చిదంబరంను ప్రశ్నించనున్న సీబీఐ? | CBI to now go after P Chidambaram, question him | Sakshi
Sakshi News home page

చిదంబరంను ప్రశ్నించనున్న సీబీఐ?

Published Sun, Mar 4 2018 3:16 AM | Last Updated on Sun, Mar 4 2018 3:16 AM

CBI to now go after P Chidambaram, question him - Sakshi

పి.చిదంబరం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బడ్జెట్‌ రెండో దశ సమావేశాలు, కాంగ్రెస్‌ ప్లీనరీ నేపథ్యంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవీనితి కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరంను సీబీఐ ప్రశ్నించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో ఆయన కొడుకు కార్తీ అరెస్టయిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ నాయకులు ‘నీరవ్‌ మోదీ..’ అని నినాదాలు చేస్తే తాము ‘చిదంబరం..’ అని నినదిస్తామని కొందరు బీజేపీ ఎంపీలు బహిరంగంగానే ప్రకటించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం ద్వారా తమ ప్రతిష్టకు జరిగిన నష్టాన్ని కొంతవరకైనా భర్తీ చేసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement