అభినందన్ రాఫెల్‌తో కౌంటర్‌ ఇచ్చుంటే..! | BS Dhanoa Said Outcome Different If Abhinandan Had Flown Rafale | Sakshi
Sakshi News home page

అప్పుడు గనుక రాఫెల్‌ ఉండి ఉంటే..!

Jan 5 2020 5:01 PM | Updated on Jan 5 2020 7:28 PM

BS Dhanoa Said Outcome Different If Abhinandan Had Flown Rafale - Sakshi

ముంబై: భారత వాయుసేన మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా బాంబే ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ దాడుల అనంతరం పాక్‌పై దాడికి అభినందన్ వర్ధమాన్ వెళ్లిన సమయంలో మనం వాడిన యుద్ధ విమానం మిగ్ -21. అయితే ఆ రోజు అభినందన్ దాని స్థానంలో రాఫెల్‌ యుద్ధ విమానంలో వెళ్లి  కౌంటర్ ఇచ్చి ఉంటే పరస్థితి మరోలా ఉండేదని అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్‌ బీఎస్ ధనోవా అన్నారు.

చదవండి: అభినందన్‌ మనోధైర్యానికి మరో గుర్తింపు

ఆ సమయంలో పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాల్లో మిగ్-21పై దాడి చేయడంతో అది కూలిపోయి వింగ్ కమాండర్ అభినందన్ శత్రు దేశానికి చిక్కాడం తెలిసిందే. అదే ఎఫ్-16 కన్నా శక్తిమంతమైన రాఫెల్ మన చేతిలో ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా భారత అమ్ములపొదిలో రాఫెల్ చేరడం శుభపరిణామమని, రాఫెల్ వివాదంపై సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చిందని బీఎస్ ధనోవా పేర్కొన్నారు.

చదవండి: ఆ జాబితాలో అభినందన్‌, సారా అలీఖాన్‌!

ఆ సమయానికి భారత్ చేతిలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడానికి కారణమెవరంటూ ధనోవా పరోక్షంగా రాజకీయ పార్టీలనుద్దేశించి విమర్శలు చేశారు. నాడు అభినందన్ వర్థమాన్ రాఫెల్‌లో వెళ్లకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఏ యుద్ధ విమానాన్ని కొనాలన్నది నిర్ణయించడానికి 10 సంవత్సరాల టైం తీసుకున్నారంటూ గతంలో అధికారంలో ఉన్న పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement