
'విమానాశ్రయంపై దాడి చేస్తాం'
ముంబై : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దాడులకు తెగబడతామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మరోసారి హెచ్చరించింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంపై దాడి చేస్తామని ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ముంబయి ఎయిర్పోర్టులోని స్నానాల గదిలో ఈ లేఖలు కనిపించాయి. రిపబ్లిక్ డే రోజు దాడులు చేస్తామని ఐఎస్ఎస్ లేఖల్లో ఆ సంస్థ పేర్కొంది.
దాంతో అప్రమత్తమైన విమానాశ్రయంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు ఈ సమాచారంపై కేంద్ర హోంశాఖ ...పోలీసు శాఖను ఎలర్ట్ చేసింది. ఈ నెల 10న దాడి చేస్తామని ...ఇదే తరహాలో ఏడో తేదీన వాష్ రూమ్ లో రాతలు కనిపించిన విషయం తెలిసిందే.