచంలోనే మూడు అతి పెద్ద మారథాన్లుగా పేరుపడ్డ బెర్లిన్ (జర్మనీ), న్యూయార్క్ (అమెరికా)లలో పాల్గొన్న భార్గవి.. ఈ నెలలో షికాగో (అమెరికా) మారథాన్లోనూ పాల్గొన్నారు. "ఒక్కసారి మారథాన్లో పాల్గొనడమనేది జీవితానికి సరిపడా అనుభవాలను, పాఠాలను నేర్పిస్తుంది. నువ్వు మారథాన్ను పూర్తి చేయగలిగితే జీవితంలో ఏదైనా సాధిస్తావన్న ఆత్మవిశ్వాసం కలిగిస్తుందంటారు" భార్గవి. వణికించే ఛాలెంజ్ షికాగో ఇటీవల షికాగోలో జరిగింది 44వ ఎడిషన్ మారథాన్. ఇందులో 40 వేల మంది వేర్వేరు దేశాల రన్నర్లు పాల్గొన్నారు. షికాగోను విండ్ సిటీ అని కూడా అంటారు. వణికించే చల్లటి ఈదురుగాలుల మధ్య మారథాన్లో పాల్గొనడమంటే మాటలు కాదు. గ్రాంట్ పార్క్ వద్ద ఎండ్ పాయింట్ను చేరుకున్న విజేతలు తమ స్వప్నాన్ని పూర్తి చేసుకున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్లానింగ్ వర్సెస్ సక్సెస్ "ఇంత బిజీగా ఉంటావు, పరుగులెలా తీస్తున్నావని నన్ను అందరూ అడుగుతారు, ఒక రోజును మనం ఏ రకంగా ప్లాన్ చేసుకుంటున్నామన్న దాంట్లోనే ఉంది. ఫిట్నెస్ కోసం ప్రతీ రోజు కొంత సమయం కేటాయించుకోగలిగితే.. మనలో తేడా మనకే తెలుస్తుంది" అంటారు భార్గవి. ఆల్ ది బెస్ట్ పరుగుల రాణీ. -
దెబ్బతిన్న గుండెకు జీబ్రా ఫిష్ వైద్యం!
జీబ్రా ఫిష్ అనే ఈ చేపలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎంత అద్భుతమైన జీవులంటే తమలోని కొన్ని దేహ భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజాగా తేలింది. మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్ అంటారు. అవి జీబ్రాఫిష్లోలా పునరుత్పత్తి చెందలేవు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా కాని సందర్భాల్లో... గుండెపోటు వస్తుంది. అప్పుడు మన గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై చార/గాటు (స్కార్) లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె మునుపటి కంటే బలహీనమవుతుంది. అయితే జీబ్రాఫిష్లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. ఒక మిల్లీమీటరు సైజులో ఉండే దాని గుండె కణాల్లో 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ అధ్యయనం ద్వారా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలం తాలూకు కణాలు కండక్టర్లుగా పనిచేసి, రిపేరుకు తోడ్పడే సిగ్నల్స్ పంపే ప్రోటీన్ల సహాయంతో.. ఇలా కణాలు మళ్లీ పుట్టేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు... కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందన్న అద్భుతమైన విషయం తెలియవస్తోంది. ‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాం’’అన్నారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన ఫిలిప్ జంకర్. ఆయన తన పరిశోధనను సెంటర్ ఫర్ మాలెక్యులార్ మెడిసిన్కు చెందిన మాక్స్ డెల్బ్రక్తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మునుపు ఈ ఏడాదే మొట్టమొదటిసారిగా ఓ పంది గుండెను తీసి, మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. (అయితే ఆ బాధితుడు ఈ చికిత్స జరిగిన రెండు నెలల్లోనే మరణించాడు). అలాగే ఈ ఏడాది మేలో గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలు వాటంతట అవే కొంతవరకు రిపేరు చేసుకుంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక జూన్ లో ఎమ్ ఆర్ఎన్ఏ ప్రక్రియ ద్వారా జన్యుపరమైన సూచనలిస్తూ గుండెపోటుకు గురైన ఓ ఎలుక గుండె రిపేరు జరిగేలా ప్రయత్నించి, విజయం సాధించారు. తాజాగా ఈ అధ్యయనంలో ఓ అల్ట్రా కోల్డ్ నీడిల్తో మనుషుల్లో గుండెపోటు ఎలా వస్తుందో ఓ ఎలుకకూ అలాగే జరిగేలా చూశారు. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. ‘‘గుండెపోటుతో మనిషిలో ఏం జరుగుతుందో... ఎలుక గుండెకూ అదే జరిగింది. అయితే గుండెపోటుతో మనిషి ఆగిపోవచ్చు. కానీ జీబ్రాషిప్లో మాత్రం కొత్త ‘కార్డియోమయోసైట్స్’అనే కణాలు ఉద్భవిస్తుంటాయి. వాటితో దాని గుండె తాలూకు రిపేరు ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా ఉద్భవించిన ఆ కణాలు స్పందనలనూ కొనసాగిస్తున్నాయి’’అని తెలిపారు ఫిలిప్ జుంకర్స్. ఆశాజనకమే కానీ.. జీబ్రాఫిష్ గుండెకు ఎలాంటి గాయం కానప్పుడు దాని నుంచి దాదాపు 2,00,000 కణాలను వేరుచేసి, సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటిని స్కాన్ చేశారు ఈ పరిశోధన బృందంలోని అధ్యయనవేత్తలు. ఆ కణాలను గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలతో పోల్చి చూశారు. వాటిలోని ఏ అంశాలు దెబ్బతిన్న తర్వాత చురుగ్గా మారి, రిపేరుకు తోడ్పడుతున్నాయనే విషయాలను పరిశీలించారు. మూడు రకాల ఫైబ్రోబ్లాస్ట్స్ రంగంలోని దూకి, కండరాల్లోని కణాలు తిరిగి పుట్టేలా పురిగొల్పే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయనీ... తిరిగి అవి కనెక్టివ్ కణజాలాన్ని ఉద్భవించేలా చేస్తున్నాయని వారి పరిశీలనలో తెలిసింది. మళ్లీ ఆ జన్యువులను పని జరగకుండా ఆపినప్పుడు.. ఈ పునరుత్పత్తి ప్రక్రియ జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. తద్వారా ఈ పునరుత్పత్తి /రిపేరు ప్రక్రియలో ఫైబ్రోబ్లాస్ట్స్ కీలకమైన భూమిక పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు పుట్టే ఇన్ఫ్లమేటరీ కణాలైన ‘మ్యాక్రోఫేజెస్’కు వ్యతిరేకంగా ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ పనిచేస్తూ, ఈ రిపేరు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎపీకార్డియమ్ అనే గుండె తాలూకు బయటిపొర సైతం ఈ పునరుత్పిత్తి ప్రక్రియలో చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశోధన కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల విషయంలో ఈ ఫైబ్రోబ్లాస్ట్ మెకానిజమ్ ఏ మేరకు పూర్తి సత్ఫలితాలు ఇస్తుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే గుండెపోటుతో దెబ్బతిన్న గుండెను సమర్థంగా రిపేరు చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భవిష్యత్తులో ఈ పరిశోధన చాలా వరకు తోడ్పడే అవకాశమున్నట్లు పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
వెరైటీగా.. స్కర్టులో స్టార్ హీరో.. ఫోటోలు వైరల్
సినిమా ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్స్ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. సినిమాను ఆడియెన్స్కు దగ్గర చేసేందుకు ఢిపరెంట్ కాన్సెప్ట్స్తో ప్రమోషన్స్ చేస్తుంటారు. హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసేందుకు వెరైటీ గెటప్లో దర్శనమిచ్చాడు. తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'బుల్లెట్ ట్రైన్' త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్తో మాంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్లో భాగంగా బెర్లిన్ ప్రీమియర్కు వచ్చిన బ్రాడ్ పిట్ లినెన్ స్కర్ట్తో కనిపించి అందరికి షాకిచ్చాడు. మ్యాచింగ్ బ్రౌన్ జాకెట్, పింక్ షర్ట్తో స్టైలిష్ గెటప్లో సందడి చేశాడు. అంతేకాకుండా ఈ గెటప్లో తన కాలిపై ఉన్న టాటూలతో మరింత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. ఒక కాలికి ఖడ్గమృగం, మరో కాలికి పుర్రె టూటూలతో బ్రాడ్ పిట్ స్పెషల్ లుక్లో కనిపించారు. ఇక ఈ ప్రీమియర్ షోకి జోయి కింగ్, ఆరోన్ టేలర్-జాన్సన్, బ్రియాన్ టైరీ హెన్రీతో సహా మిగిలిన తారాగణం సందడి చేసింది. -
మార్ఫింగ్ వీడియోతో కమెడియన్కు బిగుస్తున్న ఉచ్చు
ఢిల్లీ: ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వివాదంలో నిలిచాడు. యూరప్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. తొలుత జర్మనీలో పర్యటించిన విషయం తెలిసిందే. బెర్లిన్లో ప్రవాస భారతీయులతో ముఖాముఖి జరిపిన వేళ.. ఓ చిన్నారి దేశ భక్తి గేయం అలరించగా.. మోదీ కూడా హుషారుగా ఆ చిన్నారితో గొంతు కలిపారు. హే జన్మభూమి భారత్ అంటూ ఆ చిన్నారి వీడియో వైరల్ కాగా.. దానిని ‘మెహెన్గయి దాయన్ ఖాయే జాట్ హై’ అంటూ మరో ఆడియో క్లిప్తో మార్ఫింగ్ చేశారు ఎవరో. ఈ వీడియో కమెడియన్ కునాల్ కమ్రా తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్ చూసిన.. ఆ చిన్నారి తండ్రి తీవ్రంగా స్పందించాడు. #WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm — ANI (@ANI) May 2, 2022 చెత్త అంటూ కునాల్ను తిట్టిపోశాడు ఆ చిన్నారి తండ్రి గణేష్ పోల్. ఏడేళ్ల తన కొడుకు మాతృదేశం కోసం పాట పాడానని, అంత చిన్న వయసులో ఉన్నా చెత్త వెధవ అయిన నీ కంటే తన దేశాన్ని ప్రేమిస్తున్నాడంటూ ఆయనొక ట్వీట్ చేశాడు. అంతేకాదు చిన్నపిల్లలతో కామెడీ ఏంటంటూ మండిపడ్డాడు. He is my 7 year old son, who wanted to sing this song for his beloved Motherland . Though he is still very young but certainly he loves his country more than you Mr. Kamra or Kachra watever u are Keep the poor boy out of your filthy politics & try to work on your poor jokes https://t.co/ECnBFSIWkI — GANESH POL (@polganesh) May 4, 2022 అయితే ఈ జోక్ అతని కొడుకు మీద వేసింది కాదంటూ కునాల్ కమ్రా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉండగా.. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఈ విషయమై కునాల్ మీద చర్యలకు సిద్ధమైంది. ట్వీట్ డిలీట్ చేయించడంతో పాటు కునాల్ మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను గురువారం ఆదేశించింది. అయితే విమర్శలు తారాస్థాయికి చేరడంతో ఆ వీడియోను డిలీట్ చేశాడు కునాల్ కమ్రా. చదవండి: ‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం -
‘నా కొడుకుని మీ నీచ రాజకీయాలకు దూరంగా ఉంచండి’
ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటన సందర్భంగా బెర్లిన్లో ఏడేళ్ల కుర్రాడు దేశభక్తి గీతాన్ని ఆలపించిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించిన ఎడిట్ వీడియ కమెడీయన్ కునాల్ కుమ్రా షేర్ చేశాడు. దీంతో కుర్రాడి తండ్రి గణేష్ పౌల్ కుమ్రా పై మండిపడుతూ ఓ ట్వీట్ని షేర్ చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా 2010లో వచ్చి పిప్లీలైవ్ సినిమాలోని ‘హే జన్మభూమి భారత్’, మెహెంగయి దాయన్ ఖాయే జాత్ హై పాటను ఏడేళ్ల కుర్రాడు పాడారు. దీనికి సంబంధించిన ఎడిట్ వీడియో బయటకు రావడంతో ఆ కుర్రాడి తండ్రి గణేష్ పౌల్పై షేర్ చేసిన హస్యనటుడు కునాల్ కుమ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బదులుగా గణేష్ పౌల్ ట్విట్టర్లో స్పందిస్తు ఏడేళ్ల వయసున్న నాబిడ్డ మాతృభూమి కోసం పాట పాడారని, ఇప్పటికి భారతదేశాన్ని మీ అందరి కంటే తన కొడుకు ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు తెలిపారు. మిస్టర్ కుమ్రా లాంటి వాళ్లు ఏమనుకున్నా ఫర్వాలేదన్నారు. తన కుమారుడిని నీచ రాజకీయాలకు దూరంగా ఉంచి మీ జోకులకు పని చెప్పుకోండంటూ ఫైర్ అయ్యారు. He is my 7 year old son, who wanted to sing this song for his beloved Motherland . Though he is still very young but certainly he loves his country more than you Mr. Kamra or Kachra watever u are Keep the poor boy out of your filthy politics & try to work on your poor jokes https://t.co/ECnBFSIWkI — GANESH POL (@polganesh) May 4, 2022 #WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm — ANI (@ANI) May 2, 2022 చదవండి: పెళ్లి రోజు వరుడు సర్ప్రైజ్.. గిఫ్ట్ చూసి ఏడ్చేసిన వధువు! -
జర్మనీలో మోదీకి ఘనస్వాగతం... పాటతో అలరించిన బాలుడు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ యూరప్లో తన మూడు దేశల పర్యటన సందర్భంగా మొదటగా బెర్లిన్-బ్రాండెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు భారత సంతతికి చెందిన ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు ఒక యువ విద్యార్థి దేశభక్తి పాటతో మోదీకి ఘన స్వాగతం పలకగా.. మాన్యా అనే అమ్మాయి పెన్సిల్-స్కెచ్తో గీసిన ప్రధాని మోదీ చిత్రాన్ని బహుకరించింది. మోదీ ఈ పర్యటన భారత్, జర్మనీ ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింతగా పెంపొందింప చేస్తోందన్నారు "నేను జర్మనీకి కొత్తగా నియమితులైన ఓలాఫ్ స్కోల్జ్తో చర్చలు జరుపుతాను. ఈ సమావేశంలో వ్యాపార ప్రముఖులతో కూడా సంభాషిస్తాను." అని మోదీ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఒక యువ విద్యార్థి తన పాటతో మోదీకి ఘనస్వాగతం పలికిన వీడియోతో పాటు, విద్యార్థులు మోదీ కాళ్లకు పాదాభివందనం చేస్తున్న వీడియోలు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. నార్డిక్ దేశాల నాయకులతో చర్చలు జరపడానికి మోదీ డెన్మార్క్ను కూడా సందర్శించాల్సి ఉంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఫ్రెంచ్ అధ్యక్షడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ను కలవడానికి భారత ప్రధాని పారిస్కు వెళ్తారు. ఇది ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత ఈ ఏడాది మోదీ చేసిన తొలి విదేశీ పర్యటన. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా పలు సవాళ్లు ఎదుర్కొంటున్న యూరప్లో తాను పర్యటించబోతున్నాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. #WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm — ANI (@ANI) May 2, 2022 #WATCH Indian diaspora extends a warm welcome to PM Modi in Berlin, Germany (Source:DD) pic.twitter.com/H0yX5LWut4 — ANI (@ANI) May 2, 2022 (చదవండి: తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?) -
‘ఫటో’నా మజాకా
ఈ చిత్రంలో కనిపిస్తున్న గొరిల్లా తీక్షణంగా చూస్తున్న వస్తువు ఏమిటబ్బా అని అనుకుంటున్నారా? ఇదో రైస్ కేక్. బియ్యం, వెన్న, పలు రకాల పండ్లు, కూరగాయలతో దీన్ని తయారు చేశారు. జర్మనీలోని బెర్లిన్లో ఉన్న ఓ జూలో ఫటో అనే ఈ ఆడ గొరిల్లా ఆరగించేందుకు ఇలా తెచ్చిపెట్టారు. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? ఉందిలేండి.. తాజాగా ఈ గొరిల్లా 65 ఏళ్లు పూర్తి చేసుకుంది మరి! ప్రపంచంలోకెల్లా జీవించి ఉన్న అత్యంత వృద్ధ గొరిల్లాగా ఇది రికార్డులకెక్కింది. పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొనే కేక్పై ఎరుపు, నలుపు రంగులతో కూడిన జెమ్స్ను 65 అంకె ఆకారంలో ఉంచారు. ఇన్ని పదార్థాలతో చేసిన కేక్ను కళ్లెదుట ఉంచితే గొరిల్లా ఊరుకుంటుందా? పిసరంత కూడా మిగల్చకుండా మొత్తం కేక్ను గుటుక్కుమనిపించింది. జూ నిర్వాహకుల కథనం ప్రకారం పశ్చిమ ఆఫ్రికా అడవుల్లో 1957లో పుట్టిన ఈ గొరిల్లాను ఫ్రాన్స్కు చెందిన ఓ నావికుడు తన దేశానికి తీసుకెళ్లాడు. 1959లో దీన్ని జర్మనీ తీసుకొచ్చిన అతను.. మద్యానికి నగదు లేక గొరిల్లాను ఇచ్చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ గొరిల్లా జూలోనే జీవిస్తోంది. అడవుల్లోని గొరిల్లాల జీవితకాలం సుమారు 40 ఏళ్లు ఉంటుందని, జూలో ఉంటుండటంతో ఫటో ఇంత దీర్ఘకాలంపాటు జీవించగలుగుతోందని జూ నిర్వాహకుడు క్రిస్టియన్ ఆస్ట్ పేర్కొన్నాడు. వృద్ధాప్యం మీదపడ్డా నేటికీ ఫటో ఎంతో ఆరోగ్యంగా ఉందని, ఆకలి మందగించడం వంటి సమస్యలేవీ దీనికి లేవని చెప్పాడు. సుమారు 200 కేజీల బరువు ఉండే గొరిల్లాలు రోజూ 15 నుంచి 20 కిలోల వరకు గడ్డి, ఆకులు, బెరళ్లు, పండ్లు ఆరగిస్తాయని వివరించాడు. -
డేటింగ్ యాప్లో పరిచయం.. మత్తిచ్చి చంపి తినేశాడు!
టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలోకి సాగుతుంటే మరోవైపు మనుషులు తమ వికృత ఆలోచనలకు తెరలేపుతున్నారు. ఇది వరకు నేరాలు చేసేవాళ్లంతా కేవలం చదువుకోకపోవడంతో మూర్ఖంగానో లేక క్షణికావేశంలో అజ్ఞానంతో చేసేవారు. కానీ ఇప్పుడూ బాగా చదువుకుని ఏది మంచో, ఏది చెడో కూడా తెలిసి మంచి ఉన్నత స్థితిలో ఉండి కూడా విశృంఖలపు ఆలోచనలతో విచిత్రమైన నేరాలు చేస్తున్నవారే కోకొల్లలు. అయితే ఇక్కడోక వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అత్యంత దారుణమైన నేరానికి ఒడిగట్టాడు. (చదవండి: చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!) అసలు విషయంలోకెళ్లితే...జర్మనీ మాజీ ఉపాధ్యాయుడు స్టెఫాన్ ఆర్ స్వలింగ సంపర్కుడు. ఈ మేరకు స్టెఫాన్ ఆర్ నరమాంస భక్షణ నిమిత్తం ఆన్లైన్లో డేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు కలుద్దామని ఇంటికి పిలిపించి మరీ డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అతని జననాంగాలను కోసి తినేశాడు. ఈ మేరకు ఆ టీచర్ అతని శవాన్ని ముక్కలుగా కోసి బెర్లిన్లో ఈశాన్య పాంకో జిల్లాలో చెల్లా చెదురుగా పడేశాడు. అయితే పోలీసులు బెర్లిన్ పార్కులో మానవ అవశేషాలను గుర్తించడంతో నవంబర్ 2020న ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇంతకి ఆ అవశేషాలను తప్పిపోయిన స్టెఫాన్ టీకి సంబంధించినవిగా పోలీసులో గుర్తించారు. ఆ తర్వాత బాధితుడి ఫోన్లోని కాల్డేటా ఆధారంగా నిందుతుడు స్టెఫాన్ ఆర్గా గుర్తించి అరెస్టు చేశారు. అయితే బెర్లిన్ కోర్టు తాజాగా ఈ కేసు పూర్వాపరాలను విచారిస్తూ ఇది అత్యంత అమానవీయమైన కేసుగా అభివర్ణించింది. ఈ మేరకు ప్రిసైడింగ్ జడ్జీ మాథియాస్ షెర్ట్జ్ మాట్లాడుతూ..." 30 ఏళ్లుగా న్యాయమూర్తిగా నా సర్వీస్లో ఎన్నో కేసులు చవిచూశాను కానీ ఇంతటి అమానుషమైన కేసు ఇంతవరకు చూడలేదు" అని అన్నారు. అంతేకాదు నరమాంస భక్షణలో భాగంగానే స్టిఫాన్ టీని చంపి శరీరాన్ని కోసి తిన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఇంత భయంకరమైన అమానుష చర్యకు పాల్పడినందుకు గానూ అతనికి జీవిత ఖైదు విధించారు. పైగా నింధితుడి తరుపు న్యాయవాదులు బాధితుడు తన ఇంట్లోనే సహజ కారణాలతో చనిపోయాడని, తమ స్వలింగ సంపర్కం గురించి ప్రజలు తెలుసుకుంటారనే భయంతోనే స్టిఫాన్ ఆర్ అతని మృతదేహాన్ని నరికి పారవేశాడని వాదించారు. కానీ కోర్టు వాటన్నింటిని తిరస్కరించి ఆ నిందితుడి కఠిన శిక్ష విధించింది. అయితే నిధింతుడు శిక్ష విధించే క్రమంలో మౌనంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: ‘టైం కి డ్రోన్ రాకపోయుంటే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి’) -
నీ కుక్కను సరిగ్గా ట్రైన్ చేసుకో.. నా కుక్కనే అంటావా!
బెర్లిన్: సాధారణంగా కొందరు శునకాలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటిని ఎవరు ఏమన్నా.. ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తాజాగా, ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. జర్మనీలోని తురింజియా పట్టణంలో 27 ఏళ్ల మహిళ, 51 ఏళ్ల మరో మహిళ తమ పెంపుడు కుక్కలను తీసుకుని స్థానికంగా ఉన్న పార్కులో వాకింగ్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఒక శునకం.. మరో శునకాన్ని చూస్తు అరుస్తూ దాడికి తెగబడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 51 ఏళ్ల మహిళ.. మరో మహిళపై వాగ్వాదానికి దిగింది. శునకాన్ని సరిగ్గా ట్రైన్ చేసుకోవాలని చెప్పింది. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ పెరిగి.. ఒకరిపై మరొకరు దాడిచేసుకోవడం వరకు వెళ్లింది. ఒకరిని మరోకరు కొరుక్కుంటూ గాయపర్చుకున్నారు. పాపం.. మహిళలిద్దరు కొట్టుకోవడాన్ని వారి శునకాలు చూస్తూ ఉండిపోయాయి. ఆ ప్రదేశంలో ఉన్న స్థానికులు వారి గొడవను ఆపటానికి సాహసించలేదు. ఈ సంఘటన తర్వాత ఇరువురు స్థానిక పోలీసుస్టేషన్ వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ కన్నా.. శునకాలే నయం..’, ‘వామ్మో.. ఇలా కరుచుకున్నారేంటీ..’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
చిత్తూరు అబ్బాయి, కశ్మీర్ అమ్మాయి.. బెర్లిన్లో ప్రేమ..
సాక్షి, పీలేరు(చిత్తూరు): బెర్లిన్లో ప్రేమించుకున్న ప్రేమజంటకు పీలేరులో వివాహం జరిగింది. పీలేరు మండలం కాకులారంపల్లెకు చెందిన కాకులారం మోహన్రెడ్డి కుమారుడు కుమార్రెడ్డి గత మూడేళ్లుగా బెర్లిన్లోని చార్టీ రాష్ట్రంలో ఓ సైన్స్ పరిశోధనా కేంద్రంలో సైంటిస్ట్గా పని చేస్తున్నాడు. అక్కడే కశ్మీర్కు చెందిన రూఫ్కిషన్ రైనా కుమార్తె షికా రైనా కూడా బెర్లిన్లో సైంటిస్ట్గా పని చేస్తుంది. ఈ క్రమంలో కుమార్రెడ్డి, షికా రైనాలు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించడంతో ఆదివారం స్థానిక పీలేరు ఎంఎన్ఆర్ కల్యాణమండపంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. చదవండి: (ట్రైనింగ్లో మొగ్గతొడిగిన ప్రేమ.. పెద్దల సమక్షంలో ఎస్ఐల పెళ్లి) -
మరో మహిళతో భర్త ఫోటోలు: ఐదుగురు పిల్లలను బాత్టబ్లో ముంచి
బెర్లిన్: పిల్లలు పుట్టాలని తల్లిదండ్రులు ఎంతో పరితపిస్తుంటారు. ఒకవేళ ఏదైన సమస్యలుంటే.. వారు ఆసుపత్రుల చుట్టు.. ఆలయాల చుట్టు తిరుగుతుంటారు. మనుషులే కాదు.. నోరులేని మూగజీవాలు కూడా తమ పిల్లల పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తాయి. ఒకవేళ పిల్లలకు ఏదైన ఆపద సంభవిస్తే.. తమ ప్రాణాలను కూడా లెక్కచేయవు. ప్రస్తుతం క్షణికావేశంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిన్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. జర్మనీలో కూడా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. జర్మనీలోని సోలెంగెన్ పట్టణానికి చెందిన ఒక మహిళ, తన భర్తతోపాటు కలిసి జీవిస్తుంది. వీరికి ఆరుగురు పిల్లలున్నారు. ఈ క్రమంలో.. ఒక రోజు తన భర్త.. మరో మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో.. విచక్షణను కోల్పోయి తన ఇంట్లో ఉన్న బాత్టబ్లో ఐదుగురు పిల్లలను ముంచి ఊపిరాడకుండాచేసి అతి క్రూరంగా హత్యచేసింది. చనిపోయిన పిల్లలంతా.. 18 నెలల నుంచి 8 ఏళ్ల వయసులోపు వారున్నారు. సంఘటన జరిగినప్పుడు.. తన భర్త, పెద్దకొడుకు లేకపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గతేడాది సెప్టెంబరులో జరిగింది. ఆ తర్వాత సదరు మహిళ.. ట్రైన్ఎదుట వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత స్థానికులు ఆమెను కాపాడారు. పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో విచారించిన ఆమెను జీవితఖైదు విధిస్తు జడ్జి తీర్పునిచ్చారు. తాజాగా, ఆమె తరపు న్యాయవాది.. నిందితురాలి మానసిక స్థితి సరిగ్గాలేదని ఆమెకు బెయిల్ ఇవ్వాలని, శిక్షాకాలాన్ని 8 సంవత్సరాలకు తగ్గించాలని కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై జడ్జి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా అమానుషమని, అరుదైన ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తర్వాత.. నిందితురాలు భర్తకు.. ఇకమీదట నీవు నా పిల్లలను చూడలేవని మెసెజ్ చేసింది. దీని అర్థం ఏంటని ప్రశ్నించారు?.. అదే విధంగా నిందితురాలి మానసిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి ప్రత్యేక వైద్యుడిని నియమించారు. అతను.. ఆమెను విచారించారు. ఆమె ఆరోగ్యంగా ఉందని , ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావడంలేదని కోర్టు వారికి తెలిపారు. దీంతో ఆమెకు బెయిల్ మంజూరును న్యాయమూర్తి నిరాకరించారు. కాగా, ఈ ఘటనలో మృతి చెందిన పిల్లల ఆత్మకు శాంతి కలగాలని స్థానికులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. -
మెర్కెల్ కూటమికి ఎదురుదెబ్బ
బెర్లిన్: జర్మనీ ఎన్నికల్లో చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్కు చెందిన యూనియన్ కూటమి ఓట్ల వేటలో వెనుకబడింది. సోషల్ డెమోక్రాట్ పార్టీ స్వల్ప మెజారిటీ సాధించింది. మొత్తం 735 నియోజకవర్గాల్లో సోమవారం ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి సోషల్ డెమోక్రాట్లకు 25.7% ఓట్లు(206 సీట్లు), యూనియన్ కూటమికి 24.1%ఓట్లు(196 సీట్లు) పడ్డాయని ఎన్నికల అధికారులు చెప్పారు. తర్వాతి స్థానాల్లో ఉన్న గ్రీన్ పార్టీ 14.8%(118 సీట్లు), ఫ్రీ డెమోక్రాట్లు 11.5% ఓట్లు(92 సీట్లు)సాధించాయి. వైస్ చాన్సెలర్, ఆర్థిక మంత్రి సోషల్ డెమోక్రాట్ పార్టీ చాన్సెలర్ అభ్యర్థి ఒలాఫ్ షోల్జ్ ‘జర్మనీలో తాము ఒక మంచి, ఆచరణాత్మక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది ప్రజలిచ్చిన తీర్పు’అని అన్నారు. అయితే, చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము కూడా ప్రయత్నిస్తామని యూనియన్ కూటమి పేర్కొంది. సోషల్ డెమోక్రాట్లు, యూనియన్ కూటమి కూటమి నేతలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు గ్రీన్ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే, గ్రీన్ పార్టీ సోషల్ డెమోక్రాట్లవైపు, ఫ్రీ డెమోక్రాట్లు యూనియన్ కూటమి వైపు మొగ్గు చూపడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో మాదిరిగా యూనియన్, సోషల్ డెమోక్రాట్లు కలిసి ‘గ్రాండ్ కూటమి’ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గతంలో మెర్కెల్ పాలనలో 12 ఏళ్లపాటు ఈ కూటమి ప్రభుత్వమే ఉంది. -
వరల్డ్ ఫేమస్ దొంగల ముఠా.. ప్రతీదీ ట్విస్టే!
ఎంటర్టైన్మెంట్కి ఎల్లలు లేవు. అందుకే లోకల్ కంటెంట్తో పాటు గ్లోబల్ కంటెంట్కు ఆదరణ ఉంటోంది. ఇక ఓటీటీ వాడకం పెరిగాక.. దేశాలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్లను డిజిటల్ తెరలపై చూసేస్తున్నారు మనవాళ్లు. ఆ లిస్ట్లో ఒకటే ‘మనీ హెయిస్ట్’. ఎక్కడో స్పెయిన్లో తెరకెక్కిన ఈ టీవీ సిరీస్కి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్.. అందులో తెలుగువాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కువమంది(ఇండియన్స్తో సహా) చూసిన నాన్–ఇంగ్లీష్ సిరీస్ కూడా ఇదే(ఇదొక రికార్డు). మనీ హెయిస్ట్కి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ప్రధాన కారణాలు.. ఈ సిరీస్ మూలకథ, ప్రధాన పాత్రలతో వ్యూయర్స్ పెంచుకున్న కనెక్టివిటీ. అందుకే ఐదో పార్ట్ రూపంలో అలరించేందుకు సిద్ధమైంది ఈ దొంగల ముఠా డ్రామా. సాక్షి, వెబ్డెస్క్: క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడేవాళ్లకు ‘మనీ హెయిస్ట్’ ఒక ఫుల్ మీల్స్. ఒరిజినల్గా ఇది స్పానిష్ లాంగ్వేజ్లో తెరకెక్కింది. నాన్–స్పానిష్ ఆడియెన్స్ కోసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో సిరీస్ను అందిస్తున్నారు. మొదటి సీజన్ 2017 మే 2న స్పానిష్ టీవీ ఛానెల్ ‘అంటెనా 3’ లో టెలికాస్ట్ అయ్యింది. స్పానిష్లో మనీ హెయిస్ట్ ఒక టెలినోవెలా.. అంటే టెలిసీరియల్ లాంటిదన్నమాట. మనీ హెయిస్ట్ టెలికాస్ట్ తర్వాత.. అప్పటిదాకా ఉన్న స్పానిష్ టీవీ వ్యూయర్షిప్ రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఆ పాపులారిటీని గుర్తించి నెట్ఫ్లిక్స్ మనీ హెయిస్ట్ రైట్స్ని కొనుగోలు చేసింది. అలా నెట్ఫ్లిక్స్ నుంచి ప్రపంచం మొత్తం ఈ ట్విస్టీ థ్రిల్లర్కు అడిక్ట్ అయ్యింది. మరో రికార్డ్ ఏంటంటే.. నెట్ఫ్లిక్స్లో ఎక్కువ వ్యూయర్షిప్ ఉన్న టీవీ సిరీస్ కూడా ఇదే!. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్లు.. 31 ఎపిసోడ్స్గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్లో ఐదో పార్ట్గా పది ఎపిసోడ్స్తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు వాల్యూమ్స్(ఎపిసోడ్స్గా) రిలీజ్ కానుంది. ఆ పై డిసెంబర్లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనే ఎగ్జయిట్మెంట్ ఫ్యాన్స్లో మొదలైంది. ఎందుకంత అడిక్షన్? మనీ హెయిస్ట్ ఒరిజినల్(స్పానిష్) టైటిల్ ‘లా కాసా డె పాపెల్’. బ్యాంకుల దోపిడీ(హెయిస్ట్) నేపథ్యంలో సాగే కథ ఈ సిరీస్ది. దోపిడీకి ప్రయత్నించే గ్యాంగ్.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూసే పోలీసులు.. వెరసి ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్తో కథ ముందుకెళ్తుంది. అలాగని స్టోరీ నార్మల్గా ఉండదు. సీన్కి సీన్కి ఆడియెన్స్లో హీట్ పెంచుతుంది. ట్విస్టుల కారణంగా ‘ప్రతీ సీన్ ఒక క్లైమాక్స్లా’ అనిపిస్తుంది. కథలో తర్వాతి సీన్ ఏం జరుగుతుందనేది వ్యూయర్స్ అస్సలు అంచనా వేయలేరు. ఆ ఎగ్జయిట్మెంటే చూసేవాళ్లను సీటు అంచున కూర్చోబెడుతుంది. కథలో ఒక్కోసారి ఫ్లాష్బ్యాక్ సీన్స్ వస్తుంటాయి. వాటి ఆధారంగానే కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఆడియెన్స్ని ప్రధానంగా ఆకట్టుకునే అంశం కూడా ఇదే. ఇక స్క్రీన్ప్లే సైతం గ్రిప్పింగ్గా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ చెప్పే డైలాగులు ఫిలసాఫికల్ డెప్త్తో ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యారంటే వదలకుండా చూస్తుంటారు. ఈ సిరీస్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ట్విట్టర్లో ఒకటి, రెండు రోజులు ట్రెండింగ్లో ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు మనీ హెయిస్ట్ క్రేజ్ ఏపాటిదో. క్యారెక్టర్స్ కనెక్టివిటీ కాస్టింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు.. ప్రతీ క్యారెక్టర్కి కరెక్ట్ సీన్లు పడటం కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ, మనీ హెయిస్ట్లో ప్రతీ క్యారెక్టర్కి సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్యారెక్టర్లను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. ఈ కథ నారేటర్, దోపిడీ ముఠాలో ఫస్ట్ మెంబర్ ‘టోక్యో’. ఇక మెయిన్ క్యారెక్టర్ ‘ఎల్’ ఫ్రొఫెసర్. దోపిడీ వెనుక మాస్టర్ మైండ్ ఇతనే. నిజానికి అతని యాక్చువల్ ప్లాన్ వేరే ఉంటుంది. ప్రొఫెసర్తో పాటు నైరోబీ, బెర్లిన్(ప్రొఫెసర్ బ్రదర్) అనే మరో రెండు క్యారెక్టర్లు టోటల్గా ఈ సిరీస్కే కిరాక్ పుట్టించే క్యారెక్టర్లు. అందుకే వాటికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అసలు కథ విషయానికొస్తే.. ఆరంభంలో ఒక బ్యాంక్ దొంగతనం చేయబోయి ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతుంది ఒలివెయిరా(టోక్యో). ఆమెను పోలీసుల బారి నుంచి రక్షిస్తాడు ప్రొఫెసర్. ఆమెతో పాటు మరో ఏడుగురిని ఒకచోట చేర్చి భారీ దోపిడీలకు ప్లాన్ గీస్తాడు. ఆ ముఠాలో ప్రొఫెసర్ బ్రదర్ అండ్రెస్ డె ఫోనోల్లోసా(బెర్లిన్) కూడా ఉంటాడు.ఆ గ్యాంగ్లో ఒకరి వివరాలు ఒకరికి తెలియవు. కానీ, ఎక్కడో దూరంగా ఉండి ప్రొఫెసర్ ఇచ్చే సూచనల మేరకు పని చేస్తుంటారు. పోలీసుల నుంచి రక్షించుకునే క్రమంలో జరిగే పోరాట సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ క్రమంలో వాడే మోడరన్ టెక్నాలజీ, వెపన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. మధ్యమధ్యలో క్యారెక్టర్ల రిలేషన్స్, ఎమోషన్స్, లవ్ ట్రాక్స్.. ఇలా కథ సాగుతూ పోతుంటుంది. కథలో ప్రతీ క్యారెక్టర్ను వ్యూయర్స్ ఓన్ చేసుకున్నారు కాబట్టే.. అంతలా సూపర్ హిట్ అయ్యింది ఈ సిరీస్. సాల్వడోర్కు గౌరవసూచికంగా.. మనీ హెయిస్ట్ కథలో మరో ప్రధాన ఆకర్షణ.. క్యారెక్టర్ల పేర్లు. ముఠాలోని సభ్యులకు ఒరిజినల్ పేర్లు వేరే ఉంటాయి. వాళ్ల ఐడెంటిటీ మార్చేసే క్రమంలో వివిధ దేశాల రాజధానుల పేర్లు పెడతాడు ప్రొఫెసర్. టోక్యో, మాస్కో, బెర్లిన్, నైరోబీ, స్టాక్హోమ్, హెల్సెంకీ... ఇలాగన్నమాట. ఒకరకంగా ఈ పేర్లే మనీ హెయిస్ట్ను ఆడియెన్స్కి దగ్గర చేశాయి.. హయ్యెస్ట్ వ్యూయర్షిప్తో బ్రహ్మరథం పట్టేలా చేశాయి. కథలో ఆకట్టుకునే విషయం దోపిడీ ముఠా ధరించే మాస్క్లు. ఈ మాస్క్లకూ ఒక ప్రత్యేకత ఉంది. స్పానిష్ ప్రముఖ పెయింటర్ సాల్వడోర్ డాలి. ఆయన గౌరవార్థం.. ఆయన ముఖకవళికలతో ఉన్న మాస్క్ను ఈ సిరీస్కు మెయిన్ ఎట్రాక్షన్ చేశాడు ‘లా కాసా డె పాపెల్’ క్రియేటర్ అలెక్స్ పీనా. ఈ టీవీ షో తర్వాతే అలెక్స్ పీనా పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. ఆయనకి బడా ఛాన్స్లు తెచ్చిపెట్టింది. ఊపేసిన బెల్లా చావ్ మనీ హెయిస్ట్ థీమ్ మ్యూజిక్ కంటే.. ఈ సిరీస్ మొత్తంలో చాలాసార్లు ప్లే అయ్యే పాట బెల్లా సియావో(బెల్లా చావ్)కి ఒక ప్రత్యేకత ఉంది. బెల్లా సియావో ఒక ఇటాలియన్ జానపద గేయం. ఇంగ్లీష్లో దానర్థం ‘గుడ్బై బ్యూటిఫుల్’ అని. పాత రోజుల్లో ఇటలీలో మాండినా(సీజనల్ వ్యవసాయ మహిళా కూలీలు) తమ కష్టాల్ని గుర్తించాలని భూస్వాములకు గుర్తు చేస్తూ ఈ పాటను పాడేవాళ్లు. 19వ శతాబ్దం మొదట్లో నార్త్ ఇటలీలో వ్యవసాయ కూలీలు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేవాళ్లు. ఆ టైంలో ఈ పాట ఉద్యమ గేయంగా ఒక ఊపు ఊపింది. 1943–45 టైంలో యాంటీ–ఫాసిస్టులు ఈ పాటను ఎక్కువగా పాడేవాళ్లు. ఆ తర్వాత ఈ పాట వరల్డ్ కల్చర్లో ఒక భాగమైంది. చాలా దేశాల్లో రీమేక్ అయ్యింది. 1969 నుంచి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా బెల్లా సియావో ఒక భాగమైంది. కానీ, మోస్ట్ పాపులర్ సాంగ్గా గుర్తింపు పొందింది మాత్రం మనీ హెయిస్ట్ సిరీస్తో. మెయిన్ క్యారెక్టర్స్ ఎల్ ప్రొఫెసర్, బెర్లిన్(అన్నదమ్ములు) కలిసి పాడిన ఈ పాట తర్వాత సీజన్ల మొత్తం నడుస్తూనే ఉంటుంది. 2018 సమ్మర్లో ‘బెల్లా సియావో’ యూరప్లో ఒక చార్ట్బస్టర్సాంగ్గా గుర్తింపు పొందింది. తెలుగులో మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’లో.. ‘పిల్లా.. చావే...’ సాంగ్ దీని నుంచే స్ఫూర్తి పొందిందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. -
విష ప్రయోగం నుంచి కోలుకుని...
బెర్లిన్: విష ప్రయోగానికి గురైయిన రష్యా విపక్ష నేత అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు అలెక్సీ నావల్నీ కోలుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం జర్మనీలోని బెర్లిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బెడ్పై ఉన్న తన ఫోటోని ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆగస్ట్ 20న సైబీరియా నుంచి బెర్లిన్ వస్తుండగా నావల్నీ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఆయనను మార్గంమధ్యలో జర్మనీలో విమానాన్ని అత్యవసరంగా దింపి ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ సాయం లేకుండా నావల్నీ శ్వాస తీసుకుంటున్నారు. కాగా నావల్నీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారు. సైబీరియాలోని టోమ్స్క్ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్స్క్ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసి ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా నావల్నీపై అనుమానిత విషప్రయోగం జరగ్గా ఆసుపత్రి పాలయ్యారు. -
‘జర్మనీ డబుల్గేమ్ ఆడుతోంది’
మాస్కో : రష్యా విపక్ష నేత అలక్సీ నావల్సీపై విషప్రయోగం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తును అడ్డుకునేందుకు జర్మనీ ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. నవాల్నీ కేసుపై రష్యా వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో ఆంక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బెర్లిన్ హెచ్చరించిన నేపథ్యంలో మాస్కో స్పందించింది. రష్యన్ ప్రాసిక్యూటర్లు ఆగస్ట్ 27న పంపిన వినతిపై స్పందించడంలో జర్మన్ అధికారులు విఫలమయ్యారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియ జఖరవ ఆరోపించారు. సోవియట్ యూనియన్లో తయారయ్యే విషపూరిత రసాయనం నోవిచోక్ను నావల్నీపై మాస్కో ప్రయోగించిందనే ఆరోపణలపై రష్యా వివరణ ఇవ్వాలని జర్మన్ విదేశాంగ మంత్రి హీకో మాస్ డిమాండ్ చేసిన అనంతరం రష్యా ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశారు. జర్మనీ ప్రభుత్వం తమ ప్రకటనలపై చిత్తశుద్ధితో ఉంటే రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం పంపిన వినతపై సత్వరమే బదులిచ్చేదని మరియ ఎద్దేవా చేశారు. జర్మనీ డబుల్ గేమ్ ఆడుతోందా అనే సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. గత నెలలో విమానంలో అస్వస్థతకు గురైన నావల్నీ ప్రస్తుతం సైబీరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నావల్నీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారు. సైబీరియాలోని టోమ్స్క్ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్స్క్ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కిరా యర్మిష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చదవండి : ‘పుతిన్కు అర్ధమయ్యే భాషలోనే బదులిద్దాం’ -
ఊపిరితిత్తుల్లో కరోనా లక్ష్యాలివి
బెర్లిన్: కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లో ఏయే కణాలపై దాడులు చేస్తుందో గుర్తించారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు. ఈఎంబీవో జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైన ఈ పరిశోధన .. కోవిడ్కు సమర్థమైన చికిత్సను అభివృద్ధి చేసేందుకు సాయపడుతుందని అంచనా. శ్వాసకోశ నాళంలోని ప్రొజెనిటర్ కణాలపై కరోనా వైరస్లోని రిసెప్టర్ దాడి చేస్తున్నట్లు తాము గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రొజెనిటర్ కణాల పైభాగంలో ఉండే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు బ్యాక్టీరియాతోపాటు కఫం ఊపిరితిత్తుల నుంచి బయటకు వచ్చేందుకు దోహదపడతాయి. హైడల్బర్గ్ లంగ్ బయో బ్యాంక్ నుంచి సేకరించిన 12 మంది ఊపిరితిత్తుల కేన్సర్ రోగుల నమూనాలతో తాము పరిశోధనలు చేశామని, అంతేకాకుండా ఆరోగ్యవంతుల శ్వాసకోశంలో ఉండే కణాలను కూడా పరిశీలించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సేకరించిన సమాచారాన్ని బట్టి చూస్తే కరోనా లేని వ్యక్తుల నుంచి కీలకమై సమాచారం లభిస్తోందని రోలాండ్ ఇలిస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వైరస్పై ఉండే కొమ్ము కణ ఉపరితలంపైని ఏస్ రిసెప్టర్లకు అతుక్కుంటున్నట్లు ఇప్పటికే తెలిసినా.. కణాల్లోకి చొరపడేందుకు ఇదొక్కటే సరిపోదని చెప్పారు. సుమారు 60 వేల కణాల జన్యుక్రమాలను పరిశీలించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్రొజెనిటర్ కణాలు కరోనా వైరస్ అతుక్కోగల రిసెప్టర్ల తయారీకి కీలకమని గుర్తించామని వివరించారు. -
కావాలని కరోనా అంటించుకుని..
బెర్లిన్ : ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ పేరు చెబితేనే భయంతో వణకిపోతున్నాయి. ఇలాంటి సమయంలో జర్మనీ బెర్లిన్ జిల్లా మేయర్ స్టీఫెన్ వాన్ డాసెల్ మాత్రం కావాలనే కరోనా వైరస్ను తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. అయితే తాను ఇలా చేయడం వెనక ఒక బలమైన కారణం ఉందని స్టీఫెన్ చెబుతున్నాడు. తన పార్ట్నర్ నుంచి కరోనా వైరస్ సోకేలా చేసుకున్నానని స్టీఫెన్ తెలిపారు. కరోనాను తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని భావించానని.. అందుకోసమే ఇలా చేశానని వెల్లడించాడు. అయితే కరోనా వైరస్ తాను ఊహించని దానికంటే దారుణంగా ఉందని స్టీఫెన్ పేర్కొన్నాడు. తను అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం అనారోగ్యానికి గురైనట్టు వెల్లడించారు. దీనిని ఎవరికి సోకకుండా చూస్తానని అన్నారు. అయితే స్టీఫెన్ చేసిన పనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడితే.. మిగతావారికి కూడా కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది వైద్యుల సూచనలకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. అయితే స్టీఫెన్ మాత్రం తను ప్రపంచం కోసమే ఈ పని చేశానని అంటున్నాడు. తన పార్ట్నర్కు కరోనా సోకడంతో.. నేను కూడా క్వారంటైన్లో ఉన్నానని తెలిపారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనా ఒకరి నుంచి మరోకరికి సోకుండా నిలువరించలేమని అన్నారు. కరోనా కట్టడి కోసం కృషి చేస్తాననని చెప్పారు. బాధ్యత గత వ్యక్తిగా కరోనా నుంచి కోలుకునే వరకు క్వారంటైన్లోనే ఉంటానని స్పష్టం చేశారు. చదవండి : కరోనా: గంగవరం పోర్టు యాజమాన్యం విరాళం చేతులెత్తి నమస్కరిస్తున్నా: బాలకృష్ణ -
జర్మనీలో కాల్పుల కలకలం..
-
జర్మనీలో కాల్పులు.. 8 మంది మృతి
బెర్లిన్: జర్మనీలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో దాదాపు 8 మంది మృతిచెందారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రెండు చోట్ల దుండగులు కాల్పులకు తెగబడ్డారని.. వారి గురించి ఇంతవరకు ఎటువంటి సమాచారం తెలియరాలేదన్నారు. హనావులోని హుక్కా లాంజ్లే లక్ష్యంగా కాల్పులు జరిపారని.. ఈ ఘటనలో 8 మంది మృతిచెందినట్లు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా తేలాల్సిఉందన్నారు. ఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా నైరుతి జర్మనీలోని హనావు పట్టణంలో దాదాపు లక్ష మంది జనాభా ఉంటారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక నాలుగు రోజుల క్రితం బెర్లిన్లో కూడా దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. టెంపోడ్రమ్లో కామెడీ షో జరుగుతున్న సమయంలో దాడి చేసి... ఓ వ్యక్తిని హతమార్చారు. చదవండి: కోవిడ్ మృతులు 2 వేలు -
గూగుల్నే ఫూల్ చేశాడు!
బెర్లిన్: అందరికీ పెద్ద దిక్కైన గూగుల్నే బురిడీ కొట్టించాడో ఘనుడు. గూగుల్ మ్యాప్ మనలాంటి సాధారణ ప్రయాణికులతో ఓలా, ఉబర్ వంటి క్యాబ్ రైడింగ్ వ్యాపారాలకు కూడా ఎంతో అవసరమైనది. అలాంటి దిగ్గజ యాప్ను తప్పుదారి పట్టించాడో వ్యక్తి. ప్రయాణానికి రెడీ అయ్యేముందు మనం వెళ్లే రూటులో ఎక్కడ ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉందో చూసుకున్నాకే బండి బయటకు తీస్తాం. అలాంటిది గూగుల్ మ్యాపే స్వయంగా ఫలానా మార్గంలో ట్రాఫిక్ ఉందని వేరే రూటు వెతుక్కోండని చెప్పడంతో అక్కడి వారు నిజమేనని నమ్మి ఆ దారిలోకి అడుగుపెట్టలేదు. కానీ ఆ మార్గంలో ట్రాఫిక్ కాదు కదా కనీసం వేళ్ల మీద లెక్కేపెట్టేంత వాహనాలు కూడా లేకపోవడం గమనార్హం. బెర్లిన్కు చెందిన సిమన్ వెకర్ట్ అనే వ్యక్తి 99 సెకండ్ హ్యాండ్ ఫోన్లను ఓ చిన్నపాటి ట్రాలీలో వేసుకుని ఎంచక్కా రోడ్లపై నెమ్మదిగా నడక సాగించాడు. ఇది గూగుల్ మ్యాప్కు మరోలా అర్థమైంది. ఆ రోడ్డులో ఎన్నో వాహనాలు ఉన్నాయని, అవి నెమ్మదిగా కదులుతున్నాయని దీంతో ట్రాఫిక్ జామ్ అయిందని భావించింది. వెంటనే తక్షణ కర్తవ్యంలా.. చాలా మంది యూజర్లకు ఆ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంది, వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి.. కనుక మీరు మరో మార్గాన్ని ఎంచుకోండని సూచించింది. ఇక ఆ వ్యక్తి నెమ్మదిగా ఫోన్లను లాక్కుంటూ వెళ్లడంతో ఆ రహదారి ప్రాంతం గూగుల్ మ్యాప్లో గ్రీన్ నుంచి రెడ్ కలర్కు మారిపోయింది. ఈ ప్రయోగాన్నిఅతను గూగుల్ కంపెనీకి దగ్గరలోనే చేపట్టడం గమనార్హం. గూగుల్ నిజంగానే మోసపోయిందా? ఇక దీన్నంతటిని సిమన్ వెకర్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. కానీ దీనిగురించి పూర్తి వివరాలు తెలియపర్చలేదు. దీంతో ఆ వీడియో చూసినవారికి పలు సందేహాలు తలెత్తుతున్నాయి. అంతపెద్ద గూగుల్ కంపెనీ ఇంత చిన్నదానికే మోసపోయిందా? అసలు ఇది నిజమేనా, అంతా బూటకమేనా? అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరు గూగుల్ మ్యాప్పై బాహాటంగానే సెటైర్లు వేస్తున్నారు. కానీ ఇదే కనక నిజమైతే గూగుల్ వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఉపక్రమించక తప్పదు. చదవండి: రియల్ రైడ్ చేయండి.. -
గోడ కూలినచోట బంధాలు అతికేనా!
ఆవేశంతో ఊగిపోతున్న నిరసనకారులు సుప్రసిద్ధమైన బెర్లిన్ గోడను కూల్చివేసి 30 సంవత్సరాలు గడిచిన తర్వాత, నగరం తిరిగి ఒకటిగా అల్లుకుపోయింది. ఇది ఐక్య జర్మనీ నూతన రాజధానిగా మాత్రమే కాకుండా, యూరప్ రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా అవతరించింది. (విడిపోయినప్పుడు పశ్చిమ జర్మనీ రాజధాని బాన్ నగరం). పాత తూర్పు బెర్లిన్ శివార్లలో భాగమైన ప్రెంజ్లయర్ బెర్గ్ ఇప్పుడు జర్మనీలోనే అత్యంత ఆకర్షణీయ ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఐస్ క్రీమ్ లాగిస్తున్న గుంపులు ట్రెప్టవర్ పార్క్లో, సోవియట్ యుద్ధంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన భారీకట్టడం వద్దకు వెళుతుండగా మరి కొందరు తూర్పు జర్మనీ పాత టీవీ టవర్ ఛాయలో రూపొందించిన కారల్ మార్క్స్, ఎంగెల్స్ భారీ విగ్రహాల వద్ద ఫోటోలు తీసుకోవడానికి క్యూలో నిలబడి ఉన్నారు. కొనసాగుతున్న అవశేషాలు తూర్పు జర్మనీ ప్రభుత్వ వ్యవస్థను మొత్తంగా లొంగదీసుకుని బెర్లిన్ గోడను తెరువగలిగిన భారీ స్థాయి ప్రజాందోళనలకి 30 సంవత్సరాలు తర్వాతకూడా పాత బెర్లిన్ అవశేషాలు నేటికీ కొనసాగుతుండటమే కాదు.. ఇంకా వృద్ది చెందుతున్నాయి. కాకుంటే పాత బెర్లిన్లో ఇష్టానుసారంగా పరిణామాలు జరగటం లేదు. తూర్పు జర్మనీ పార్లమెంట్ భవనం అయిన పీపుల్స్ ప్యాలెస్ (ప్రజల ఉపయోగార్థం ఇక్కడ థియేటర్లు, రెస్టారెంట్లు, డిస్కో కూడా ఉండేవి)ని 2006–2008 మధ్య కాలంలో నాటకీయంగా కూల్చి వేశారు. ఆ కాలంలో అక్కడ గడిపి తమ మధురానుభూతులను పండించుకున్న చాలామందికి ఈ భవనం కూల్చివేతతో గుండె పిండినంత పనయింది. కొంతమంది తూర్పు జర్మన్ పౌరులు తమ గతానికి సంబంధించిన ముఖ్యమైన భాగాలు ఇప్పుడు తమ జ్ఞాపకాల దొంతర్లలో మరుగునపడిపోయాయని భావిస్తుండటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆనాటి సుపరిచితమైన ప్రకృతి చిత్రాలు, రంజింపజేసే పురాస్మృతులను ఇప్పుడు ఎయిర్ బ్రష్తో వాస్తవమైన వాటికంటే మించిన ప్రతిభతో చిత్రించారు. ఈ చిత్రాలు.. జాత్యహంకారపు నాజీ సామ్రాజ్యం, కమ్యూనిస్టు తూర్పు జర్మనీ రాజ్యంకి చెందిన రెండు నియంతృత్వాలతో కూడిన 20 శతాబ్దపు జర్మన్ ఏకాధిపత్య నిరంకుశ చరిత్రకు సమాన ప్రాతిపదికను కల్పిస్తుంటాయి. ఇంకా వింత గొల్పేదేమిటంటే ఆనాటి పార్లమెంట్ భవనం స్థానంలో ఒకప్పుడు అక్కడే నివసించిన జర్మన్ కైజర్ల ప్యాలెస్ ప్రతిరూపాన్ని ప్రతిష్టించడమే. కమ్యూనిస్టులు, నాజీలూ అడుగుపెట్టని కాలానికి చెందిన ఈ ప్యాలెస్లో రాజ రికపు గతాన్ని ప్రదర్శించే మ్యూజియం కూడా నెలకొల్పారు. వలసవాదపు కళాత్మక చిహ్నాలెన్నో దీంట్లో కనిపిస్తాయి. విస్తృతార్థంలో, పాత తూర్పు జర్మనీపై పాశ్చాత్యీకరణ మార్పు ప్రభావాలను ఇప్పుడు బెర్లి¯Œ లో స్పష్టంగా చూడవచ్చు. ప్రజల పాదార్థిక జీవన ప్రమాణాలు స్పష్టంగానే మెరుగుపడ్డాయి. పునరేకీకరణలో భాగంగా సంఘీభావ పన్ను విధిం పుద్వారా తూర్పు ముఖంగా వచ్చిపడిన బిలియన్ల కొద్దీ యూరోల కారణంగా తూర్పు ప్రాంతంలోని కొన్ని భాగాలు చాలా బాగా మెరుగుపడ్డాయి. అయితే వ్యవస్థాగత పునరభివృద్ధి ఇప్పటికీ ముళ్లబాటలోనే నడుస్తోంది. పాశ్చాత్య వలసీకరణపై తీవ్ర నిరసనలు తూర్పు జర్మనీలోని భారీ పరిశ్రమలను పశ్చిమ జర్మనీకి చెందిన ఆర్థిక పండితులు పట్టుబట్టి అమ్మివేయడం లేక మూసివేయడం చేసిన తీరు నూతన జర్మనీ దేశంలో పలు నిరసనలకు దారి తీసింది. పాశ్చాత్య వలసీకరణలో భాగంగా తూర్పు జర్మన్ కార్మికుల ఉద్యోగాలను పణంగా పెట్టి పశ్చిమ జర్మనీ ప్రాంతంలో పరిశ్రమలన్నింటినీ కేంద్రీకరించారంటూ ఐక్య జర్మనీలో పలువురు నిరసనకారులు నిరసిస్తున్నారు. ఈ సెంటిమెంటును అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఐక్యమయ్యాక తూర్పు జర్మనీలో నిరుద్యోగం పరాకాష్టకు చేరింది. ఫలితంగా బెర్లిన్, లీప్జిగ్ వంటి నగరాలకు వెలుపల ఉన్న హిప్స్టెర్ హబ్లనుంచి అనేకమంది యువతీయువకులు చక్కటి కెరీర్లు, మంచి జీవన పరిస్థితులను అన్వేషిస్తూ పశ్చిమ జర్మనీ వైపు తరలిపోతున్నారు. రాజకీయంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో గుర్తించదగిన స్థాయిలో వ్యత్యాసాలున్నాయి. దీని వల్ల తక్కువ బహుళ సంస్కృతీ వ్యవస్థ కలిగిన తూర్పు ప్రాంతంలో అసాధారణ స్థాయిలో ఛాందసవాద తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతుం డటం గమనించవచ్చు. ఉదాహరణకు చెమింట్జ్ (పాత కార్్లమార్క్స్ సిటీ) పట్టణంలో 2018లో మితవాద పక్షాల ర్యాలీల సంఖ్య పెరిగింది. వీటిలో కొన్ని జాత్యహంకారానికి వ్యతిరేక ర్యాలీలు కూడా ఉన్నాయి. డ్రెస్డెన్ పట్టణంలో నాజీ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎందుకంటే పట్టణంలో ప్రజాస్వామ్య వ్యతిరేక జాత్యహంకారులతో పోరాడక తప్పని స్థితి. పాత తూర్పు జర్మనీకి చెందిన థురిగింయాలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కరడుగట్టిన మితవాద పక్షమైన ‘ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ’ రెండో స్థానంలో నిలిచింది. తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న కారణంగా పశ్చిమ జర్మనీలో ఎన్నికల్లో గెలవలేకపోతున్న లెఫ్ట్ పార్టీ తూర్పు జర్మనీ ప్రాంతంలో మాత్రం అనేక సంవత్సరాలుగా ప్రజాకర్షక ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ (ఎఎఫ్డి) తూర్పు జర్మనీ ప్రాంతంలో గణనీయంగా మెరుగుపడింది పైగా అది తూర్పుకు మాత్రమే పరిమితం కాలేదు. ఆశ్చ ర్యమేమిటంటే ఈ పార్టీ ప్రముఖ నేత జోర్న్ హోకె పశ్చిమ జర్మనీలోని పారిశ్రామిక కేంద్రమైన రుర్ ప్రాంతానికి చెందినవాడు. నియో నాజీల హింస జర్మనీలో పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా తీవ్ర ఛాందసవాద మారణ కాండవైపు ఇలాంటి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. మితవాదమే అసలైన ప్రమాదం వలసల అనుకూల సీడీయూ నాయకుడు వాల్టర్ లుబేక్ను నాజీ అనుకూల ముఠాలు ఈ సంవత్సరం చంపేయడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ హత్య పశ్చిమ జర్మనీలోని కాజెల్ పట్టణంలో జరగటం గమనార్హం. తూర్పు జర్మనీలో మౌలిక వసతుల పునరుద్దరణ, పశ్చిమ జర్మనీని తలపించే జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో పాత తూర్పు జర్మనీ రాష్ట్రాల్లోని రాజకీయ, సామాజిక జీవితానికి నిజమైన ప్రమాదం ఏర్పడనుంది. ఇది జర్మన్లందరి భవిష్యత్తుకూ ప్రమాద హేతువే. మేట్ ఫిట్జ్పాట్రిక్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొపెసర్, ఇంటర్నేషనల్ హిస్టరీ, ఫ్లిండర్స్ యూనివర్సిటీ -
ప్రాణం పోకడ చెప్పేస్తాం!
బెర్లిన్ : వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియదని సామెత.. కానీ టెక్నాలజీ పుణ్యమా అని వాన రాక గురించి కొంచెం అటు ఇటుగానైనా తెలుస్తోంది. ప్రాణం పోకడ గురించి తాము చెబుతామని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయాలజీ అండ్ ఏజింగ్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక్క రక్త పరీక్షతోనే చెప్పేస్తామని ధీమాగా చెబుతున్నారు. వచ్చే 5 నుంచి పదేళ్లలో ఓ వ్యక్తి మరణిస్తారా లేదా అనే విషయానికి సంబంధించిన గుర్తులను (బయోమార్కర్స్)ను తాము గుర్తించామని చెబుతున్నారు. 14 గుర్తులు నిర్దిష్టమైన వ్యాధికి సూచికలు కాకపోగా.. జీవక్రియలు, కొవ్వులు జీర్ణమయ్యే ప్రక్రియ, మంట/వాపు, రక్తంలో చక్కెరల మోతాదు వంటి అంశాల ఆధారంగా పనిచేస్తాయి. 44 వేల మందిపై ఈ పద్ధతిని పరీక్షించి చూశామని.. అన్ని వయసుల వారు, ఆడ, మగ తేడా లేకుండా ఈ పరీక్ష సరైన ఫలితాలిచ్చిందని చెప్పారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వాళ్లందరూ యూరోపియన్ సంతతికి చెందిన వారే. ఇతర ప్రాంతాల ప్రజలతోనూ ఈ పద్ధతి కచి్చతమైన ఫలితాలను ఇస్తుందా లేదా అన్నది విశ్లేషించాల్సి ఉందని అమండా హస్లేగ్రేవ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. -
అత్యంత చౌక నగరం అదే...
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం, చదువు, పెళ్లి.. అవసరం ఏదైనా కానివ్వడం ఒక చోట నుంచి మరొక చోటుకు ఇల్లు మార్చడం పెద్ద తలనొప్పి. ఇల్లు వెతకడం నుంచి మొదలుపెడితే అడ్వాన్స్, ట్రాన్స్పోర్ట్, ఇంటర్నెట్, ఫోన్, గ్యాస్ వంటి యుటిలిటీ చేంజెస్ వరకూ ప్రతి ఒక్కటీ టాస్కే. పైగా ఖర్చు కూడా! ఇంటి షిఫ్టింగ్లో ప్రపంచ దేశాల్లోని ప్రధాన నగరాలతో పోలిస్తే మన దేశ రాజధాని అత్యంత చౌక నగరమట!! బెర్లిన్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న కొరియర్ అండ్ లాజిస్టిక్ కంపెనీ మూవింగ్ ప్రపంచ దేశాల్లోని 85 నగరాల్లో 2019 మూవింగ్ ఇండెక్స్ స్టడీని నిర్వహించింది. ఇంటి షిప్టింగ్లో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇల్లు మారిన తర్వాత కుదురుకునే వరకూ తొలి మూడు నాలుగు నెలల పాటు ఆర్ధికంగా కొంత ఇబ్బందులుంటాయని స్డడీ వెల్లడించింది. షిఫ్టింగ్ ఢిల్లీలో 1,735 డాలర్ల ఖర్చు.. ఇంటి షిప్టింగ్లో అమెరికా అత్యంత ఖరీదైన నగరం. శాన్ఫ్రాన్సిస్కోలో ఇండివిడ్యువల్స్ ఇంటి షిఫ్టింగ్ చేయాలంటే 13,531 డాలర్లు ఖర్చు అవుతుంది. న్యూయార్క్లో 12,041 డాలర్లు, స్విట్జర్లాండ్లోని జెనివాలో 11,694 డాలర్లు ఖర్చు అవుతుంది. ఇక మన నగరం ఢిల్లీలో 1,735 డాలర్లు ఖర్చు అవుతుందని సర్వే తెలిపింది. ఢిల్లీలో ఇండివిడ్యువల్స్ ఇంటి షిఫ్టింగ్ ఖర్చులు విభాగాల వారీగా చూస్తే.. శాశ్వత ఇంటి అద్దె 182 డాలర్లు, తాత్కాలిక ఇంటి అద్దె అయితే 392 డాలర్లు, అద్దె డిపాజిట్ 182 డాలర్లు, ఫుడ్ అండ్ డ్రింక్స్ 232 డాలర్లు, ట్రాన్స్పోర్ట్ 11 డాలర్లు, స్టోరేజీ 51 డాలర్లు, ఇంటర్నెట్ షిఫ్టింగ్ కోసం 4 డాలర్లు, ఫోన్ బిల్స్ 2 డాలర్లు ఖర్చు అవుతుంది. ఫ్యామిలీ షిఫ్టింగ్ అయితే 4,232 డాలర్లు ఫ్యామిలీ మొత్తం ఇల్లు షిఫ్టింగ్ చేయాలంటే అత్యంత ఖరీదైన నగరం శాన్ఫ్రాన్సిస్కో. ఇక్కడ 24,004 డాలర్లు ఖర్చు అవుతుంది. బూస్టన్లో 20,738 డాలర్లు, జెనీవాలో 20,165 డాలర్లు అవుతుంది. ఇక ఢిల్లీలో కుటుంబంతో సహా షిఫ్ట్ చేయాలంటే 4,232 డాలర్లు అవుతుంది. విభాగాల వారీగా చూస్తే.. శాశ్వత ఇంటి అద్దె 335 డాలర్లు, తాత్కాలిక ఇంటి అద్దె అయితే 1,422 డాలర్లు, అద్దె డిపాజిట్ 335 డాలర్లు, ఫుడ్ అండ్ డ్రింక్స్ 533 డాలర్లు, ట్రాన్స్పోర్ట్ 29 డాలర్లు, స్టోరేజీ 51 డాలర్లు, ఇంటర్నెట్ షిఫ్టింగ్ కోసం 4 డాలర్లు, ఫోన్ బిల్స్ 5 డాలర్లు ఖర్చు అవుతుంది. -
గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!
గుండెపోటు కారణంగా దెబ్బతిన్న గుండె కణజాలానికి వేగంగా స్వస్తత చేకూర్చేందుకు బెర్లిన్ హీల్స్ అనే జర్మనీ సంస్థ ఓ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసింది. శరీర గాయాలు తొందరగా మానేందుకు చిన్న స్థాయి విద్యుత్తు షాక్లు ఉపయోగపడతాయన్న అంశం ఆధారంగా తాము ఈ పరికరాన్ని అభివృద్ధి చేశామని వియన్నా మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు డయలేటివ్ కార్డియోమయపతి అనే ఆరోగ్య సమస్య కారణంగా గుండె కణజాలం క్రమేపీ బలహీనపడుతూంటుందని... చివరిదశలో సక్రమంగా సంకోచ వ్యాకోచాలూ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుందని డొమినిక్ వీడెమాన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మందులు ఇవ్వడం లేదంటే పేస్మేకర్ వంటివి అమర్చడం మాత్రమే ప్రస్తుతం ఈ సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలు. చాలా సందర్భాల్లో గుండెమార్పిడి చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్డియాక్ మైక్రోకరెంట్ పేరుతో తాము ఉత్పత్తి చేసిన పరికరం ఎంతో ఉపయోగపడుతుందని డొమినిక్ వీడెమాన్ తెలిపారు. రెండు చిన్న గాట్లు పెట్టడం ద్వారా ఈ పరికరాన్ని గుండెపైన అమర్చవచ్చునని సూక్ష్మస్థాయి విద్యుత్తు షాక్లు ఇచ్చినప్పుడు కణజాలం చైతన్యవంతమై సమస్య రాకుండా ఉంటుందని వివరించారు. -
ఓఎల్ఎక్స్ ప్రీ–ఓన్డ్ కార్ స్టోర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మార్కెట్ప్లేస్ కంపెనీ ఓఎల్ఎక్స్... ప్రీఓన్డ్ కార్ల అమ్మకాల్లోకి ప్రవేశించింది. ఇందుకోసం బెర్లిన్కు చెందిన యూజ్డ్ కార్ గ్రూప్ ఫ్రాంటియర్తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు పలు నగరాల్లో ‘ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్’ పేరిట స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఓఎల్ఎక్స్ యూజర్లు ఆన్లైన్తో పాటూ ఆయా స్టోర్లలో ప్రీ ఓన్డ్ కార్లను విక్రయించే వీలుంటుంది. ప్రస్తుతం దేశంలోని 10 నగరాల్లో 27 స్టోర్లున్నాయని.. 2021 నాటికి 40 నగరాల్లో 150 స్టోర్లను ప్రారంభిస్తామని ఓఎల్ఎక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ కుమార్ తెలిపారు. -
‘వరల్డ్ వార్ వన్’ విస్మరించిన జర్మనీ
బెర్లిన్ : ‘జర్మనీ జీవించేందుకు మేము చనిపోయాం. జర్మనీ జీవించడంలో మేము బతికుంటాం’ అన్న నినాదం బెర్లిన్లోని కొలంబియాడామ్ శ్మశానంలో నేల కొరిగిన ఓ సైనికుడి విగ్రహం పక్కన రాసి ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ఏడువేల మంది జర్మనీ సైనికులు సంస్మరణార్థం ఈ విగ్రహాన్ని 1925లో అప్పటి జర్మనీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పిడికిలి మాత్రమే బయటకు కనిపించేలా బ్లాంకెట్ కప్పిన అమరసైనికుడి విగ్రహం నెత్తిన టోపీ, పక్కన తుపాకీ ఉన్నట్లుగా చెక్కిన ఈ రాతి విగ్రహం వద్ద మొదట్లో ప్రభుత్వ పెద్దలు, ప్రజలు పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించేవారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి ప్రపంచ యుద్ధం అమర సైనికులను జర్మనీ దాదాపు విస్మరించింది. మొదటి సంవత్సరం యుద్ధం ముగిసి ఆదివారం నాటికి సరిగ్గా వందేళ్లు పూర్తియిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతోపాటు పారిస్లో వివిధ దేశాధినేతల సమక్షంలో భారీ ఎత్తున స్మారక కార్యక్రమాలు జరిగాయి. పారిస్ ఆహ్వానాన్ని అందుకున్నప్పటికీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. దేశంలో కూడా పెద్దగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఒక్క పార్లమెంట్ హాలులో స్మారక ఉపన్యాసంతో మొక్కుబడిగా నూరేళ్ల స్మారక దినాన్ని ముక్తిసరిగా ముగించింది. ఎందుకు? మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన నష్టం కంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కువ నష్టం వాటిల్లడం. మొదటి ప్రపంచ యుద్ధమే రెండో ప్రపంచ యుద్ధానికి కారణం కావడం కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా దేశం రాజరిక వ్యవస్థ నషించి రిపబ్లికన్ వ్యవస్థ ఏర్పడడం, ఆ రిపబ్లికన్ వ్యవస్థ నియంత హిట్లర్, నాజిజిం పుట్టుకకు కారణం అయింది. రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి బెర్లిన్తోపాటు, దేశంలోని పలు ప్రాంతాల్లో స్మారక భవనాలు, మ్యూజియంలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి అతి తక్కువ స్మారక మ్యూజియంలు ఉన్నాయి. కొలంబియాడామ్ శ్మశానంలోని అమర వీరుల సమాధాల వద్దగానీ, వారి స్మారక విగ్రహం వద్దకుగానీ పుష్మ నివాళులర్పించేందుకు ఈ మధ్య ఎవరూ రావడం లేదని స్థానికులు తెలిపారు. 2017లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలినా మార్కెల్ సైనిక స్మారక విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే ఈసారి ఆమె అక్కడికి కూడా పోలేదు. నాటి యుద్ధానికి కారణమైన దేశాల్లో జర్మనీ ఒకటి అవడమే కాకుండా ఆ యుద్ధంలో ఓటమిని అంగీకరించమనే ఆత్మన్యూనతా భావం వల్ల కూడా జర్మనీ నూరేళ్ల కార్యక్రమాన్ని పట్టించుకోక పోవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమం కోసం పలు దేశాలు ఏడాది ముందుగానే చరిత్రకారులతో, ఉన్నతాధికారులతో కమిటీలు వేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం, ప్రపంచంపై దాని ప్రభావం, ఫలితాలు అంశాలపై చరిత్రకారులతో పుస్తకాలు రాయించి ప్రచురించడంతోపాటు తమ దేశాల్లో పలు స్మారక భవనాలను కూడా నిర్మించాయి. సెమినార్లు, సదస్సులను నిర్వహించాయి. -
జర్మనీలో ఘనంగా ‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు
బెర్లిన్: జర్మనీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జర్మనీ రాజధాని బెర్లిన్లో తెలంగాణ జాగృతి జర్మనీ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మహిళలు, పిల్లలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆటపాటలు, కోలాటాలతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. తెలంగాణ సంతతికి చెందిన వారే కాకుండా జర్మనీయులు కూడా పాల్గొని, బతుకమ్మను పేర్చి, తెలంగాణ సంస్కృతిని ఆస్వాదించడం కార్యక్రమంలో గొప్ప విషయం. అనంతరం తెలంగాణ వంటకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జాగృతి సభ్యులు డాక్టర్ స్వర్ణకార చేరుకతోట, ఇంద్రకరణ్ రెడ్డి చరాబ్ది, వెంకటరమన బోయినపల్లి, అనూష కోండూరి, విజయ భాస్కర్ గగల, తదితరులకు తెలంగాణ యూరప్ అధ్యక్షులు దాన్నంనేని సంపత్ కృతజ్ఞతలు తెలిపారు. -
మారథాన్లో కొత్త ప్రపంచ రికార్డు
బెర్లిన్ (జర్మనీ): పురుషుల అథ్లెటిక్స్లో అత్యంత క్లిష్టమైన రేసు మారథాన్లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన బెర్లిన్ మారథాన్లో కెన్యాకు చెందిన 33 ఏళ్ల ఎలియుడ్ కిప్చోగె ఈ ఘనత సాధించాడు. రియో ఒలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన కిప్చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల ఒక నిమిషం 39 సెకన్లలో పూర్తి చేసి... స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2014 బెర్లిన్ మారథాన్లోనే కెన్యాకు చెందిన డెన్నిస్ కిమెట్టో (2గం:02ని.57 సెకన్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిప్చోగె తెరమరుగు చేశాడు. -
హువావే మేట్ 20 లైట్ లాంచ్
చైనా కంపెనీ హువావే తన నూతన స్మార్ట్ఫోన్ మేట్ 20 లైట్ను విడుదల చేసింది. బెర్లిన్లో (ఆగస్టు 31- సెప్టెంబర్ 5) ప్రారంభమైన ఐఎఫ్ఏ 2018 ఈవెంట్లో లాంచ్ చేసింది. అధునాతన ప్రాసెసర్, మొత్తం నాలుగు కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు ఏఐ ఆధారిత క్యూట్ స్పీకర్ను కూడా విడుదల చేసింది. హువావే మేట్ 20 లైట్ ఫీచర్లు 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ హై సిలికాన్ 710 ఎస్ఓసీ ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3650 ఎంఏహెచ్ బ్యాటరీ -
సురేఖ గురి అదిరింది
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో మరో రెండు అంతర్జాతీయ పతకాలను జమ చేసుకుంది. బెర్లిన్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్లో సురేఖ కచ్చితమైన గురితో ఓ రజతం, ఒక కాంస్యం సాధించింది. కాంపౌండ్ టీమ్ విభాగంలో త్రిషా దేబ్, ముస్కాన్ కిరార్లతో కలిసి సురేఖ రజత పతకం సొంతం చేసుకోగా... మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ జతగా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఓవరాల్గా ఈ ఏడాది జరిగిన నాలుగు ప్రపంచకప్ లలో సురేఖ రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించడం విశేషం. బెర్లిన్ (జర్మనీ): వరుసగా నాలుగో ప్రపంచకప్లోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించిన జ్యోతి సురేఖ రెండు పతకాలను కొల్లగొట్టింది. శనివారం జరిగిన ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలో సురేఖ, త్రిషా దేబ్, ముస్కాన్లతో కూడిన భారత మహిళల జట్టు పాయింట్ తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. ఫైనల్లో భారత్ 228–229తో సోఫీ డోడ్మోంట్, అమెలీ సాన్సెనోట్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్ జట్టు చేతిలో పరాజయం పాలై రజత పతకాన్ని దక్కించుకుంది. నాలుగు రౌండ్లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్లో ఒక్కో జట్టు ఆరేసి బాణాలు సంధించాయి. తొలి రౌండ్లో భారత్ 59–57తో పైచేయి సాధించగా... రెండో రౌండ్లో 57–59తో, మూడో రౌండ్లో 53–58తో వెనుకబడిపోయింది. చివరిదైన నాలుగో రౌండ్లో భారత్ 59–55తో ఆధిపత్యం చలాయించినా ఓవరాల్గా ప్రత్యర్థి స్కోరుకు ఒక పాయింట్ దూరంలో ఉండిపోయింది. మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో సురేఖ–అభిషేక్ వర్మ జంట 156–153తో యాసిమ్ బోస్టాన్–డెమిర్ ఎల్మాగాక్లి (టర్కీ) జోడీపై విజయం సాధించింది. నాలుగు రౌండ్లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్లో ఒక్కో జోడీ నాలుగేసి బాణాలు సంధించాయి. తొలి రౌండ్లో 39–40తో వెనుకబడ్డ సురేఖ–అభిషేక్ జంట... రెండో రౌండ్లో 40–36తో... మూడో రౌండ్లో 40–39తో పైచేయి సాధించింది. 119–115తో నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. నాలుగో రౌండ్లో భారత జంట 37–38తో వెనుకబడ్డా ఓవరాల్గా మూడు పాయింట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఇటీవలే ప్రపంచ ర్యాంకింగ్స్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ పదో స్థానానికి చేరుకున్న సురేఖ ఈ సీజన్లో... షాంఘై ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం... అంటాల్యా ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం... సాల్ట్లేక్ సీటీ ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం సాధించింది. -
ఊహించని సంఘటన; అంతా షాక్..!
లూబెక్/బెర్లిన్: బస్సు ప్రయాణంలో అంతా ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉండగా ఒక్కసారిగా హాహాకారాలు మొదలయ్యాయి. సహ ప్రయాణికుడు విచక్షణా రహితంగా కత్తితో తోటి వారిపై దాడి చేసి 14 మందిని గాయపరిచాడు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ ఘటన ఉత్తర జర్మనీలోని లూబెక్ పోర్టు వద్ద శుక్రవారం సాయంత్ర చోటుచేసుకుంది. బాధితుల్లో ఒకరు వెల్లడించిన వివరాలు.. అప్పుడే బయల్దేరిన బస్సు నిర్ధిష్ట వేగంలో ప్రయాణిస్తోంది. సీట్లు నిండుకోవడంతో కాస్త సర్దుకుని ఒక ముసలావిడకి సీటు ఇచ్చాను. అంతలోనే పక్కసీట్లో ఉన్న ఓ వ్యక్తి నా ఛాతీలోకి కత్తి దింపాడని బాధితుడు ఘటనను గుర్తు చేసుకుని వణికిపోయాడు. ఉన్మాదంతో రెచ్చిపోయిన దుండగుడు చూస్తుండగానే చుట్టూ ఉన్నవాళ్లపై కత్తితో విరుచుకు పడ్డాడని వెల్లడించాడు. దాడికి పాల్పడిన వ్యక్తికి ముప్పయేళ్లుంటాయని తెలిపాడు. కాగా, వెంటనే స్పందించిన పోలీసులు దుండగున్నిఅరెస్టు చేసి, జైలుకు తరలించారు. -
జంక్ఫుడ్ ఎందుకు మానలేమో తెలిసిపోయింది..
బెర్లిన్: కడుపు నిండినప్పటికీ కొవ్వు పదార్థాలు, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే జంక్ఫుడ్ను ఎందుకు మానలేకపోతున్నామో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సహజంగా తల్లిపాలల్లో కార్బొహైడేట్లు, కొవ్వు పదార్థాలు అధికస్థాయిలో ఉంటాయి. అదే మోతాదులో బంగాళాదుంపలు, తృణధాన్యాల్లో ఉండటం వల్ల వాటితో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, కేండీ బార్ వంటివి ఎక్కువగా తింటున్నట్లు చెబుతున్నారు. ఈ కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు మెదడు వ్యవస్థను తీవ్రంగా ప్రభావితంగా చేస్తాయంటున్నారు. ‘పిండి పదార్థాలపై మనం ఆసక్తి పెంచుకోవడానికి కారణం బహుశా తల్లిపాలు కావొచ్చు. ఇది కీలకమైనందువల్ల బ్రెయిన్ రివార్డింగ్ సిస్టమ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ సంస్థ పరిశోధన విభాగానికి చెందిన మార్క్ టిట్జెమెయర్ చెప్పారు. దీన్ని నిర్ధారించడానికి కంప్యూటర్ గేమ్స్ ఎక్కువగా ఆడే కొంతమంది వాలంటీర్లపై ప్రయోగం చేశారు. అత్యధిక కార్బొహైడ్రేట్లు, కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను వారికి ఇచ్చారు. ఈ పదార్థాలను తిన్న తర్వాత కంప్యూటర్ గేమ్ ఆడే సమయంలో ఇతరులతో పోలిస్తే వీరి బ్రెయిన్ రివార్డింగ్ వ్యవస్థ చురుగ్గా పనిచేయడాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే జంక్ఫుడ్ మానలేని బలహీనతకు కారణం వీరు కనుగొన్నారు. -
ఈ ఇల్లు చూస్తే సూపర్ అంటారు!
‘జీవితంలో ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’.. అంటుంటారు పెద్దలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే అంత కష్టం మరీ. ఇక హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అయితే కత్తి మీద సామే. కేవలం స్థలం కొనాలంటేనే కోట్లు కావాలి. ఈ సమస్య ఒక హైదరాబాద్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ విషయాన్నే గ్రహించిన ఓ ఆర్కిటెక్ట్ ఓ వినూత్నఇళ్లు డిజైన్కు శ్రీకారం చుట్టారు. 90 చదరపు మీటర్లోనే పూర్తయ్యే ఈ ఇంటికి కేవలం 30వేల యూఎస్ డాలర్లు(రూ. 22లక్షలు) ఖర్చవుతుందట! ఒకే గదిలా ఉండే ఈ ఇంటిలో కిచన్, బెడ్ రూం, వాష్రూమ్ వంటి సకల వసతులున్నాయి. ఒకే గదిలో ఇవన్నీ ఎలా సాధ్యం అనుకుంటాన్నారే ఇక్కడే ఉంది ట్విస్ట్. బెడ్ను మడత బెట్టినట్టు కిచన్, బెడ్రూమ్, వాష్రూమ్లను మడతబెట్టుకోవచ్చు. అవసరమైన వాటిని వాడుకొని, మిగతావీ మూసేయడమే. అంతే కాదండోయ్ ట్రక్కులా ఉండే ఈ ఇల్లును ఏ ప్రాంతానికైనా సులభంగా తరలించవచ్చు. ఈ వినూత్న ఆలోచనను లియోనార్డో డి చియారా అనే ఆర్కిటెక్ట్ టినీ హౌజ్ యూనివర్సిటీ సహకారంతో రూపొందించారు. దీనికి అవాయిడ్ అని నామకరణం చేశారు. ఈ డిజైన్కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. తన చిన్నప్పుడు తల్లితండ్రులతో కలిసి చిన్న ఇంటిలో నివసించిన అనుభవమే ఈ ఆలోచనను తట్టేలా చేసిందని లియోనార్డో చెప్పుకొచ్చారు. ఈ ప్రస్తుత డిజైన్ బెర్లిన్లోని బహస్-ఆర్కివ్ మ్యూజియం గార్డెన్లో ఉందని, మరిన్నీ సూచనలతో మరింత మెరుగుపరుస్తానని తెలిపారు. -
పురుషులు ఇంట్లో.. మహిళలు పనుల్లో
బెర్లిన్: ఇప్పుడైతే పురుషులు, మహిళలు ఉద్యోగరీత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు ఉద్యోగరీత్యా పురుషులే వలస జీవులుగా మారేవారు. అయితే ఇదంతా ఇప్పటి మాట. ఈ రెండింటిలా కాకుండా రాతియుగం చివర్లో, శిలాయుగం మొదట్లో మహిళలే ఇంటి బాధ్యతలు, సమాజ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆ కాలంలో యూరప్లోని మహిళలు తాము ఉన్న ప్రాంతాల నుంచి వలస వెళ్లి కుటుంబాలను ఏర్పాటు చేయటం, సంస్కృతి, ఆలోచనలు, విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం వంటివి చేశారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇదే సమయంలో పురుషులు మాత్రం ఇంటికే పరిమితమయ్యేవారని అధ్యయనంలో బయటపడింది. రాతియుగం చివరల్లో శిలా యుగం మొదట్లో జర్మనీలో ఆశ్చర్యకరంగా కుటుంబాల ఏర్పాటు జరిగిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ సమయంలో పురుషులు తాము పుట్టిన ఊరులోనే ఉండగా.. మహిళల్లో ఎక్కువ శాతం మంది బొహేమియా, సెంట్రల్ జర్మనీ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలిపారు. అయితే క్రీ.పూ.2500–1650 మధ్య కాలంలో ఇలా వలస వచ్చిన మహిళలను ఖననం చేసిన ప్రదేశంలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఇలా వలస వచ్చిన మహిళలు చనిపోయే నాటికి స్థానిక సమాజంలో కలిసిపోయారని వారు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
పారాఅథ్లెట్తో బిచ్చమెత్తించారు..
న్యూఢిల్లీ: శారీరక లోపాలతో సతమతమవుతున్నా వెరవక కష్టించి.. ఏదో సాధించి దేశం పేరు మార్మొగేలా చేయాలని తపన పడుతున్న ఓ పారాఅథ్లెట్కు తీవ్ర అవమానం జరిగింది. దృష్టిలోపం గల కాంచనమాల పాండే ఈ నెల 3 నుంచి 9 వరకూ జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్లో పాల్గొని వెండి పతకం సాధించారు. అయితే, చాంపియన్షిప్లో పాల్గొంటున్న సమయంలో ఖర్చులకు డబ్బు లేకపోవడంతో ఆమె బిచ్చమెత్తినట్లు రిపోర్టులు వచ్చాయి. కాంచనమాల పాండే ఇంటర్వూ తీసుకున్న మెయిల్ టుడే.. టూర్లో ఆమెకు జరిగిన అవమానాన్ని వెలుగులోకి తెచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు రూ.5 లక్షలు లోన్ తీసుకున్నట్లు కాంచనమాల మెయిల్ టుడేకు వెల్లడించారు. టోర్నమెంట్ ముగిసేనాటికి తాను రూ.1,10,000/- హోటల్ బిల్లు చెల్లించాల్సివుందని చెప్పారు. తాను ఖర్చు చేసిన డబ్బు రీయింబర్స్మెంట్ రూపంలో వెనక్కు వస్తుందో? రాదో కూడా అధికారికంగా సమాచారం లేదని వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జరిగిన పారా అథ్లెటిక్ స్విమ్మింగ్ చాంపియన్షిప్కు భారత్ నుంచి ఎంపికైన ఏకైక స్విమ్మర్ కాంచనమాల పాండేనే. కాంచనమాలకు ఈ గతి పట్టడానికి కారణం భారత పారాలింపిక్ కమిటి(పీసీఐ)యే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టూర్కు బయల్దేరే ముందు ఆర్థిక సాయం కోసం కాంచనమాల పెట్టుకున్న అభ్యర్ధనను పీసీఐ పట్టించుకోలేదు. ఈ ఘటనపై టాప్ చైర్మన్ అభినవ్ బింద్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు ట్వీట్ చేశారు. బింద్రా ట్వీట్కు వెంటనే సమాధానం ఇచ్చిన గోయల్.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
‘ఉగ్ర’పోరును ముందుండి నడపాలి
యూరప్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు ► టెర్రరిజంతో ఎక్కువగా నష్టపోతుంది ఆ దేశాలే ► జర్మన్ పత్రికకు మోదీ ఇంటర్వ్యూ బెర్లిన్: విశ్వ మానవాళికి ఉగ్రవాదం పెను సవాల్గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జరుగుతున్న ఉగ్రవాదంపై పోరులో ఐరోపా దేశాలు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన కోరారు. నాలుగు దేశాల పర్యటన సందర్భంగా సోమవారం బెర్లిన్ చేరుకున్న ప్రధాని జర్మన్ ప్రధాన పత్రిక ‘హ్యాడెల్స్బ్లాట్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐరోపా దేశాలే ఉగ్రవాదం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయని ఈ ఇంటర్వూ్యలో మోదీ తెలిపారు. ఇటీవలి కాలంలో జర్మనీ, ఫ్రాన్స్, యూకే, స్వీడన్ దేశాల్లో ఉగ్రదాడుల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాజాగా మాంచెస్టర్ (యూకే)లో జరిగిన ఉగ్రదాడిలో 22 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ‘మా దృష్టిలో ఉగ్రవాదం మానవాళికి పెనుముప్పుగా మారింది. దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఐరోపా దేశాలు.. ఉగ్రవాదంపై పోరును ముందుండి నడిపించాలి’ అని ప్రధాని పేర్కొన్నారు. వ్యాపారంలో రక్షణాత్మకచర్యలపైనా నిక్కచ్చిగా మాట్లాడారు. ‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంరక్షణాత్మక వ్యాపార ధోరణి, వలసవాద వ్యతిరేక సెంటిమెంట్లు మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పర్యటనలో వీటిపై చర్చ జరిగి, పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహం స్వేచ్ఛగా సాగేలా ఐరోపా దేశాలు చొరవతీసుకోవాలని మోదీ సూచించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు: ⇒ మనమంతా పరస్పర అనుసంధాన ప్రపంచంలో జీవిస్తున్నాం. అన్ని దేశాల మధ్య వస్తువులు, పెట్టుబడుల మార్పిడితోపాటు ప్రజల వలసలు సాగితేనే సంయుక్తంగా అభివృద్ధి సాధించగలం. ప్రపంచీకరణ లాభాలను అప్పుడే అందుకోగలం. ⇒ ప్రపంచంలో అత్యంతవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలైన భారత్, జర్మనీ దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నాయి. ⇒ భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్వచ్ఛభారత్, స్మార్ట్సిటీస్ వంటి పథకాల్లో జర్మనీ కీలకమైన భాగస్వామి. ⇒ ప్రస్తుత వాస్తవ ప్రపంచానికి అనుగుణంగా సంస్కరణాత్మకమైన సంస్థలు ఏర్పడాలి. ⇒ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణలు రావాలని చాలాకాలంగా కోరుతున్నాం. ఈ మార్పులు వీలైనంత త్వరగా రావాల్సిన అవసరం ఉంది. ⇒ అంతర్జాతీయంగా యూరోపియన్ యూనియన్ పాత్ర కీలకం. ప్రపంచాభివృద్ధి, శాంతి, భద్రతల విషయంలో ఈయూ స్థిరత్వం చాలా కీలకం. ⇒ యూకే, యూరోపియన్ యూనియన్లతో బహుముఖ రంగాల్లో బలమైన బంధాలను మేం గౌరవిస్తాం. వీటిని ఇలాగే కొనసాగిస్తాం. జర్మనీ చేరుకున్న మోదీ నాలుగు దేశాల పర్యటన నిమిత్తం మోదీ సోమవారం జర్మనీ చేరుకున్నారు. మంగళవారం జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్తో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలు, శాస్త్ర సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, రైల్వేలు, పౌర విమానయానం, అభివృద్ధిలో సహకారం, ఆరోగ్యం, వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారత్– ఈయూ సంబంధాలు, దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితులు, చైనా ప్రతిపాదించిన ఓబీఓఆర్, సవాల్ విసురుతున్న ఉగ్రవాదం వంటి అంశాలపైనే మోదీ జర్మనీ పర్యటనలో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్తో సమావేశం అనంతరం మంగళవారం సాయంత్రం స్పెయిన్కు మోదీ బయలుదేరనున్నారు. -
బెర్లిన్ బర్నింగ్
-
జర్మనీలో ట్రక్కు బీభత్సం
• బెర్లిన్లో క్రిస్మస్ మార్కెట్లోకి దూసుకుపోయిన ట్రక్కు • 12 మంది మృతి, 50 మందికి గాయాలు బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ షాపింగ్ సందడితో రద్దీగా ఉన్న మార్కెట్లోకి ట్రక్ దూసుకుపోవడంతో 12 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. బెర్లిన్లోని కైజర్ విల్హెల్మ్ మొమోరియల్ చర్చ్ ముందు మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మార్కెట్లో దాదాపు 80 మీటర్ల దూరం జనాల్ని చిదిమేస్తూ, షాపుల్ని కూల్చుకుంటూ ట్రక్కు దూసుకుపోయింది. ఈ సమయంలో డ్రైవర్ క్యాబిన్లో ఇద్దరు యువకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ట్రక్కు ఆగగానే డ్రైవర్ దూకి పారిపోయాడని, క్యాబిన్లో ఒక పోలిష్ జాతీయుడి మృతదేహం లభించిందని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో పాక్కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు కారకుడైన వ్యక్తి పేరు నవీద్ (23) అని, అతను ఏడాది క్రితం జర్మనీలో శరణార్థిగా పేరు నమోదు చేసుకున్నట్లు అధికారులను ఉటంకిస్తూ స్థానిక బిల్డ్ పత్రిక వెల్లడించింది. ఘటనకు కారణమైన పోలీష్ రవాణా సంస్థకు చెందిన ట్రక్కును నిందితుడు దొంగిలించి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సంఘటన జరగడానికి నాలుగు గంటల ముందునుంచి ట్రక్కు ఆచూకీ తెలియలేదని సంబంధిత కంపెనీ వెల్లడించింది. చివరిసారిగా డ్రైవర్తో మాట్లాడినప్పుడు తాము బెర్లిన్లో ఉన్నామని, సోమవారం ఉదయం సరుకు అన్లోడ్ చేస్తామని చెప్పినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్నవారు తమ డ్రైవర్ను ఏదో చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి జర్మన్ పోలీస్ అధికార ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ పాక్ నుంచి శరణార్థిగా వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతనే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించలేదన్నారు. -
అసలు నిందితుడు అతడు కాదు!
బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్లో ట్రక్కుతో విధ్వంసం సృష్టించిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేశామని అక్కడి భద్రతా బలగాలు తెలిపాయి. దుండగుడు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వ్యక్తి అని అధికారులు వెల్లడించారు. అయితే.. తాము పొరపాటున వేరే వ్యక్తిని అరెస్ట్ చేశామని.. ట్రక్కు దాడికి పాల్పడింది అతడు కాదని బెర్లిన్ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. అసలు నిందితుడు వేరే ఉన్నాడని.. అతడి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఇంకా పట్టుబడని దుండగుడి వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్నాయని.. విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో అక్కడ తీవ్ర కలకలం రేగుతోంది. సోమవారం ట్రక్కు దాడిలో.. సెంట్రల్ బెర్లిన్లోని క్రిస్మస్ మార్కెట్లో ప్రజలను లక్ష్యంగా దుండగుడు ట్రక్కుతో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా జనంపైకి ట్రక్కును తోలుతూ.. మారణహోమానికి దిగాడు. ఈ ఘటనలో 12 మంది చెందగా, 50 మంది గాయపడ్డారు. -
ఆ బీభత్సానికి పాల్పడింది పాకిస్థానీనే!
బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్లో ట్రక్కుతో బీభత్సం సృష్టించి 12మందిని పొట్టనబెట్టుకున్న దుర్మార్గుడు పాకిస్థానీ జాతీయుడని తేలింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సెంట్రల్ బెర్లిన్లోని ఓ మార్కెట్లో క్రిస్మస్ పండుగ షాపింగ్లో మునిగితేలిన ప్రజలు లక్ష్యంగా అతను ట్రక్కుతో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా జనంపైకి ట్రక్కును తోలుతూ.. మారణహోమానికి దిగాడు. ఈ ఘటనలో 12 మంది చెందగా, 50 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్రిస్మస్ పండుగ వేళ బెర్లిన్లో విషాదం నింపిన ఈ ఘటనకు పాల్పడింది పాకిస్థాన్ నుంచి వలసవచ్చిన 23 ఏళ్ల వ్యక్తి అని జర్మనీ భద్రతాధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలో అతను బెర్లిన్ వచ్చాడని, స్థానికంగా ఉన్న శరణార్థుల హోటల్లో నివసిస్తున్న అతను గతంలో చిన్నచిన్న నేరాలకు పాల్పడ్డాడని, పోలీసులకు అతను తెలుసని చెప్పారు. -
క్రిస్మస్ మార్కెట్లో ట్రక్కు బీభత్సం
-
యువతిపై గ్యాంగ్ షాకింగ్ అటాక్..!
-
బెర్లిన్లో ఐఎఫ్ఏ మెగా ఎలక్ట్రానిక్స్ షో
-
జర్మనీలో మళ్లీ కాల్పుల కలకలం!
జర్మనీలో ఉగ్రభూతం కోరలు చాస్తోంది. మ్యూనిక్ షాపింగ్ మాల్ దాడి మరువక ముందే జర్మనీ రాజధాని బెర్లిన్ కు దగ్గరలోని ఓ ఆస్పత్రిలో దుండగులు కాల్పులకు పాల్పడటం కలకలం రేపింది. బెర్లిన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఓ సాయుధుడైన దుండగుడు అక్కడి వైద్యుడిపై కాల్పులు జరిపి, అనంతరం తనను తాను తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రంగంలోకి దిగిన స్పెషల్ పోలీసు బలగాలు ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జర్మనీలో మరో ఉగ్రదాడి
బెర్లిన్: జర్మనీలో మరోసారి ఉగ్రదాడి కలకలం సృష్టించింది. బెర్లిన్లో సిరియా శరణార్థి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి(27) మృతి చెందాడు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ బార్ ప్రాంగణంలో జరుగుతున్న పాప్ మ్యూజిక్ ఫెస్టివల్ను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్న 2,500 మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దక్షిణ జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడో దాడి ఇది. ఈ దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని జర్మనీ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిథి మైఖెల్ సిఫెనర్ వెల్లడించారు. మ్యూనిక్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. రైలులో ప్రయాణికులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసిన ఘటనలో పలువురు గాయపడిన ఘటనలు ఇటీవల జర్మనీలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. -
జర్మనీ పర్యటనకు వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం రాత్రి జర్మనీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం జర్మనీలో జరిగే వంద స్మార్ట్ సిటీ మిషన్ సదస్సులో పాల్గొంటారు. జర్మనీ పర్యావరణ, భవనాల మంత్రి బార్బరా హెండ్రిక్స్ తో కలిసి వెంకయ్య మెట్రోపాలిటిన్ సొల్యూషన్ ఫెయిర్-2016ను సందర్శిస్తారు. ఆ తర్వాత పట్టణాభివృద్ధి, ప్రాదేశిక అభివృద్ధిలపై అక్కడి అధికారులతో సమావేశమవుతారు. కాగా భారత్లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం చేస్తామని జర్మనీ ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూరు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం అందించనుంది. ఇక ఈ పర్యటనలోనే కేంద్రమంత్రి వెంకయ్య పట్టణాభివృద్ధి, ప్రాదేశిక అభివృద్ధిలపై అక్కడి అధికారులతో భేటీ అవుతారు. అలాగే భారత్లో వంద ఆకర్షణీయ నగరాల నిర్మాణం గురించి వివరించి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. జర్మనీలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి ఉపయోగిస్తున్న సాంకేతికత, ఇతర పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు. బుధవారం బెర్లిన్లోని ట్రాఫిక్ నిర్వహణ కేంద్రాన్ని వెంకయ్య సందర్శిస్తారు. బెర్లిన్లో రవాణా వ్యవస్థ డిజిటలైజేషన్పై చర్చించనున్నారు. అలాగే గురువారం ఉదయం జర్మనీ పార్లమెంటు భవనాన్ని సందర్శించి స్పీకర్తో భేటీ అవుతారు. పార్లమెంటు ఉపాధ్యక్షురాలు ఉల్లా ష్మిత్, ఇండోజర్మన్ పార్లమెంటరీ బృందంతో సమావేశమవుతారు. తిరిగి వెంకయ్య శుక్రవారం ఉదయం భారత్కు చేరుకుంటారు. -
మొసాక్ ఫోన్సెకా గూఢచర్యం
బెర్లిన్: మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనానికి సృష్టించిన పనామా పేపర్ల లీక్ వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.వందమందికి పైగా సభ్యులుగా ఉన్న పరిశోధనాత్మక పాత్రికేయుల అంతర్జాతీయ కూటమి(ఐసీఐజే) పనామా కేంద్రంగా పనిచేస్తున్న పనామా పేపర్స్ మరో విషయాన్ని తేట తెల్లం చేసింది. మొసాక్ ఫోన్సికా వివిధదేశాల్లోని ప్రస్తుత, మాజీ ఉన్నత స్థాయి అధికారుల సేవలను ఏజెంట్లుగా వినియోగించుకున్నట్టు ఒక జర్మన్ వార్తాపత్రిక తెలిపింది. అనేక దేశాల గూఢచారులను మొసాకా విస్తృతంగా ఉపయోగించినట్టు మ్యూనిచ్ ఆధారిత వార్తాపత్రిక వెల్లడించింది. దాదాపు మూడు దేశాలకు చెందిన సీక్రెట్ ఏజెన్సీ అధికారులను వాడుకున్నట్టు తెలిపింది. సౌది అరేబియా, కొలంబియా, రువాండా లాంటి దేశాల అత్యున్నత అధికారులను తమ రహస్య సేవలకు వినియోగించుకున్నట్టు ఈ కథనంలో పేర్కొంది. అనేక దేశాలలో,సీఐఎ వారి మధ్యవర్తుల సహాయంతో పనిచేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా 1990 లో మరణించిన సౌది ఇంటిలిజెన్స చీఫ్ షేక్ కమల్ అదాం 1970 లలో ఫోన్సెకా కు బాగా సహకరించినట్టు తెలిపింది. వివిధ సీక్రెట్ ఏజెంట్లు, వారి ఇన్ ఫార్మర్ల సేవలను సంస్థ వినియోగించుకున్నట్టు తెలిపింది. కాగా ఈ పనామా పేపర్స్ వెల్లడించిన అంశాలతో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయంగా పెను దుమారాన్ని రాజేసింది. విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచంలోనే ధనిక, శక్తివంతమైన పలు రాజకీయ నేతల జాబితాను ప్రకటించింది. దీంతో ఐస్ లాండ్ ప్రధాని రాజీనామా చేసిన సంగతి తెలిసింది. -
జర్మనీల మధ్య గోడ కూలింది...
ఆ నేడు 1990 అక్టోబర్ 3 బెర్లిన్ గోడ కూలింది. తూర్పు, పశ్చిమ జర్మనీలు ఒకటయ్యాయి. దాంతో 45 ఏళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న రెండు జర్మనీలు కలసిపోయి ఐక్యజర్మనీ పునరావిర్భవించినట్లయింది. నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, సోవియట్ నాయకుడు మిహాయిల్ గోర్బచెవ్ల చొరవతో ఈ పరిణామం సంభవించింది. తూర్పు, పశ్చిమ జర్మనీలకు రాజధానులుగా ఉన్న బెర్లిన్, బాన్లు తిరిగి స్వతంత్ర నగరాలయ్యాయి. రెండు జర్మనీలకు మధ్య అడ్డుగా ఎంతో పటిష్టంగా నిర్మించి ఉన్న బెర్లిన్ గోడను కూలగొట్టడానికి కొన్ని నెలలు పట్టిందంటే అతిశయోక్తి కాదు! మొత్తం మీద దీనినొక ప్రజాస్వామిక విజయంగా వర్ణించవచ్చు. -
మనిషిని చంపిన రోబో!
బెర్లిన్: రోబోలు మనుషులను చంపడం ఇప్పటిదాకా సినిమాల్లోనే చూశాం. కానీ జర్మనీలో ఫోక్స్వ్యాగన్ కంపెనీకి చెందిన కార్ల తయారీ ఫ్యాక్టరీలో ఓ రోబో నిజంగానే మనిషిని చంపేసింది! కార్మికుడిని దగ్గరికి లాక్కుని, ఓ లోహపు పలకపై వేసి ఛాతీపై నొక్కుతూ నలిపేసింది! ఫ్రాంక్ఫర్ట్కు 100 కి.మీ. దూరంలోని బౌనతల్ వద్ద గల ఫోక్స్వ్యాగన్ ఫ్యాక్టరీలో మంగళవారం రోబోను కార్మికులు సిద్ధం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఉదంతంలో తీవ్రంగా గాయపడిన 21 ఏళ్ల కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే, ఇది సినిమాల్లో చూసినట్టు మనిషి రూపంలో ఉండే హ్యూమనాయిడ్ రోబో కాదు. జేసీబీలా ఉండే రోబోటిక్ యంత్రం. సాధారణంగా యంత్రాలను జోడించే చోటు(అసెంబ్లీ లైన్) వద్ద ఈ రోబోలు మనుషులకు పక్కపక్కనే ఉంటూ పనిచేస్తాయని, తర్వాత సేఫ్టీ బోన్లలోకి వెళతాయని స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ప్రమాదానికి కారణమైన రోబో కొత్తతరం రోబో కాదని, దానిని ఇన్స్టాల్ చేసేందుకని ఓ కార్మికుడు సేఫ్టీ బోను లోపలికి వెళ్లడంతో అతడిని చంపేసినట్లు తెలిపింది. దీనిపై ఫోక్స్వ్యాగన్ వర్గాలు స్పందిస్తూ.. ఇందులో రోబో వైఫల్యం లేదని, మానవ తప్పిదం వల్లే ఇలా జరిగిందని తెలిపాయి. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. -
డూమ్స్డే అపార్ట్మెంట్లు!
బెర్లిన్: రిచ్ రెస్టారెంట్లు, పబ్లు, బార్లు, కాసినోలు, మల్టీప్లెక్స్లు, ఈత కొలనులు, క్రీడా ప్రాంగణం లాంటి సకల సౌకర్యాలు కలిగిన, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అపార్టుమెంట్లను కాలిఫోర్నియాకు చెందిన వివోస్ కంపెనీ జర్మనీలోని రోతెన్స్టీన్ గ్రామంలో నిర్మిస్తోంది. అణు బాంబు పేలుళ్లు, ప్రమాదకరమైన రసాయనాలను, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాల లాంటి ప్రకృతి ప్రళయాలను సైతం తట్టుకొని ఈ అపార్టుమెంట్లు చెక్కు చెదరకుండా నిలవగలవని, ప్రజల ప్రాణాలకు ఎల్లవేళలా పూర్తి పూచికత్తును ఇవ్వగలవని ఈ అపార్టుమెంట్లను నిర్మిస్తున్న వివోస్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో రాబర్ట్ విసినో చెబుతున్నారు. ఎందుకంటే వీటిని అండర్ గ్రౌండ్లో నిర్మిస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అప్పటి సోవియట్ యూనియన్ నిర్మించిన అండర్ గ్రౌండ్ టన్నెళ్లను విస్తరించి 76 ఎకరాల స్థలంలో ఈ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నామని, ఇందులో ఒక్కో ఫ్లాట్ 2500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని, వీటిని కొనుగోలు చేసే వ్యక్తుల అభిరుచులనుబట్టి ఫ్లాట్లో అంతర్గత మార్పులు చేసుకునే సౌకర్యం కూడా ఉందని రాబర్ట్ ఫోర్బ్స్ మ్యాగజైన్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వీటిని ‘డూమ్స్డే ఎస్కేప్’ అపార్ట్మెంట్లుగా పిలుస్తున్నారు. ఇందులోని నివాసితుల అవసరాలకు తగినంత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వాటర్ రీసైక్టింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. దాదాపు ఆరువేల మంది నివసించే సామర్థ్యంగల ఈ అపార్ట్మెంట్ల ఆవాసుల ఆవసరార్థం భూ ఉపరితలంపైనా ఓ ప్రత్యేక ఏర్పాటును ఏర్పాటు నిర్మిస్తున్నామని, చిన్న హెలీ కాప్టర్ల సౌకర్యం కూడా ఉంటుందని, సమీపంలోని రైల్వే స్టేషన్లకు బస్ సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మొత్తం అపార్ట్మెంట్ల విలువ 67 వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పిన రాబర్ట్ ఒక్కో ప్లాట్ ఎంత ఖరీదు చేస్తుందో మాత్రం వెల్లడించడానికి నిరాకరించారు. ప్రకృతి విలయాలను, మానవ తప్పిదాల వల్ల కలిగే సకల ముప్పుల నుంచి మనుషులను రక్షించే భూగర్భ ఇళ్లను నిర్మించాలనే ఆలోచన తనకు 1980లో వచ్చిందని, అయితే అది ఎందుకు వచ్చిందో మాత్రం తెలియదని ఆయన చెప్పారు. ‘మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎటు నుంచి ప్రళయం ముంచుకొస్తుందో తెలియదు. అందుకని ఇలాంటి భూగర్భ అపార్ట్మెంట్లు ఎంతైన అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ఇందులో నివసించేవారికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు సరిపోయే ఆహారం అందుబాటులో ఉంటుంది’ అని ఆయన వివరించారు. ఒక్కో ఫ్లాట్ ఖరీదు ఎంతో ఆయన వెల్లడించనప్పటికీ అపర కుభేరులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందన్నది సుస్పష్టం. -
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
-
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
భారత్, జర్మనీ ప్రతిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలపై ఒత్తిడి తేవాలి అలాంటి దేశాలను ఒంటరి చేయాలి బెర్లిన్లో మోదీ వ్యాఖ్యలు మెర్కెల్తో ద్వైపాక్షిక చర్చలు బెర్లిన్: పాకిస్తాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద అనుకూల వైఖరిని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాలే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం కలసికట్టుగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అణ్వాయుధ వ్యాప్తి ఎంత ప్రమాదకరమో.. ఉగ్రవాదమూ అంతే ప్రమాదకరమన్నారు. అణ్వాయుధ వ్యాప్తిపై మాదిరే ఉగ్రవాదంపైనా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఐక్యరాజ్య సమితిలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం(కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టైజం-సీసీఐటీ)’పై ఒక నిర్ణయానికి రావాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచదేశాల పరస్పర సహకారాన్ని మరింత దృఢతరం చేయడమే చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న సీసీఐటీ ప్రధాన లక్ష్యం. జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్తో ఉగ్రవాదం తదితర అంశాలపై ద్వైపాక్షిక చర్చల అనంతరం.. ఇరువురు నేతలు మంగళవారం బెర్లిన్లో సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. శాశ్వత సభ్యత్వంతోనే భారత్కు న్యాయం ప్రపంచ శాంతికి ఎంతో కృషి చేసిన భారత్కు ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించడంలో జరిగిన జాప్యాన్ని మోదీ ప్రశ్నించారు. ఐరాస ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ‘బుద్ధుడు, మహాత్మాగాంధీ జన్మించిన నేల.. శాంతి తమ డీఎన్ఏలోనే ఉన్న దేశం.. శాశ్వత సభ్యత్వంకోసం 70 ఏళ్లుగా ఎందుకు ఎదురుచూడాల్సి వస్తోంది? మండలిలో శాశ్వత సభ్యత్వమిచ్చి భారత్కు న్యాయం చేయాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. ‘మొదటి ప్రపంచ యుద్ధంపై ఎలాంటి ఆసక్తి లేకుండానే.. ఆ యుద్ధంలో 14 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు.. 75 వేల మంది అమరులయ్యారు’ అని గుర్తుచేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత శాంతి పరిరక్షక దళం అందించిన సేవలు అనేక దేశాల ప్రశంసలందుకున్నాయన్నారు. భారత్, జర్మనీలు భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాలు కావాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ‘ఉగ్ర’ దేశాలను కట్టడిచేయాలి ‘ఉగ్రవాదం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం. మానవత్వంపై నమ్మకమున్న ప్రతీ ఒక్కరు ముక్తకంఠంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి. ఆ మహమ్మారిపై పోరులో సహకరించాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదులకు ఆయుధాలు అందిస్తున్నవారిని కట్టడి చేయడమెలాగో.. ఉగ్రవాదులకు ప్రభుత్వాలే ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై ఒత్తిడి తేవడమెలాగో అందరం కలిసి ఆలోచించాల్సి ఉంది. అలాంటి దేశాలను ఒంటరి చేయాల్సిన అవసరముంది’ అని అన్నారు. ఇటీవల ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని పాకిస్తాన్ కోర్టు విడుదల చేసిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అనంతరం ఎంజెలా మెర్కెల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్, జర్మనీలు అంగీకరించాయన్నారు. మెర్కెల్కు మోదీ గిఫ్ట్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత సర్ సీవీ రామన్కు చెందిన రాతప్రతులు, ఇతర పత్రాలను మళ్లీ రూపొందించి జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్కు మోదీ బహుమతిగా ఇచ్చారు. అనంతరం ‘రామన్ ఎఫెక్ట్, రామన్ స్పెక్ట్రమ్ పదాలను సృష్టించింది జర్మన్ శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ ప్రింగ్శీమ్. నోబెల్ పురస్కారానికి రామన్ను నామినేట్ చేసింది జర్మన్ శాస్త్రవేత్తలే. జర్మనీతో సర్ రామన్కు అంత అనుబంధం ఉంది. జర్మనీ చాన్సెలర్ మెర్కెల్ కూడా క్వాంటమ్ కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించారు’ అని మోదీ ట్వీట్ చేశారు. మోదీ విమానంలో సాంకేతిక సమస్య న్యూఢిల్లీ: మూడు దేశాల పర్యటనకు మోదీని తీసుకువెళ్లిన ‘ఎయిర్ ఇండియా వన్’ బోయింగ్ విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ నుంచి బయల్దేరి పారిస్, తౌలౌజ్, హనోవర్లలో ఆగి.. అనంతరం బెర్లిన్కు మోదీ ఈ విమానంలోనే వెళ్లారు. అనంతరం అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబై నుంచి మరో ఎయిర్ ఇండియా వన్’ మంగళవారం తెల్లవారు జామున బెర్లిన్ బయల్దేరి వెళ్లింది. కాగా, బుధవారం నుంచి మూడ్రోజులపాటు మోదీ కెనడాలో పర్యటించనున్నారు. ప్రధానితో నేతాజీ మనవడి భేటీ నేతాజీ కుటుంబంపై నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టిందన్న వివాదం నేపథ్యంలో ఆయన సోదరి మనవడు సూర్యకుమార్ బోస్ సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బెర్లిన్లోని భారత రాయబార కార్యాలయంలో సూర్యకుమార్ మోదీతో భేటీ అయ్యారు. నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బయటపెట్టాలని, నిజాలు వెలుగుచూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. దీనికి ప్రధాని కూడా సానుకూలంగా స్పందించినట్లు సూర్య తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని, ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరముందని మోదీ వ్యాఖ్యానించినట్లు చెప్పారు. మోదీ గౌరవార్థం జర్మనీలోని భారత రాయబారి విజయ్ గోఖలే ఇచ్చిన విందులో ఇండో-జర్మన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సూర్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానితో సమావేశమయ్యారు. కాగా, దీనిపై ప్రధాని కార్యాలయం స్పందిస్తూ.. విదేశాలతో సంబంధాలను దృష్టిలో ఉంచుకొని నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బయటపెట్టడానికి వీల్లేదని పేర్కొంది. ప్రకృతి రక్షణలో మాకే పాఠాలా!?: మోదీ గ్లోబల్ వార్మింగ్పై భారత్ను తప్పుబడుతున్న అభివృద్ధి చెందిన దేశాలపై ప్రధానమంత్రి మోదీ విరుచుకుపడ్డారు. తలసరి కాలుష్య ఉద్గారాల స్థాయి ప్రపంచంలోనే అత్యంత కనిష్టంగా ఉన్నప్పటికీ.. గ్లోబల్ వార్మింగ్ విషయంలో భారత్ను వేలెత్తి చూపడాన్ని తప్పుపట్టారు. సెప్టెంబర్లో ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరగనున్న అంతర్జాతీయ వాతావరణ మార్పు సదస్సు ఎజెండాను భారతే రూపొందిస్తుందని స్పష్టం చేశారు. జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ భారత సంప్రదాయంలోనే ఉందని పునరుద్ఘాటించారు. ‘పర్యావరణాన్ని నాశనం చేసినవారే.. మనల్ని ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ప్రకృతిని నాశనం చేసింది మీరేనని వారికి స్పష్టం చేద్దాం. ప్రకృతికి సేవ చేసినవారెవరైనా ఉన్నారంటే వారు భారతీయులే అని చెబుదాం’ అని తేల్చి చెప్పారు. భారతీయులు నదులను నదీమ తల్లులుగా భావిస్తారని, వృక్షాలను పూజిస్తారన్నారు. -
ప్రధాని కోసం వెళ్లిన మరో విమానం
న్యూఢిల్లీ: మూడు దేశాల పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోదీని తీసుకువెళ్లిన 'ఎయిర్ ఇండియా వన్' బోయింగ్ 747-400 విమానం ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మోదీ ఆ విమానంలో న్యూఢిల్లీ నుంచి బయలుదేరి పారిస్, తౌలౌజ్, హనోవర్లలో ఆగి, అనంతరం బెర్లిన్కు వెళ్లారు. ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబైలో సిద్ధంగా ఉన్న మరో 'ఎయిర్ ఇండియా వన్' మంగళవారం తెల్లవారు జామున బెర్లిన్ బయల్దేరి వెళ్లింది. మోదీ తన మిగతా పర్యటనను ఇందులోనే ముగించి, భారత్కు తిరిగివస్తారు. ఈ నెల 9న పారిస్ వెళ్లిన ప్రధాని మోదీ 18 ఉదయం తిరిగి ఇక్కడికి వాస్తారు. -
పైసా ఖర్చు పెట్టలేదు... అయినా ప్రపంచమంతా తిరిగారు!
ప్రపంచం చుట్టేయాలని ఎవరికి మాత్రం ఉండదు? మిలన్, ఎలిమజ్ అనే మిత్రులు కూడా అచ్చం అలాగే అనుకున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఇదే మాసంలో ఈ ఇద్దరు బెర్లిన్లో కలుసుకున్నారు. వారి తొలి పరిచయమే గాఢ స్నేహంగా మారింది. ఇద్దరికీ పర్యటన అంటే ఎంతో ఇష్టం. అందుకే ‘‘ఇద్దరం కలిసి ప్రపంచమంతా పర్యటిద్దాం’’ అని బలంగా అనుకున్నారు. అనుకున్నంత మాత్రాన... అన్నీ జరగవు కదా! ఎందుకంటే మిలన్, ఎలిమజ్లు సంపన్నులు కారు. అంతమాత్రాన వారేమీ నిరాశ పడి పోలేదు. ప్రయత్నించారు. కొన్ని ట్రావెల్ కంపెనీలు కొంత మొత్తం సహాయం చేయడానికి ఒప్పుకున్నాయి. అలా తొలి అడుగు పడింది. ఒక దేశానికి వెళ్లడం, ఆ దేశంలోని దాతల నుంచి సహాయం పొందడం...ఇలా ఆస్ట్రియా, హంగేరి, రొమేనియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, పాకిస్థాన్, ఇండియా, అమెరికా, సింగపూర్... ఇలా ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో సంస్కృతులను దగ్గరి నుంచి చూస్తే అదృష్టానికి నోచుకున్నారు ఇద్దరు మిత్రులు. అదృష్టమేమిటంటే, ప్రతి దేశంలోనూ ఎవరో ఒకరు ఈ మిత్రులకు అతిథ్యం ఇచ్చారు. తమ ప్రయాణ అనుభవాలను ‘ది అప్టిమిస్టిక్ ట్రావెలర్’ పేరుతో ఫేస్బుక్లో షేర్ చేసుకుంటున్నారు మిలిన్, ఎలిమజ్లు. -
సైగలేలనోయి...
స్టడీ మాట్లాడే వాళ్లలో రెండు రకాలు కనిపిస్తారు. కొందరు మాట్లాడుతున్నప్పుడు...నోరు మాత్రమే కదులుతుంది. ‘మాకేం పని’ అన్నట్లుగా ఉంటాయి మిగిలిన అవయవాలు. కొందరు మాట్లాడుతున్నప్పుడు....నోరు మాత్రమే కదలదు...చేతి వేళ్లు రకరకాల భంగిమలు పోతుంటాయి. ఏవో సంజ్ఞలను సూచిస్తుంటాయి. ఇది కేవలం అలవాటు మాత్రమేనా? ఇంకేమైనా ఉందా? వేలి సంజ్ఞలు, వాటి కదలికలు సామాన్యమేవీ కావు అంటున్నారు పరిశోధకులు. వేలి సంజ్ఞలు, కదలికలను కేవలం ‘అలవాటు’గా మాత్రమే చూడనక్కర్లేదని వాటి గురించి చెప్పడానికి ఎంతో ఉందని కూడా అంటున్నారు. మనిషి తెలివి, చురుకుదనం, వేలి సంజ్ఞలు, కదలికలకు మధ్య గల సంబంధాన్ని బెర్లిన్లోని హాంబోర్డ్ యూనివర్శిటీలోని పరిశోధకులు అధ్యయనం చేసి కొన్ని విషయాలు చెప్పారు. వారు చెప్పిన దాని ప్రకారం... వేలి కదలికలకు, మన ఆలోచన సరళికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. సైగలు, వేలి కదలికలు మన అంతఃచేతనలోని జ్ఞానాన్ని ప్రతిఫలిస్తాయి(అందుకేనేమో, యోగులు చేతివేళ్లతో విచిత్రంగా సంజ్ఞలు చేస్తుంటారు. కొందరు గాల్లో కూడా రాస్తుంటారు!) ఆలోచనల్లో అప్పటికప్పుడు మార్పు తేవడానికి కూడా చేతి కదలికలు, సంజ్ఞలు ఉపయోగపడతాయి. వేలి సంజ్ఞలకు జ్ఞాపకశక్తిని వృద్ధి చేసే శక్తి ఉంటుంది. వేలి కదలికలు ఎక్కువగా ఉన్న పిల్లలలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మెదడు చురుకుదనానికి వేలి కదలికలు తమ వంతు పాత్ర నిర్వహిస్తాయి. -
ఎఫ్1 బాస్కు ‘బేబీ’ కష్టాలు...
బెర్లిన్: ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే తీర్చుకోవాలి... లేకుంటే సమస్యలొచ్చిపడతాయి. ఫార్ములా వన్ బాస్ బెర్నీ ఎకిల్స్టోన్ (83)కు ఇప్పుడు అదే కష్టమొచ్చిపడింది. ఆయన భార్య ఫాబియానా (37) పిల్లల్ని కనాలని అనుకుంటోంది. ఇదే మాటను ఎకిల్స్టోన్కు చెప్పిందట. ఆయనేమో ఈ వయసులో పిల్లల్ని కనడం బాగోదేమో అంటున్నారు. ‘నా భార్య ఫాబియానా ఇప్పుడు పిల్లల్ని కనాలనుకుంటోంది. ఇప్పుడు నాకు 83 ఏళ్లు. ఈ వయస్సులో బాగుండదేమో..!’ అని చెప్పారు. అలాగని పిల్లలపై ఆసక్తి చూపడం లేదనుకుంటే పొరపాటే.. ‘నా భార్య కోరిక సాధ్యమవుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ అదే జరిగితే ఆరేళ్ల వయసులో స్కూల్కు వెళ్లిన నా బిడ్డను నేనే (అప్పటికి నా వయసు 90 ఏళ్లు) తీసుకొస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి’ అని ఆయనే అంటున్నారు. ఈ ఎఫ్1 బాస్కు ఫాబియానా మూడో భార్య. 2012లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. గతంలో ఇద్దరు భార్యలతో ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు.