బెంగళూరులో 20 కేజీల బంగారం పట్టివేత | Capture of 20 kg of gold in Bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరులో 20 కేజీల బంగారం పట్టివేత

Published Tue, Sep 19 2017 3:33 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

బెంగళూరులో 20 కేజీల బంగారం పట్టివేత

బెంగళూరులో 20 కేజీల బంగారం పట్టివేత

బనశంకరి (బెంగళూరు): దుబాయ్‌ నుంచి బెంగళూరుకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని కెంపేగౌడ అంతర్జాతీయ విమాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

ఈ నెల 18వ తేదీన దుబాయ్‌ నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల బ్యాగ్‌లను తనిఖీ చేయగా అందులో 20 కేజీల బంగారు బిస్కెట్లతోపాటు కొంత నగదు బయటపడింది. దీంతో వాటని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నింధితులను అరెస్ట్‌ చేశారు. కాగా, పట్టుబడిన బంగారం విలువ రూ.6 కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement