Karthi Chidambaram
-
పని గంటలపై నారాయణమూర్తికి కౌంటర్
న్యూఢిల్లీ:ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్లో పనిదినాలు ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గిపోతుండడంపై మూర్తి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కార్తీ చిదంబరం ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేశామన్నది ముఖ్యం కాదని, ఎంత ప్రభావవంతంగా పనిచేశామన్నది ముఖ్యమన్నారు.‘ఎక్కువ సేపు పనిచేయడమనేది అర్థం లేనిది. ఎంత ఫోకస్తో పనిచేశామనేది మఖ్యం. జీవితంలో రోజువారి సమస్యలతో పోరాడే మనుషులకు వర్క్లైఫ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. నిజానికి భారత్లో పనిదినాలను వారానికి నాలుగు రోజులకు తగ్గించాలి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే చాలు’అని కార్తీ చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్గొగోయ్ కూడా నారాయణమూర్తి ఎక్కువ పనిగంటల విధానంతో విభేదించడం గమనార్హం. Working longer is meaningless, focus should be on efficiency. Daily life is as it is a struggle, battling inefficient & substandard infrastructure & amenities. Work life balance is most important for good social order & harmony. We should infact move to a 4 day working week. 12… https://t.co/EOOer6AgnK— Karti P Chidambaram (@KartiPC) December 22, 2024 ఇదీ చదవండి: హైదరాబాద్పై ఇన్ఫోసిస్ మూర్తి కీలక వ్యాఖ్యలు -
ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళన
సిబిల్ స్కోర్ విశ్వసనీయతపై రాజకీయ రంగంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో సిబిల్ స్కోర్ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించే సిబిల్ స్కోర్ల విశ్వసనీయత, జవాబుదారీతనంపై ప్రశ్నలొస్తున్నాయని తెలిపారు. వ్యవస్థ పారదర్శకత, నిష్పాక్షికతపై అనుమానం వ్యక్తం చేశారు. సిబిల్ స్కోర్ నిర్వహణకు మెరుగైన యంత్రాంగం లేకపోవడాన్ని చిదంబరం నొక్కిచెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న సిబిల్ నిర్వహణ చాలా మంది భారతీయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుందని అభిప్రాయపడ్డారు.అసలు సిబిల్ అంటే ఏమిటి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది ఎంత ఉండాలి? దాన్ని మెరుగుపరుచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. అనే అంశాల గురించి తెలుసుకుందాం.సిబిల్ స్కోర్సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు. క్రెడిట్ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకున్న రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్ను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ సిబిల్లో రికార్డు అవుతాయి. ఈ స్కోర్ 750-900 మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం.ఎక్కువగా ఉంటే..సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్ పొందే వీలుంటుంది. మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం రాదని కాదు. ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరో బ్యాంకు లోన్ ఇవ్వొచ్చు. అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తాయి.సిబిల్ 750-900: సిబిల్ స్కోర్ 750 నుంచి 900 మధ్యలో ఉంటే ఎటువంటి లోన్ అయినా సులభంగా పొందవచ్చు. అది కూడా తక్కువ వడ్డీరేటుతో పొందే అవకాశం ఉంటుంది.స్కోర్ పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్పై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్, జియో పరస్పరం విరుద్ధ వాదనలుస్కోర్ తెలుసుకోవడం ఎలా?క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దానికోసం సిబిల్కు సంబందించిన అధికారక వెబ్సైట్ www.cibil.comలోకి వెళ్లాలి. ఆన్లైన్లో ఫారం పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు, బ్యాంకుకు సంబందించిన వివరాలను ఇవ్వాలి. అన్ని వివరాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే క్రెడిట్ రిపోర్ట్ మెయిల్ ద్వారా పంపిస్తారు. -
ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కరరామన్ అరెస్ట్
చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వీసా కన్సల్టెన్సీ స్కాంలో కీలక మలుపు చోటుచేసుకుంది. చిదంబరం కుమారుడు కార్తీ అనుచరులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నైలో కార్తీ సన్నిహితుడు ఎన్ భాస్కర్ రామన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా విదేశీ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల కిందట యూపీఏ హయాంలో తన తండ్రి చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో పవర్ కంపెనీ పనుల నిమిత్తం భారత్ వచ్చిన 250 మంది చైనా పౌరులకు వీసాలు ఇచ్చేందుకు కార్తీ రూ. 50 లక్షల లంచం తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మంగళవారం కార్తి, ఆయన సన్నిహితుడు భాస్కరరామన్ సహా పలువురి నివాసాలు, అధికారిక కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, ఒడిశా, శివగంగైలో ఈ సోదాలు జరిగాయి. తాజా కేసులో కార్తీతోపాటు ఆయన సన్నిహితుడు ఎన్ భాస్కర రామన్, తలవండీ, పవర్ ప్రాజెక్ట్ ప్రతినిధి వికాస్ మఖరియా, ముంబైకు చెందిన బెల్టూల్స్ తదితరుల పేర్లను కూడా చేర్చారు. భాస్కరరామన్ వద్ద చిక్కిన కొన్ని పత్రాలు ఈ కేసులో కీలకంగా సీబీఐ భావిస్తోంది. చదవండి: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ -
కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరంపై మరో కేసు నమోదైంది. పదకొండేళ్ల క్రితం చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండగా రూ.50 లక్షల లంచం తీసుకొని ఒక విద్యుత్ కంపెనీ కోసం 263 మంది చైనీయులకు వీసాల మంజూరుకు సహకరించారంటూ కార్తీపై సీబీఐ కేసు నమోదు చేసింది. కార్తీతో పాటు ఆయన సన్నిహితుడు ఎస్.భాస్కరరామన్, నాటి తల్వాండి సాబో పవర్ ప్రాజెక్టు అధ్యక్షుడు వికాస్ మఖారియా తదితరులపై ఏపీసీ 120బీ, 477ఏ, అవినీతి నిరోధక చట్టంలోని 8, 9 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, చెన్నైలోని చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై, ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, ఒడిశా, పంజాబ్ సహా 10 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. సోదాల సమయంలో చిదంబరం ఢిల్లీలో, కార్తీ లండన్లో ఉన్నారు. వీటిపై కార్తీ, ‘‘ఇప్పటివరకు నాపై ఎన్నిసార్లు ఇలా దాడులు చేశారో గుర్తు లేదు. ఇది కచ్చితంగా ఒక రికార్డే’’ అని ట్వీట్ చేశారు. ఎఫ్ఐఆర్లో నాపేరే లేదు: చిదంబరం మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిదంబరం కొడుకు కార్తీపై నమోదైన కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీబీఐ దాడులపై చిదంబరం స్పందించారు. This morning, a CBI team searched my residence at Chennai and my official residence at Delhi. The team showed me a FIR in which I am not named as an accused. The search team found nothing and seized nothing. I may point out that the timing of the search is interesting. — P. Chidambaram (@PChidambaram_IN) May 17, 2022 ‘ఈ రోజు(మంగళవారం) ఉదయం చెన్నై, ఢిల్లీలోని నా నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. అధికారులు ఎఫ్ఐఆర్ కాపీ చూపించారు. కానీ అందులో నిందితుడిగా నా పేరే లేదు. అంతేగాక సోదాల్లో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి అధికారులు ఎలాంటి పత్రాలనూ స్వాధీనం చేసుకోలేదు. ఇక అధికారులు సెర్చింగ్ చేసే సమయం ఆసక్తికరంగా సాగింది’ అంటూ చిదంబరం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చదవండి: ‘ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్దే’ I have lost count, how many times has it been? Must be a record. — Karti P Chidambaram (@KartiPC) May 17, 2022 -
టీ హబ్కి ఎంపీలు ఫిదా.. మంత్రి కేటీఆర్ని మెచ్చుకున్న ఫ్రైర్బ్రాండ్
THubHyd: స్టార్టప్లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన తెలంగాణ హబ్ని పార్లమెంట్ ఐటీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటు ఐటీ స్టాండింగ్ కమిటీ ఇటీవల టీ ఐటీ హబ్ని సందర్శించారు. ఇక్కడ స్టార్టప్లకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వపరమైన ప్రోత్సహాకాలను వారు పరిశీలించారు. మంత్రి కేటీఆర్కు ప్రశంసలు తెలంగాణ ఐటీ హబ్ పనితీరును పశ్చిమ బెంగాల్కి చెందిన టీఎంసీ ఎంపీ, ఫైర్బ్రాండ్ మహువా మెయిత్రా మెచ్చుకున్నారు. 70 వేల చదరపు అడుగుల ఇంక్యుబేటర్ సెంటర్ని త్వరలోనే 3.50 లక్షల అడుగుల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్లోకి వెళితే ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు వండర్ఫుల్ జాబ్ ఆల్ అరౌండ్ కేటీఆర్టీఆర్ఎస్ అంటూ ప్రశంసించారు. — KTR (@KTRTRS) September 8, 2021 థ్యాంక్యూ మహువా మోయిత్రా ప్రశంసల ట్వీట్కి మంత్రి కేటీఆర్ స్పందించారు. థ్యాంక్యూ మహువా జీ అంటూ ట్వీట్ చేశారు. తమిళనాడుకి అవసరం మరోవైపు తమిళనాడుకు చెందిన కార్తి చిదంబరం సైతం ఐటీ హబ్ని మెచ్చుకున్నారు. ఇటువంటి ఐటీ హబ్ తమిళనాడుకు అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. టీ హబ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్షియేటివ్ అంటూ ట్వీట్ చేశారు. చదవండి : ఆన్లైన్లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు! -
సొంత పార్టీ నేతలపై కార్తీ చిదంబరం విమర్శలు
చెన్నై: కాంగ్రెస్ పార్టీ వర్గాలపై అదే పార్టీకి చెందిన జాతీయ నేత పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తీవ్రంగా విరుచుకుపడడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ వాళ్లు అబద్ధాల కోరులు.. ఆపండి మీ అబద్ధాలు అని ఆయన రామనాథపురం వేదికగా ఆగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. రామనాథపురం జిల్లా పరమకుడిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కార్తీ చిదంబరం తన పార్టీ వాళ్ల మీదే తీవ్రంగానే మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ సభ్యత్వం 70 లక్షలు అంటా.. ఇది పూర్తిగా అబద్ధమని మండిపడ్డారు. ( కాంగ్రెస్లో సంక్షోభం: సీఎం రాజీనామా..!) ఈ మేరకు సభ్యులు ఉండి ఉంటే, ఎందుకు ఓటింగ్ శాతం తగ్గినట్టో అని ప్రశ్నించారు. సభ్యుల్ని పెంచి చూపించాలని, ఏదో మొక్కుబడిగా నివేదికలు, చిట్టాలు సిద్ధం చేసి ఢిల్లీకి పంపించేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ పేపర్లు అక్కడి వాళ్లకు బటానీలను పెట్టుకుని తినేందుకు ఉపయోగపడుతున్నట్టు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, ఇకనైనా నిజాలు చెబితే మంచిదని హితవు పలికారు. -
రజనీకాంత్ అసలు రాజకీయం ఇదీ!
సాక్షి, చెన్నై: పౌరసత్వం (సవరణ) చట్టానికి మద్దతుగా నటుడు రజనీకాంత్ చేసిన ప్రకటనకు వరుస కౌంటర్లు పేలుతున్నాయి. సీఏఏ, ఎన్పీఆర్ గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్న రజనీకాంత్ వ్యాఖ్యలను తమిళనాడు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం రజనీకాంత్పై విమర్శలు గుప్పించారు. అధికార బీజేపీ చేతిలో ఆయన కీలు బొమ్మగా మారిపోయాడని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అళగిరి మండిపడ్డారు. సీఏఏ అమల్లోకి వస్తే 17 కోట్ల మంది ముస్లింలు, మూడు కోట్ల మంది క్రైస్తవులతోపాటు 83 కోట్ల మంది హిందువులు కూడా ప్రభావితమవుతారు. అస్సాంలో 19 లక్షల మంది పౌరులను విదేశీయులుగా ప్రకటించారు. ఈ జాబితాలో ముస్లింలు, హిందువులు ఉన్నారనే సంగతి రజనీకాంత్కు తెలుసా అని అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో మాదిరిగా దేశవ్యాప్తంగా నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలను కుంటున్నారా? అని ప్రశ్నించారు. రజనీకాంత్ తమిళనాడులో మతపరమైన ఎజెండాను భుజానకెత్తుకున్నారని స్పష్టమైందనీ, రజనీ అసలు రాజకీయాలు ఇప్పుడు బహిర్గతమ య్యాయని విమర్శించారు. మతం ప్రాతిపదికన పౌరులపై వివక్ష చూపలేమని రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. బీజేపీకి రజనీకాంత్ మద్దతు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు.. కానీ వాస్తవాలను మరుగుపరచకూడదన్నారు. జనాభా గణన, ఎన్పీఆర్ వేర్వేరు అనే విషయాన్ని ఆయన మొదట అర్థం చేసుకోవాలని హితవు పలికారు. అలాగే కాంగ్రెస్ సీనియర్నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం రజనీకాంత్ వ్యాఖ్యలపై నిరాశ వ్యక్తం చేశారు. సీఏఏ ఎందుకు వివక్షాపూరితమైందో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎలా అవుతుందో రజనీకాంత్ వివరించేవాడినని ఆయన ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్ నేత, ఎంపీ కార్తీచిదంబరం కూడా రజనీకాంత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీ నటించాల్సిన అవసరం లేదని కార్తీ ఎద్దేవా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చని పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి సూపర్స్టార్ రజనీకాంత్ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. సీఏఏపై బుధవారం స్పందించిన రజనీ సీఏఏ వలన ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరపున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని రజనీ ప్రకటించారు. చదవండి :సీఏఏ, ఎన్పీఆర్పై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు Disappointed with Mr.Rajnikanth’s statement on CAA. If he had asked me, I would’ve explained to him why the CAA is discriminatory and violates Art 14 of the Constitution. — P. Chidambaram (@PChidambaram_IN) February 5, 2020 -
ఎన్కౌంటర్ హత్యలు వ్యవస్థకు మచ్చ: కాంగ్రెస్ ఎంపీ
చెన్నై: షాద్నగర్ కేసులోని నిందితులను శుక్రవారం తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ పి చిదంబరం ట్విటర్లో స్పందించారు. 'అత్యాచారమనేది ఒక క్రూరమైన నేరం. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అత్యాచారానికి పాల్పడిన నిందితులను నేను సమర్థించకున్నా.. ఎన్కౌంటర్ హత్యలు మన వ్యవస్థకు మచ్చ అని విమర్శించారు. Rape is an heinous crime. It must be dealt with strictly under the provisions of law. While I hold no brief for the alleged perpetrators of this dastardly act, “encounter” killings are a blot to our system. While I understand the urge for instant justice, this is not the way. https://t.co/BzVkLlSgYW — Karti P Chidambaram (@KartiPC) December 6, 2019 కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు, తమిళనాడు శివగంగ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తీ చిదంబరం.. ఎన్కౌంటర్ హత్యలు మన వ్యవస్థకు మచ్చ అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. సత్వర న్యాయం కోసం.. ఎన్కౌంటర్ సరైన మార్గం కాదని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను శుక్రవారం తెల్లవారుజామున షాద్నగర్ చటాన్పల్లి శివారుకు తీసుకురాగా.. వారు పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా నలుగురు నిందితులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. -
మేం పదేపదే చెప్తున్నాం.. ఇది కక్షసాధింపే!
సాక్షి, న్యూఢిల్లీ: తిహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ను ఆ పార్టీ సీనియర్ నాయకులు పలువురు గురువారం కలిశారు. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శ్మ, డీకే సురేశ్ జైల్లో ఉన్న శివకుమార్ను కలిసి.. కాసేపు ముచ్చటించారు. తిహార్ జైల్లోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఆయన తనయుడు కార్తీ చిదంబరం గురువారం కలిశారు. చిదంబరాన్ని కలిసిన అనంతరం జైలు బయట కార్తీ మీడియాతో మాట్లాడారు. ‘ఇది కక్షసాధింపు రాజకీయం తప్ప మరొకటి కాదని మేం పదేపదే చెప్తున్నాం. మంచి వక్తలై ఈ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్న నాయకుల్ని బోగస్ కేసులతో టార్గెట్ చేశారు. మా నాన్న, శివకుమార్ మీద ప్రస్తుతం ఎలాంటి విచారణ జరగడం లేదు. వారిని దోషులుగా ఏ కోర్టు నిర్ధారించలేదు. అయినా, జ్యుడీషియల్ కస్టడీ కింద వారిని జైల్లో ఉంచారు. ఇది దేశ రాజకీయ వాతావరణాన్ని విషతుల్యంచేసి భయానక వాతావరణాన్ని సృష్టించడమే’ అని కార్తీ మండిపడ్డారు. -
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి బెయిల్
-
ఇదీ.. చిదంబరం చిట్టా
యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తన కొడుకు కార్తీ కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారని ఆరోపణలున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియాతోపాటు మరి కొన్ని కేసుల్లో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలివీ... ఐఎన్ఎక్స్: విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా! స్టార్ టీవీ ఇండియాకు సీఈఓగా దాదాపు పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చేసిన పీటర్ ముఖర్జియా సంస్థ పేరే ఐఎన్ఎక్స్ మీడియా. ఈయన తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి 2007లో ఐఎన్ఎక్స్ మీడియాను ఆరంభించారు. దాన్లో ఇంద్రాణి సీఈఓగా ఉండగా... పీటర్ ముఖర్జియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా చేరారు. ఈ సంస్థలోకి విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిన రూ.305 కోట్లకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) పచ్చజెండా ఊపింది. ఈ ఎఫ్ఐపీబీ అనుమతుల విషయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. అంతేకాక విదేశీ పెట్టుబడుల రూపంలో ఐఎన్ఎక్స్లోకి వచ్చిన డబ్బులు వేరెవరివో కావని, చిదంబరం తనయుడు కార్తీకి చెందిన వివిధ కంపెనీలు ఈ పెట్టుబడుల్ని ఇండియాకు తరలించడానికి ఐఎన్ఎక్స్ మార్గాన్ని ఎంచుకున్నాయని, ఇది స్పష్టమైన మనీ లాండరింగ్ వ్యవహారమని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలు ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారిపోయారు. ఈ కేసులో తమను ఇరికించకుండా చూడడానికి వారు కార్తీకి 10 లక్షలు లంచం కూడా ఇచ్చారని సీబీఐ చెబుతోంది. ఎయిర్సెల్– మాక్సిస్: అక్రమ అనుమతులు! ఎయిర్సెల్ మాక్సిస్ కేసు 2011వ సంవత్సరం మేలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్సెల్ సంస్థ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తన సంస్థలోని 74 శాతం వాటాలను 2006లో మలేసియా కంపెనీ మాక్సిస్కు విక్రయించారు. అప్పటి కేంద్ర టెలికం మంత్రి దయానిధి మారన్ బలవంతంగా తనతో ఈ పని చేయించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఆరంభించగా... ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రూ.3,500 కోట్ల విలువ చేసే పెట్టుబడులను మాక్సిస్ సంస్థ ఎయిర్సెల్లో పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రిగా చిదంబరమే ఉన్నారు. వాస్తవానికి ఈ స్థాయి విదేశీ పెట్టుబడులకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం నిబంధనల్ని తోసిరాజని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ద్వారా అనుమతులు మంజూరు చేశారని అభియోగాలున్నాయి. నిజానికి ఎఫ్ఐపీబీకి రూ.600 కోట్ల వరకు విలువున్న పెట్టుబడులకు మాత్రమే అనుమతినిచ్చే అధికారం ఉంది. ఈ ఒప్పందం కుదరడానికి చిదంబరం కుమారుడు కార్తీకి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. 20 సార్లు చిదంబరానికి ఊరట ఐఎన్ఎక్స్, ఎయిర్సెల్, మాక్సిస్ కేసుల్లో ఇప్పటికే పలు దఫాలు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాయి. చిదంబరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేసుకొని అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఈ ముందస్తు బెయిల్కు సంబంధించిన గడువుల్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అలా మొత్తంగా 20 సార్లు చిదంబరానికి ఊరట లభించింది. ఇప్పటికే ఈడీ చిదంబరాన్ని గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో రెండు సార్లు ప్రశ్నించింది కూడా. బెయిల్పై ఉన్న కార్తీ ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం కుమారుడు కార్తీని గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది. 23 రోజుల పాటు జైల్లో ఉన్న కార్తీ మార్చిలో బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి భారత్, యూకే, స్పెయిన్ దేశాల్లో కార్తీ చిదంబరానికి చెందిన రూ.54 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. పెండింగ్లో మరిన్ని కేసులు ► ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.1,272 కోట్ల విలువైన అవినీతి జరిగినట్టు కూడా చిదంబరంపై కేసు ఉంది. దీనిపై విచారణకు హాజరు కావాలని ఇటీవలే ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ► రూ.5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ ్చంజ్ వ్యవహారంలో చిదంబరం తీసుకున్న నిర్ణయాల వల్లే తమ సంస్థ భారీగా దెబ్బతిన్నదని ‘63 మూన్స్ టెక్నాలజీస్’సంస్థ (గతంలో దీనిపేరు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్) ఫిర్యాదు చేసింది. ► ఇక శారదా చిట్ఫండ్ కేసులో చిదంబరం భార్య నళిని ప్రమేయం ఉన్నట్టుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 1.4 కోట్ల రూపాయల ముడుపులు నళినికి అందినట్టుగా ఆరోపణలున్నాయి. ► బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015 కింద చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధిని విచారించాలంటూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను గత ఏడాది మద్రాస్ హైకోర్టు కొట్టివేసినప్పటికీ, సుప్రీం కోర్టులో ఇంకా ఇది పెండింగ్లో ఉంది. ► చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పడు ఇష్రాత్ జహాన్ కేసులో అఫిడవిట్ను తారుమారు చేసినట్టుగా ఆరోపణలున్న కేసు ఢిల్లీ పోలీసుల వద్ద పెండింగ్లో ఉంది. దాక్కోలేదు.. నిందితుడిని కాను న్యూఢిల్లీ: బుధవారం రాత్రి అరెస్టవ్వడానికి కొద్దిసేపటి ముందు చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. అక్కడ చిదంబరం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్ఎక్స్ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు. ఈ కేసులో సీబీఐ, ఈడీలు అభియోగపత్రం కూడా దాఖలు చేయలేదు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాల్లోనూ నేను తప్పు చేసినట్లు ఎక్కడా లేదు. అయినా నేను, నా కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు చెప్పడమనే రోగం ఉన్నవారు వ్యాప్తి చేస్తున్న అసత్యాలే ఇవన్నీ. నిజాన్ని దాటి ఏదీ ముందుకు వెళ్లలేదు. సీబీఐ, ఈడీలు నన్ను విచారించడం కోసం నోటీసులు ఇచ్చాయి. ముందుజాగ్రత్తగా అరెస్టు నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లి తాత్కాలిక రక్షణ కోరాను. నాకు దాదాపుగా గత 15 నెలలపాటు ఆ రక్షణ లభించింది. నేను ఎక్కడా దాక్కోలేదు. నిన్న రాత్రంతా నేను నా లాయర్లతో కలిసి కూర్చొని కోర్టులో సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నా. ఈ రోజు ఉదయానికే పని ముగిసింది. నా కేసును సుప్రీంకోర్టు శుక్రవారమే విచారిస్తుందని తెలిసింది. నేను న్యాయస్థానం ఆదేశాలకు తలవంచుతున్నాను. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేయకపోయినా సరే, నేను చట్టాన్ని గౌరవిస్తాను’అని మీడియాతో అన్నారు. కక్షగట్టారు: కాంగ్రెస్ చిదంబరానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే ఆయనపై కక్షగట్టి కేంద్రం వేధిస్తోందని వారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ లను, ఓ వర్గం మీడియాను ఉపయోగించి చిదంబరం వ్యక్తిత్వాన్ని హతమార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహు ల్ గాంధీ ఆరోపించారు. చిదంబరాన్ని కేంద్రం వేటాడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఓ ట్వీట్ చేస్తూ ఏది ఏమైనా తాము చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపింది. ‘అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా నిజం మాట్లాడే పౌరులను పీడించడం ద్వారా ప్రభుత్వం తన పిరికితనాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది. చిదంబరం ఎన్నో అర్హతలున్న, గౌరవనీయ నాయకుడు. అంకితభావం, వినయంతో ఆయన ఈ దేశానికి సేవ చేశారు. సత్యాన్వేషణలో మేం ఆయనకు మద్దతుగా ఉంటాం. ఏది ఏమైనా సరే’అని కాంగ్రెస్ ట్విట్టర్లో పేర్కొంది. పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, ఇతర సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, శశి థరూర్ తదితరులు చిదంబరానికి మద్దతుగా మాట్లాడా రు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులపై ఎన్ని ఆరోపణలున్నా వారంతా పదవులు అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు: బీజేపీ చిదంబరంపై కేసు విషయంలో కాంగ్రెస్ చేసిన కక్షసాధింపు వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. విచారణలో తాము జోక్యం చేసుకోవడంలేదనీ, చిదంబరం తాను చేసిన పనుల వల్లే ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. ‘ఆయన (చిదంబరం) ఏదైనా తప్పు చేసి ఉంటే, తప్పకుండా ఆయన ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాదేశాలతో పనిచేయవు. స్వతంత్రంగా పనిచేసే అధికారాలు వాటికి ఉన్నాయి’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. అరెస్ట్కు ముందు ఏఐసీసీ కార్యాలయంలో చిదంబరం చిదంబరం ఇంట్లోకి వస్తున్న సీబీఐ అధికారుల కారును అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు -
గెలుపు చిదంబర రహస్యం
తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్న రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటి శివగంగ. కాంగ్రెస్ సీని యర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కార్తీ చిదంబరం కిందటి ఎన్నికల్లో నాలుగో స్థానం లో నిలిచారు. మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి హెచ్.రాజా మళ్లీ పోటీలో ఉన్నా రు. వీరిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. 2014లో గెలిచిన ఏఐఏడీఎంకే నేత పీఆర్ సెంథిల్నాథన్, రెండో స్థానంలో ఉన్న డీఎంకే అభ్యర్థి దురై రాజ్ సుభా పొత్తుల కారణంగా పోటీ చేయడం లేదు. రాష్ట్రంలో రెండు కూటములకు నాయకత్వం వహిస్తున్న పాలక ఏఐఏడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే తమ మిత్రపక్షాలకు ఈసారి శివగంగ సీటును కేటాయిం చాయి. కిందటి ఎన్నికల ముందు పి.చిదంబరం రాజ్యసభకు ఎన్నికవడంతో తొలిసారి లోక్సభకు పోటీచేయలేదు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన కొడుకు కార్తి ఓడిపోయారు. గత ఐదేళ్లలో ఆర్థిక నేరాలకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కార్తి ఇప్పుడు రెండోసారి గెలుపు కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఏఐఏడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థి హెచ్.రాజాకు వివాదాస్పద ప్రకటనలతో సంచలనం సృష్టించే నేపథ్యం ఉంది. నోటి దురుసు నేత రాజా రెండు దశాబ్దాల క్రితం శివగంగలో కాంగ్రెస్ అభ్యర్థికి రాజా గట్టి పోటీ ఇచ్చినా ఆయన నోటి దురుసు వల్ల జనాదరణ కోల్పోయారు. పాలకపక్షమైన ఏఐఏడీఎంకేతో పొత్తు ఉన్నా ఆయన ఇమేజ్ కారణంగా ఆయన అభ్యర్థిత్వానికి బీజేపీ కార్యకర్తలు మొదట అంత అనుకూలంగా లేరు. ఇటీవల రాజా తమిళులంతా గౌరవించే పెరి యార్ ఈవీ రామస్వామి నాయకర్, మైనారిటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో గొడవపడిన సమయంలో ఆయన మద్రాసు హైకోర్టుపైన, శబరిమల ఆలయ ప్రవేశ వివాదంలో అన్ని వయసుల మహిళలపై కూడా అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు. ఇలాంటి కరుడుగట్టిన హిందుత్వ రాజకీయాలు నడిపే నేత అభ్యర్థి అయితే ఓటర్లను ఆకట్టకోలేమని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి కార్తిపై ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులుండటంతో ఇద్దరు వివాదాస్పద నేతల మధ్య పోటీ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కార్తి పేరు ప్రకటించడంలో జరిగిన ఆలస్యం కూడా కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది. ఎయిర్సెల్–మాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో నిందితుడైన కార్తి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ నాచయప్పన్ అభ్యంతరం చెప్పడంతో ఆయనకు శివగంగ టికెట్ ఇవ్వడంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జాప్యం చేసింది. చాలా కాలంగా తన కేసులకు సంబంధించి ముఖ్యంగా బెయిలు కోసం వేసిన పిటిషన్ల కారణంగా కార్తి వార్తల్లో ఉంటున్నారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన శివగంగలో రైతులు కష్టాల్లో మునిగి ఉన్నారు. వరి, చెరకు, పత్తి, మిరప, వేరు శనగ పండించే ఈ ప్రాంతంలోని రైతులు సాగు నీటి సమస్యతోపాటు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. చెరకు పం టకు కనీస మద్దతు ధర తగినంత లేకపోవడం, సాగునీటి కొరత వల్ల పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమా పథకం ఇక్కడి రైతులను ఆదుకోలేకపోతోంది. చెరువుల్లో పూడిక తీయకపోవడం వల్ల ప్రజలు తాగు నీరులేక అల్లాడుతున్నారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నా అలాంటి ప్రయత్నాలు జరగటం లేదు. సున్నపురాయి, గ్రానైట్, గ్రాఫైట్ వంటి ఖనిజ నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నా రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పరిశ్రమల స్థాపన జరగడం లేదు. శివగంగ సమీపంలో తమిళనాడు మినరల్ లిమిటెడ్ కార్యాలయం ఉంది కానీ మైనింగ్ కార్యకలాపాలు పెరగడం లేదు. ఈ నేపథ్యంలో యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. పాలకపక్షాలపై వ్యతిరేకత బీజేపీకి అననుకూల అంశం.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో దాని మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే అధికారంలో ఉండడంతో జనంలో పాలకపక్షాలపై వ్యతిరేకత హద్దులు దాటితే అదిక్కడ బీజేపీ అభ్యర్థికి అననుకూలం కావచ్చు. మందకొడిగా ప్రారంభమైన ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తన కొడుకు కార్తి గెలుపు కోసం చిదంబరం శివగంగలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నా రు. చిదంబరం దశాబ్దాల పాటు శివగంగ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి ఏం చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ పార్టీ అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) అభ్యర్థి కూడా రంగంలో ఉండడంతో హిందువుల ఓట్లలో వచ్చే చీలిక బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. ఇక్కడి తేవర్ల ఓట్లు గణనీయంగానే ఈ పార్టీకి పడవచ్చని పరిశీలకుల అంచనా. కార్తి గెలుపు ఆయ న తండ్రి చిదంబరానికి అత్యంత ప్రతిష్టాత్మకరంగా మారింది. తండ్రి కంచుకోటలో కొడుకుకు పరీక్ష 1967లో ఏర్పడిన శివగంగ నుంచి చిదంబరం ఏడుసార్లు లోక్సభకు ఎన్నికయ్యా రు. టీఎంసీ తరఫున పోటీ చేసిన 1999లో ఒక్కసారే ఆయన ఇక్కడ ఓడిపోయారు. ఐదుసార్లు కాంగ్రెస్ టికెట్పై, రెండుసార్లు టీఎంసీ తరఫున విజయం సాధించారు. 1999లో చిదంబరాన్ని కాంగ్రెస్ అభ్యర్థి ఈఎం సుదర్శన్ నాచయప్పన్ ఓడించారు. ఆరు అసెంబ్లీ సెగ్మెం ట్లు ఉన్న శివగంగలో మొత్తం ఓటర్లు 11,07, 575. ఇక్కడ పోలింగ్ ఏప్రిల్ 18న జరుగుతుం ది. టీఎంసీతోపాటు ప్రధాన ప్రాంతీయ పక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే రెండేసిసార్లు ఇక్కడ గెలుపొందాయి. బీజేపీ అభ్యర్థి రాజా 1999లో 2,22,668 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలి చారు. ప్రస్తుతం బీజేపీ నుంచి రాజా బరిలోకి దిగగా, కాంగ్రెస్ నుంచి కార్తి చిదంబరం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
మళ్లీ ఈడీ ముందుకు వాద్రా
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రా వరుసగా రెండో రోజు గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ముగ్గురు అధికారులు వాద్రాను దాదాపు 9 గంటలకుపైగా ప్రశ్నించారు. లండన్లో ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో బుధవారం వాద్రా ఇచ్చిన సమాధానాలపై సంతృప్తిచెందకపోవడంతో రెండు రోజు విచారణకు పిలిచింది. తొలిరోజు మాదిరిగానే రెండో రోజు కూడా ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదుచేశారు. బికనీర్ భూకుంభకోణానికి సంబంధించి మరో మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా ఈ నెల 12న జైపూర్లో మళ్లీ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మరో కేసులో కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా గురువారం ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకేరోజు విచారణకు రావడంతో ఢిల్లీలోని జామ్నగర్ హౌజ్ ఈడీ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. ఆ ప్రాంగణంలో ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రతినిధులను నియంత్రించడానికి బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఉదయం 11 గంటలకు కార్తీ ఈడీ కార్యాలయానికి చేరుకోగా, 11.25 గంటలకు వాద్రా వచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకే సంబంధించి పి.చిదంబరంను శుక్రవారం విచారించే అవకాశాలున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మాల్యాతో తల్వార్కు సంబంధాలు: ఈడీ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాతో కార్పొరేట్ మధ్యవర్తి దీపక్ తల్వార్కు సంబంధాలు ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. విదేశాల్లో ఉన్న తల్వార్ కొడుకు ఫిబ్రవరి 11న తమ ముందు విచారణకు హాజరవుతున్నారని, ఇద్దరిని కలిపి ప్రశ్నించాల్సి ఉందని వెల్లడించింది. తల్వార్ కస్టడీని వారం పాటు పొడిగించాలని కోరగా కోర్టు ఫిబ్రవరి 12 వరకు అనుమతిచ్చింది. -
అప్రూవర్గా ఇంద్రాణి.. మరిన్ని చిక్కుల్లో కార్తీ
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు.. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు.. ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చిందో చెప్పాలని ఈడీ ప్రశ్నించింది. ఇదిలా ఉండగా ఈ కేసులో మరో నిందితురాలు, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి అప్రూవర్గా మారేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అయితే ఇంద్రాణి అప్రూవర్గా మారేందుకు గల కారణాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు భావిస్తోంది. ఆమె ఎవరి నుంచైనా బెదిరింపులు ఎదుర్కొంటున్నారా లేదా ఇందుకు ప్రతిగా మరేదైనా లాభం పొందాలనుకుంటున్నారా అన్న అంశాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక గత విచారణలో భాగంగా ఐఎన్ఎక్స్ మీడియాలో పెట్టుబడుల అనుమతికి కార్తీ చిదంబరం.. 1 మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ తన భర్త పీటర్ను డిమాండ్ చేశారని ఇంద్రాణి పేర్కొన్నారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గతేడాది ఫిబ్రవరిలో కార్తీ చిదంబరం అరెస్టైన సంగతి తెలిసిందే. కార్తీ తండ్రి పి.చిదంబరం.. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఈ లావాదేవీలు జరగడంతో ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కార్తీ మరిన్ని చిక్కుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. -
కార్తీ.. చట్టంతో ఆటలాడొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీం కోర్టు ఘాటైన హెచ్చరిక చేసింది. చట్టంతో ఆటలాడుకోవద్దని హితవు పలికింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరిన కార్తీని ముందుగా రూ.10 కోట్లు తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ‘ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోవచ్చని కాకపోతే విచారణకు మాత్రం సహకరించాలి’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. ‘విచారణకు సహకరించాల్సి ఉంటుందనే విషయాన్ని మీ క్లయింట్కు చెప్పండి. మీరు సహకరించలేదు. చాలా విషయాలు చెప్పాల్సి ఉంది’ అని కార్తీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం చెప్పింది. అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్స్ కోసం వచ్చే నెల ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కార్తీ కోరారు. మాజీ టెన్నిస్ ఆటగాడిగా, ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్గా, వ్యాపారవేత్తగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. -
సీబీఐ కోటలో ‘దేశం’ ఆటలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని అవసర మైన సందర్భాల్లో ఉప యోగించుకునేందుకు తెలుగుదేశం పార్టీ భారీ వ్యూహరచన చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. టీడీపీ ముఖ్యంగా రెండు ప్రయోజనాలను ఆశించే.. సీబీఐ ఉన్నతాధికారులతో సన్ని హిత సంబంధాలకు ప్రయత్నించి నట్లు తెలుస్తోంది. ఒకటి రాజకీయ ప్రత్యర్థులకు ఇబ్బందులు సృష్టించడం కాగా.. రెండోది తమపై విచారణకు ఆదేశిస్తే బయటపడే మార్గాలు అన్వేషించడం. ఇప్పటికిప్పుడే తెర వెనుక జరిగిన పరిణామాలు బయటకు వచ్చే అవకాశాల్లే నప్పటికీ..కాలక్రమేణా సీబీఐ కేసుల్లో కీలకంగా వ్యవహ రించిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు, మరో రాజ్యసభ సభ్యుని వ్యవ హారం బయటకు వస్తుం దని సీబీఐ వర్గాలే అంటు న్నాయి. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అస్థానాపై అవినీతి కేసు నమోదు కావడం, డీఎస్పీ స్థాయి అధికారి ఒకరిని అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ సంస్థ అధికారు లతో టీడీపీ నేతల సంబంధాలపై ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. (కోర్టుకు చేరిన సీబీఐ పోరు) కార్తీ చిదంబరం కేసు నుంచే.. కేంద్ర మాజీ మంత్రి, కాం గ్రెస్ సీనియర్ నేత చిదం బరం కుమారుడు కార్తీ చిదంబరం కేసు సంద ర్భంగా అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్సీపీఎల్) డైరెక్టర్ చిన్న బాల నాగేశ్వర రెడ్డి (సీబీఎన్ రెడ్డి)ని కేసు నుంచి తప్పించేందుకు టీడీపీ రాజ్యసభ సభ్యుడొకరు సీబీఐ ఉన్నతాధికారితో చర్చలు జరిపారని సమా చారం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరం ద్వారా ఏఎస్సీపీఎల్ డైరెక్టర్లకు ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డైరెక్టర్లను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ సంస్థ ముగ్గురు డైరెక్టర్లలో ఒకరైన సీబీఎన్ రెడ్డి.. కార్తీ చిదంబరానికి అత్యంత సన్నిహితుడు. మామూలుగా ఆ కేసులో సీబీఎన్ రెడ్డిని అరెస్టు చేస్తారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే.. సీబీఎన్ రెడ్డికి.. ఓ టీడీపీ ముఖ్య నేత కుమారుడితో పాటు ఆ పార్టీ ఎంపీ (రాజ్యసభ)కి సన్నిహిత సంబంధాలున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని సీబీఎన్ రెడ్డి అప్పట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యుడిని సంప్రదించినట్లు సమాచారం. ‘నాకు తెలిసినంత వరకు సీబీఎన్ రెడ్డి విషయంలో ఆ టీడీపీ రాజ్యసభ సభ్యుడు చక్రం తిప్పారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారినే ఆయన కలిసి సీబీఎన్రెడ్డిని ఎలాగైనా బయటపడేయాలని కోరారు. అయితే ఆ డీల్లో ఎంత మొత్తం చేతులు మారిం దన్నది ఇప్పుడే చెప్పలేను. కొద్ది రోజులు ఆగితే.. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి’ అని సీబీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సీబీఐతోపాటు.. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)లోనూ టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారని దానికి సంబంధించి ఆధారాలతో సహా వచ్చిన ఫిర్యాదును సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తొక్కిపెట్టారని ఆయన వెల్లడించారు. పోస్టింగుల్లోనూ ఒత్తిళ్లే! సీబీఐ పోస్టింగుల్లో సాధారణంగా రాజకీయ ఒత్తిడులు పెద్దగా ఉండవు. కానీ, టీడీపీ నేతలు కొందరు మాత్రం.. కావాల్సిన వారిని తమకు అనుకూలమైన పోస్టుల్లో నియమించుకునేందుకు అనేక ఒత్తిడులు తెచ్చారని ఢిల్లీ సీబీఐ కార్యాలయంలోని మరో అధికారి వెల్లడించారు. వీని ఒత్తిళ్ల ఫలితంగా నిజాయితీపరులైన అధికారులకు మంచి పోస్టులు దక్కకుండా పోయాయని ఆయన చెప్పారు. ‘రెండేళ్లుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి హవా (టీడీపీ నేతల) కొనసాగుతోంది. ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో చాలామంది అధికారులు ఈ విషయం తెలిసి విస్తుపోయారు. దీని కారణంగానే పరిస్థితులు దారుణంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. దక్షిణాదిలో సీబీఐ పోస్టుల్లో ఎవరిని నియమించాలో టీడీపీ నేతలు నిర్దేశించినట్లు జరిగింది’ అని సదరు అధికారి వివరించారు. (ఆస్ధాన మోదీ ఆస్ధానవాసే..) స్పెషల్ డైరెక్టర్ అవినీతి కేసులో కీలకంగా మారిన ఏపీకి చెందిన సతీష్ బాబుతోనూ టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీబీఐ అధికారులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. కేసు నుంచి బయటపడేస్తామని ఓ రాజ్యసభ సభ్యుడు అతనికి మాటిచ్చిన సంగతి ఏడాది క్రితమే వెలుగులోకి వచ్చిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సీబీఐతో దోస్తీ చేసుకుని తమకు కావాల్సిన పనులు చేయించుకునేందుకు టీడీపీ ఎంపీలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. వారి అనుకూల మీడియా మాత్రం ఛీ(సీ)బీఐ అంటూ కథనాలు ప్రచురించడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
కార్తీ చిదంబరానికి ఈడీ షాక్
-
కార్తీ చిదంబరం విదేశీ పర్యటనకు సుప్రీం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం కుమరుడు కార్తీ చిదంబరానికి ఈనెల 20 నుంచి 31 వరకూ బ్రిటన్లో పర్యటించేందుకు మంగళవారం సుప్రీం కోర్టు అనుమతించింది. తన కుమార్తె అడ్మిషన్ కోసం కార్తీ చిదంబరం బ్రిటన్ పర్యటనకు సుప్రీం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్సెల్-మ్యాక్సి్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో కార్తీ చిదంబరం విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐలు కార్తీపై క్రిమినల్ కేసులను దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విదేశీ పర్యటనల కోసం కార్తీకి న్యాయస్ధానం ఇచ్చిన స్వేచ్ఛను ఆయన దుర్వినియోగం చేశారని ఈడీ సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. కాగా విదేశాల్లో కార్తీ కొత్తగా బ్యాంకు ఖాతాను ప్రారంభించడం లేదా మూసివేయడం చేయరాదనే నిబంధన సహా పలు షరతులపై ఆయన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతించింది. విమాన వివరాలు, భారత్కు తిరిగివచ్చే తేదీ వంటి వివరాలతో కార్తీ హామీ పత్రాన్ని సమర్పించాలని, స్వదేశానికి తిరిగి రాగానే తన పాస్పోర్ట్ను తిరిగి ఇచ్చేయాలని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. -
చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ: ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంనకు ఊరట లభించింది. ఆయన్ను ఆగస్ట్ 7వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదంటూ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుకు 3 వారాల్లోగా బదులివ్వాలని స్పెషల్ కోర్టు జడ్జి సీబీఐను ఆదేశించారు. ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసులో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీపై సీబీఐ చార్జిషీటు వేసింది. దీంతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు కార్తీకి అనుమతి ఎయిర్సెల్–మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం కొడుకు కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఓకేచెప్పింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వెళ్లేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చిదంబరం కుటుంబంపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను దాచిన కేసులో చిదంబరం కుటుంబం విచారణకు హాజరు కాకపోవడాన్ని చెన్నై ఎగ్మూరు న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిలకు బ్రిటన్, అమెరికాలో ఉన్న ఆస్తులకు సంబంధించి నల్లధనం చట్టం కింద ఐటీ శాఖ కేసు వేసింది. ఈ కేసు సోమవారం విచారణకు రాగా ఆ ముగ్గురూ హాజరు కాలేదు. దీంతో వారిపై న్యాయమూర్తి మలర్విళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీన వారంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. -
చిదంబరం ఇంట్లో చోరీ.. ట్విస్ట్
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగింది. నుగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో ఉన్న ఆయన ఇంట్లో లూటీ జరిగింది. చిదంబరం భార్య నళినీ చిదంబరం నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి, గత రాత్రి తిరిగొచ్చారు. తలుపులు తెరిచి చూసేసరికి అల్మరాలు ఓపెన్ చేసి ఉండటంతో దోపిడీ జరిగిన విషయాన్ని ఆమె గుర్తించారు. వెంటనే పోలీసులకు ఆమె సమాచారం అందించారు. విలువైన ఆభరణాలు, రూ. 1.50 లక్షల నగదు, ఆరు విలువైన చీరలు చోరీ అయినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఘటన వెనుక తమ ఇంట్లో పనిచేసే ఇద్దరు పనిమనుషుల హస్తం ఉండొచ్చని ఆమె అనుమానించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తే, మాస్క్లు ధరించిన ఇద్దరు మహిళలు ఇంట్లోకి వెళుతుండటం కనిపించింది. పదిరోజుల క్రితమే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు వెనక్కి.. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి అరెస్టులు జరగలేదు. పోలీసు ఫిర్యాదుతో కంగారుపడ్డ ఆ పని మనుషుల కుటుంబ సభ్యులు.. చోరీకి గురైన సొత్తు వెనక్కి ఇస్తామని చిదంబరం ఫ్యామిలీకి చెప్పారు. దీంతో ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం ఉదయం కార్తీ చిదంబరం కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఆభరణాలు ఏవీ చోరీ కాలేదని, కేవలం డబ్బు మాత్రమే అయిందని కార్తీ తెలిపారు. -
కార్తీ చిదంబరానికి ఊరట
సాక్షి, చెన్నై : విదేశీ ఆస్తులను వెల్లడించలేదనే ఆరోపణలపై ఆదాయ పన్ను శాఖ మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి వారెంటు జారీ చేసిన క్రమంలో మద్రాస్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కార్తీపై ఆదాయ పన్ను శాఖ నల్లధనానికి సంబంధించిన కేసులో జారీ చేసిన వారెంట్పై ఆదివారం అర్థరాత్రి చేపట్టిన విచారణలో మద్రాస్ హైకోర్టు ఆయనకు ఊరట కల్పించింది. కార్తీ విదేశాల నుంచి తిరిగివచ్చే వరకూ ఆయనపై జారీ చేసిన వారెంట్ను పక్కనపెట్టాలని ఐటీ శాఖను ఆదేశించింది. ఐటీ వారెంట్ నేపథ్యంలో కార్తీ అరెస్ట్ను నివారించేందుకు ఆయన న్యాయవాదులు ఏఆర్ఎల్ సుందరేశన్, సతీష్ పరాశరన్లు ఆదివారం రాత్రి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ అధికారిక నివాసాన్ని ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్తో సంబంధిత న్యాయమూర్తిని ఆశ్రయించాలని వారికి ప్రధాన న్యాయమూర్తి సూచించారు. -
చిదంబరానికి ముందస్తు బెయిల్
న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరానికి తాత్కాలిక ఊరట లభించింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కుంభకోణంలో తనను అరెస్ట్ చేయకుండా ఉండాలని చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సీబీఐ స్పెషల్ కోర్టు ఆమోదించింది. వచ్చే నెల అయిదు వరకు అంటే తదుపరి విచారణ వరకు చిదంబరాన్ని అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. బెయిల్ పిటీషన్ స్పందన తెలియజేయాలని ఈడీకి కోర్టు ఆదేశాలు జారీచేసింది. చిదంబరం తరుఫున కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. 800 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారని చిదంబరంపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిలో కోట్ల రూపాయలు ముడుపులు తనయుడు కార్తీ చిదంబరానికి ముట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసును ఈడీ, సీబీఐ మనీలాండరింగ్ ఆరోపణల కింద విచారిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్తీని సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. కార్తీకి చెందిన రూ.1.16 కోట్ల ఆస్తులను 2017 సెప్టెంబర్లో ఈడీ అటాచ్ చేసింది. గతేడాది డిసెంబర్లో కార్తీ చిదంబరానికి చెందిన సన్నిహితుల నివాసాల్లో ఈడీ దాడులు జరిపింది. కార్తీకి చెందిన ఢిల్లీ, చెన్నైలోని ప్రాపర్టీలపై కూడా దాడులు నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తును జాప్యం చేస్తున్నాయని ఏజెన్సీలపై సుప్రీంకోర్టు మండిపడింది కూడా. -
ఇదీ కాంగ్రెస్.. నవాజ్ షరీఫ్ మూమెంట్!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విదేశీ ఆస్తుల విషయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. తన విదేశీ ఆస్తులను వెల్లడించడంలో విఫలమైనా చిదంబరంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు. చిదంబరం విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ‘నవాజ్ షరీఫ్ మూమెంట్’గా ఆమె అభివర్ణించారు. ఆయన ఆర్థిక అవకతవకలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. తన కుటుంబం విదేశీ ఆస్తులను వెల్లడించే విషయాన్ని చిదంబరం ఎందుకు మరిచిపోయారో వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ‘పలు కేసుల్లో స్వయంగా బెయిల్ మీద ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తన పార్టీకి సంబంధించిన నేతపై విచారణ జరుపుతారో లేదో వెల్లడించాలి’ అని ఆమె పేర్కొన్నారు. ‘చిదంబరం విదేశీ పెట్టుబడుల వివరాల్ని పన్ను విభాగానికి వెల్లడించలేదు. ఇది నల్లధన చట్టాన్ని ఉల్లంఘించడమే. నల్లధనాన్ని నిరోధించేందుకు మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద విదేశాల్లో రహస్యంగా అక్రమ సంపదను దాచిపెట్టే భారతీయులను విచారించవచ్చు’ అని ఆమె తెలిపారు. విదేశాల్లో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నందకు, వాటి వివరాలు వెల్లడించనందకే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ను ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాని పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు దేశానికి, కాంగ్రెస్ పార్టీకి చిందబరం వ్యవహారం నవాజ్ షరీఫ్ వ్యవహారంలా తయారైందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నెల 11న చెన్నై సిటీ కోర్టులో చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తీ, అతని భార్య శ్రీనిధిపై ఐటీ చట్టం 2015 సెక్షన్ 50 కింద కేసులు నమోదైనట్టు తెలిపారు. విదేశి ఆదాయం, ఆస్తుల వివరాలు వెల్లడించనందకే ఈ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. యూకేలోని కేంబ్రిడ్జ్లో 5.37 కోట్ల ఆస్తులు, వేరే చోట 80 లక్షల ఆస్తులు, అమెరికాలో 3.28 కోట్ల ఆస్తులు వంటి వెల్లడించని ఆస్తులు కలిగి ఉన్నందకే ఆయనపై చార్జ్ షీట్ నమోదైందని తెలిపారు. ఆయన కుమారుడు కార్తీ అమెరికాలోని నానో హోల్డింగ్స్ ఎల్ఎల్సీలో 3.28 కోట్ల, 80 లక్షల పెట్టుబడులు కలిగి ఉన్నట్టు ఆదాయ పన్ను చట్టం, నల్లధన చట్టం కింద నమోదైన చార్జ్ షీట్లో పేర్కొని ఉందని తెలిపారు. చిదంబరం ఆయన కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులు 14 దేశాలు, 21 విదేశి బ్యాంకుల్లో ఉన్నాయని, వాటి విలువ దాదాపు మూడు బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిపై చిదంబరం వివరణ ఇస్తూ.. సీతారామన్ వ్యాఖ్యలపై తాను స్పందించనని, ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉందని నిజానిజాలు అక్కడే తెలుస్తాయని అన్నారు. -
ఇదీ కాంగ్రెస్ ‘నవాజ్ షరీఫ్ మూమెంట్
-
చిదంబరం కుటుంబంపై ఐటీ చార్జిషీటు
చెన్నై: విదేశాల్లోని ఆస్తుల వివరాలు వెల్లడించలేదన్న ఆరోపణలతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) చార్జిషీట్లు దాఖలు చేసింది. చెన్నైలోని ప్రత్యేక కోర్టు ముందు ఈ చార్జిషీట్లను దాఖలు చేసింది. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్లో ఉన్న రూ.5.37 కోట్ల విలువైన ఆస్తి, రూ.80 లక్షల విలువైన మరో ఆస్తి, అమెరికాలోని రూ.3.28 కోట్ల విలువైన ఆస్తి వివరాలను నళిని, కార్తీ, శ్రీనిధి వెల్లడించలేదని ఐటీ శాఖ పేర్కొంది. కార్తీ సహ యజమానిగా ఉన్న చెస్ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ, చిదంబరం కుటుంబం ఈ వివరాల్ని దాచడం నల్లధన నిరోధక చట్టాన్ని అతిక్రమించినట్లేనని తెలిపింది. ఈ కేసులో కార్తీకి, ఆయన కుటుంబానికి గతంలో నోటీసులు జారీచేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో కార్తీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ను కోర్టు కొట్టేసింది. కాగా, ఈ కేసులో విచారణ దాదాపు చివరి దశకు చేరుకుందని, అందుకే కోర్టు ముందు చార్జిషీటు దాఖలు చేసినట్లు ఐటీ శాఖ అధికారులు చెప్పారు. నల్లధన చట్టం ప్రకారం వెల్లడించని విదేశీ ఆస్తులపై 120 శాతం పన్ను విధించడమే కాకుండా దాదాపు పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. -
చిక్కుల్లో చిదంబరం కుటుంబం
సాక్షి, చెన్నై: ఆదాయ పన్ను శాఖ తాజా చర్యతో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుటుంబం మొత్తం చిక్కుల్లో పడింది. చిదంబరంతో సహా ఆయన భార్య నళిని, కుమారుడు కార్తి చిదంబరం, కోడలు శ్రీనిధిలపై ఆదాయ పన్నుశాఖ ఈ కీలక చర్యలకు దిగింది. నల్లధనం చట్టం కింద వీరిపై చార్జిషీట్లు దాఖలు చేసింది. చెన్నైలోని స్పెషల్ కోర్టు ముందు శుక్రవారం నాలుగు చార్జ్షీట్లను నమోదు చేసింది. ప్రత్యేక పన్నుల చట్టం కింద,(అప్రకటిత విదేశీయ ఆస్తులు, పెట్టుబడులు) సెక్షన్ 50 ప్రకారం ఈ ఆరోపణలను నమోదు చేసింది. నళిని, కార్తి, శ్రీనీధిలపై విదేశీ ఆస్తుల వివరాలను పూర్తిగా కానీ లేదా పాక్షికంగాగానీ ప్రకటించలేదంటూ ఐటీ శాఖ ఆరోపించింది. యూకేలోని కేంబ్రిడ్జ్లో రూ. 5.37 కోట్ల విలువైన స్థిరాస్తులు, 80 లక్షల ఆస్తి, అమెరికాలో 3.25 కోట్ల రూపాయల ఆస్తులను వెల్లడించలేదని అధికారులు తెలిపారు. చెస్ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ సహ యజమాని కార్తి చిదంబరం పెట్టుబడులను బహిర్గతం చేయకుండా చట్టా ఉల్లంఘనకు పాల్పడ్డారని చార్జిషీట్లో ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. కాగా ఈ ఆరోపణలను ఖండించిన కార్తి చిదంబరం తాను ఇప్పటికే వివరాలను సమర్పించినట్టు వాదిస్తూ మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో కార్తీకి, ఆయన కుటుంబ సభ్యులకు ఐటీ శాఖ ఇటీవల నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2015 లో మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. విదేశాల్లో అక్రమ సంపదను రహస్యంగా ఉంచిన భారతీయులకు 120 శాతం దాకా జరిమానాతోపాటు పదేళ్ల దాకా శిక్ష విధించే అవకాశ ఉంది. -
కార్తీ చిదంబరానికి మరో ఊరట
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఊరట లభించిన కార్తీ చిదంబరానికి, ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో కూడా మరో ఊరట లభించింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో ఏప్రిల్ 16 వరకు ఆయనను అరెస్ట్ చేయకుండా.. స్పెషల్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ సీబీఐ జడ్జి ఓపీ సైని, షరత్తులతో కూడిన ఈ ముందస్తు బెయిల్ను మంజూరు చేశారు. ఈ కేసులో ఎప్పుడు సమన్లు జారీచేస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని జడ్జి తెలిపారు. కార్తీ చిదంబరం ముందస్తు బెయిల్ ఫిర్యాదులపై మూడు వారాల్లోగా స్పందించాలని సీబీఐ, ఈడీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. 2006లో ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు అనుమతి ఇవ్వడానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ కేసు నమోదైంది. ఎఫ్ఐపీబీ అనుమతి కోసం కార్తీ చిదంబరం రూ.26 లక్షలను పుచ్చుకున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. నేడు గంట పాటు జరిగిన ఈ విచారణలో కార్తీ తరుఫున వాదించిన కపిల్ సిబాల్... ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో కార్తీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఎఫ్ఐపీబీ అధికారులు ఆయనకు తెలుసన్న రుజువులేమీ లేవన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిన్ననే(శుక్రవారమే) కార్తీకి బెయిల్ మంజూరైంది. -
కార్తీకి ఢిల్లీ హైకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: ‘ఐఎన్ఎక్స్ మీడియా’ అవినీతి కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తీకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు చూపాలని, ఒకవేళ దేశం విడిచి వెళ్లాల్సి వస్తే సీబీఐ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. బెయిల్పై బయట ఉన్న సమయంలో ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించింది. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు రూ.4.5 కోట్లు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఫిబ్రవరి 28న కార్తీని సీబీఐ అరెస్టు చేసింది. ఆ మేరకు కోర్టు విధించిన 12 రోజుల జ్యూడీషియల్ కస్టడీ శనివారంతో ముగియనుంది. -
కార్తీ చిదంబరానికి బెయిల్ మంజూరు
-
కార్తీ చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్టును తమకు సమర్పించాలని, విదేశాలకు వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాక బెయిల్ మంజూరు కోసం రూ.10 లక్షలను పూచీకత్తును సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. మార్చి 16న కార్తి, సీబీఐ వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు, తదుపరి నిర్ణయాన్ని రిజర్వులో పెట్టింది. ప్రస్తుతం కార్తికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను కార్తి తారుమారు చేశారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయకూడదంటూ సీబీఐ వాదించింది. అయితే సాక్ష్యాధారాల టాపరింగ్ చేసిన ఆరోపణలను కార్తి లాయర్లు ఖండించారు. తుదపరి కస్టోడియన్ ఇంటరాగేషన్ను సీబీఐ కోరనప్పుడు, ఇంకెందుకు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచిందని ప్రశ్నించారు. కార్తీపై ఇప్పటివరకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయలేదని వాదించారు. అంతేకాక ఈ కేసులో ఇప్పటివరకు ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో యూకే నుంచి వస్తున్న కార్తిని చెన్నై ఎయిర్పోర్టులో సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి వచ్చిన రూ.307 కోట్ల నిధులకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాకాల బోర్డ్ ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనే కార్తీకి రూ.10 లక్షల ముడుపులు ముట్టినట్లు మొదట్లో సీబీఐ ఆరోపించింది. ఆ తర్వాత ఆ మొత్తం రూ.6.5 కోట్లగా పేర్కొంది. -
‘బరువు తగ్గాలా....సీబీఐకి ఫోన్ చేయండి’
న్యూఢిల్లీ : బరువు తగ్గడానికి మనలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. జిమ్కి వెళ్లడం, వర్కవుట్లు చేయడం, ఆయసం వచ్చేలా పరుగులు పెట్టడం ఇవన్నీ బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా ఎంచుకుంటుంటారు. అయితే ఈ ఆపసోపాలేమీ పడక్కర్లేదట. బరువు తగ్గాలనుకునే వారందరికి సులువైన ఉపాయం చెప్తా అంటున్నారు కార్తీ చిదంబరం. అది ఏంటో ఆయన మాటల్లోనే విందాం...‘బరువు తగ్గాలనుకునే వారు జిమ్కు వెళ్లి కష్టపడక్కర్లేదు. కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సీబీఐ కస్టడీలో ఉంటూ వారి కాంటీన్ తిండి తింటే చాలు. వెంటనే బరువు తగ్గిపోతారు. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న నేను చాలా తక్కువ తింటున్నాను. ఫలితంగా చాలా బరువు కోల్పోయాను. ఇప్పుడు నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఎందుకంటే పాత బట్టలన్ని లూజ్ అయిపోయాయి'' అని తెలిపారు. 12 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కార్తీ చిదంబరాన్ని సోమవారం న్యూఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు. ఈ సందర్భంగా తన భద్రత దృష్ట్యా తీహార్ జైలులో తనకు ప్రత్యేక గదిని, బాత్రూమ్ని కేటాయించాలని కోర్టును అభ్యర్థించారు. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రాణా ఈ అభ్యర్థనను తిరస్కరించారు. జైలు అధికారులే కార్తీ భద్రతకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతిస్తామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఐఎన్ఎక్స్ కేసులో కార్తీ చిదంబరం నిందితుడిగా ఉన్నారు. తన తండ్రి పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ముఖర్జీల ఐఎన్ఎక్స్ మీడియా కంపెనీకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు క్లియరెన్స్ ఇప్పించడం కోసం వారి వద్ద నుంచి రూ. 3 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జీ స్టేట్మెంట్ను కూడా సీబీఐ రికార్డు చేసింది. ప్రస్తుతం ఐఎన్ఎక్స్ మీడియా హౌజ్కు సహవ్యవస్థాపకులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలు కూడా కుమార్తె షీనా బోరాను హత్య కేసులో జైలులో ఉన్నారు. పీటర్ ముఖర్జీని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కస్టడీకి తీసుకోనున్నామని సీబీఐ తెలిపింది. గత నెల 28న కార్తి చిదంబరాన్ని చెన్నై ఎయిర్పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
24 వరకు కార్తీకి జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తీని 24వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తీహార్ జైల్లో తనకు ప్రత్యేక గది, బాత్రూమ్ ఇవ్వాలన్న కార్తీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. జైల్లో తనకు ఇంటి భోజనం తినడానికి అవకాశం ఇవ్వాలని, అలంకార వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతించాలని కార్తీ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ను ఈ నెల 15న విచారించనున్నారు. -
కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ
-
కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎయిర్సెల్, మ్యాక్సిస్ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ(విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులపై సీబీఐ, ఈడీలు గత కొన్నేళ్ల నుంచి విచారణ చేస్తున్నాయి. ఈ విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిందేనని సుప్రీం గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందపు కేసు 2006 నాటిది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుతో పాటు కార్తి చిదంబరంపై ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులోనూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.600 కోట్లకు పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వాలంటే ఆ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించాలి. అయితే 2006లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.3,500 కోట్ల విలువైన ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ విషయమై సీబీఐ ఆర్థిక మంత్రికి రూ.600 కోట్లలోపు ఒప్పందాలకు అనుమతిచ్చే అధికారమే ఉందని, ఈ డీల్ అంతకుమించినదైనప్పటికీ ఎలా అనుమతిచ్చారంటూ సీబీఐ అప్పటి ఆర్థికమంత్రి చిందంబరాన్ని పలుమార్లు ప్రశ్నించింది. ఎయిర్సెల్కు ఎఫ్ఐపీబీ అనుమతి కోసం 2006 ఏప్రిల్ 11న రూ.26 లక్షల ముడుపులు కార్తి చిదంబరం పుచ్చుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. చిదంబరంతో పాటు కార్తిపై కూడా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు వస్తుండటంతో, ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీవ్ర ఉచ్చులో బిగుసుకుపోయిన కార్తికి ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. కార్తి బెయిల్పై మార్చి 15న విచారణ జరుగనుంది. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని, వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ కార్తి చిదంబరం కోరారు. అయితే కార్తీ వాదనను సీబీఐ కొట్టిపారేసింది. -
కార్తీ చిదంబరానికి ఝలక్
-
కార్తీకి కోర్టు ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఝలక్ తగిలింది. బెయిల్ పిటిషన్ ను మార్చి 15కు వాయిదా వేసిన కోర్టు.. కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్లు తీర్పునిచ్చింది. అంతకు ముందు అతన్ని అరెస్ట్(మార్చి 20వ తేదీ వరకు) చేయరాదని ఈడీని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ముందుగా ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అభ్యర్థించగా.. కోర్టు మాత్రం మూడు రోజులకు అనుమతిచ్చింది. దర్యాప్తు పొడిగించటంతో ఆయనకు మరిన్ని చిక్కులు తప్పేలా కనిపించటం లేదు. కార్తీని ఆయన అడిటర్తో సహా విచారణ చేపట్టే అవకాశం ఉందని.. అవసరమైతే నార్కో పరీక్షలు కూడా నిర్వహించే యోచనలో సీబీఐ ఉన్నట్లు సమాచారం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్పోర్ట్లో కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది. -
కార్తీకి మరో మూడు రోజుల కస్టడీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టు, ఢిల్లీ స్థానిక కోర్టుల్లోనూ ఊరట లభించలేదు. ఆయన సీబీఐ కస్టడీని ఢిల్లీ స్థానిక కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. బెయిల్ పిటిషన్ను సైతం వాయిదా వేసింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కార్తీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ ఐదు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన నేపథ్యంలో మంగళవారం అతడిని సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయమూర్తి సునీల్రాణా ఎదుట హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయని, వీటిలో కార్తీ పాత్రపై వాస్తవాలు తెలియాలంటే విచారణ తప్పనిసరి అని, అందువల్ల కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది. కార్తీని ముంబై తీసుకువెళ్లి ఐఎన్ఎక్స్ మీడియా మాజీ ప్రమోటర్, ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జియాతో కలిపి విచారించాల్సి ఉందని, ఈ కేసులో ఆమె వాంగ్మూలం ఓ కీలక ఆధారమని విజ్ఞప్తి చేసింది. -
కార్తీకి సుప్రీంకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. కార్తీ ముందస్తు బెయిల్ పిటిషన్ను మంగళవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కార్తీపై నమోదైన మనీలాండరింగ్ కేసుపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ముందస్తు అరెస్ట్లను నివారించేందుకు ఎలాంటి రక్షణ ఇవ్వబోమన్న సర్వోన్నత న్యాయస్ధానం కేసు విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. తనకు ఈడీ జారీ చేసిన సమన్లను కొట్టివేయాలంటూ కార్తీ చిదంబరం సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవినీతి కేసును విచారిస్తున్న సీబీఐ బైకుల్లా సెంట్రల్ జైల్లో కార్తీని ప్రశ్నిస్తోంది. తన తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్ లభించేలా చేసేందుకు కార్తీ చిదంబరానికి భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే సీబీఐ వాదన అవాస్తవమని..రాజకీయ కక్షతోనే తనను వేధిస్తున్నారని కార్తీ ఆరోపిస్తున్నారు. -
సుప్రీంకోర్టుకు కార్తి
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ.. ఆయన సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ అధికారాన్ని కార్తి సవాల్ చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదుచేయని విషయాలపై సీబీఐ, ఈడీలు తనను ప్రశ్నిస్తున్నాయని కార్తి చిదంబరం అన్నారు. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక కోర్డు అక్రమంగా ఆమోదించిందంటూ దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయన్నారు. కాగ, ఈ ఎఫ్ఐపీబీ క్లియరెన్స్ కోసం ముంబైకి చెందిన ఐఎన్ఎక్స్ మీడియా నుంచి కార్తి చిదంబరం రూ.3.5 కోట్లను పొందారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో కార్తి తండ్రి చిదంబరం కేంద్రంలో కీలక శాఖను నిర్వహిస్తున్నారు. ఈ కేసుపై కోర్టు రేపు వాదనలు విననుంది. తనకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలన్నీ తప్పుడవేనని, రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈ ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇంద్రాణి ముఖర్జీతో పాటు బైకుల్లా జైలులో కార్తిని ప్రశ్నించిన అనంతరం, ఆయనను ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. -
ఇంద్రాణితో కలిపి కార్తీ విచారణ
ముంబై: ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా సీబీఐ ఆదివారం కార్తీ చిదంబరంను ఢిల్లీ నుంచి ముంబైలోని బైకుల్లా జైలుకు తీసుకు వచ్చింది. అక్కడ ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్, షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియాతో కలిపి విచారణ జరిపింది. ఇద్దరినీ ఒకే చోట కూర్చోబెట్టిన ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం ఉదయం 11.15 గంటల నుంచి నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కార్తీని తిరిగి విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇద్దరినీ విచారణ జరుపుతున్న సమయంలో బైకుల్లా జైలు గేట్లను మూసి వేశారు. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఆయన కుమారుడు కార్తీ నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ నిధులకు అనుమతులు మంజూరు చేయించారనీ ఇంద్రాణి ఇటీవల సీబీఐ ఎదుట అంగీకరించారు. -
చిదంబరంను ప్రశ్నించనున్న సీబీఐ?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బడ్జెట్ రెండో దశ సమావేశాలు, కాంగ్రెస్ ప్లీనరీ నేపథ్యంలో ఐఎన్ఎక్స్ మీడియా అవీనితి కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరంను సీబీఐ ప్రశ్నించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో ఆయన కొడుకు కార్తీ అరెస్టయిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు ‘నీరవ్ మోదీ..’ అని నినాదాలు చేస్తే తాము ‘చిదంబరం..’ అని నినదిస్తామని కొందరు బీజేపీ ఎంపీలు బహిరంగంగానే ప్రకటించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం ద్వారా తమ ప్రతిష్టకు జరిగిన నష్టాన్ని కొంతవరకైనా భర్తీ చేసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. -
కార్తీ (చిదంబరం తనయుడు) రాయని డైరీ
కస్టడీ కంఫర్ట్గా ఉంది. ఫేస్లే ఫ్రెండ్లీగా లేవు. క్వొశ్చన్స్ కూడా కంఫర్ట్గా ఉన్నాయి. క్వొశ్చనింగే అన్ఫ్రెండ్లీగా ఉంది. ‘ఎంత తిన్నావ్?’ అని నవ్వుతూ అడిగితే, ‘ఇంత తిన్నాను’ అని నవ్వుతూ చెప్పనా?! నేనెక్కడ నవ్వుతూ చెబుతానోనని, నాకెక్కడా నవ్వు రాకుండా అడుగుతున్నారు వీళ్లు. అయినాగానీ సడన్గా నవ్వొచ్చేస్తోంది. ‘‘ఊరికే నవ్వెందుకొస్తుంటుంది! నువ్వు ఎవరి అదుపులో ఉన్నావో తెలుసా?’’ అన్నారు రెండో రోజు ఇంటరాగేషన్లో. ‘‘నేను ఎవరి అదుపులో ఉన్నా, నవ్వు నా అదుపులో ఉండదు. నవ్వడం నాకు ఇష్టం’’ అన్నాను. ‘‘నీ ఇష్టం నీ ఇంట్లో’’ అన్నాడు కుర్ర ఆఫీసర్. అతడెక్కడో ఆ మాట విన్నట్లున్నాడు. దాన్ని నా మీద ప్రయోగించాడు. అలాంటివే ఏవో రెండు మూడు కూడా ఉదయం ఇంటరాగేషన్ మొదలవగానే అతడే ప్రయోగించాడు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగితే తెలియదనుకున్నావా? చట్టానికి వెయ్యి కళ్లు.. ఇలాంటివి! ‘‘నా ఇష్టం నా ఇంట్లోనా! అయితే నన్ను ఇంటికి పంపించండి. కాసేపు నవ్వుకుని వచ్చేస్తాను’’ అన్నాను. కుర్ర ఆఫీసర్కి నవ్వు రాబోయింది. ఆపుకున్నాడు. సీనియర్ ఆఫీసర్లకు కోపం రాబోయింది. ఆపుకున్నారు. ఈ ఆఫీసర్లెందుకో రాబోతున్న దానిని ఆపుకుంటారు! సీబీఐ ఆఫీసర్ ఆపుకుంటున్నాడని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆపుకుంటున్నాడనీ, అడ్వొకేట్ జనరల్ ఆపుకుంటున్నాడనీ.. నేనెందుకు ఆపుకోవాలి?! ‘‘నా నవ్వును ఆపకండి. ఆపితే, నవ్వుతో పాటు, నా ఆన్సర్లూ ఆగిపోతాయి’’ అని నవ్వాను. ‘‘నీతో నిజం ఎలా కక్కించాలో మాకు తెలుసు’’ అన్నాడు కుర్రాఫీసర్. అతడిని సీరియస్గా చూశాడు సీనియర్ ఆఫీసర్. ‘‘సారీ సర్.. బెదిరిస్తే నవ్వు ఆపుతాడనీ..’’ అన్నాడు కుర్రాఫీసర్. ‘‘బెదిరిస్తే నా నవ్వు ఇంకా ఎక్కువౌతుంది. చిన్నప్పుడు స్కూల్లో మా హెడ్మాస్టర్ నవ్వొద్దని చెప్పినందుకు నేను నవ్వును ఆపుకోలేక చచ్చాను’’ అని చెప్పాను. ‘‘తర్వాతేమైంది?’’ అని ఆసక్తిగా అడిగాడు కుర్రాఫీసర్. అతడి వైపు మళ్లీ సీరియస్గా చూశాడు సీనియర్ ఆఫీసర్. సాయంత్రం అయింది. ‘‘మళ్లీ రేపొస్తాం. రేపైనా నవ్వకుండా చెప్పు’’ అని కుర్చీల్లోంచి లేచారు ఆఫీసర్లు. ‘‘ఒక్కసారి సెల్ఫోన్ ఇవ్వండి. మా మమ్మీడాడీతో మాట్లాడి ఇచ్చేస్తాను’’ అన్నాను. ఆఫీసర్ల ముఖంలోకి నవ్వొచ్చింది! ‘‘ఈ ఐదు రోజులూ మీ లాయరే మీ మమ్మీడాడీ. అది కూడా, రోజుకు ఒక గంట మాత్రమే అతడు మీ మమ్మీడాడీ’’ అని, అందరూ ఒకేసారి వెళ్లిపోయారు. సీబీఐ ఆఫీసర్లైనా నవ్వితే ఎంత కళగా ఉంటారు!! రేపు వచ్చినప్పుడు వాళ్లకీ సంగతి చెప్పాలి. - మాధవ్ శింగరాజు -
మరిన్ని కేసుల్లో కార్తీ పాత్ర!
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టై సీబీఐ రిమాండ్లో ఉన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకోనుంది. సీబీఐ, ఈడీ అధికారులు చెబుతున్న ప్రకారం ఐఎన్ఎక్స్ మీడియా కేసుతోపాటు మరిన్ని కేసుల్లో కార్తీ పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో జూనియర్ చిదంబరంపై మరికొన్ని కేసులు నమోదు చేసేందుకు ఈ రెండు విచారణ సంస్థలు సిద్ధమవుతున్నాయి. యూపీఏ హయాంలో భారతదేశంలోని పలు కంపెనీలకు విదేశీ పెట్టుబడులకు అనుమతులు వచ్చేలా చేసేందుకు కార్తీ చక్రం తిప్పారని.. ఇందుకోసం భారీమొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఈడీ వెల్లడించింది. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్సీపీఎల్) సంస్థ పేరుతోనే ఈ లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. రెండు కంపెనీలు ఇలా అనుమతులు పొందిన ఆధారాలున్నాయని.. మిగిలిన వివరాలు సంపాదిస్తామని ఈడీ అధికారులు తెలిపారు. కార్తీ కంపెనీ రంగంలోకి దిగగానే అన్ని అనుమతులు చకచకా వచ్చేశాయని గుర్తుచేశారు. అయితే కార్తీ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాత్రం ఈ విషయం ఇంతవరకు తన దృష్టికి రాలేదన్నారు. తొలిరోజు విచారణలో.. తమ కస్టడీలో ఉన్న కార్తీపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఐదురోజుల రిమాండ్కు కోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో తొలిరోజైన శుక్రవారం ఉదయం 8 గంటలనుంచే విచారణ మొదలుపెట్టింది. ఐఎన్ఎక్స్ మీడియాతో పాటు పలు ఇతర కేసుల్లో కార్తీ పాత్రపై ప్రశ్నలు సంధించింది. దీంతోపాటు ఇటీవలి విదేశీ పర్యటనలో ఈ కేసులకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారనే అంశంపైనా గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు తెలిసింది. శుక్రవారం గంటసేపు కార్తీ తన న్యాయవాదితో మాట్లాడేందుకు సీబీఐ అవకాశమిచ్చింది. కార్తీ సహకరించట్లేదు: సీబీఐ కస్టడీలో ఉన్న కార్తీ విచారణకు సహకరించటం లేదని ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నాడని సీబీఐ అధికారులు చెబుతున్నారు. విచారణ ప్రారంభమైనప్పటినుంచీ.. అసలు విషయాలను పక్కనపెట్టి అనవసర అంశాలతో సమయాన్ని వ్యర్థం చేస్తున్నాడన్నారు. స్విగ్గీ, జొమాటోల ద్వారా తనకు భోజనం ఆర్డర్ చేయాలని పట్టుబడుతున్నారన్నారు. చెన్నై ఎయిర్పోర్టులో అరెస్టయినప్పటినుంచీ కార్తీ ఇలాగే వ్యవహరిస్తున్నారని.. ఎకానమీ క్లాస్లో ఎక్కనని, తనకు బిజినెస్ క్లాస్లో టికెట్ బుక్ చేయాలని పట్టుబట్టాడని వెల్లడించారు. కోర్టు కస్టడీకి ఇవ్వగానే తనకు ఇంట్లో వండిన భోజనమే కావాలని డిమాండ్ చేశాడన్నారు. బంగారు చైన్, ఉంగరం తీసేయాలని చెప్పగా.. మతవిశ్వాసమని చెప్పి నిరాకరించాడన్నారు. కోర్టులో ఉండగా తన మిత్రుడితో కార్తీ తమిళంలో మాట్లాడారు. ఇంగ్లీష్లో మాట్లాడాలని సీబీఐ అధికారులు కోరగా.. ‘అలాగైతే.. నేను ఉన్నప్పుడు మీరు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకోండి’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ‘మీరు కస్టడీలో ఉన్నారు. మేము కాద’ని అధికారులు ఘాటుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. -
కార్తీకి ఐదు రోజుల కస్టడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కార్తీ చిదంబరంను ఐదురోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. కార్తీకి సంబంధించి ఈ కేసుల్లో ఆశ్చర్యకర సాక్ష్యాలున్నాయని వీటిని రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ విజ్ఞప్తి మేరకు మార్చి 6 వరకు కార్తీ కస్టడీని పొడిగిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు జడ్జి సునీల్ స్పష్టం చేశారు. కార్తీ విదేశాలకు వెళ్లి అక్రమ నిధులు దాచుకున్న వివాదాస్పద బ్యాంకు అకౌంట్లను క్లోజ్ చేశారని, దీనికి సంబంధించి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆధారాలున్నాయని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఒకరోజు కస్టడీ ముగియటంతో సీబీఐ గురువారం ప్రత్యేక కోర్టుముందు కార్తీని ప్రవేశపెట్టింది. ఈ సమయంలో చిదంబరం, ఆయన భార్య నళిని (ఇద్దరూ సీనియర్ లాయర్లే) కోర్టు హాల్లో ఉన్నారు. వీరిద్దరూ కార్తీతో కాసేపు మాట్లాడారు. కుట్రను బయటపెట్టండి: జడ్జి కార్తీ కస్టోడియల్ విచారణ ద్వారా ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన భారీ కుట్ర బయటపెట్టాలని జడ్జి సీబీఐకి సూచించారు. సీబీఐ చూపించే దస్తావేజులు, సహ నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాలతో కార్తీ అసలు విషయాన్ని అంగీకరించేందుకు ఈ కస్టడీ అవసరమన్నారు. కేసు డైరీ, రోజువారీ నివేదికల ఆధారంగా ఈ కేసు ఇప్పుడు కీలకదశలో ఉందని.. విచారణ ద్వారా మరిన్ని విషయాలు బయటపడే∙అవకాశం ఉన్నందునే కస్టడీ పొడిగించినట్లు జడ్జి తెలిపారు. సీబీఐ కస్టడీ సందర్భంగా న్యాయవాది సహకారం (రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో గంట చొప్పున) తీసుకునేందుకు కార్తీకి స్వేచ్ఛ కల్పించాలని ఆదేశించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుపై ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులను విచారించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు కమిటీ ముందు కార్తీ పలువురు సహనిందితులు పేర్కొన్న విషయాలను అంగీకరించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. రాజకీయ దురుద్దేశం లేదు సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ వాదిస్తూ.. ‘ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన అరెస్టు కాదు. ఆర్టికల్ 21 ప్రకారమే విచారణ జరుగుతోంది. విదేశాలకు వెళ్లి కార్తీ చిదంబరం ఏం చేశాడో తెలిపే ఆశ్చర్యకర సాక్ష్యాలున్నాయి’ అని జడ్జికి తెలిపారు. కార్తీ సాధారణ మెడికల్ చెకప్ సందర్భంగా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయనప్పటికీ బుధవారం సఫ్దర్జంగ్ ఆసుపత్రిలోని కార్డియాక్ కేర్ యూనిట్లో చికిత్స చేశారు. తర్వాతే గురువారం సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. హాస్పిటల్లో చేర్చినందున కార్తీ ఒకరోజు కస్టడీ వృధా అయ్యిందికనుకే కస్టడీని పొడిగించాలని జడ్జిని కోరారు. కార్తీ తరపున వాదిస్తున్న అభిషేక్ సింఘ్వీ.. ‘గతేడాది మేలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఆయన్ను 22 గంటలపాటు విచారించిన సీబీఐ ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయింది. సహకరించటం లేదనే కారణంతోనే అరెస్టు చేస్తారా? ఇది దారుణం’ అని అన్నారు. మెహుల్ చోక్సీకి మేలుచేసేలా.. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన 80:20 బంగారు దిగుమతి పథకం ద్వారా చాలా మంది బంగారు, వజ్రాభరణాల వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీలోని బీజేపీ సభ్యులు ఆరోపించారు. పీఎన్బీ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ మనీలాండరింగ్ కేసూ ఇందులో భాగమేనన్నారు. గురువారం రెవెన్యూ కార్యదర్శి, ఈడీ ఉన్నతాధికారులు, ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ), ఎక్సైజ్, కస్టమ్స్ కేంద్ర మండలి (సీబీఈసీ)ల అధికారులు పీఏసీ సబ్ కమిటీ ముందు హాజరయ్యారు. యూపీఏ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా దేశ ఖజానాకు రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లిందంటూ.. 2016లో కాగ్ ఇచ్చిన నివేదికపై వీరు చర్చించారు. ఈ పథకంలో భాగంగా వజ్రాల వ్యాపారులు ఒక డాలర్ సంపాదించేందుకు ప్రభుత్వం సుంకం రూపంలో రూ.221.75 చెల్లించింది. దీని ద్వారా దేశం నుంచి నల్లధనం బయటకెళ్లి వైట్ మనీగా తిరిగొచ్చిందని వారన్నారు. కోర్టు బయట కార్తీ. కోర్టుకు వస్తున్న కార్తీ తల్లిదండ్రులు నళిని, చిదంబరం విచారణ లిస్టులో చిదంబరం కార్తీతోపాటు చిదంబరం సీబీఐ, ఈడీ విచారణ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్సెల్–మ్యాక్సిస్ ఒప్పందంలో విదేశీ పెట్టుబడుల ఒప్పందానికి అనుమతివ్వటంలో చిదంబరం పాత్ర ఉందని సీబీఐ వాదిస్తోంది. కాగా, ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి మే 2007లో ఎఫ్ఐపీబీ ఇచ్చిన అనుమతులు తర్వాతి పరిణామాలపై కార్తీ ఏవిధంగా ఒత్తిడితెచ్చారనే అంశాన్ని విచారిస్తున్నామని సీబీఐ తెలిపింది. ‘మా దగ్గర కార్తీ చిదంబరానికి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్కి నిధులు బదిలీ అయినట్లు పేర్కొనే ఈ–మెయిల్స్, బిల్లులు ఉన్నాయి. కార్తీని దోషిగా నిలబెట్టేందుకు అవసరమైన సాక్ష్యాలున్నాయి. ఈయన నుంచి స్వాధీనం చేసుకున్న మూడు మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నాం. వీటన్నింటికోసం కనీసం 14రోజుల కస్టడీ అవసరం’ అని మెహతా కోర్టును కోరారు. -
కార్తీ కేసు సందడి!
ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతులు ఇప్పించడం కోసం లంచం తీసుకున్నారన్న ఆరోపణపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని బుధ వారం సీబీఐ అరెస్టు చేసింది. కార్తీని 5 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ గురువారం ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. అధికారంలో ఉండగా రాజ కీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేందుకు సీబీఐని ఉపయోగించుకున్నదని ఆరో పణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు ఈ కేసు విషయంలో అదే ఆరోపణ చేస్తున్నది. దానిలోని నిజానిజాల సంగతలా ఉంచి బ్రిటన్ నుంచి వచ్చిన కార్తీని చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేసినప్పుడు చోటుచేసుకున్న హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. ఆ హడావుడి చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి పరారైన నీరవ్మోదీ తరహాలో వేరే దేశానికి కార్తీ పరారవుతున్నాడేమో, దాన్ని నివారించడానికి సీబీఐ వలపన్ని అరెస్టు చేయాలని చూస్తున్నదేమోనన్న అ నుమానం కలుగుతుంది. కానీ ఆయన మరో దేశం నుంచి ఇక్కడ అడుగుపెట్టాడు. ఈ కేసులో నిరుడు మే నెలలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారం యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2007 నాటిది. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా ఆ సంవత్సరం మార్చి 13న ఎఫ్ఐపీబీని ఆశ్రయించగా, రూ. 4.62 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) తెచ్చుకునేందుకు ఆ ఏడాది మే 30న దానికి అనుమతి లభించింది. అయితే అదే సమయంలో తమ అనుబంధ సంస్థ ఐఎన్ఎక్స్ న్యూస్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలన్న ఆ సంస్థ వినతిని మాత్రం తిరస్కరించింది. అందుకు వేరే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఐఎన్ఎక్స్ మీడియా ఎఫ్ఐపీబీ తనకు విధించిన పరిమితుల్ని ఉల్లంఘించి రూ. 4.62 కోట్లకు బదులు రూ. 305 కోట్ల ఎఫ్డీఐలను తీసుకు రావడమేగాక అందులో 26 శాతాన్ని ఐఎన్ఎక్స్ న్యూస్కు మళ్లించింది. ఈ వ్యవహారంపై ఎఫ్ఐపీబీ ఐఎన్ఎక్స్ మీడియా నుంచి వివరణ కోరినప్పుడు కార్తీ చిదంబరం జోక్యం చేసుకుని ఆ మండలిలోని కొందరిని ప్రభావితం చేశారన్నది సీబీఐ ఆరోపణ. ఇలా ప్రభావితం చేసినందుకు ఆయన పరోక్షంగా నియంత్రిస్తున్న అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు ఐఎన్ఎక్స్ మీడియా నుంచి రూ. 10 లక్షలు ముట్టాయని సీబీఐ చెబుతోంది. ఆదాయపు పన్ను విభాగం దర్యాప్తు నుంచి తప్పించేందుకు కార్తీకి మరో మూడున్నర కోట్ల రూపాయలు, భారీయెత్తున షేర్లు అందాయన్నది మరో ఆరోపణ. ఇందుకు సంబంధించిన అనేక ఆధారాలు కార్తీ సీఏ భాస్కరరామన్ కంప్యూటర్లో లభించాయని సీబీఐ అంటోంది. కుమార్తె షీనాబోరాను హత్య చేసిన కేసులో విచారణనెదుర్కొంటున్న దంపతులు ఇంద్రాణీ ముఖర్జీ, పీటర్ ముఖర్జీలిద్దరూ కలిసి స్థాపించిన సంస్థ ఐఎన్ఎక్స్ మీడియా. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు రెండూ ఇప్పటికే ఈ కేసులో కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసి సోదాలు నిర్వహించాయి. ఆయనను ఈడీ అనేకసార్లు ప్రశ్నించింది. చివరకు విదేశాలకు వెళ్లే వీలు లేకుండా లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. నేరుగా కార్తీ సంస్థకు అందిన రూ. 10 లక్షలు కాక ఇతర ముడుపులు విదేశాల్లో ఆయన పేరనున్న ఖాతాల్లోకి చేరాయని ఈడీ ఆ రోపించింది. తన కుమార్తెను ఉన్నత చదువుల్లో చేర్చేందుకు బ్రిటన్ వెళ్లడానికి అవ రోధంగా ఉన్న లుకౌట్ నోటీసుకు వ్యతిరేకంగా కార్తీ గత నవంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అలా వెళ్లనిస్తే విదేశీ ఖాతాలన్నిటినీ ఆయన మాయం చేసే ప్రమాదమున్నదని సీబీఐ వాదించింది. చివరకు న్యాయస్థానం అనుమతితో కార్తీ వెళ్లి వచ్చారు. ఆయన వెళ్లాక బయటపడిన మరిన్ని ఆధారాలతోనే ప్రస్తుతం కార్తీని అరెస్టు చేయాల్సివచ్చిందని సీబీఐ చెబుతోంది. ఈ కేసు పరిధిని మరింత విస్తృతపరిచి చిదంబరాన్ని అరెస్టు చేస్తారా అన్నది కీలకమైన ప్రశ్న. కేంద్ర ఆర్థికమంత్రి హోదాలో ఎఫ్ఐపీబీకి చిదంబరం ఇన్చార్జి. తాము కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో చిదంబరాన్ని కలిసినప్పుడు కార్తీ వ్యాపారానికి సహకరించమని ఆయన తమను కోరారని పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. ఈ కేసు మాత్రమే కాదు...చిదంబరంపై భారత్కు చెందిన ఎయిర్సెల్ను 2006లో మలేసియా సంస్థ మాక్సిస్ టేకోవర్ చేయడానికి ఎఫ్ఐపీబీ అనుమతి మంజూరు చేసిన వ్యవహారం కూడా ఉంది. ఆ సమయంలో టెలికమ్యూనికేషన్ల రంగంలో గరిష్టంగా 74శాతం ఎఫ్డీఐలకు మాత్రమే అనుమతి ఉండగా మాక్సిస్ 99.3శాతం వరకూ పెట్టింది. పైగా నిబంధనల ప్రకారం ఎఫ్ఐపీబీ సిఫార్సులు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం(సీసీఈఏ)కు వెళ్లి అక్కడ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఆ ఫైలు అటు పోకుండానే చిదంబరం అనుమతులు మంజూరు చేశారన్నది ఆరోపణ. ఐఎన్ఎక్స్ మీడియాలోగానీ, ఎయిర్ సెల్–మాక్సిస్ వ్యవహారంలోగానీ పరిమితులకు మించి ఎఫ్డీఐలకు అనుమ తిం చడం అనుమానాలకు తావిస్తున్నదని బీజేపీ నాయకుడు సుబ్ర హ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఎయిర్సెల్ కేసును ‘అన్ని కోణాల్లోనూ’ దర్యాప్తు చేస్తున్నట్టు నిరుడు ఏప్రిల్లో సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే నిరుడు డిసెంబర్లో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి రాజాతోసహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేకకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుకు తెచ్చుకోవాలి. నిందితుల అపరాధాన్ని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాలను సేకరించడంలో, నిరూపించడంలో సీబీఐ ఘోరంగా విఫలమైం దని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కార్తీ కేసులో లభించాయంటున్న ఆధారాలు న్యాయస్థానాల్లో నిలబడేవిధంగా సీబీఐ దర్యాప్తు చేస్తుందా అన్నదే కీలకమైన ప్రశ్న. కార్తీ అరెస్టుకు చేసిన హడావుడి వల్ల కాంగ్రెస్కు రాజకీయంగా ఎంత నష్టం కలుగు తుందోగానీ...సరిగా నిరూపించలేకపోతే అప్రదిష్టపాలయ్యేది సీబీఐ మాత్రమే. -
'ఇంద్రాణికి మెంటల్.. మీరెలా నమ్మారు?'
సాక్షి, చెన్నై : కన్న కూతురును చంపిన కేసులో రెండేళ్లుగా జైలులో ఉంటున్న ఇంద్రాణి ముఖర్జియా మాటలు ఎలా పరిగణనలోకి తీసుకుంటారని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేసిన సందర్భంగా వారు ఈ ప్రశ్నను సందించారు. ఇంద్రాణి గత రెండేళ్లుగా జైలులో ఉంటోందని, ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఆమె ఏవీ చెబితే వాటిని నమ్మి అరెస్టు చేస్తారా అని దాదాపు 200మంది కాంగ్రెస్ పార్టీ నేతలు వల్లవార్ కొట్టాంలో పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ఇది బీజేపీ చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తప్ప మరొకటి కాదని అన్నారు. ఇంద్రాణి మాటలను కోర్టు స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని, ఆమె సరైన మానసిక స్థితిలో ఉండి చెప్పారో లేదో నిర్ధారించిన తర్వాతే పోలీసులు చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ఇష్టం వచ్చినట్లు చేయడం ఏమిటని నిలదీశారు. 'మీరు ఇంద్రాణి వాంగ్మూలాన్ని ఎలా విశ్వాసంలోకి తీసుకుంటారు? ఆమె మానసిక పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంది. రెండేళ్లుగా ఆమె జైలులో ఉంటోంది. ఆమె వాంగ్మూలాన్ని కోర్ట్ ఆఫ్ లా ప్రకారం మరోసారి ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ కేసు బీజేపీ రాజకీయ కక్ష సాధింపు మాత్రమే' అని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీటర్ అల్ఫాన్స్ అన్నారు. క్విడ్ ప్రో కో కింద చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు కార్తీ పెద్ద మొత్తంలో లంఛాలు తీసుకొని ఇంద్రాణి, ఆమె భర్త ముఖర్జియాకు మేలు కలిగేలా చేశారని, కొన్ని కేసుల నుంచి తప్పించారని దీంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం జరిగిందనే కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. -
కార్తీ చిదంబరం అరెస్టు
-
కార్తీ చిదంబరం అరెస్టు
న్యూఢిల్లీ: అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కొడుకు కార్తీని సీబీఐ బుధవారం చెన్నైలో అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యేందుకు లండన్ నుంచి భారత్కు వచ్చిన కార్తీని చెన్నై విమానాశ్రయంలోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడి కోర్టులో హాజరుపరిచింది. ఐఎన్ఎక్స్ మీడియా నుంచి కోట్ల రూపాయల మేర ముడుపులు అందుకున్న కేసులో కార్తీని ప్రశ్నించేందుకు 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా.. ఒకరోజు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ కోర్టులో హాజరుపర్చాలంది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కార్తీని అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఆరోపించగా.. ఇందులో ప్రభుత్వ జోక్యం ఏదీ లేదని, చట్ట ప్రకారమే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. అయితే, ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి నాటి ఆర్థిక మంత్రి చిదంబరంను కూడా కలిశామని అప్పటి ఐఎన్ఎక్స్ డైరెక్టర్లు ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ సీబీఐ, ఈడీల విచారణలో వెల్లడించడం సంచలనం రేపుతోంది. విచారణకు సహకరించడం లేదనే.. విచారణకు సహకరించకపోవడం వల్లనే కార్తీని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సీబీఐ స్పష్టం చేసింది. అలాగే, ఆయన పలుమార్లు విదేశాలకు వెళ్తుండటంతో అక్కడి బ్యాంకుల్లోని సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉందంది. విచారణకు హాజరవకుండా పూర్తిగా విదేశాల్లోనే ఉండిపోయే పరిస్థితి కూడా ఉందని, అందువల్లనే అదుపులోకి తీసుకుని విచారిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ వాదనను కార్తీ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. గతంలోనే ఎన్నోసార్లు సీబీఐ, ఈడీలు కార్తిని విచారించాయనీ, ఇప్పుడు కూడా ఈడీ విచారణకు హాజరవ్వడానికే ఆయన భారత్ వచ్చారని కోర్టుకు తెలిపారు. ఆయన అరెస్టుకు సరైన కారణాలే లేవన్నారు. కాగా, ఐఎన్ఎక్స్ మీడియా కేసుతోపాటు 2006లో ఎయిర్సెల్–మ్యాక్సిస్ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులపై కూడా సీబీఐ విచారిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీలాండరింగ్ కేసులో కార్తీని ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. రాజకీయ కక్షతోనే.. రాజకీయ కక్షతోనే బీజేపీ ప్రభుత్వం కార్తీని అరెస్టు చేయించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్డీయే హయాంలో వెలుగుచూస్తున్న కుంభకోణాలు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఎత్తుగడ వేసిందంది. కాంగ్రెస్ ప్రజలకు నిజాలు చెప్పడాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరని ఆ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. కాంగ్రెస్పై విమర్శలు చేయడానికి బీభత్సంగా మాటలను వాడే ప్రధాని మోదీ.. గత 10 రోజుల్లో బీజేపీ హయంలో రూ. 30 వేల కోట్ల కుంభకోణాలు బయటపడినా నోరు తెరవడం లేదన్నారు. ‘వేల కోట్లు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాను ప్రభుత్వం ఏం చేయదు. కేసు విచారణకు హాజరయ్యేందుకు విదేశం నుంచి తిరిగొచ్చిన కార్తీని అరెస్టు చేస్తుంది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. ప్రభుత్వ జోక్యం లేదు.. కార్తీ చిదంబరం కేసులో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదనీ, ఉండదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చట్టం ప్రకారమే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనీ ఆయన తప్పు చేశారో లేదో ఆధారాలే చెబుతాయని పేర్కొన్నారు. కేసు విచారణకు రాకముందే.. సీబీఐ, ఈడీలు తప్పుడు కేసులతో తనను, తన కుటుంబ సభ్యలను తరచూ వేధిస్తున్నాయని, తమ ప్రాథమిక హక్కులను రక్షించాలని కోరుతూ చిదంబరం గతవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దర్యాప్తు సంస్థలు తమపై ‘అక్రమ విచారణలు’ జరపకుండా అడ్డుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు. అయితే సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్ ఇంకా విచారణకు కూడా రాకముందే కార్తిని సీబీఐ అరెస్టు చేయడం గమనార్హం. మార్చి 1న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసుపై స్టే విధించాలనీ, లేదా కనీసం విచారణను కొద్దికాలం వాయిదా వేయాలంటూ కార్తి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. గతవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కార్తి తరఫున వాదిస్తున్న కపిల్ సిబల్ కూడా ‘మీరు కార్తీని అరెస్టు చేయాలని అనుకుంటున్నారా?’ అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించడం గమనార్హం. ఏమిటీ ఐఎన్ఎక్స్ కేసు? ఐఎన్ఎక్స్ మీడియా కేసు 2007 మార్చిలో పి.చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటిది. కూతురి హత్యకేసులో నిందితులుగా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న భార్యాభర్తలు ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీల చేతుల్లో అప్పట్లో ఈ కంపెనీ ఉండేది. తమ కంపెనీలోకి 46 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను అనుమతించాలంటూ వారు.. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ)కి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల అనంతరం ఎఫ్ఐపీబీ ఐఎన్ఎక్స్ మీడియాలో 46 శాతం ఎఫ్డీఐకి అనుమతినిచ్చింది. అయితే అప్పటికే 26 శాతం ఎఫ్డీఐలు ఐఎన్ఎక్స్లో ఉన్నాయి. ఆ విషయాన్ని ముఖర్జీలు ఎఫ్ఐపీబీ వద్ద దాచిపెట్టారు. పరిమితికి మించి రూ. 305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులను తీసుకున్నారు. ఈ అవకతవకలను ఆదాయ పన్ను శాఖ గుర్తించి, ఆర్థిక శాఖను సైతం అప్రమత్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ సూచన మేరకు గతేడాది మే 15న సీబీఐ తొలి కేసును నమోదు చేసింది. ఆ తర్వాత జరిపిన సోదాల్లో తమకు పలు ఆధారాలు లభించాయని ఈడీ, సీబీఐలు చెబుతున్నాయి. తండ్రి మద్దతుతోనే.. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతుల విషయంలో జరిగిన ఉల్లంఘనలను సరిచేసేందుకు కార్తీ తమ నుంచి పది లక్షల డాలర్లు తీసుకున్నట్లు ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీ ఇటీవల సీబీఐ విచారణలో బయటపెట్టారు. అందుకు అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న తన తండ్రి పీ చిదంబరం సహకరిస్తారని కార్తీ చెప్పాడని వారు వెల్లడించారు. ‘కార్తీ కోరిన 10 లక్షల డాలర్లలో 7 లక్షల డాలర్లను(రూ.3.10 కోట్లు) కార్తీకి విదేశాల్లోని ఆయన అనుబంధ సంస్థల ద్వారా అందించాం’ అని ముఖర్జీలు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. ‘ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ. 305 కోట్ల విదేశీ పెట్టుబడులను అక్రమంగా పొందాం. ఆ పెట్టుబడులను క్రమబద్ధీకరించేందుకు కార్తీని సంప్రదించాం. అనంతరం ఆయనకు చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్సీపీఎల్), దాని అనుబంధ సంస్థలకు 7 లక్షల డాలర్లు(రూ. 3.10 కోట్లు) అందజేశాం. ఆ తరువాత మా ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడుల అంశానికి లైన్ క్లియరైంది’ అని ఇంద్రాణి, పీటర్లు వెల్లడించినట్లుగా తన దర్యాప్తు నివేదికల్లో సీబీఐ, ఈడీ తెలిపాయి. అనుమతులివ్వవద్దంటూ ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు సూచించిన విషయాన్ని కూడా సీబీఐ ప్రస్తావించింది. చిదంబరంను అరెస్టు చేసే అవకాశం సీబీఐ, ఈడీల విచారణలో మరో విషయాన్ని కూడా పీటర్, ఇంద్రాణి ముఖర్జీలు బయటపెట్టారు. అక్రమ లావాదేవీలను క్రమబద్ధం చేసుకునే క్రమంలో భాగంగా తాము అప్పటి ఆర్థికమంత్రి చిదంబరంను నార్త్బ్లాక్లోని ఆయన కార్యాలయంలో కలిశామని వెల్లడించారు. ‘నా కుమారుడి వ్యాపారాలకు సహకరించండి. అందుకు విదేశీ నిధులందజేయండి’ అని చిదంబరం తమను కోరారని దర్యాప్తు సంస్థలకు తెలిపారు. ఆ తరువాత తాము ఢిల్లీలోని పార్క్ హయత్ హోటల్లో కార్తీని కలిశామని, తమ పని చేసేందుకు ఆయన 10 లక్షల డాలర్లు కోరారని దర్యాప్తులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను కూడా దర్యాప్తు సంస్థలు ప్రశ్నించే అవకాశముందని, అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కార్తీ – ఐఎన్ఎక్స్ మీడియా కేసు పూర్వాపరాలు 2017 మే 15: ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి 2007లో రూ.305 కోట్ల పెట్టుబడులను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతించటంలో అవకతవకలు జరిగాయనీ, ఆ సమయంలో కార్తీ తండ్రి చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. 2017 జూన్ 16: కేంద్ర హోం శాఖలోని ది ఫారినర్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఎఫ్ఆర్ఆర్వో), బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్లు కార్తీపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశాయి. 2017 ఆగస్టు 10: లుకౌట్ సర్క్యులర్పై మద్రాస్ హైకోర్టు స్టే. వారెంట్లు లేనందున లుకౌట్ నోటీసు చెల్లదని తీర్పు. 2017 ఆగస్టు 14: మద్రాస్ హైకోర్టు స్టే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2017 ఆగస్టు 18: ఆగస్టు 23న సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా కార్తీకి సుప్రీంకోర్టు ఆదేశం. 2017 ఆగస్టు 23: సీబీఐ కోర్టులో హాజరైన కార్తీ 2017 సెప్టెంబర్ 11: కార్తీకి విదేశాల్లో ఉన్నట్లు భావిస్తున్న 25 ఆస్తుల వివరాలను, లావాదేవీలను సీబీఐ సీల్డు కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. 2017 సెప్టెంబర్ 22: విదేశాల్లో బ్యాంకు అకౌంట్లను కార్తీ మూసివేస్తున్నందున దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకున్నట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. 2017 అక్టోబర్ 9: కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తన కుమార్తెను చేర్పించేందుకు లండన్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో కార్తీ పిటిషన్ వేశారు. అక్కడ ఏ బ్యాంకుకూ వెళ్లబోనని అందులో పేర్కొన్నారు. 2017 అక్టోబర్ 9: బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే తనను, తన కుమారుడిని వేధిస్తోందంటూ చిదంబరం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2017 డిసెంబర్ 8: ఎయిర్సెల్–మాక్సిస్ కేసులో సీబీఐ సమన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కార్తీ. 2018 జనవరి 31: తనతోపాటు మరికొందరిపై ఉన్న రెండు లుకౌట్ నోటీసులపై కార్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచింది. 2018 ఫిబ్రవరి 16: దేశ, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టటంలో సహకరించారంటూ కార్తీ చార్టెర్డ్ అకౌంటెంట్భాస్కరరామన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2018 ఫిబ్రవరి 24: సీబీఐ దర్యాప్తుతో తన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందనీ, వెంటనే నిలిపివేసేలా ఆదేశివ్వాలని సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్ వేశారు. -
కార్తీ చిదంబరం సీఏ అరెస్ట్..
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తీ చార్టెర్డ్ అకౌంటెంట్(సీఏ)ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. దీంతోపాటు చెన్నైలోని కార్తీ సంబంధీకుల ఇళ్లలో సోదాలు జరిపింది. ఢిల్లీలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఉన్న కార్తీ సీఏ భాస్కరరామన్ను ఈడీ అదుపులోకి తీసుకుని స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచింది. అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలను రాబట్టేందుకు భాస్కరరామన్ను విచారించాల్సిన అవసరముందని పేర్కొంది. సీఏను జడ్జి ఐదురోజుల రిమాండ్కు పంపారు. -
కార్తీ చిదంబరం కార్యలయాలపై ఈడీ దాడులు
-
కార్తీ చిదంబరం నివాసాలపై ఈడీ దాడులు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంపై మరోసారి ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దాడులు నిర్వహించింది. ఢిల్లీతో పాటు చెన్నైలోని కార్తీ చిదంబరం నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారం కేసులో ఈడీ మళ్లీ సోదాలు చేపట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం కార్తీ చిదంబరం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన గైర్హాజరు అయ్యారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. కాగా 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు కేటాయింపుల విషయంలో అవకతవకలు వెలుగులోకి రాగా, పెద్ద స్కాం బయటపడింది. దీంతో కార్తీపై ఈడీ... మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా పదేళ్ల తర్వాత కార్తీ పాత్ర వెలుగు చూడటంతో ఉందంటూ గత యేడాది మే 16న కార్తీ నివాసంతోపాటు ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఛండీగఢ్ లలో మొత్తం 13 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. కార్తీతోపాటు ఐఎన్ఎక్స్ మీడియా అధిపతులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీయాలకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియాకు దొడ్డిదారిలో అనుమతులు మంజూరు చేయించినట్టు కార్తీపై ఆరోపణలు ఉన్నాయి. -
కార్తీ చిదంబరానికి మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎయిర్ సెల్ మాక్సిస్లో సీరియస్గా స్పందించిన ఈడీ కోటికిపైగా ఆస్తులను ఎటాచ్ చేసింది. ఎఫ్డీలు, బ్యాంక్ అకౌంట్లతోపాటు గుర్గావ్లో ఇంటిని సీజ్ చేసింది. కార్తీకి చెందిన రూ. 1.16 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఎటాచ్ చేసింది. ముఖ్యంగా అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ASCPL) పేరుతో ఉన్న రూ. 26 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను,ఇతర రూ. 96లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. గుర్గావ్లోని ఇంటిని బినామీ పేరుతో నిర్వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. -
ఐఎన్ఎక్స్ కేసు: కార్తీకి మరో దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు మరో షాక్ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కార్తీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరం పాత్రపై ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫారినర్ రిజీయనల్ రిజిస్ట్రేషన్ శాఖ ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం వాటిపై స్టే విధిస్తూ ఆదేశాలివ్వగా, సీబీఐ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కార్తీని ఇండియాను వదిలి వెళ్లకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తూ సెప్టెంబర్ 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. లుక్ అవుట్ తేదీని కూడా సెప్టెంబర్ 11 వరకు పొడిగించింది. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు కేటాయింపుల విషయంలో అవకతవకలు వెలుగులోకి రాగా, పెద్ద స్కాం బయటపడింది. విచారణలో భాగంగా పదేళ్ల తర్వాత కార్తీ పాత్ర వెలుగు చూడటంతో ఉందంటూ ఈ యేడాది మే 16న కార్తీ నివాసంతోపాటు ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఛండీగఢ్ లలో మొత్తం 13 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. కార్తీతోపాటు ఐఎన్ఎక్స్ మీడియా అధిపతులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
కార్తీకి సుప్రీంలో చుక్కెదురు
-
కార్తీకి సుప్రీంలో చుక్కెదురు
► సీబీఐ విచారణకు హాజరవకుండా విదేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు ► లుకౌట్ నోటీసుల అంశంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసుల్లో సీబీఐ విచారణకు హాజరు కాకుండా విదేశాలకు వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది. అలాగే కార్తీపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లుకౌట్ నోటీసుల్ని నిలిపివేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ‘అతను దోషి అవునా.. కాదా! అన్న అంశం జోలికి మేం పోలేదు. కార్తీ విచారణకు హాజరై సహకరిస్తాడా? లేదా? అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. విచారణకు హాజరుకావాలని సీబీఐ కోరింది. మీరు హాజరు కాలేదు. మొదట విదేశాల్లో ఉన్నానని చెప్పారు. అక్కడి నుంచి వచ్చాక కూడా విచారణకు సహకరించలేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం పేర్కొంది. విచారణకు హాజరై కార్తీ తన విశ్వసనీయతను నిరూపించుకోవాలంది. కార్తీ తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రమ ణియంపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపిం చింది. ‘కార్తీ అరెస్టుకు ఎలాంటి ఉత్తర్వులు లేవు. అతన్ని అరెస్టు చేసే ఆలోచన కూడా లేదు. అయినా విచారణకు ఎందుకు దూరం గా ఉన్నారు.? అలాగే ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మాత్రమే మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారు. కానీ మీరు అలా చేయలేదు. అంటే అరెస్టు గురించి మీరు భయపడడం లేదు’ అని పేర్కొంది. విచా రణకు ఎప్పుడు హాజరవుతారో సమయం తెలపాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో కార్తీకి, మరో నలుగురికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది. విదేశాలకు అనుమతిలో... కక్షిదారు నుంచి వివరాలు తీసుకుని కోర్టుకు సమర్పిస్తానని, అదే సమయంలో కార్తీ రక్షణ విషయంలో సుప్రీంకోర్టు భరోసా ఇవ్వాలని సుబ్రమణియమ్ కోరారు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ‘కొందరు ప్రముఖ వ్యక్తులకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి విషయంలో కోర్టుకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. వెళ్లిన వారు ఇంకా తిరిగి రాలేదు’ అని పేర్కొంది. ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసును ఉదహరిస్తూ.. మలేసియా వెళ్లేందుకు అనుమతించిన వ్యక్తులు తిరిగి రాలేదని ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా కార్తీ, ఇతరులపై జారీ చేసిన లుకౌట్ నోటీసులపై మద్రాసు హైకోర్టు ఉత్తర్వుల్ని నిలిపివేస్తూ.. ఎఫ్ఐఆర్ రద్దు పిటిషన్ను చట్ట పరిధికి లోబడి పరిష్కరించాలని సూచించింది. ఎఫ్ఐఆర్ రద్దు పిటిషన్పై తుది ఉత్తర్వుల కోసం కార్తీ ప్రయత్నాలు కొనసాగించాలని, ఒకవేళ అత ను విజయం సాధిస్తే విచారణను నిలిపి వేస్తామని సుప్రీం తెలిపింది. అయినా అతను విదేశాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. -
చిదంబరం తనయుడికి ఊరట
సాక్షి, చెన్నై: కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి మద్రాస్ హైకోర్టులో ఊరట కలిగింది. సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్తుల జాబితాలో చేరుస్తూ జారీ చేసిన లుకౌట్ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లేందుకు అడ్డంకి తొలగినట్లయింది. కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగుతున్న కార్తీ ఓ వ్యాపార వేత్త కూడా. ఆయన వివిధ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని, విదేశీ మారకం విషయంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల పేరిట ఐటీ, సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. అయితే, ఈ సంస్థలు నిర్వహిస్తున్న విచారణకు కార్తీ హాజరుకావడం లేదని ఆయనపై లుకౌట్ నోటీసులను విడుదల చేసింది. సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్తుల జాబితాలో కార్తీని కేంద్ర హోం మంత్రిత్వశాఖ చేర్చింది. ఆయన విదేశీయానంపై నిషేధం విధించింది. అయితే, లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో..వీటిని వ్యతిరేకిస్తూ కార్తీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది. షెల్ కంపెనీల నుంచి భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం పొందినట్లుగా కార్తీపై సీబీఐ అభియోగం. -
కార్తీపై లుక్ ఔట్ నోటీసులు
సాక్షి, చెన్నై: సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్తుల జాబితాలో కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ చేర్చింది. ఆయన విదేశీయానంపై నిషేధం విధించింది. ఐటీ, సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణకు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో..వీటిని వ్యతిరేకిస్తూ శుక్రవారం కార్తీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై ఈనెల 7వ తేదీన విచారణ జరగనుంది. షెల్ కంపెనీల నుంచి భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం పొందినట్లుగా కార్తీపై సీబీఐ అభియోగం. -
కేంద్రం అసలు టార్గెట్ నేనే... కార్తీ కాదు..
చెన్నై: కేంద్రం గురి అంతా తన మీదే ఉందని మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. తన కుమారుడు కార్తీని అడ్డం పెట్టుకుని తనను ఇరకాటంలో పెట్టేందుకు తీవ్ర కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ జాతీయ రాజకీయల్లో కీలక నేతగా ఉన్న పి.చిదంబరం కుటుంబం మీద ఇటీవల కాలంగా ఆరోపణల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. శారదా చిట్ ఫండ్ కేసులో ఆయన సతీమణి నళిని చిదంబరం ప్రమేయం ఉన్నట్టుగా ఓవైపు విచారణ సాగుతోంది. అలాగే, ఆయన తనయుడు కార్తీ చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ మీడియా, వాసన్ హెల్త్ కేర్లోకి విదేశీ పెట్టుబడుల రాక వ్యవహారాలు ఉచ్చుగా మారి ఉన్నాయి. ఇటీవల సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ల దాడుల పర్వం సాగాయి. విచారణ వేగవంతం అయింది. కార్తీ విదేశాల్లో ఉండటంతో, రాగానే, అరెస్టుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టు ప్రచారం ఊపందుకుని ఉంది. ఈ పరిస్థితుల్లో ఓ మీడియాతో నిన్న చిదంబరం మాట్లాడుతూ, కేంద్రం గురి తన కుమారుడు కాదు అని, తానేనని వ్యాఖ్యానించారు. తనను ఇరకాటంలో పెట్టడం, తనను అణగదొక్కడం లక్ష్యంగా తీవ్ర కుట్రలకు కేంద్రం వ్యూహరచన చేసి ఆచరణలో పెట్టే పనిలో నిమగ్నం అయిందని ఆరోపించారు. తన కుమారుడు అన్ని విచారణలకు సరైన సమాధానం ఇస్తారని పేర్కొంటూ, తనను గురిపెట్టి, కొత్త ఎత్తుగడలకు సీబీఐ సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐని అడ్డం పెట్టుకుని సాగుతున్న ప్రయత్నాలకు కాలమే సమాధానం ఇస్తుందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
మారన్ల చుట్టూ మళ్లీ ఉచ్చు
ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసులో ఢిల్లీ హైకోర్టు విచారణ - అక్రమాలు జరిగినట్లు బలమైన సాక్ష్యాలున్నాయన్న ఈడీ న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్లకు మళ్లీ ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసు ఉచ్చు బిగుసుకోనుంది. ఈ కేసునుంచి మారన్ సోదరులకు విముక్తి కల్పించిన ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతవారం ఢిల్లీ హైకోర్టును సంప్రదించింది. వారి అక్రమాలకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలున్నాయని తెలిపింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎస్పీ గార్గ్.. ఈడీ పిటిషన్పై నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాలని మారన్ సోదరులతోపాటు ఐదుగురికి నోటీసులు జారీచేశారు. దయానిధి, కళానిధి, కావేరీ కళానిధి (ఎస్ఏఎఫ్ఎల్), ఈ సంస్థ ఎండీ షణ్ముగం, సన్ డైరెక్ట్ టీవీలకు నోటీసులిచ్చారు. ఫిబ్రవరి నాటి తీర్పులో ఈడీ, సీబీఐ వేసిన కేసులను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఎయిర్సెల్–మ్యాక్సిస్ ఒప్పందంతో మారన్ సోదరులతోపాటు మిగిలిన వారికి సంబంధం లేదని తీర్పునిచ్చింది. తాజా పిటిషన్లో ఈ కేసుకు సంబంధించిన కార్పొరేట్ ప్రముఖుల అక్రమాలపై ఇచ్చిన వివరాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. ‘కళానిధి, కావేరిలు, మారన్ గ్రూప్ కంపెనీలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి’ అని పేర్కొంది. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ మొదట సుప్రీంకోర్టును సంప్రదించింది. కార్తీపై ఈడీ కేసు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంపై ఈడీ శుక్రవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్న కార్తీ, ఐఎన్ఎక్స్ మీడియా, దాని డైరెక్టర్లు పీటర్, ఇంద్రాణి ముఖర్జియా, ఇతరులపై పోలీస్ ఎఫ్ఐఆర్తో సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను నమోదు చేసింది. కార్తీకి ఐఎన్ఎక్స్ అక్రమంగా చెల్లింపులు చేసిందని ఈడీ తొలుత సమాచారం వెల్లడించడంతో ఈ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. -
కార్తీ చిదంబరానికి ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాసన్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి రూ. 45కోట్లు విలువైన షేర్లను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడిదారులకు కేటాయించడం, రూ. 2,262 కోట్లకు సంబంధించి ఫెమా నిబంధనల ఉల్లంఘన విషయంపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. కార్తీచిదంబరానికి సంబంధించిన కంపెనీలకు వాసన్ హెల్త్కేర్ వాటాదారు ద్వారకానాథన్కు మధ్య జరిగిన లావాదేవీల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. వాసన్ హెల్త్కేర్లోకి భారీమొత్తంలో నిధులు వచ్చాయని, ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈడీ ఆరోపణలు ఆధార రహితం, అసంబద్ధమని సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం తప్పుపట్టారు. కార్తికి నోటీసులతో తన గొంతును కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు. -
చిదంబరానికి మరిన్ని కష్టాలు
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరిన్ని కష్టాలు వస్తున్నాయి. ఆయన కుమారుడు, వ్యాపారవేత్త అయిన కార్తీ చిదంబరాన్ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విచారణకు రావాల్సిందిగా ఎన్నిసార్లు పిలిచినా కార్తీ రాకపోవడంతో.. ఇక కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎయిర్సెల్ మాక్సిస్ డీల్ విషయమై ప్రశ్నించేందుకు ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలని ఆయనను ఇప్పటికి మూడుసార్లు పిలిచారు. 2జీ స్కాంలో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎయిర్సెల్-మాక్సిస్ డీల్పై ఈడీ విచారణ సాగిస్తోంది. కార్తీ చిదంబరాన్ని విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఇప్పటికి మూడు సార్లు పిలిచింది. వ్యక్తిగతంగా హాజరు కావల్సిందేనంటూ మూడోసారి గట్టిగా చెప్పింది. అయినా కార్తీ మాత్రం విచారణకు రాలేదు. ఒకసారి మాత్రం.. అసలు తాను చేసిన తప్పేంటని కార్తీ అడిగినట్లు సమాచారం. ఇక కార్తీని అదుపులోకి తీసుకోవడం ఒక్కటే మార్గమని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. చిదంబరం భార్య నళినీ చిదంబరాన్ని కూడా గతవారం ఈడీ వర్గాలు మరో కేసులో ప్రశ్నించాయి. శారదా చిట్ఫండ్ స్కాంకు సంబంధించి కోల్కతాలోని ఈడీ కార్యాలయం ఆమెను విచారించింది. -
మళ్లీ తెరపైకి కార్తీ!
సాక్షి, చెన్నై : ఎన్నికల వేళ మరో మారు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అక్రమాస్తులు అంటూ చిట్టాను తెర మీదకు తెచ్చే పనిలో తమిళ మీడియా నిమగ్నమైంది. అలాగే, ఆడిటర్ గురుమూర్తి సైతం ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. అవన్నీ అవాస్తవాలని, ఎన్నికల్లో దెబ్బ తీయడానికి కుట్రగా కార్తీ ఖండించారు. యూపీఏ హయాంలో కేంద్రంలో తొలుత ఆర్థిక మంత్రిగా, తదుపరి హోం మంత్రిగా తన తండ్రి చిదంబరం ఉన్న సమయంలో కార్తీ చిదంబరం స్వలాభాన్ని చూసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 2జీ వ్యవహారంలోనూ పరోక్షంగా లాభ పడ్డట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమార్జనతో విదేశాల్లో కార్తీ చిదంబరం ఆస్తుల్ని గడించినట్టు, అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఆరోపణలు గుప్పించే వాళ్లు అధికం అయ్యారు. అయితే, వీటిని కార్తీ ఖండిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో మారు కార్తీ చర్చ తమిళ మీడియాలు కొన్ని తెర మీదకు తెచ్చే పనిలో పడ్డాయి. డీఎంకే, కాంగ్రెస్ కూటమిని దెబ్బ తీయడానికి ఈ కుట్ర సాగుతున్నదా? లేదా, కార్తీ గడించిన ఆస్తుల చిట్టా ఇదేనా..? అన్న చర్చ తాజాగా బయలు దేరింది. ఇందుకు తగ్గట్టుగా కార్తీ ఎక్కడెక్కడ ఆస్తుల్ని కొనుగోలు చేసి ఉన్నారో, సంస్థల్లో పెట్టుబడులు పెట్టారో వివరిస్తూ చిట్టా రూపంలో కథనాలు బయలు దేరాయి. ఇందులో సింగపూర్కు చెందిన సంస్థ ద్వారా లండన్, దుబాయ్, ఫిలిఫైన్స్, దక్షిణాఫ్రికా, మలేషియా, థాయలాండ్, సింగపూర్, స్పెయిన్ తదితర యాభై దేశాల్లో ఈ ఆస్తులు ఉన్నట్టుగా ఆచిట్టాలో వివరించడం గమనార్హం. అదే సమయంలో ఆడిటర్ గురుమూర్తి సైతం కార్తీ చిదంబరం పై తీవ్ర ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. అయితే, ఇవన్నీ అవాస్తవాలని, కట్టుకథలుగా కార్తీ చిదంబరం వ్యాఖ్యానిస్తున్నారు.ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, డీఎంకే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేతో మాత్రమే ప్రధాన పోటీ అని, మిగిలిన వాళ్లంతా డిపాజిట్లను గల్లంతు చేసుకోవడం ఖాయం అని వ్యాఖ్యానిస్తున్నారు. -
'మా అబ్బాయి కాబట్టే టార్గెట్ చేస్తున్నారు'
కార్తీ తన కుమారుడు కాబట్టే అతడిపై ఆరోపణలు చేస్తున్నారని, వాళ్ల అసలు టార్గెట్ తానేనని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం వాపోయారు. విదేశాల్లో కార్తీకి వెల్లడించని ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. నిజంగా కార్తీకి అలాంటి ఆస్తులు ఏమైనా ఉంటే, ప్రభుత్వం వాటి జాబితాను తయారు చేయాలని, ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని వాటన్నింటినీ రిజిస్టర్ చేస్తారని చెప్పారు. కార్తీ ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారంటూ ఇటీవల వచ్చిన వార్తాకథనాలపై చిదంబరం స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కార్తీ భారీ సామ్రాజ్యం నిర్మించుకున్నాడని, దాంతోపాటు 14 దేశాల్లో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయంటూ ఇటీవల మీడియా కథనాలు వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎయిర్సెల్-మాక్సిస్ స్కాంలో ఆదాయపన్ను శాఖ దర్యాప్తు ఆధారంగా ఈ వివరాలు తెలిశాయన్నది ఆ కథనాల సారాంశం. వీటి నేపథ్యంలోనే చిదంబరం స్పందించారు. కార్తీ న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నాడని, దాంతోపాటు వారసత్వ ఆస్తిని నిర్వహిస్తున్నాడని, చాలా కాలంగా ఆదాయపన్ను ఎసెసీగా ఉన్నాడని చెప్పారు. అతడి ఆస్తులు, అప్పులు అన్నింటి వివరాలూ ఆదాయపన్ను రిటర్నులలో పేర్కొన్నాడని, అలా చెప్పకుండా దాచిపెట్టిన ఆస్తులు ఎక్కడా లేవని అన్నారు. కేవలం తనను టార్గెట్ చేయడానికే కార్తీపై ఇలాంటి అసత్య కథనాలు వస్తున్నాయని అన్నారు. -
‘నల్ల’ధనులపై కరుణ లేదు
నల్లధనాన్ని చట్టబద్ధ ఆదాయంగా మార్చుకునే అవకాశంపై జైట్లీ న్యూఢిల్లీ: నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడి చేసి, చట్టబద్ధ ఆదాయం/ఆస్తులుగా మార్చుకునే అవకాశం కల్పించడమంటే నల్లధనం దాచుకున్నవారిపై కరుణ చూపడం కాదని కేంద్ర మంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు. వారికి 45 శాతం వసూలు చేయనున్నామని, ఈ అవకాశం కూడా కొంతకాలమేనన్నారు. బడ్జెట్ అనంతర భేటీల్లో భాగంగా జైట్లీ బుధవారం పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంగా మాట్లాడారు. దేశీయంగా వెల్లడించని ఆదాయం, ఆస్తులు ఉన్నవారికి.. వాటిని బహిర్గతం చేసేందుకు జూన్ 1 నుంచి నాలుగు నెలల అవకాశం కల్పిస్తామన్నారు. ‘ఆ ఆదాయం/ఆస్తులకు సంబంధించి 30 శాతం పన్నుతోపాటు 7.5 శాతం జరిమానా, మరో 7.5 శాతం సర్చార్జీ కింద వసూలు చేస్తాం.’ అని చెప్పారు. అయితే 1997లో ఇలాగే నల్లధనాన్ని చట్టబద్ధ ఆదాయంగా మార్చుకునే అవకాశం ఇవ్వగా కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ. 10 వేల కోట్లు సమకూరాయి. ఎయిర్సెల్-మాక్సిస్ వ్యవహారంలో ఎవరినీ వదలం మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ వ్యవహారంపై లోక్సభలో బుధవారం దుమారం చెలరేగింది. ఎయిర్సెల్ - మాక్సిస్ ఒప్పందంలో మరిన్ని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. 2జీ స్కాంతో సంబంధం ఉన్న ఈ వ్యవహారంలో కార్తీ చిదంబరంపై చర్యలు తీసుకోవాలని ఏఐఏడీఎంకే చేసిన డిమాండ్ మేరకు సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, పాలకపక్ష సభ్యులమధ్య వాగ్యుద్ధం జరిగింది. ఎయిర్సెల్-మాక్సిస్ వ్యవహారంలో ఎవరినీ వదలమని ప్రభుత్వం తెలిపింది. -
దొరికిన అస్త్రం
వెలుగులోకి కార్తీ విదేశీ ఆస్తులు విమర్శలు ఎక్కుపెట్టేందుకు అన్నాడీఎంకే సిద్ధం ఇరకాటంలో కాంగ్రెస్ డీఎంకేకు మరో కొత్త సంకటం సాక్షి, చెన్నై : కార్తీ చిదంబరం విదేశీ ఆస్తుల బండారం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో చర్చ బయలు దేరింది. ఎన్నికల వేళ ఈ అస్త్రాన్ని ఆయుధంగా చేసుకునే పనిలో అన్నాడీఎంకే నిమగ్నమైం ది. కాంగ్రెస్ను ఇరకాటంలో పెడుతూ, డీఎంకేకు సంకటం సృష్టించే ప్రయత్నాల్ని వేగవంతం చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలసి కాంగ్రెస్ పయనం సాగించేందుకు సిద్ధమైంది. అధికారం లక్ష్యంగా పరుగులు తీస్తున్న డీఎంకేకు కాంగ్రెస్ రూపంలో తాజాగా కలవరం బయలు దేరింది. ఇప్పటికే కాంగ్రెస్ గ్రూ పు రాజకీయాల హెచ్చరికలు గుబులు రేపుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ విదేశీ ఆస్తుల బండారం వెలుగులోకి రావడంతో సంకట పరిస్థితులు డీఎంకే ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్నది. డీఎంకేతో కలసి కాంగ్రెస్ పయ నం సాగిస్తుండడంతో తాజాగా వెలుగులోకి వచ్చిన విదేశీ ఆస్తుల వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందు కు అన్నాడీఎంకే సిద్ధమైంది. అధికారంలో ఉన్నప్పుడు స్పెక్ట్రమ్, మ్యాక్సీస్ ఒప్పందాల రూపంలో డీఎంకే, తాజా గా, ఆ అవినీతి వాటాతో కార్తీ చిదంబరం విదేశాల్లో ఆస్తులు గడించారంటూ ఆరోపణలు గుప్పించే పనిలో అన్నాడీఎంకే వర్గాలు నిమగ్నమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమకు లభించిన ఈ అస్త్రాన్ని ఆయుధంగా మలుచుకునేందుకు అన్నాడీఎంకే పరుగులు తీస్తున్నది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఢిల్లీలో అటు పార్లమెంట్లోనూ, ఇటు రాజ్య సభలోనూ అన్నాడీఎంకే సభ్యులు గళం విప్పి ఉన్నారు. అలాగే, ఉభయ సభలు వాయిదా పడే రీతిలో స్పీకర్ల పోడియంను చుట్టుముట్టి కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతుండటం గమనార్హం. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, శ్రీలంక దేశాల్లోని విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, కోట్లలో ఆస్తులు కూడబెట్టుకుని ఉన్నట్టుగా మంగళవారం ఓ మీడియాలో కథనాలు రావడం ఈ చర్చకు ప్రధాన కారణంగా మారింది. రాష్ట్రంలోనూ కార్తీ విదేశీ ఆస్తుల చర్చ బయలు దేరి ఉండటంతో ఈ వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమికి ఎలాంటి సంకట పరిస్థితుల్ని సృష్టిస్తాయోనన్న భావన బయలు దేరింది. అయితే, ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నదంటూ తిప్పి కొట్టేందుకు చిదంబరం మద్దతు దారులు సిద్ధమవుతున్నారు. -
ఇంకెన్నాళ్లు నా కుమారుడిని వేధిస్తారో...చూస్తా..!
సాక్షి, చెన్నై : ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందాల వ్యవహారంపై సాగిన దాడుల్లో కీలక రికార్డులు లభించినట్లు ఈడీ, ఐటీ వర్గాలు చెబుతుండగా, అదేమీ లేదంటూ కార్తీ చిదంబరం వ్యాఖ్యానించడం గమనార్హం! ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందం వెనుక అవినీతి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారం కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం చుట్టూ పరిభ్రమిస్తోంది. గత నెల 30న ఆయన కార్యాలయాలు, ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. అయితే, మరో మారు బుధవారం దాడులు చేయడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో కార్తీ చిదంబరానికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో సాగిన ఈ దాడుల్లో కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్, ఆదాయ పన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, తన కార్యాలయాల్లో ఏమీ స్వాధీనం చేసుకోలేదని కార్తీ చిదంబరం ఇప్పటికే స్పష్టం చేయగా, గురువారం మరో మారు అదే విషయాన్ని చెప్పారు. తన సన్నిహితుల కార్యాలయాల్లో కూడా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదని వివరించారు. తనకు ఇతరుల సంస్థల్లో ఎలాంటి వాటాలు లేవని, తన మీద ఎయిర్సెల్, మాక్సీస్ ఒప్పంద వ్యవహారాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కార్తీ విమర్శించారు. ఈ వేధింపులెన్నాళ్లంటూ గురువారం చిదంబరం సైతం ఓ ప్రకటన లో ఘాటుగా స్పందించారు. పాలకులు తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన కుమారుడి కార్యాలయంలో ఎలాంటి ఆధారాలు లభించ లేదని, ఇదే విషయాన్ని కార్తీ సైతం స్పష్టం చేశాడని గుర్తు చేశారు. అయితే, కార్తీకి వ్యతిరేకంగా ప్రయత్నాలు సాగుతున్న విషయం తేటతెల్లమవుతోందని పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మళ్లీ దాడులు!
కార్తీ చిదంబరం కార్యాలయంలో ఐటీ, ఈడీ సోదాలు సన్నిహితుల కార్యాలయాల్లోనూ... నాలుగు గంటలు సాగిన తనిఖీలు సాక్షి, చెన్నై: ఎయిర్ సెల్ , మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయు డు కార్తీ చిదంబరం మెడకు సైతం చుట్టుకునేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ కేసు విచారణలో భాగంగా మరో మారు ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్లు సంయుక్తంగా బుధవారం దాడులకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. చెన్నైలో నాలుగు గంటల పాటుగా నాలుగు చోట్ల తనిఖీలు జరిగాయి.ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారంలో సాగిన అవినీతి ఇప్పటికే టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్ చుట్టూ తిరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు మారన్ సహకరిస్తున్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఇదే కేసు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం వైపుగా కూడా మళ్లి ఉండటం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంలో ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు ఇటీవల కార్తీ చిదంబరం, ఆయన సన్నిహితుల ఆస్తుల మీద దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఓ మారు దాడులు సాగాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం మరో మారు ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు దాడులకు దిగడంతో ఉత్కంఠ బయలు దేరి ఉన్నది. మళ్లీ దాడులు : ఉదయాన్నే నాలుగు బృందాలుగా ఆదాయ పన్ను శాఖ, ఈడీ వర్గాలు రంగంలోకి దిగాయి. చెన్నైలోని కార్తీ చిదంబరం కార్యాలయం, నుంగంబాక్కంలోని మరో కార్యాలయం, వాసన్ ఐ కేర్కు చెందిన కార్యాలయాల్లో తనిఖీల్లో నిమగ్నం అయ్యారు. చిదంబరం సన్నిహిత మిత్రుల కార్యాలయాల్లోని తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థల్లో కార్తీ చిదంబరానికి ఏదేని వాటాలు ఉన్నాయా అన్న దిశగా ఈ దాడులు జరిగి ఉండటం గమనార్హం. నాలుగు గంటల పాటుగా సాగిన ఈ దాడుల పలు అంశాలపై దృష్టి పెట్టి తనిఖీలు సాగి ఉన్నది. కాగా, దాడుల అనంతరం మీడియా ముందుకు వచ్చిన కార్తీ చిదంబరం అధికారుల తనిఖీలు చేసి వెళ్లారని, అయితే, ఇక్కడి నుంచి ఎలాంటి రికార్డులు తీసుకెళ్ల లేదని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన దాడుల మేరకు తనకు ఏ సంస్థల్లోనూ వాటాలు లేవు అని పేర్కొంటూ, తన వద్ద ఎలాంటి విచారణ జరగలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ దాడులు జరిగినట్టుగా తాను భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. -
ఇంకెన్నాళ్లీ వేధింపులు?
చెన్నై : ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందాల వ్యవహారంపై సాగిన దాడుల్లో కీలక రికార్డులు లభించినట్లు ఈడీ, ఐటీ వర్గాలు చెబుతుండగా, అదేమీ లేదంటూ కార్తీ చిదంబరం వ్యాఖ్యానించడం గమనార్హం! ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందం వెనుక అవినీతి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారం కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం చుట్టూ పరిభ్రమిస్తోంది. గత నెల 30న ఆయన కార్యాలయాలు, ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. అయితే, మరో మారు బుధవారం దాడులు చేయడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో కార్తీ చిదంబరానికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో సాగిన ఈ దాడుల్లో కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్, ఆదాయ పన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, తన కార్యాలయాల్లో ఏమీ స్వాధీనం చేసుకోలేదని కార్తీ చిదంబరం ఇప్పటికే స్పష్టం చేయగా, గురువారం మరో మారు అదే విషయాన్ని చెప్పారు. తన సన్నిహితుల కార్యాలయాల్లో కూడా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదని వివరించారు. తనకు ఇతరుల సంస్థల్లో ఎలాంటి వాటాలు లేవని, తన మీద ఎయిర్సెల్, మాక్సీస్ ఒప్పంద వ్యవహారాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కార్తీ విమర్శించారు. ఈ వేధింపులెన్నాళ్లంటూ గురువారం చిదంబరం సైతం ఓ ప్రకటన లో ఘాటుగా స్పందించారు. పాలకులు తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన కుమారుడి కార్యాలయంలో ఎలాంటి ఆధారాలు లభించ లేదని, ఇదే విషయాన్ని కార్తీ సైతం స్పష్టం చేశాడని గుర్తు చేశారు. అయితే, కార్తీకి వ్యతిరేకంగా ప్రయత్నాలు సాగుతున్న విషయం తేటతెల్లమవుతోందని పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కార్తీ చిదంబరంపై ఈడీ ఫోకస్
-
కార్తీ చిదంబరంపై మరో కేసు
చెన్నై : రాజస్తాన్లో అంబులెన్స్ అక్రమాల వ్యవహారానికి సంబంధించి కార్తీ చిదంబరంపై మరో కేసు దాఖలైంది. రాజస్థాన్లో 108 అంబులెన్స్ సర్వీసును ఈఎంఆర్ అనే సంస్థ అందజేస్తూ వచ్చింది. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీపీఎస్ సౌకర్యంతో కూడిన అంబులెన్స్ సర్వీసుకు టెండర్ కోరారు. చికిత్సా హెల్త్కేర్ అనే సంస్థకు అనుమతి నిచ్చారు. ఈ సంస్థ డెరైక్టర్లుగా మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, మాజీ కేంద్ర మంత్రి వయలార్ రవి కుమారుడు కృష్ణ, రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సేవలందించిన చికిత్సా హెల్త్కేర్ సంస్థ ఇందుకోసం 450 అంబులెన్సులను నడిపింది. ఇం దుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంస్థ అదనపు సొమ్మును వసూలు చేసిన ట్లు ఆరోపణలు అందాయి. దీనిపై గత కాంగ్రెస్ హయాంలోనే సీఏజీ విచారణ జరిపేందుకు నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత రాజస్థాన్లో వసుంధర నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అంబులెన్స్ అక్రమాల గురించి విచారణకు ఆదేశాలిచ్చింది. ఇందులో కార్తి చిదంబరం, సచిన్ పైలట్, కృష్ణ, ఆశోక్ గెహ్లాట్, రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖా మంత్రి దూరా మీర్జాలపై సిబిఐ కేసు దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణపై ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఈ అక్రమాలకు సంబంధించి ఈడీ మరో కేసును నమోదు చేసింది. -
కార్తీపై అవినీతి మరక
సాక్షి, చెన్నై : కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం వార్తల్లోకి ఎక్కారు. అవినీతి మరక ఆయన మీద పడడంతో రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. కాంగ్రెస్లోని కొన్ని గ్రూపులు లోలోపల ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్ని ఆయన తనయుడు కార్తీ చిదంబరం రాష్ట్రంలో చూసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నా, తెర వెనుక నుంచి రాజకీయం సాగిస్తూ వచ్చిన కార్తీ చిదంబరం ఇటీవలి లోక్సభ ఎన్నికల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగారు. తన తండ్రి చిదంబరం నియోజకవర్గం శివగంగై నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పనిలో పడ్డారు. చిదంబరం మద్దతు వర్గానికి అండగా ఉంటూ, కాంగ్రెస్లోని గ్రూపుల్లో అతి పెద్ద గ్రూపుగా చిదంబరం వర్గాన్ని తీసుకెళ్లే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తాజాగా కార్తీ చిదంబరం మీద అవినీతి మరక పడడం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతి మరక: రాజస్థాన్లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్ సేవల్లో అవినీతి చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతం బిజేపి ప్రభుత్వం గుర్తించింది. సీబీఐను రంగంలోకి దించడంతో అక్కడి మాజీ ముఖ్యమంత్రితో పాటుగా పలువురి మీద ఆరోపణలు బయలు దేరాయి. కేసుల నమోదు ప్రక్రియ సాగుతున్నది. ఈ అవినీతిలో కార్తీ చిదంబరానికి వాటా ఉందన్న సమాచారంతో వెలుగులోకి రావడం, ఆ మరక ఆయన మీద పడ్డట్టు అయింది. దీంతో కార్తీ చిదంబరం మీద పడ్డ అవినీతి మరక చర్చ కాంగ్రెస్లోనే కాదు, రాష్ర్టంలోనూ సాగుతున్నది. తండ్రి చేతిలో ఉన్న ఆధికారాన్ని తనకు అనుకూలంగా మలచుకుని కార్తీ మరెన్న వ్యవహారాలు సాగించి ఉంటారన్న ఆరోపణలు బయలు దేరాయి. కాంగ్రెస్లోని కొన్ని గ్రూపులు ఈ వ్యవహారాన్ని ఆసరగా తీసుకుని రాజకీయం సాగించేందుకు సిద్ధం అయ్యాయి. అయితే, కార్తీ చిదంబరంకు ఎలాంటి సంబంధం లేదని, చిదంబరం మీద కక్ష సాధింపు లక్ష్యంగా కార్తీ చిదంబరం మీద అవినీతి మరకను అంటించి ఉన్నారని ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. నాకే సంబంధం లేదు: తన మీద 108 సేవల అవినీతి మరకను రాజస్థాన్ ప్రభుత్వం రుద్దుతుండడంపై కార్తీ చిదంబరం స్పందించారు. ఓ మీడియాతో మాట్లాడుతూ, ఆ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలో తాను ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా మాత్రం గతంలో పనిచేశానని, ఆ సమయాల్లో సంస్థ వ్యవహారాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, జోక్యం చేసుకునే అవకాశం కూడా తనకు రాలేదన్నారు. అలాంటప్పుడు తనను ఇరికించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆ సంస్థలో తాను వాటా దారుడు కూడా కాదు అని కేవలం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా మాత్రమే పనిచేశానని తెలిపారు. సంబంధం లేని వ్యవహారాన్ని తన మీద రుద్దే యత్నం మానుకోవాలని హితవు పలికారు. -
కాంగ్రెస్లో కార్తీ కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్కు మరో తలనొప్పి ఎదురైంది. పార్టీలో కేంద్ర మాజీ మంత్రి పీ.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కల్లోలం సృష్టించాడు. మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్ను, పార్టీ వ్యవహారాలను విమర్శించాడు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సంజాయిషీ నోటీసు అందుకున్నాడు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంపై తగిన వివరణ ఇవ్వకుంటే అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం ప్రకటించారు. ఇటీవల సత్యమూర్తి భవన్లో జరిగిన కామరాజర్ గురించి మాట్లాడకుంటే కాంగ్రెస్ పార్టీనే లేదని ఇళంగోవన్ వెంటనే కార్తి మాటలను తిప్పికొట్టారు. కార్తీ వ్యాఖ్యలపై గందరగోళం నెలకొంది. కొందరు నిరసన నినాదాలతో ఆందోళన చేశారు. ఆగ్రహించిన కార్తీ చిదంబరం బలనిరూపణగా ‘ఐ 67’ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతం అయిన 1967 తరువాత జన్మించిన వారిని మాత్రమే అందులో సభ్యులుగా చేర్చుకున్నారు. ఐ 67కు సంబంధించిన సమావేశాన్ని గురవారం జరిపారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున సుమారు 234 మందిని కార్తీ పిలిపించారు. లౌకికపార్టీ అనే ప్రచారానికే పరిమితమైతే ఫలితం లేదు, ప్రజాకర్షణ కలిగిన కాంగ్రెస్ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కార్తీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేగా సినిమా ప్రముఖులు వెంటపడటం మానుకోవాలని పరోక్షంగా నటి కుష్బును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అంతేగాక రాష్ట పార్టీ కార్యకలాపాలను సైతం విమర్శించారు. కార్తీకి నోటీసు : ఇళంగోవన్ నేతాజీ సుభాష్చంద్రబోస్ జయంతి సందర్భంగా సత్యమూర్తి భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఇళంగోవన్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్తీ చిదంబరం పార్టీ నియమావళికి విరుద్దంగా పోటీ సమావేశాన్ని నిర్వహించారని, అనేక విమర్శలు చేశారని మీడియాతో చెప్పారు. కామరాజనాడార్ గురించి మాట్లాడుకుంటే ప్రయోజనం లేదని వ్యాఖ్యానించాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు వివరణ కోరుతూ సంజాయిషీ నోటీసు జారీచేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన కార్తీని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదని పేర్కొన్నట్లు చెప్పారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
చల్లారని ‘నాడార్ల’ ఆగ్రహం
* కార్తీకి వ్యతిరేకంగా నిరసన * సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నం * పలువురి అరెస్ట్ సాక్షి, చెన్నై: దివంగత నేత కామరాజనాడర్కు వ్యతిరేకంగా కేంద్ర మాజీ మంత్రి పీ.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలు నాడార్ల సంఘాల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. క్షమాపణ చెప్పకుండా, నిర్లక్ష్య పూరితంగా సమాధానం ఇస్తున్న కార్తీ తీరును ఖండిస్తూ నాడార్ల సంఘాలు శుక్రవారం సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నించాయి. మార్గమధ్యంలో నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశా రు. గత నెల సత్యమూర్తి భవన్ వేదికగా జరిగిన యువజన సమావేశంలో చిదంబరం తనయుడు కార్తీ నోరు జా రిన విషయం తెలిసిందే. కామరాజర్ సుపరిపాలనను మళ్లీ తీసుకొస్తాం.. ఆ పాలనే లక్ష్యం, పూర్వ వైభవం ధ్యేయం అన్న నినాదాల్ని పక్కనపెట్టి, భవిష్యత్తు లక్ష్యం గా ఏం చేద్దాం అన్న అంశాలపై దృష్టి పెట్టాలని కార్తీ చేసి న వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తమిళనాడులో కామరాజర్ లేనిదే కాంగ్రెస్ లేదన్నది జగమెరిగిన సత్యం. అలాంటి నేతను అగౌరవపరిచే విధంగా కార్తీ చిదంబరం అనుచిత వ్యాఖ్యలు చేయడం రచ్చకెక్కింది. కాంగ్రెస్ వాదులు పలువురు ఖండించారు. నాడార్ల సంఘాలు కార్తీ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించాయి. క్షమాపణకు పట్టుబడుతూ ఆయన ఇంటి ముట్టడికి యత్నించాయి. కార్తీకి వ్యతిరేకంగా ఆందోళనల్ని ఉధృతం చేయడానికి నిర్ణయించాయి. తాజాగా కార్తీపై ఎలాంటి చర్యలు తీసుకోని కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నించారు. ముట్టడి: కార్తీ క్షమాపణ చెప్పాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాడార్ల సంఘాలు ఉదయం సత్యమూర్తి భవన్ముట్టడికి బయలు దేరాయి. గతంలో ఓ మారు ఓ సంఘం నేతృత్వంలో సత్యమూర్తి భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. తమ కార్యాలయాన్నే ముట్టడిస్తారా? అంటూ కాంగ్రెస్ వాదులు తిరగబడడంతో ఆ పరిసరాలు రణరంగంగా మారాయి. తాజాగా నాడార్ల సంఘాలు ముట్టడికి యత్నిం చడంతో ఎక్కడ ఉద్రిక్తతకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షత్రియ నాడార్ల సంఘం నేత చంద్రన్ జయపాల్, నాడార్ల సంఘం నేత పద్మనాభన్ల నేతృత్వంలో ఆ సంఘాల నాయకులు ర్యాలీగా ఎక్స్ప్రెస్ అవెన్యూ వద్దకు చేరుకున్నారు. వారిని సత్యమూర్తి భవన్ వైపుగా వెళ్లనీయకుండా పోలీసు లు అడ్డుకున్నారు. కాసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. కార్తీ క్షమాపణ చెప్పాల్సిందేనని, ఆయన పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని నిరసన కారులు నినదించారు. చివరకు ట్రాఫిక్కు ఆటంకం నెలకొనడంతో ఆందోళనకారుల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. -
కార్తీ ‘రచ్చ’
సాక్షి, చెన్నై : దివంగత నేత కామరాజనాడర్కు వ్యతిరేకంగా కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో రచ్చకు దారి తీస్తున్నాయి. సర్వత్రా కార్తీ చిదంబరంపై విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. క్షమాపణకు పట్టు బడుతున్నారు. నాడార్ల సమాఖ్య ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించింది. ఆదివారం నుంగబాక్కంలోని కార్తీ చిదంబరం ఇంటిని ముట్టడించేందుకు యత్నించింది. జీకే వాసన్ పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో టీఎన్సీసీలో కలవరం మొదలైంది. వాసన్ పార్టీ ఆవిర్భావ వేడుకలో ఎందరు నేతలు ప్రత్యక్షం కాబోతున్నారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో పార్టీని రక్షించుకుని, కేడర్కు తాను అండగా ఉండానని చాటుకునే పనిలో కొత్త అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నిమగ్నం అయ్యారు. సత్యమూర్తి భవన్ వేదికగా ప్రతి రోజు ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేసి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ముందుకు సాగుతున్నారు. అయితే, ఈవీకేఎస్ ప్రయత్నాలపై నీళ్లు చల్లే రీతిలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం వ్యవహరించారు. రెండు రోజుల క్రితం జరిగిన యువజన సమావేశంలో కార్తీ నోరు జారారు. కామరాజర్ సుపరి పాలనను మళ్లీ తీసుకొస్తాం.. ఆ పాలనే లక్ష్యం..., పూర్వ వైభవం ధ్యేయం అన్న నినాదాల్ని పక్కన పెట్టి, భవిష్యత్తు లక్ష్యంగా ఏం చేద్దాం అన్న అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ర్టంలో కామరాజర్ లేనిదే కాంగ్రెస్ లేదని చెప్పవచ్చు. అలాంటి నేతను అగౌరవ పరిచే విధంగా కార్తీ చిదంబరం అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్లో రచ్చకు దారి తీస్తున్నది. కార్తీ వ్యాఖ్యల్ని అదే వేదిక మీదున్న ఈవీకేఎస్ తీవ్రంగానే ఖండించారు. ఇక మీదట ఎవరైనా కామరాజర్ను విమర్శించే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, కాంగ్రెస్లోని నాడార్ల సామాజిక వర్గ నేతలు మాత్రం జీర్ణించుకోవడం లేదు. కార్తీపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే పనిలో పడ్డారు. కర్పూరం వాసన తెలుసా: తప్పును కప్పి పుచ్చుకునే విధంగా కార్తీ వ్యవహరించ కూడదని, క్షమాపణ చెప్పుకోవాలని పట్టుబట్టే పనిలో పలువురు కాంగ్రెస్వాదులు నిమగ్నం అయ్యారు. ఇందుకు కార్తీ సిద్ధంగా లేని దృష్ట్యా, ఈ వ్యాఖ్యల వివాదం చిలికి చిలికి తుపానులా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాసన్ రూపంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ బలం, కార్తీ వ్యాఖ్యల రూపంలో ఎలాంటి పరిస్థితుల్ని సృష్టిస్తుందోనన్న బెంగ ఈవీకేఎస్లో మొదలైంది. ఈవీకేఎస్ సైతం తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నారని చెబుతున్నారు. అయితే, చిదంబరం మద్దతు తనకు తప్పనిసరి కావడంతో చర్యల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా కార్తీపై ఆదివారం ఈవీకేఎస్ పరోక్షంగా తీవ్రంగానే స్పందించారు. తాంబరంలో జరిగిన పార్టీ వేడుకలో విలేకరులు ఈవీకేఎస్ను చుట్టుముట్టారు. కార్తీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ప్రశ్నించారు. ఇందుకు ఈవీకేఎస్ ఇచ్చిన సమాధానానికి విస్మయం చెందాల్సిన వంతు మీడియాకు తప్పలేదు. కామరాజర్కు వ్యతిరేకంగా కార్తీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని దాట వేశారు. అదే సమయంలో కామరాజర్ గురించి ఇక మీదట ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. ‘గాడిదకు తెలుసునా... కర్పూర వాసన’ అంటూ పరోక్షంగా కార్తీ చిదంబరంను ఉద్దేశించి మండి పడటం గమనార్హం. ఇంటి ముట్టడి : కార్తీ వ్యాఖ్యలను నాడార్ల సమాఖ్య తీవ్రంగా పరిగణించింది. కార్తీ చిదంబరం క్షమాపణ చెప్పాలని, తన వ్యాఖ్యల్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ సమాఖ్య నేతృత్వంలో ఉదయం నిరసన కార్యక్రమం చోటు చేసుకుంది. తమ నాయకుడు కార్తీ చిదంబరం ఇంటిని ముట్టడించేందుకు నాడార్ల సమాఖ్య సిద్ధం కావడాన్ని ఆయన మద్దతుదారులు తీవ్రంగా పరిగణించారు. తమ నేత ఇంటి వద్దకు వచ్చే వాళ్లను అడ్డుకునేందుకు ముందుగానే నుంగబాక్కంలో మకాం వేశారు. అలాగే, పోలీసులు సైతం రం గంలోకి దిగారు. శాస్త్రి భవన్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. 11 గంటల సమయంలో నాడార్ల సమాఖ్య నాయకులు అటు వైపుగా రాగానే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో తోపులాట, వాగ్యుద్దం చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారుల్ని పోలీసు లు అరెస్టు చేశారు. కార్తీ చిదంబరం ఇంటి పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్తీ క్షమాపణ చెప్పే వరకు విడిచి పెట్టమని, తమ ఆందోళనలు కొనసాగుతాయని నాడార్ల సమాఖ్య స్పష్టం చేసింది. -
రజనీతో కార్తీ భేటీ
దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ను రాజకీయ పక్షాల నేతలు వరుసగా కలుసుకుంటూ రావడం చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తాజాగా రజనీతో భేటీ కావడంతో రాజకీయ వర్గాలు ఆంతర్యాన్ని వెతికే పనిలో పడ్డాయి. సాక్షి, చెన్నై : రజనీ కాంత్ ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలకు హాట్ కేకులా మారుతున్నారు. ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఆయనకు సీఎం అభ్యర్థిత్వాన్ని సైతం ఆఫర్ చేసింది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా రజనీ కాంత్ లేఖాస్త్రం సంధించడం బీజేపీ వర్గాల్ని కలవరంలో పడేసింది. జయలలితను పరామర్శిస్తూ రజనీ రాసిన లేఖ తో అన్నాడీఎంకే వర్గాలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ తమ వెంట ఉన్న రజనీ కాంత్, రానున్న ఎన్నికల్లోను తమకు మద్దతుగానే ఆయన వ్యవహరిస్తారన్న ఆశాభావం అన్నాడీఎంకేలో వ్యక్తమవుతోంది. ఈ లేఖాస్త్రం ఓ వైపు చర్చకు దారి తీసిన సమయంలో డీఎంకే నేతలు పలువురు రజనీని రెండు రోజుల క్రితం పరామర్శించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ వంతు వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు రజనీ కాంత్తో భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది. కార్తీ భేటీ : మూడు నెలలుగా రజనీ కాంత్ లింగా చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. పది రోజుల క్రితం చెన్నైకు వచ్చిన ఆయన, లింగా చిత్ర వ్యవహారాల మీద దృష్టి పెట్టారు. దీంతో పోయెస్ గార్డెన్లో ఉన్న రజనీ కాంత్ను ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా అటు రాజకీయ వర్గాలు, ఇటు మిత్రులు కలుసుకుంటున్నారు. శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు, కాంగ్రెస్ నేత కాార్తీ చిదంబరం పోయేస్ గార్డెన్లో రజనీ కాంత్ ఇంటి మెట్లు ఎక్కారు. రజనీ కాంత్ను కలుసుకుని పుష్ప గుచ్ఛాలు అందజేశారు. కార్తీ వెంట మరో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. తన ఇంటికి వచ్చిన కార్తీతో చాలా సేపు రజనీకాంత్ మాటా మంతిలో మునిగారు. కార్తీ చిదంబరం నేతృత్వంలోని ఓ ట్రస్టు కార్యక్రమానికి రజనీ కాంత్ను ఆహ్వానించినట్టు సమాచారం. ఈ భేటీ గురించి కాంగ్రెస్ వర్గాల్ని కదిలించగా, కార్తీ చిదంబరం రజనీకాంత్ను కలిసిన మాట వాస్తవేమనని, అయితే, అది వ్యక్తిగతమేనంటున్నారు. చిదంబరం మద్దతుదారుల్ని కదిలించగా, రజనీ కాంత్, కార్తీ చాలా సేపు రాజకీయాల గురించి మాట్లాడుకున్నారని, అలాగే, కార్తీ ట్రస్టు నేతృత్వంలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజనీ కాంత్ను ఆహ్వానించి ఉన్నట్టు పేర్కొంటున్నారు. అయితే గతంలో కాంగ్రెస్తో కయ్యం ఏర్పడ్డప్పుడు చిదంబరం సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఏదైనా సాగేనా లేదా, ఈ భేటీ కేవలం మర్యాదేనా..? అన్న విషయమై ఆంతర్యాన్ని వెతికే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి. చిదంబరంపై ఆగ్రహం: ఓ వైపు రజనీ కాంత్తో కార్తీ చిదంబరం భేటీ అయితే, మరో వైపు చిదంబరంపై ఏకంగా కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం ప్రదర్శించాయి. ఆంగ్ల మీడియాకు చిదంబరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నెహ్రు, ఇందిరా కుటుంబాలకు చెందని వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే సమయం వస్తుందని పేర్కొనడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యల్ని టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు, ఎమ్మెల్యే విజయ ధరణిలు ఖండించారు. నెహ్రు, ఇందిర కుటుంబాలకు చెందిన వాళ్లు అధ్యక్షులుగా ఉండబట్టే పార్టీ బలంగా ఉందని, లేని పక్షంలో పార్టీలో ఐక్యత కొరవడి ఉండేదన్న విషయాన్ని చిదంబరం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీఎన్సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ అయితే, చిదంబరం వ్యాఖ్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో ఆధిపత్యం లక్ష్యంగా కేంద్ర మాజీ మంత్రులు జీకే వాసన్, చిదంబరం మద్దతు గ్రూపుల మధ్య పోటీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో విరక్తితో చిదంబరం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన మద్దతు దారులు పేర్కొనడం ఆలోచించాల్సిందే. -
వీరికి ఆస్తులే లేవట!
ఒకవైపు కళ్లు చెదిరేలా కోట్లాది రూపాయల ఆస్తులను కొందరు అభ్యర్థులు ప్రకటిస్తుండగా.. అందుకు విరుద్ధంగా తమకు ఆస్తులేం లేవంటూ మరికొందరు చెబుతున్నారు. తమిళనాడు లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న 14 మంది అభ్యర్థులు తమ పేరుపై ఎలాంటి స్థిర, చరాస్తులు లేవని ఎన్నికల సంఘానికిచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నారు. వారిలో 12 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కాగా, సీపీఐఎంఎల్ రెడ్స్టార్, అఖిల భారత హిందూ మహాసభ పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి ఉన్నారు. మరోవైపు రూ.5 కోట్లకు పైగా అప్పులున్న అభ్యర్థుల సంఖ్య కూడా పద్నాలుగే. వారిలో కాంగ్రెస్ తరఫున కన్యాకుమారిలో పోటీ చేస్తున్న హెచ్ వసంతకుమార్ రూ.87 కోట్ల రుణంతో మొదటిస్థానంలో ఉన్నారు. విశేషమేంటంటే అత్యధిక ఆస్తులున్న అభ్యర్థుల్లోనూ రూ.285 కోట్లతో ఆయనే ప్రథమ స్థానంలో ఉన్నారు. శివగంగ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం ఆదాయం సంవత్సరానికి రూ. 1 కోటి.