Nirav Modi
-
రూ.22,280 కోట్ల ఆస్తుల పునరద్ధరణ
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆస్తులు పోగేసి వివిధ బ్యాంకులను మోసం చేసిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్థంగా చర్యలు తీసుకుంటోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకు రుణాలను ఎగవేసి పరారీలో ఉన్న విజయ్మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీతోపాటు వివిధ మోసాలకు పాల్పడిన వారికి చెందిన రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి బాధితులకు పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక నేరగాళ్లపై ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.సంపద రాబట్టేందుకు ఈడీ ప్రయత్నంనిధులకు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్లపై చర్చ సందర్భంగా లోక్సభలో మంత్రి మాట్లాడారు. ‘ఆర్థిక నేరస్థులు బ్యాంకులను మోసం చేసి అక్రమంగా సంపాదించిన సంపదను తిరిగి రాబట్టేందుకు ఈడీ చాలా ప్రయత్నిస్తోంది. ప్రధాన కేసుల్లో పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ రికవరీ చేసింది. వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుద్ధరించాం. నీరవ్ మోదీ నుంచి రూ.1,052.58 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఈడీ అధికారులు తిరిగి అప్పగించారు. మెహుల్ చోక్సీకు చెందిన రూ.2,565.90 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వేలం వేయడానికి సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.ఎన్ఎస్ఈఎల్.. రూ.17.47 కోట్లు రికవరీవ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ సృష్టించే లక్ష్యంతో 2005లో ఏర్పాటు చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కుంభకోణంకు సంబంధించి రూ.17.47 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా మోసపోయిన పెట్టుబడిదారులకు తిరిగి ఈ డబ్బును ఇచ్చినట్లు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ఆధ్వర్యంలోని ప్రధాన కేసుల నుంచి కనీసం రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ విజయవంతంగా పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..బ్లాక్ మనీ చట్టంతో పెరిగిన సంఖ్య2015లో రూపొందించిన బ్లాక్ మనీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులను స్వచ్ఛందంగా బహిర్గతం చేస్తున్నట్లు తెలిపారు. విదేశీ ఆస్తులను ప్రకటించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2021-22లో 60,467 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకు పెరిగిందన్నారు. జూన్ 2024 నాటికి బ్లాక్ మనీ చట్టం కింద మొత్తం రూ.17,520 కోట్లకు సంబంధించి 697 కేసుల విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 163 ప్రాసిక్యూషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. పనామా పేపర్లు, పండోర పేపర్లు, హెచ్ఎస్బీసీ, ఐసీఐజే లీక్ల వంటి హైప్రొఫైల్ అంశాలకు సంబంధించి విచారణ సాగుతున్నట్లు స్పష్టం చేశారు. -
మోస్ట్ పాపులర్ హౌస్ కొన్న సోనమ్ కపూర్ జంట
ప్రముఖ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా ఇటీవల ముంబైలోని నీరవ్ మోదీకి చెందిన ఐకానిక్ మ్యూజిక్ స్టోర్ 'రిథమ్ హౌస్'ను కొనుగోలు చేశారు. నీరవ్ మోదీ బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లిచకపోవడంతో దీనిని 2018లో మూసివేశారు. కాగా ఇప్పుడు 478.4 మిలియన్లకు (రూ.47.84 కోట్లు) సోనమ్ కపూర్ దంపతులు సొంతం చేసుకున్నారు.సుమారు 3,600 చదరపు అడుగుల రిథమ్ హౌస్ ఒకప్పుడు ఫైర్స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని నీరవ్ మోదీ నిర్వహణలో ఉండేది. దీనిని కొనుగోలు చేసినట్లు భానే ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తి డీల్ విలువను వెల్లడించలేదు.భానే అనేది షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్కు చెందిన ఒక విభాగం. ఇది ఆనంద్ అహూజా తండ్రి హరీష్ అహుజాకు చెందినది. అంతే కాకుండా ఇది భారతదేశంలోని అతిపెద్ద దుస్తులు తయారీదారులలో ఒకటి. ఈ కంపెనీ అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయిస్తోంది.1940లో ప్రారంభమైన రిథమ్ హౌస్.. ఒకప్పుడు పండిట్ రవిశంకర్, ఇయాన్ ఆండర్సన్ వంటి సంగీత విద్వాంసులకు మాత్రమే కాకుండా ఎంతోమంది బాలీవుడ్ తారల బృందాలకు ఆతిథ్యం ఇచ్చింది.ఇదీ చదవండి: గూగుల్లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్కొన్ని వారాల క్రితం సోనమ్ కపూర్, హరీష్ అహూజా లండన్లోని నాటింగ్ హిల్ జిల్లాలో 231.47 కోట్ల రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ జంటకు ఢిల్లీలో రూ.173 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. అంతే కాకుండా వీరి వద్ద ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే టైకాన్, మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్580 వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. -
నీరవ్ మోదీ రూ.29.75 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన తాజా ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. రూ. 6,498 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసు విచారణలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈడీ జప్తు చేసిన వాటిల్లో స్థిరాస్తులు, ఇండియాలో బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నట్టు తెలిపారు.మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)-2002 కింద ముంబై జోనల్ కార్యాలయం ఈ జప్తులు చేపట్టింది. కాగా ఇంతకు ముందు భారత్తో పాటు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీకి చెందిన రూ.2,596 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇవే గాక పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం (ఎఫ్ఈఓఏ)-2018 కింద ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మరో రూ.692.90 కోట్ల ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైలులో ఉన్నారు -
ప్రధానిని కించపరచలేదు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై లోక్సభలో మాట్లాడనందుకే నీరవ్ అనే మాటను వాడాను తప్ప, ఆయన్ను కించపరచడానికి కాదని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ప్రధాని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయే సరికి ‘నీరవ్’అనే మాటను వాడానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. నీరవ్కు నిశ్శబ్దం అనే అర్థం ఉందన్నారు. పార్లమెంట్లో ఎవరినైనా అగౌరవపరచాలనే ఆలోచన తనకు లేశ మాత్రమైనా లేదని చెప్పారు. ఏదైనా మాట అన్ పార్లమెంటరీగా అనిపిస్తే తొలగించేందుకు నిబంధనల ప్రకారం స్పీకర్కు అధికారముందని చౌదరి తెలిపారు. ఒకరి ప్రతీకార, అహంకార వైఖరికి తానెందుకు క్షమాపణ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రతిపక్షం గళం వినిపించకుండా చేసేందుకే బీజేపీ నేతలు పథకం ప్రకారం అనుచిత విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. తన సస్పెన్షన్ను తిరోగమన చర్యగా ఆయన అభివర్ణించారు. ఉరితీసిన తర్వాత విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో తనను ఉంచారంటూ వ్యాఖ్యానించారు. సస్పెన్షన్పై చట్టపరంగా ముందుకెళ్లేందుకు గల అవకాశాలను పరిశీలిస్తానన్నారు. అనుచిత ప్రవర్తన కారణంతో అధిర్ రంజన్ చౌదరిని గురువారం లోకసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై సభా హక్కుల కమిటీ నివేదిక ఇచ్చేవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. భారత్, ఇండియా ఒక్కటే అయినప్పుడు ప్రధాని మోదీ మాత్రం ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి పేరును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని ఆధిర్ రంజన్ చౌదరి అన్నారు. ‘అంత శక్తిమంతుడైన మోదీకి ఇండియా పదంతో వచ్చిన ఇబ్బందేమిటి? భారత్, ఇండియా రెండూ ఒక్కటేనని రాజ్యాంగం కూడా చెప్పింది. అయినా బీజేపీ నేతలు రెండింటి మధ్య తేడాలు చూపిస్తున్నారు’అని అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఘర్షణలకు మణిపూర్ పరిణామాలకు పోలిక లేదని, అక్కడ మానవీయ సంక్షోభం నెలకొని ఉందని చెప్పారు. మణిపూర్లో పరిస్థితులు దేశంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్రం భావిస్తే పరిష్కరించేందుకు మరింతగా కృషి చేయాలని సూచించారు. -
మెహుల్ చోక్సీ బ్యాంక్, డీమ్యాట్, ఫండ్ ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: భారత్ నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ చెల్లించాల్సిన రూ.5.35 కోట్ల బకాయిల రికవరీ దిశలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ల జప్తునకు ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ షేర్లలో మోసపూరిత ట్రేడింగ్కు పాల్పడిన కేసులో సెబీ 2022 అక్టోబర్లో విధించిన జరిమానాను చెల్లించడంలో చోక్సీ విఫలమైన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ గ్రూప్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చోక్సీ, మరో ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీకి మామ కావడం గమనార్హం. ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని రూ.14,000 కోట్లకు పైగా మోసగించినట్లు వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీఎన్బీ స్కామ్ వెలుగులోనికి వచ్చిన తర్వాత 2018 తొలి నాళ్లలో వీరు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా లేదా బార్ముడాలో ఉన్నారని వార్తలు వస్తుండగా, మోడీ బ్రిటిష్ జైలులో ఉన్నారు. తనను అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను కోర్టులో ఆయన సవాలు చేశారు. -
పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం
సాక్షి,ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13వేల కోట్ల రుణం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న మెహుల్ చోక్సీకి సంబంధించికీలక పరిణామంకలకలం రేపింది. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు లిస్ట్నుంచి చోక్సీ పేరును తొలగించింది. దీంతో అతనిని స్వదేశానికి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బేనని విమర్శలు వెల్లువెత్తాయి. 2018 డిసెంబర్లో జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్పోల్ ఇపుడు ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే మెహుల్ చోక్సీ విదేశీ గడ్డపై దొరికితే అరెస్ట్ చేసే అధికారాన్ని భారత ప్రభుత్వం కోల్పోయినట్టే. అయితే తాజా పరిణామంపై సీబీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్నమెహుల్ చోక్సీ పేరు ఇంటర్పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుండి తొలగించారు. లియోన్-హెడ్క్వార్టర్డ్ ఏజెన్సీకి చోక్సి అప్పీల్ మేరకే చోక్సీ పేరును రెడ్ లిస్ట్లో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఇంటర్పోల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. అయిదేళ్లనుంచి పరారీలో ఉన్న చోక్సీని ఇండియాకు ఎపుడు రప్పిస్తారంటూ కాంగ్రెస్ ట్విటర్ ద్వారా మోదీ సర్కార్ను ప్రశ్నించింది. PM मोदी का चहेता मेहुल 'भाई' चोकसी अब वांटेड नहीं रहा। भगोड़े मेहुल चोकसी के खिलाफ इंटरपोल ने रेड कॉर्नर नोटिस हटा लिया है। PM मोदी जवाब दें कि आपके 'मेहुल भाई' को देश वापस कब लाया जाएगा। 5 साल से फरार है, अब और कितना वक्त चाहिए? — Congress (@INCIndia) March 20, 2023 రెడ్ నోటీసు (లేదా రెడ్ కార్నర్ నోటీసు) 2018లో డిసెంబరు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. నాలుగేళ్ల తరువాత మెహుల్ చోక్సీని రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్పోల్ తొలగించింది. తాజా నివేదికల ప్రకారం ఆ నోటీసు ఇప్పుడు ఇంటర్పోల్ వెబ్సైట్లో అందుబాటులో లేదు. మంగళవారం ఉదయం 8 గంటల నాటికి, మొత్తం రెడ్ నోటీసుల సంఖ్య 7023కి చేరింది. ఇంటర్పోల్లో 195 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇంటర్పోల్ రెడ్ నోటీసు అనేది అప్పగించడం, లొంగిపోవడం లేదా ఇలాంటి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాన్ని అమలు చేసేవారికి చేసే అభ్యర్థన. రెడ్ నోటీసు అరెస్ట్ వారెంట్తో సమానం కాదు. అయితే సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అనేదానిపై సభ్యదేశాలు తమ స్వంత చట్టాలను వర్తింపజేయాలి. అనేక సందర్భాల్లో నిందితుడిని కోరుకున్న దేశానికి అప్పగిస్తారు. కాగా పీఎన్బీ స్కాం ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్మోదీకి దగ్గరి బంధువు మెహుల్ చోక్సీ. దేశంలో అతిపెద్ద స్కాం వెలుగులోకి రావడంతో ఆంటిగ్వా , బార్బుడా పారిపోయి, అక్కడి పౌరసత్వం పొందాడు. ఈడీ, సీబీఐ దర్యాప్తు, ఫుజిటివ్ నేరస్తుడుగా కేంద్రం ప్రకటించింది. సీబీఐ అభ్యర్థన మేరకు పది నెలల తర్వాత ఇంటర్పోల్ అతడి రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే సీబీఐ ఛార్జిషీట్పై చోక్సీ అభ్యంతరాలు లేవనెత్తడంతోపాటు,పలు సందర్భాల్లో భారతీయ జైళ్లు, ఆరోగ్య సమస్యలను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈ కీలక పరిణామాల మధ్య మే 2021లో చోక్సీ ఆంటిగ్వా నుండి అదృశ్యమైనాడు. ఆ తరువాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడన్న ఆరోపణలపై డొమినికాలో అరెస్ట్ కావడంతో 51 రోజులు డొమినికా జైలులో గడిపాడు. అనంతరం అక్రమంగా ప్రవేశించిన చోక్సీపై ఉన్న అన్ని అభియోగాలను కూడా డొమినికా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంక్ అకౌంట్లో రూ.236, జైలులో దుర్భర జీవితం గడుపుతున్న నీరవ్ మోదీ
నీరవ్ మోదీ! ఒకప్పుడు ప్రముఖ బిలియనీర్. కానీ ఇప్పుడు చేసిన తప్పులకు మూల్యం చెల్లిస్తూ జైల్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టిన కేసులో కోర్టుకు చెల్లించేందుకు డబ్బులు లేక అప్పు కావాలని అర్రులు చాస్తున్నాడు. ఈ నేపథ్యంలో నీరవ్కు చెందిన బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.236 ఉన్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2019లో నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి వేల కోట్ల ఎగనామం పెట్టి యూకేకి పారిపోయాడు. అక్కడ భారత్లో భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ లండన్ పోలీసులు అరెస్టు చేశారు. అ తర్వాత నీరవ్ పతనం ప్రారంభమైంది. తాజా నివేదికల ప్రకారం.. నీరవ్ మోదీకి చెందిన ఫైర్స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్డిఐపిఎల్) వద్ద రూ. 236 బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐకి రూ. 2.46 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.236 ఉన్నట్లు తెలుస్తోంది. మరి బ్యాంక్లకు నీరవ్ చెల్లించాల్సిన మొత్తాన్ని దర్యాప్తు సంస్థలు ఏ విధంగా వసూలు చేస్తాయో చూడాల్సి ఉంది. అప్పు కావాలి! కాగా, గత వారం భారత్కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్లోని హైకోర్టు నీరవ్ను ఆదేశించింది. కానీ నీరవ్ మోదీ తన వద్ద అంత డబ్బు లేదని కోర్టుకు మొరపెట్టుకున్నాడు. దీంతో మరి విచారణ నిమిత్తం చెల్లించాల్సిన చట్టపరమైన ఖర్చుల్ని ఎలా చెల్లిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. అందుకు అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్ తన ఆస్తులను స్వాధీనం చేసుకున్నందున, తనకు తగిన వనరులు లేవని, కోర్టుకు చెల్లించే మొత్తాన్ని ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటానని, రుణ దాత కోసం అన్వేషిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు. -
వేల కోట్లు ఎగొట్టి.. ఇప్పుడేమో డబ్బులు లేవు, అప్పు తీసుకోవాలంటున్న ఘనుడు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.11వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని వేల కోట్లు స్కాంలో కీలక నిందితుడు అయిన నీరవ్ దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని చెబుతున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా స్వయంగా అతనే ఈ వ్యాఖ్యలు చేశాడు. నీరవ్ విషయంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేసే పనిలో పడింది. పైసలు లేవు.. అప్పు తీసుకుంటా ప్రస్తుతం నీరవ్ నైరుతి లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్నాడు. అతడిని భారత్కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్లోని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపులకు సంబంధించి నీరవ్ అక్కడి నుంచే వర్చువల్ ద్వారా తూర్పు లండన్లోని బార్కింగ్సైడ్ మేజిస్ట్రేట్ కోర్టులో ముందు హాజరయ్యాడు. చెల్లింపులపై వజ్రాల వ్యాపారి న్యాయస్థానానికి ఈ రకంగా విన్నవించుకున్నాడు.. తాను కోర్టు తీర్పు ప్రకారం డబ్బులను ఒకేసారి చెల్లించలేనని, నెలకు 10 వేల పౌండ్ల చొప్పున కడతానని అభ్యర్థించాడు. ఎందుకంటే భారత ప్రభుత్వం తన ఆస్తులన్నీ సీజ్ చేయడంతో డబ్బులు పరంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అనంతరం దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ 10 వేల పౌండ్లను ఎక్కడి నుంచి తెస్తావని అడగగా.. కోర్టుకు చెల్లించాల్సిన మొత్తం కోసం రుణం తీసుకుంటున్నానని చెప్పాడు. కాగా ఈ వ్యాపారవేత్తపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగాల ఆధారంగా నేరవ్ మోదీని 2019 మార్చిలో అరెస్టు చేసిన మూడేళ్ల తర్వాత అప్పీల్ను తిరస్కరించడం జరిగింది. -
ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి కేంద్రం భారీ షాక్!
బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. కేంద్రం ఓ వైపు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తుంది. కటకటాల్లోకి మార్చి 2019లో భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థనల మేరకు లండన్లో ఉన్న నీరవ్ని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం స్థానిక వాండ్స్వర్త్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అక్కడే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆస్తుల వేలం ఈ నేపథ్యంలో పూణేలో ఉన్న నీరవ్ ప్రాపర్టీలను వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో ఆక్షన్ పక్రియ ప్రారంభం కానుందని, ముంబైకి చెందిన డెబిట్ రికవరీ ట్రైబ్యూనల్-ఐ (డీఆర్టీ-ఐ) విభాగం ఈ వేలం చేపట్టనుంది. రికవరీ అధికారి అషుకుమార్ ఆదేశాలతో నీరవ్కు చెందిన రెండు ప్రాపర్టీలపై ఈ- ఆక్షన్ జరగనుంది. అధికారుల దర్యాప్తు ముమ్మరం పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం పేరుతో వేలకోట్ల ఆర్ధిక మోసాలకు పాల్పడ్డ నీరవ్ మోడీ, మోహిల్ చోక్సీలు ప్రధాన నిందితులు. ఇద్దరు బ్యాంకుల్లో వేల కోట్లను అప్పుగా తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో భారత ప్రభుత్వం నిందితులకు ఇచ్చిన రుణాల్ని తిరిగి రాబట్టేందుకు దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులతో దర్యాప్తు చేయిస్తుంది. ప్రాప్టరీ విలువ ఎంతంటే విచారణ కొనసాగుతుండగానే పూణేలోని హదప్సర్లో ఉన్న యో పూణే హౌసింగ్ స్కీమ్లోని 398 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఎఫ్ 1 భవనంలోని 16వ అంతస్తు... ఆ పక్కనే 396 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మరో ప్లాట్ ధరల్ని రూ. 8.99కోట్లు, రూ. 8.93 కోట్లుగా నిర్ణయించారు. వాటినే వేలం వేయనున్నారు. నోటీసులు జారీ వేలంపై అధికారులు ఇప్పటికే నీరవ్కు చెందిన స్టెల్లార్ డైమండ్స్, సోలార్ ఎక్స్పోర్ట్స్ డైమండ్ ఆర్ యూఎస్, ఏఎన్ఎం ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్డీఎం ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్లకు నోటీసులు జారీ చేశారు. -
బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. త్వరలోనే భారత్కు అప్పగింత!
లండన్: రూ.11వేల కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో షాక్ తగిలింది. తనను భారత్కు అప్పగించే విషయంపై అక్కడి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు లండన్ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు చట్టపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్లు అయింది. ఫలితంగా ఆయనను త్వరలోనే భారత్కు తీసుకువచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11 వేల కోట్ల మేర మోసం చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో 2018లో దేశం వీడి పారిపోయాడు. 2019లో లండన్లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉంటున్నాడు. తనను భారత్కు అప్పగించొద్దని గతనెలలోనూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆయన అప్పీల్ను రిజెక్ట్ చేసింది. దీంతో చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరుతూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాను భారత్కు వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని, మానసికంగా సమస్యలున్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు. న్యాయస్థానం వీటిని తోసిపుచ్చి అప్పీల్ను రిజెక్ట్ చేసంది. అయితే నీరవ్కు ఇంకా ఓ అవకాశం ఉంది. తనను భారత్కు అప్పగించే విషయంపై ఐరోపా సమాఖ్య మానవ హక్కుల కోర్టును ఆయన ఆశ్రయించవచ్చు. చదవండి: రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్! బంకర్లోనే -
నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన యూకే హైకోర్టు.. త్వరలో భారత్కు..
చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొనేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యునైటెడ్ కింగ్డమ్లోని హైకోర్టులో చుక్కెదురైంది. దేశం నుంచి పరారీలో ఉన్న నీరవ్ మోదీని భారత్కి తిరిగి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పిటీషన్ దాఖలైంది. అయితే నీరవ్ మోదీని అప్పగించడం అన్యాయం లేదా అణచివేత కాదని కోర్టు పేర్కొంటూ అతని పిటీషన్ను తిరస్కరించింది. దీంతో త్వరలో నీరవ్ భారత్కు రానున్నారు. ఈ అప్పీల్ విచారణకు అధ్యక్షత వహించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు. ఆగ్నేయ లండన్లోని వాండ్స్వర్త్ జైలులో కటకటాల వెనుక ఉన్న 51 ఏళ్ల వ్యాపారవేత్త, గత ఫిబ్రవరిలో భారత్కు అప్పగింతకు అనుకూలంగా జిల్లా జడ్జి సామ్ గూజీ వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని రూ. 13,500 కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయాడు. అప్పటినుంచి భారత్కు తిరిగి రాకుండా తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నాడు. చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! -
మేహుల్ చోక్సీపై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త మేహుల్ చోక్సీపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పదేళ్ల నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా 45 రోజుల్లోగా చెల్లించమని ఆదేశిస్తూ రూ. 5 కోట్ల జరిమానా సైతం విధించింది. గీతాంజలి జెమ్స్ కౌంటర్లో అక్రమ లావాదేవీలు చేపట్టిన అభియోగాలపై సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. దీంతో సెక్యూరిటీల మార్కెట్లో చోక్సీ పదేళ్లపాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి లావాదేవీలు చేపట్టేందుకు వీలుండదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గీతాంజలి జెమ్స్ షేర్ల ట్రేడింగ్లో ఇన్సైడర్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చోక్సీపై సెబీ ఏడాది కాలం నిషేధాన్ని, రూ. 1.5 కోట్ల జరిమానాను విధించింది. ఇక 2020 ఫిబ్రవరిలో లిస్టింగ్ తదితర పలు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ రూ. 5 కోట్ల జరిమానా చెల్లించవలసిందిగా చోక్సీతోపాటు, గీతాంజలి జెమ్స్ను సెబీ ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్, చైర్మన్ చోక్సీ నీరవ్ మోడీకి మేనమావకాగా.. వీరిరువురిపైనా పీఎస్యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ. 14,000 కోట్లకుపైగా మోసం చేసిన కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2018 మొదట్లో పీఎన్బీ మోసం బయటపడిన తొలినాళ్లలోనే చోక్సీ, మోడీ విదేశాలకు తరలిపోయారు. చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాలలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వెలువడగా.. ఇండియాకు అప్పగించాలన్న ప్రభుత్వ వాదనను బ్రిటిష్ జైల్లో ఉన్న మోడీ వ్యతిరేకిస్తున్నారు. -
నీరవ్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.253.62 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నీరవ్ కంపెనీలకు చెందిన రత్నాలు, నగలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసినట్లు తెలిపింది. సుమారు రూ.16వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేసిన కేసులో ప్రస్తుతం యూకేలో జైలు శిక్ష అనుభవిస్తున్న నీరవ్ను భారత్కు రప్పించే ప్రయత్నాలు తుదిదశలో ఉన్నట్లు పేర్కొంది. తాజా జప్తుతో కలిపి నీరవ్కు చెందిన మొత్తం రూ.2,650 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లయిందని వివరించింది. -
ఆర్బీఐ కొత్త టెక్నాలజీ, వేల కోట్ల బ్యాంక్ స్కాంలు జరగవట!
దేశంలో ఆర్ధిక నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు కేంద్రం తీసుకోని నిర్ణయం లేదు. అయినా సరే ఎక్కడో ఓ చోటా రుణాల పేరిట జరుగుతున్న స్కాంలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఫిర్యాదుతో రూ.42,871 కోట్ల కుంభ కోణం బ్యాంకింగ్ రంగ వ్యవస్థని అతలా కుతులం చేసింది. చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ధిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసింది. వ్యాపారాల నిర్వహణ పేరుతో బ్యాంకుల వద్ద వేలకోట్లు రుణాలు తీసుకొని.. వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోతున్న ఆర్ధిక నేరగాళ్లపై ఆర్బీఐ ఉక్కుపాదం మోపనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను వేలకోట్ల రూపాయలు (ఆర్టీఐలో తేలింది రూ.15,423.39 కోట్లు) మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అతని మామ (బంధువు)మెహుల్ చోక్సీల తరహా మోసాలు మరోసారి జరగకుండా ఉండేందుకు ఆర్బీఐ బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఇందులో పలు బ్యాంకుల్ని సైతం ఆర్బీఐ జత చేసింది. 12 బ్యాంక్లు హెచ్డీఎఫ్సీ,ఐసీఐసీఐ ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 12కు పైగా బ్యాంకులు సమిష్టిగా బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రికృతమై జాతీయ, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ (ట్రేడ్ ఫైనాన్సింగ్) నిర్వహిస్తున్నాయి. ఆ ట్రాన్సాక్షన్ల నిర్వహణలో సత్ఫలితాలు రాబడితే నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల్లాంటి ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకుల్ని మోసం చేయాలన్న ఆలోచనే రాదని ఆర్బీఐ భావిస్తున్నట్లు పలు వెలుగులోకి నివేదికలు చెబుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా బెంగళూరు కేంద్రంగా ఈ పైలెట్ ప్రాజెక్ట్లో యూరప్ దేశమైన బెల్జియంకు చెందిన బ్లాక్ చైన్ డెవలప్మెంట్ ఫ్లాట్ ఫామ్ సెటిల్ మింట్, అమెరికాకు చెందిన క్రోడా టెక్నాలజీస్, ఐబీఎంలు టెక్నాలజీ సపోర్ట్ను అందిస్తుండగా..యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే? ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పేరుతో ఆర్బీఐ నేతృత్వంలో డెవలప్ చేస్తున్న ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ..దాని పరిభాషలో చెప్పాలంటే.. ఉదాహారణకు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు బ్యాంకుల వద్ద రుణం తీసుకొని వాటిని అక్రమ మార్గంలో మళ్లించేందుకు జరిపే ట్రాన్సాక్షన్లపై ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కన్నేస్తుంది. అనుమానం వచ్చిందా వెంటనే ఈ టెక్నాలజీ అనుసందానమైన సెంట్రల్ డేటాతో సంబంధం లేకుండా బ్లాక్ చేస్తుంది. ఇన్ పుట్ డివైజ్, ఔట్పుట్ డివైజ్, స్టోరేజ్ డివైజ్ ఇలా మూడు పద్దతుల్లో ట్రాన్సాక్షన్లను బ్లాక్ చేసి సంబంధిత బ్యాంకుల సంబంధించిన కంప్యూటర్లకు లేదా, సంబంధిత శాఖలకు అలెర్ట్ ఇస్తుంది. తద్వారా లోన్ ఫ్రాడ్లను గుర్తించవచ్చు. ప్రస్తుతం ఆర్బీఐ ఈ టెక్నాలజీ విధి విధానాల్ని పరిశీలిస్తుండగా.. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల్ని సరి చేయాలని చూస్తోంది. నిపుణులు ఏం అంటున్నారంటే! రుణాలు పొందే విషయంలో ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎటువంటి అడ్డకట్ట వేయలేదు. అయితే రుణాలు తీసుకున్న వ్యక్తులు ఆ నిధులను పక్క దారి పట్టిస్తుంటే మాత్రం ఇట్టే పసిగడుతుంది. వాళ్ల కుతంత్రాలకు చెక్ పెడుతుంది. తద్వారా భారీ స్థాయిలో జరిగే మోసాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ టెక్నాలజీ సాయంతో లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) పేరుతో జరిగే మోసాల్ని సైతం అరికట్టవచ్చు. చదవండి👉బ్యాంకులంటే విజయ్ మాల్యా గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి! -
ఆర్థిక నేరగాళ్లను అప్పగించాలి
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్థులను రప్పించి చట్టం ముందు నిలబెట్టడం తమకు అత్యంత ప్రాధాన్యాంశమని ఇంగ్లండ్కు భారత్ స్పష్టం చేసింది. దీన్ని తాను అర్థం చేసుకున్నానని భారత పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు తమ న్యాయవ్యవస్థను వాడుకోవాలనుకునే నేరగాళ్లను ఎన్నటికీ స్వాగతించబోమని స్పష్టం చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి ఇంగ్లండ్లో తలదాచుకుంటున్న విజయ్మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని చాలారోజులుగా భారత్ ఒత్తిడి తెస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీతో చర్చల అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో జాన్సన్ మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్లను భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని వివరించారు. మోదీ, జాన్సన్ చర్చల్లో ఆర్థిక నేరగాళ్ల అప్పగింత అంశం ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. ఈ విషయంలో భారత్ వైఖరిని జాన్సన్కు మోదీ వివరించారని చెప్పారు. దీనిపై జాన్సన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉగ్ర మూకలను సహించం ఇంగ్లండ్ వేదికగా ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్ర మూకలను సహించబోమని బోరిస్ హెచ్చరించారు. బ్రిటన్లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని ష్రింగ్లా చెప్పారు. దీనిపై భారత్ ఆందోళనను బోరిస్ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి గ్రూపులను ఎదుర్కొనేందుకు సంయుక్త ంగా ఒక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై నేతలు చర్చించారన్నారు. అక్కడ సత్వరమే శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారని చెప్పారు. రష్యాపై ఆంక్షల విషయంలో భారత్పై యూకే ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కీవ్లో వచ్చేవారం తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తామని బోరిస్ వెల్లడించారు. అఫ్గాన్లో శాంతి స్థాపన జరగాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్–ఇంగ్లండ్ బంధం.. అత్యంత పటిష్టం భారత్, ఇంగ్లండ్ మధ్య అన్ని విషయాల్లోనూ బంధం ముందెన్నడూ లేనంత బలోపేతంగా మారిందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో శుక్రవారం ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు. దీపావళి నాటికి రెండుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవుతుందని, వినిమయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఎఫ్టీఏలోని 26 అంశాల్లో నాలుగింటిపై గతంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిందని, మిగతా వాటిపై పురోగతి కనిపించిందని అధికారులు తెలిపారు. ఇండియాకు ఒజీఈఎల్ (ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్) ఇస్తామని, దాంతో రక్షణ రంగ వాణిజ్యానికి అడ్డంకులు తొలగుతాయని జాన్సన్ చెప్పారు. భూ, జల, వాయు, సైబర్ మార్గాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించామన్నారు. నూతన ఫైటర్ జెట్ టెక్నాలజీని భారత్తో పంచుకుంటామన్నారు. చర్చల్లో మంచి పురోగతి కనిపించిందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి యూకే సాయం చేస్తుందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛపై యూకే ఆరంభించిన ఐపీఓఐని స్వాగతించారు. విద్య, వైద్యం, పునర్వినియోగ ఇంధనం తదితర అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. సచిన్, అమితాబ్లా ఫీలవుతున్నా: జాన్సన్ భారత్లో తనకు అత్యంత ఆదరణపూర్వక స్వాగతం లభించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తం చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీని తన ఖాస్ దోస్త్ (బెస్ట్ ఫ్రెండ్)గా అభివర్ణించారు. పలుమార్లు నరేంద్ర అని ప్రస్తావిస్తూ తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. బ్రిటీష్ ఇండియన్లలో దాదాపు సగంమందికి పుట్టిల్లైన గుజరాత్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ తనకు లభించిన ఆదరణ చూస్తే సచిన్ టెండూల్కర్లాగా ఫీలవుతున్నానని, ఎక్కడచూసినా అమితాబ్ బచ్చన్ లాగా తన పోస్టర్లే కనిపిస్తున్నా యని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య బంధం ఎంతో కీలకమన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ వద్ద జాన్సన్కు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ స్వాగతం లభించింది. నా భుజానికున్నది భారతీయ టీకానే! తనతో సహా వందకోట్లమందికి పైగా ప్రజలకు భారత్ కోవిడ్ టీకా అందించిందని బోరిస్ ప్రశంసించారు. ‘ నా భుజానికున్నది ఇండియన్ టీకా, అది నాకు ఎంతో మేలు చేసింది. భారత్కు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఆశించినట్లు ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ మారిందని కొనియాడారు. ఆస్ట్రాజెనెకా, సీరమ్ సహకారంతో కోవిడ్ టీకా రూపొందించడాన్ని ప్రస్తావించారు. -
సీబీఐ బిగ్ ఆపరేషన్..నీరవ్మోదీ ప్రధాన అనుచరుడు అరెస్ట్..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాం కేసులో సీబీఐ కీలక పురోగతిని సాధించింది. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన అనుచరుడు సుభాష్ శంకర్ను ఈజిప్టు రాజధాని కైరోలో సీబీఐ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సుభాష్ను ఈజిప్టు నుంచి భారత్కు తీసికొచ్చినట్లుగా సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 13 వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత ఆరోపణలను నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నారు. ఈ స్కామ్లో సుభాష్ శంకర్ కీలక నిందితుడు. పీఎన్బీ స్కాంకు సంబంధించి సీబీఐ అభ్యర్థన మేరకు.. నీరవ్, అతని సోదరుడు నిషాల్ మోదీ , అతని ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్లపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది. 2018లో కేసు నమోదైనప్పటి నుంచి సుభాష్ శంకర్ పరారీలో ఉన్నాడు. అతడు కైరోలో అజ్ఞాతంలో దాక్కున్నాడు. తమకు అందిన ఇన్పుట్ల ఆధారంగా సీబీఐ ఆపరేషన్ నిర్వహించి శంకర్ని పట్టుకుంది. అతడిని ప్రత్యేక విమానంలో సీబీఐ అధికారులు.. ముంబైకి తీసుకొచ్చినట్లు సమాచారం. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని సీబీఐ కోర్టులో శంకర్ను హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. ఇక కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకుగాను సుభాష్ను విచారణ నిమిత్తం కస్టడీకి సీబీఐ కోరనుంది. చదవండి: భారత ఆర్థిక వ్యవస్థపై మూడీస్ ఆసక్తికర వ్యాఖ్యలు..! -
ఆ ముగ్గురి 19వేల కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేశాం
న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్లయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన రూ.19వేల కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రూ.22,500 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడిన ఈ ముగ్గురు నేరగాళ్లపై సకాలంలో చర్యలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. మనీ ల్యాండరింగ్ చట్టంలోని కొన్ని నిబంధనలకు వక్రభాష్యాలు చెబుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సకాలంలో తీసుకున్న చట్టపరమైన చర్యల ఫలితంగా ఈ ముగ్గురికి చెందిన రూ.15,113 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి అప్పగించినట్లు చెప్పారు. ఈ కేసుపై వాదనలు వచ్చే వారం కూడా కొనసాగనున్నాయి. -
విజయ్మాల్యా, తదితరుల నుంచి బ్యాంకులకు రూ. 18 వేల కోట్లు రికవరీ: కేంద్రం
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల వంటి కుబేరుల నుంచి దాదాపు రూ.18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి ఇచ్చామని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్రం మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చిన విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుకి బుధవారం కేంద్రం వెల్లడించింది. అంతేకాదు విదేశాల్లోని పరిస్థితులతో పోలిస్తే భారతదేశంలో పీఎంఎల్ఏ కింద చాలా తక్కువ సంఖ్యలో కేసులను దర్యాప్తు చేస్తున్నామని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో కేంద్రం సుప్రీం కోర్టులో యూకేని ఉదహరించింది, ఇక్కడ మనీలాండరింగ్ చట్టం కింద ఒక ఏడాదిలో 7,900 కేసులు నమోదయ్యాయని, యూఎస్ (1,532), చైనా (4,691), ఆస్ట్రియా (1,036), హాంకాంగ్ (1,823), బెల్జియం (1,862), రష్యా (2,764) నమోదవుతున్నాయని వివరించింది. భారత్లో 4 వేల పీఎంఎల్ఏ కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోందని తెలిపింది. అయితే సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్న నేరాల మొత్తం ఆదాయం రూ. 67,000 కోట్లు అని పేర్కొంది. గత 5 ఏళ్లలో ప్రతి ఏడాది విచారణకు తీసుకున్న కేసుల సంఖ్య 2015-16లో 111 కేసుల ఉండగా.. 2020-21 నాటికి 981గా మారుతుందని కేంద్రం తెలిపింది. అంతేకాదు ఇటువంటి నేరాలకు సంబంధించి 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, కానీ 2 వేల కేసులను మాత్రమే విచారణకు స్వీకరించినట్లు కేంద్రం వెల్లడించింది. (చదవండి: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్!... కోలుకున్నా ఇంకా బాధిస్తునే ఉంటుంది!) -
ఎగవేతదారుల నుంచి రికవరీ చేసింది ఎంతంటే..
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా బ్యాంకింగ్ను కోట్లాది రూపాయలు మోసం చేసి, దేశం నుంచి పారిపోయిన వాళ్ల నుంచి వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంతత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విజయ్మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీసహా ఈ తరహా వ్యక్తుల ఆస్తుల అమ్మకం ద్వారా బ్యాంకులు రూ.13,100 కోట్ల రికవరీ చేసినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు తెలిపారు. జులై 2021 నాటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అందించిన సమాచారం మేరకు ఈ వివరాల్ని వెల్లడించారు ఆర్థిక మంత్రి. కాగా, గడచిన ఏడు సంవత్సరాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యతల (సీఎస్ఆర్) కింద కంపెనీలు రూ.1.09 లక్షల కోట్లు వెచ్చించినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బొగ్గు గణనీయమైన నిల్వలతో సరసమైన ఇంధన వనరుగా ఉన్నందున భవిష్యత్లో బొగ్గు ప్రధాన ఇంధన వనరుగా నిలవనుందని బొగ్గు వ్యవహారాల శాఖ ప్రహ్లాద్ జోషి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఆర్థిక నేరస్థులను భారత్కు తీసుకొస్తాం
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరస్థులను స్వదేశానికి రప్పించేందుకు దౌత్యపరమైన, అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో భారత్కు తిరిగి రావడం మినహా వారికి మరో మార్గం అంటూ ఉండదన్నారు. రుణ వితరణ, ఆర్థిక వృద్ధిపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడారు. ‘ఆర్థిక నేరస్థులను తీసుకొచ్చే విషయంలో విధానాలు, చట్టపరంగా నడుచుకుంటున్నాం. మేమిచ్చే సందేశం సుస్పష్టం. మీ దేశానికి తిరిగి రండి. ఇందుకోసం మా చర్యలు కొనసాగుతూనే ఉంటాయి’ అని పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రధాని ప్రస్తావించలేదు. విజయ్ మాల్యా, నీరవ్మోదీలను తీసుకొచ్చేందుకు భారత్ ఇటీవలి కాలంలో చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకులు వినూత్నంగా పనిచేయాలి.. దేశంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగుపడినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి తమ సర్కారు గడిచిన ఏడేళ్లలో ఎన్నో సంస్కరణలను అమలు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు గత ఐదేళ్లలోనే కనిష్ట స్థాయిలకు చేరినట్టు చెప్పారు. చురుకైన చర్యల ద్వారా రూ.5 లక్షల కోట్ల మొండి రుణాలను వసూలు చేసినట్టు పేర్కొన్నారు. ‘‘సంపద సృష్టి కర్తలకు, ఉపాధి కల్పించే వారికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది. వారికి రుణ వితరణ అందేలా చూడాలి. నిజాయితీ నిర్ణయాల్లో మీకు రక్షణగా నేను ఉంటాను’ అంటూ బ్యాంకులకు మార్గదర్శనం చేశారు. 2022 ఆగస్ట్ 15 నాటికి ప్రతీ బ్యాంకు శాఖ.. పూర్తి డిజిటల్గా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కనీసం 100 క్లయింట్లను అయినా కలిగి ఉండాలన్న లక్ష్యాన్ని ప్రధాని నిర్ధేశించారు. సొంతంగా 5జీ, 6జీ సామర్థ్యాలు టెలికం రంగానికి సంబంధించి 5జీ, 6జీ టెక్నాలజీల్లో స్వీయ సామర్థ్యాల అభివృద్ధిపై భారత్ పెట్టుబడులు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనికితోడు సెమీ కండక్టర్ల తయారీపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. గురువారం ‘సిడ్నీ డైలాగ్’ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని వర్చువల్(ఆన్లైన్ మాధ్యమంలో)గా మాట్లాడారు. నూతన తరం టెలికం టెక్నాలజీల అభివృద్ధిలో జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో కలసి భారత్ పనిచేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీకి సంబంధించి గొప్ప ఉత్పత్తి డేటాయేనన్నారు. డేటాను కాపాడడం, గోప్యత, భద్రతకు సంబంధించి పటిష్ట కార్యాచరణను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజా సార్వభౌమాధికారం కోసం డేటాను ఉపయోగించుకుంటామన్నారు. డిజిటల్ డొమైన్లో భారత్ సాధించిన ఘతనను ప్రస్తావించారు. ‘‘క్లౌడ్ ప్లాట్ఫామ్లో సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాం. డిజిటల్ సార్వభౌమాధికారానికి ఇది కీలకం. క్వాంటమ్ కంప్యూటింగ్లోనూ ప్రపంచ స్థాయి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లకు సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలు, సేవలను అందించడంలో భారత్ ఇప్పటికే ప్రముఖ కేంద్రంగా ఉంది. సైబర్ సెక్యూరిటీకి సైతం భారత్ను కేంద్రంగా మార్చేందుకు పరిశ్రమతో కలసి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశాం. సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహకాల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నాం’’ అని ప్రధాని వివరించారు. -
దేశంలో మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన సీబీఐ
వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో సంబంధం ఉన్న గార్విట్ ఇన్నోవేటివ్ ప్రమోటర్స్ లిమిటెడ్(జీఐపీఎల్), ఆ కంపెనీ యజమాని సంజయ్ భాటిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన బైక్ బాట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి, మరో 14 మంది కలిసి దేశవ్యాప్తంగా సుమారు రూ.15,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులను మోసం చేశారని ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సంజయ్ భాటి బైక్ బాట్ పేరుతో బైక్-టాక్సీ సర్వీసులను ప్రారంభించాడు. ఈ బైక్ సర్విస్ ముసుగులో లాభదాయకమైన మోసపూరిత ఆర్థిక పథకాలను రూపొందించాడు. ఈ బైక్ టాక్సీ సర్వీసుల్లో బైక్ బాట్ వాహనాన్ని ఎవరైనా కొనుగోలుదారుడు తమ వద్ద ఉన్న డబ్బుతో ఒకటి, మూడు, ఐడు లేదా ఏడు బైక్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బైక్లను తమ కార్పొరేట్ కార్యాలయమే నడుపుతుందని నమ్మించారు. ఇలా పెట్టుబడి పెట్టినవారికి నెలవారీ అద్దె, ఈఎంఐతో పాటు ఎక్కువ బైక్లపై పెట్టుబడి పెడితే బోనస్ కూడా ఇస్తామంటూ ఆసక్తికరమైన ప్రోత్సాహకాలతో ఆకట్టుకున్నారు. కంపెనీ వివిధ నగరాల్లో ఫ్రాంచైజీలను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ నగరాల్లో బైక్లు టాక్సీలు పెద్దగా పనిచేయడం లేదని సీబీఐ పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా బైక్ టాక్సీల్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడి దారులు మోసపోయినట్టు సీబీఐ గుర్తించింది. (చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్!) 2017లో ఈ పథకాలను ప్రారంభించిన ఈ సంస్థ.. పెట్టుబడిదారుల నుంచి డబ్బు వసూలు చేయడం, వేరేవారికి తిరిగి చెల్లించడం వంటివి చేస్తూ 2019 జనవరి వరకు చేసింది. నవంబర్ 2018లో పెట్రోల్ బైక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ ఎలక్ట్రిక్-బైక్ కోసం కంపెనీ ఇదే విధమైన ప్రణాళికను ప్రవేశపెట్టింది. సాధారణ పెట్రోల్ బైక్ లతో పోలిస్తే ఈ-బైక్ల సబ్ స్క్రిప్షన్ మొత్తం దాదాపు రెట్టింపు అని ఎఫ్ఐఆర్లో తెలిపింది. పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించడానికి 'బైక్ బాట్ - జీఐపీఎల్ పథకం ద్వారా నడిచే బైక్ టాక్సీ అతి త్వరలో వేయనున్నాము. ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలనే వ్యక్తులు త్వరగా డబ్బును డిపాజిట్ చేయాలి' అని కంపెనీ ప్రచారం చేసింది. కేవలం రూ.62,200 పెట్టుబడి పెట్టి అద్దె పొందవచ్చునని, ఏడాదిలోగా బైక్ ఓనర్గా మారవచ్చు అని అందరినీ నమ్మించింది. ఇలా రూ.62,000 పెట్టుబడి పెట్టిన వారికి 12 నెలలపాటు నెలకు రూ.9,765 చొప్పున అందిస్తామని ఆశపెట్టింది. ఇలా ఏడాదికి రూ.1,17,000 సంపాదించవచ్చు అని తెలిపింది. ఈ ప్రకటన చూసి సుమారు 2,25,000 మంది ఇందులో పెట్టుబడి పెట్టారు. అయితే, కొన్నాళ్ల తర్వాత నెలలు గడుస్తున్నా అద్దెతో పాటు ఈఎంఐ చెల్లింపులు, బోనసులు రాకపోవడంతో పెట్టుబడిదారుల్లో అనుమానాలు వచ్చాయి. అప్పుడిస్తాం, ఇప్పుడిస్తాం అని భారీ మొత్తం లాగేసుకున్నాక బోర్డు తిప్పేశారు. అయితే, ఈ కంపెనీ నోయిడా జిల్లా అథారిటీ, పోలీసు అధికారుల పరిధిలో ఉంది. (చదవండి: రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లు) ఇంత జరుగుతున్న అక్కడి పోలీసు అధికారులు ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. "బదులుగా, ఎస్ఎస్ పి, ఎస్ పీ క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదుదారుల ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు" సీబీఐ తెలిపింది. సంజయ్ భాటి, అతని సహచరులు పెట్టుబడిదారులను నుంచి ముందస్తు కుట్రలో భాగంగా దేశవ్యాప్తంగా కనీసం 15,000 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించింది. అయితే, ఇంతకు ముందు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జీఐపీఎల్, దాని ప్రమోటర్ భాటి, ఇతరులకు వ్యతిరేకంగా గౌతమ్ బుద్ధనగర్ లోని దాద్రీ పోలీస్ స్టేషన్ లో నమోదైన వివిధ ఎఫ్ఐఆర్ల ఆధారంగా బైక్ బాట్ కుంభకోణం మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో ఆర్థిక దర్యాప్తు సంస్థ 216 కోట్లకు పైగా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. -
అప్పగింతపై నీరవ్ సవాల్కు లండన్ కోర్టు ఓకే
లండన్: మనీల్యాండరింగ్ ఆరోపణలపై భారత్కు తనను అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసే మరో అవకాశం వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి దక్కింది. తాను నిరాశ నిస్పృహలో ఉన్నానని, మానసిక ఆరోగ్యం సరిగాలేదని, ఆత్మహత్య చేసుకోవాలనేంతగా కుంగిపోయానని ఆయన పెట్టుకున్న అభ్యర్థనను లండన్లోని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. నీరవ్ తరఫు లాయర్లు తమ వాదనలను జడ్జికి వినిపించారు. ‘ బ్రిటన్లోని క్రిమినల్ జస్టిస్ యాక్ట్–2003,యూరప్లోని మానవ హక్కుల పరిరక్షణ, జీవించే హక్కులను పరిగణనలోకి తీసుకుని అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నా’ అని జడ్జి వ్యాఖ్యానించారు. -
భారత్కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యం..
లండన్: బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని భారత్కు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. లండన్ కోర్టులో అప్పీల్కు వెళ్లిన అతను సంచలన వ్యాఖ్యలతో మరో డ్రామాకు తెరలేపాడు. తనను భారత్కు అప్పగించొద్దని కోర్టుకు మెరపెట్టిన నీరవ్.. భారత్కు అప్పగిస్తే తనకు ఆత్మహత్యే శరణ్యమని వ్యాఖ్యానించాడు. కాగా, ఇదే కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే నీరవ్కు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్కు లండన్ కోర్టు తిరస్కరించింది. ఫలితంగా అతన్ని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇదిలా ఉంటే, బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర ఎగనామం పెట్టి విదేశాల్లో తల దాచుకుంటున్న నీరవ్ మోదీ.. ఆర్థిక నేరాల్లో నిందితుడు కావడంతో అతన్ని భారత్కు అప్పగించాలని లండన్లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. భారత్లో మనీల్యాండరింగ్, నమ్మకద్రోహం వంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కానీ, ఇప్పుడు కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోదీ.. సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
Nirav Modi: నీరవ్మోదీ కేసులో కీలక మలుపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ నిందితుడు నీరవ్మోదీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ మనీ లాండరింగ్కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. నీరవ్మోదీ చెల్లెలు పూర్వి మోడీ ఈడీకి అప్రూవర్గా మారింది. పూర్వి మోడీ యుకె బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి ₹17 కోట్లకు పైగా నగదును భారత ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. "పూర్వి మోడీ(నీరవ్ మోడీ సోదరి) యుకె బ్యాంక్ ఖాతా నుంచి భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యాంకు ఖాతాకు 2316889.03 డాలర్లు బదిలిచేశారు. దీంతో నీరవ్మోదీ లండన్ అకౌంట్స్ నుంచి రూ.17.25 కోట్లు రికవరీ చేసినట్లు" దర్యాప్తు సంస్థ పేర్కొంది. జూన్ 24న పూర్వి మోడీ తన పేరిట యునైటెడ్ కింగ్ డమ్ లోని లండన్లో ఒక బ్యాంకు ఖాతా ఓపెన్ చేసినట్లు, తన సోదరుడు నీరవ్మోదీ ఆదేశాల మేరకు ఖాతా ఓపెన్ చేసినట్లు, అందులో ఉన్న నిధులు తనకు చెందినవి కాదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు తెలియజేసింది. కొన్ని షరతులతో ఈడీ ఆమెకు క్షమబిక్ష పెట్టింది. ఈడీకి అప్రూవర్గా మారిన పూర్వి మోడీ తన యుకె బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యాంకు ఖాతాకు 2316889.03 డాలర్లు బదిలీ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నీరవ్ మోడీ ప్రస్తుతం యుకె జైలులో ఉన్నారు. ముంబైలోని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) నుంచి వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ రూ.13,000 కోట్లు తీసుకొని బ్రిటన్ కు పారిపోయాడు. కొద్ది రోజుల క్రితం భారత్కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్చేస్తూ నీరవ్ లండన్లోని హైకోర్టులో చేసుకున్న అప్పీల్ ను కోర్టు తిరస్కరించింది. చదవండి: State Bank Day: పీఎం కేర్స్ ఫండ్కు భారీ విరాళం -
మాల్యా షేర్లతో స్టేట్ బ్యాంక్ కన్సార్టియంకు రూ. 5824 కోట్లు
ముంబై: లిక్కర్ కింగ్, రుణ ఎగవేత దారుడు విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రేవరీస్ షేర్లను ఎస్బీఐ నేతృత్వంలో గల బ్యాంకుల కన్సార్షియం జూన్ 23న విక్రయించింది. ఈ విక్రయం ద్వారా రూ. 5,824.5 కోట్లు వచ్చినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలియజేసింది. భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా కేసుల్లో బ్యాంకులకు మొత్తం రూ. 22,583.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ తెలిపింది. ఈడి ప్రకారం.. పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు చేసిన మోసాలలో బ్యాంకులు నష్టపోయిన మొత్తంలో 40 శాతం (రూ.9,041.5 కోట్లు) ఇప్పటివరకు రికవరీ చేశారు. ముంబైలోని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీ కలిసి రూ.13,000 కోట్లు మోసం చేశారని, అలాగే విజయ్ మాల్య సుమారు రూ.9,000 కోట్లు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో మోసం చేసినట్లు ఈడీ తెలిపింది. మాల్య కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసులో ఇదే విధమైన వాటాల అమ్మకాల ద్వారా బ్యాంకులు ఇంతకు ముందు రూ.1,357 కోట్లు పొందినట్లు ఈడీ తెలిపింది. నీరవ్ మోడీ కేసులో మరో రూ.1,060 కోట్ల విలువైన ఆస్తులు బ్యాంకులకు జప్తు చేసినట్లు పేర్కొంది. చదవండి: ట్విటర్ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం -
నీరవ్కు లండన్ హైకోర్టులో చుక్కెదురు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్కు దాదాపు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్లోని హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్చేస్తూ నీరవ్ లండన్లోని హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతించాలంటూ సంబంధిత పత్రాలను సమర్పించారు. ఈ పత్రాలను పరిశీలించిన కోర్టు మంగళవారం తిరస్కరించింది. అయితే, మరో ఐదు రోజుల్లోపు నీరవ్ హైకోర్టులో మరోసారి అప్పీల్చేసుకునే అవకాశముంది. భారత్లో ఆర్థికనేరాల్లో నిందితుడైన కారణంగా నీరవ్ను భారత్కు అప్పగించాలంటూ లండన్లోని వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. నీరవ్ భారత్లో మనీ ల్యాండరింగ్, నమ్మకద్రోహం తదితర నేరాభియోగాలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్.. నీరవ్ను భారత్కు అప్పగించేందుకు సమ్మతి తెలుపుతూ ఏప్రిల్ 15న ఆదేశాలు జారీచేశారు. హోం మంత్రి నిర్ణయాన్ని, వెస్ట్మినిస్టర్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అవకాశమివ్వాలంటూ నీరవ్ హైకోర్టులో దాఖలుచేసిన ‘అప్పీల్’ అనుమతి పత్రాలను కోర్టు మంగళవారం తిరస్కరించిందని హైకోర్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 50ఏళ్ల నీరవ్ను 2019 మార్చి 19న అరెస్ట్చేసిన యూకే పోలీసులు అతడిని నైరుతి లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉంచారు. -
రూ. 9 వేల కోట్ల రికవరీ..ఇలా రాబట్టారు!
న్యూఢిల్లీ: రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి యునైటెడ్ బ్రూవరీస్ (యూబీఎల్)లో ఉన్న షేర్లలో కొంత భాగాన్ని బ్యాంకుల తరఫున రుణాల రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) బుధవారం విక్రయించింది. వీటి విలువ సుమారు రూ. 5,824 కోట్లు. దీనితో భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా కేసుల్లో బ్యాంకులు ఇప్పటిదాకా సుమారు రూ. 9,041 కోట్లు దాకా రికవర్ చేసుకున్నట్లయింది. వారు ముగ్గురూ ఎగవేసిన మొత్తంలో (దాదాపు రూ. 22,000 కోట్లు) ఇది సుమారు 40 శాతం. ఈ కేసుల్లో వారి ఆస్తులను జప్తు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 25న మాల్యా షేర్లు మరిన్ని.. ‘మాల్యా, చోక్సీ, మోదీల వల్ల బ్యాంకులకు సుమారు రూ. 22,585 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ కేసులకు సంబంధించి అటాచ్ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు వాటిల్లిన నష్టంలో దాదాపు 80 శాతం (రూ. 18,170 కోట్లు) ఉంటుంది‘ అని ఈడీ పేర్కొంది. మాల్యా కేసుల విచారణ సందర్భంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు (పీఎంఎల్ఏ) ఆదేశాల మేరకు తాము జప్తు చేసిన సుమారు రూ. 6,624 కోట్ల విలువ చేసే యూబీఎల్ షేర్లను ఎస్బీఐ కన్సార్షియంకు ఈడీ బదలాయించింది. ఇందులో నుంచి రూ. 5,824 కోట్ల విలువ చేసే షేర్లను బ్యాంకుల తరఫున బుధవారం డీఆర్టీ విక్రయించింది. జూన్ 25న మరో రూ. 800 కోట్ల షేర్లను విక్రయించే అవకాశం ఉందని ఈడీ తెలిపింది. ఇక పరారైనవారు, ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి ఆస్తులను జప్తు చేసుకుని, బాకీలన్నీ రాబడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటనపై స్పందిస్తూ, ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు రావాల్సిన బాకీలకన్నా ఎక్కువే ఉంటుందని చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఇలా రాబట్టారు.. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) రూ. 13,000 కోట్లు మేర మోసగించారని వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ, బ్యాంకుల కన్సార్షియంకు సుమారు రూ. 9,000 కోట్లు ఎగవేశారని మాల్యా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి.. మాల్యాకి చెందిన షేర్లను గతంలో కూడా విక్రయించిన బ్యాంకులు సుమారు రూ. 1,357 కోట్లు రాబట్టుకోగలిగాయి. నీరవ్ మోదీ కేసులో రూ. 1,060 కోట్ల విలువ చేసే అసెట్స్ను దక్కించుకున్నాయి. తాజాగా మాల్యాకు చెందిన మరిన్ని షేర్లను విక్రయించడంతో బ్యాంకులు మొత్తం ఈ మూడు కేసులకు సంబంధించి రూ. 9,000 కోట్ల పైగా రాబట్టుకోగలిగినట్లయింది. ఈ ముగ్గురు బోగస్ సంస్థలను ఉపయోగించి, బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులను మళ్లించారని తమ విచారణతో స్పష్టంగా రుజువు చేయగలిగినట్లు ఈడీ తెలిపింది. వీరిని స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. -
పీఎన్బీ స్కాం: నీరవ్ మోదీకి భారీ షాక్
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. మోదీని ఇండియాకు అప్పగించాలన్న వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి నీరవ్ చేసుకున్న లిఖిత పూర్వక అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది కోర్టు అధికారి తెలిపారు. ఈ అప్పగింత తీర్పుపై మోదీకి మరో అవకాశం ఉంది. చట్టం ప్రకారం అతను మరో ఐదు రోజుల్లోగా మౌఖికంగా అభ్యర్థన చేసుకోవచ్చు. ఒకవేల ఈ అభ్యర్థనను అంగీకరిస్తే విచారణ చేపడుతుంది, తిరస్కరిస్తే నీరవ్ భారత్కు రాక తప్పదని అధికారిక వర్గాల సమాచారం. నీరవ్ మోడీ మౌఖికంగా దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అతను మౌఖికంగా అప్పీల్ చేస్తే అప్పీల్ ప్రొసీడింగ్స్ కు అనుగుణంగా మేం చర్యలు తీసుకుంటాం అని భారత అధికారుల తరఫున కోర్టులో వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) పేర్కొంది. తప్పుడు సమాచారంతో పీఎన్బీని నీరవ్ మోదీ మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడింది. అప్పటికే మోడి లండన్ కు పారిపోయాడు. నీరవ్ మోడీ రెండు సంవత్సరాల క్రితం 19 మార్చి 2019న అరెస్టు ఇంగ్లాండ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి నైరుతి లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో ఉన్నారు. పీఎన్బీ బ్యాంకును రూ.13,500కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలంటూ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఫిబ్రవరిలో వెలువరించిన విషయం తెలిసిందే. చదవండి: ఆర్థిక నేరగాళ్ల రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం -
ఆర్థిక నేరగాళ్ల రూ. 18,170 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
పరారీలో ఉన్న ఆర్ధిక నెరగాళ్లు విజయ్ మాల్య, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు చెందిన ఆస్తులలో 80 శాతం రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. కేవలం ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా రూ.9,371.17 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఈడీ తెలిపింది. విజయ్ మాల్య, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ బ్యాంకులను మోసం చేసిన మొత్తం రూ.22,585.83 కోట్లు, వీటిలో రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటి వరకు రూ.8,441 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేయగా, కోర్టు ఆదేశాల ప్రకారం జూన్ 25న మరో రూ.800 కోట్లు బదిలీ చేయాల్సి ఉంది. ముంబైలోని పీఎంఎల్ఎ ప్రత్యేక కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు ఈడీ తన వద్ద ఉన్న రూ.6,600 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేసింది. వీటిలో రూ.5,824.50 కోట్లు విలువ చేసే షేర్లను కన్సార్టియం తరఫున ‘డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)’ విక్రయించినట్లు వెల్లడించింది. ఈ ముగ్గురు వ్యాపారవేత్తల దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలను పరిశీలించగా.. విదేశాల్లోనూ వీరు ఆస్తులు కూడబెట్టినట్లు తేలిందని వెల్లడించింది. అలాగే డొల్ల కంపెనీల పేరిట బ్యాంకుల నుంచి నిధులను సమీకరించినట్లు పేర్కొంది. ఈ అంశాలపై మనీలాండరింగ్ చట్టం కింద విచారణ పూర్తయిన తర్వాత కేసులు నమోదు చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ తెలిపింది. ఈడీ తన దర్యాప్తులో రూ.18,170.02 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో విదేశాలలో ఉన్న రూ.969 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. బ్యాంకులు నష్టపోయిన రూ.22,585.83 కోట్లలో దర్యాప్తు సంస్థ స్వాధీనంచేసుకున్న మొత్తం నష్టంలో 80.45%(రూ.18,170 కోట్లు). ఇదేగాక, ఈడీ సహాయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఇంతకు ముందు వాటాలను విక్రయించడం ద్వారా రూ.1,357 కోట్ల నష్టాలను తిరిగి పొందాయి. చదవండి: విమాన ప్రయాణికులకు ఇండిగో గుడ్ న్యూస్ -
భారత్కు అప్పగించొద్దు.. నీరవ్ మోదీ పిటిషన్
లండన్: భారత్ తిరిగి రాకుండా ఉండేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అతడిని భారత్కు అప్పగించాలని ఫిబ్రవరి 25న యూకే కోర్టు తీర్పు ఇచ్చింది. అదే క్రమంలో ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు అడ్డుపడే క్రమంలో ప్రస్తుతం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఆయన మరోసారి యూకే హైకోర్టులో తాజాగా పిటిషన్ కూడా దాఖలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను దాదాపు రూ. 14వేల కోట్ల మోసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ భారత్కు తిరిగి రాకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్కు అప్పగించొద్దు... నీరవ్ మోదీ కోర్టులో.. భారత్లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి సరిగా లేదంటూ బ్రిటన్ కోర్టుకు విన్నవించారు. అయితే, ఆయన చేసిన వాదనలను అక్కడి కోర్టు తోసిపుచ్చింది. మనీలాండరింగ్ కేసులో భారత్ సమర్పించిన ఆధారాలు పరీశిలించామని, తప్పు చేసినట్లు రుజువులు ఉన్నాయని.. కనుక అతడిని అప్పగించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కోర్టు తీర్పునిచ్చింది. ఆపై యూకే హోంమంత్రిత్వశాఖ కూడా ఇందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం భారత్కు రాకుండా ఉండడానికి తాజాగా మరో ప్రయత్నంగా యూకే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. తప్పుడు ఎల్వోయూలతో పీఎన్బీని నీరవ్ మోదీ మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడింది. అయితే అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయారు. 2018 డిసెంబర్లో నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అక్కడి వాండ్స్వర్త్ జైల్లో నీరవ్ ఉంటున్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బ్రిటన్ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. ( చదవండి: బిల్ గేట్స్: వ్యాక్సిన్ ఫార్ములాను భారత్కు ఇవ్వద్దు ) -
భారత్కు నీరవ్ మోదీ అప్పగింత!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(50)ని భారత్కు రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్కు అప్పగించేందుకు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అప్పగింత ఉత్తర్వుపై యునైటెడ్ కింగ్డమ్ హోంశాఖ మంత్రి(సెక్రెటరీ) ప్రీతి పటేల్ సంతకం చేసినట్లు యూకేలోని భారత రాయబార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్ కేసులు నీరవ్ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్నారు. హోంశాఖ సెక్రెటరీ జారీ చేసిన తాజా ఉత్తర్వుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరడానికి నీరవ్ మోదీకి 14 రోజుల గడువు ఇచ్చారు. ఆధారాల పట్ల కోర్టు సంతృప్తి నీరవ్ మోదీ తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు ఇండియాలో కేసులు నమోదయ్యాయని, అతడు ఇండియాలోని న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలని వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న స్పష్టం చేసింది. నీరవ్పై నమోదైన కేసుల విషయంలో ఇండియాలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. నీరవ్ను భారత్ అప్పగించే విషయంలో నిర్ణయాన్ని హోంశాఖకు వదిలేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇండియాలో అయితే సరైన వైద్యం అందదన్న నీరవ్ వాదనను న్యాయస్థానం కొట్టిపారేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడని చెప్పేందుకు ఉన్న ఆధారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మనీ లాండరింగ్, సాక్షులను బెదిరించడం, ఆధారాలను మాయం చేయడం తదితర అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడని స్పష్టంగా బయటపడుతోందని గుర్తుచేసింది. అందుకే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తెలియజేసింది. యూకే అప్పగింత చట్టం–2003 ప్రకారం.. న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని హోంశాఖ సెక్రెటరీకి తెలియజేస్తారు. ఇండియా–యూకే మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పర్యవేక్షించే అధికారం ఉన్న యూకే కేబినెట్ మంత్రి దీనిపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిప్రకారమే నీరవ్ మోదీ అప్పగింతకు హోంశాఖ మంత్రి ప్రీతి సుముఖత వ్యక్తం చేశారు. అప్పగింత ఎప్పుడు? నీరవ్ మోదీని వాండ్స్వర్త్ జైలు నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్న 12వ నంబర్ బ్యారక్కు తరలించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యూకే హోంమంత్రి ఉత్తర్వులను సవాలు చేస్తూ లండన్ హైకోర్టును ఆశ్రయించేందుకు నీరవ్ మోదీకి అవకాశం కల్పించారు. ఆయన ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే మరికొంత కాలం విచారణ జరుగనుంది. యూకే సుప్రీంకోర్టులో కూడా నీరవ్మోదీ అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుందని సమాచారం. అయితే, లండన్ హైకోర్టు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. తాజా పరిణామాలపై నీరవ్ మోదీ లీగల్ టీమ్ ఇంకా స్పందించలేదు. హైకోర్టుకు వెళ్తారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. యూకేలో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే నీరవ్ మోదీ భారత్కు చేరుకుంటారు. అసలేమిటి కేసు? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ను (ఎల్ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఎల్ఓయూతో నీరవ్ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్బీ బ్యాంక్ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్ కోర్టులో దాఖలు చేసింది. 2019 డిసెంబర్ 20న 30 మందిపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 జూన్లో ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోదీని లండన్లో అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది. -
నీరవ్ మోదీ అప్పగింతకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. దీనికి సంబందించిన ఉత్తర్వులపై యుకె హోంశాఖ కార్యదర్శి ఈ రోజు సంతకం చేశారు. 50 ఏళ్ల నీరవ్ మోడీకి చివరగా యుకె హైకోర్టు ముందు 28 రోజుల్లోగా చట్టబద్ధంగా సవాలు చేసే అవకాశం ఉంది. గతంలో విజయ్ మాల్యా 2019 ఫిబ్రవరిలో బ్రిటన్ ప్రభుత్వం తన అప్పగించే ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత కోర్టుకు వెళ్లారు. రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి) కుంభకోణం, మనీలాండరింగ్ కోసం నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని యూకే, భారత్కి అప్పగిస్తుండడంతో నీరవ్ మోదీ కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ప్రత్యేక సెల్ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో కరోనా మహమ్మారితో నీరవ్ మోదీ మానసిక ఆరోగ్యం బాగాలేదని, భారత్ లో మానవ హక్కల ఉల్లంఘనను సాకుగా చూపిన ఆయన తరపు అడ్వకేట్ల వాదననూ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక నీరవ్ కు ఆర్ధర్ రోడ్డు జైలులో బ్యారక్ నెంబర్ 12లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని భారత్ హామీ ఇచ్చిందని జడ్జ్ గూజీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదముద్ర వేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. -
ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామం ఎలా ?
లండన్: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, సంజయ్ భండారీ.. భారత్ బ్యాంకులకు కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బ్రిటన్కు పరారైన ఆర్థిక నేరగాళ్లలో వీరు కొందరు. మన దేశంలో నేరం చేసిన వారందరూ బ్రిటన్కే ఎందుకు ఉడాయిస్తున్నారు ? ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామంగా ఎలా మారింది ? ఈ ప్రశ్నలకు జవాబుల్ని లండన్కు చెందిన జర్నలిస్టు దంపతులు డేనిష్ ఖాన్, రుహి ఖాన్లు ఒక పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎస్కేప్డ్ @ ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో 12 కేసుల్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారత్ నేరగాళ్లకి లండన్ ఎలా సురక్షితంగా మారిందో వివరించారు. రుణాల ఎగవేత దగ్గర్నుంచి హంతకుల వరకు అన్ని రకాల కేసుల్ని రచయితలు అధ్యయనం చేశారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, భారత్ నావికాదళ మాజీ అధికారి రవి శంకరన్, మ్యుజీషియన్ నదీమ్ సైఫీ వంటి వారి గురించి ఈ పుస్తకంలో రాశారు. ఈ కేసులకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాలు, భారత్, బ్రిటన్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, బ్రిటన్లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలు, కొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులు అన్నింటిని విస్తృతంగా పరిశీలించి, అన్నింటినీ క్రోడీకరించి లండన్ ఏ విధంగా భారత్ నేరగాళ్లకు సురక్షితమో పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశామని డేనిష్ ఖాన్ తెలిపారు. ప్రధానంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. భారత్, బ్రిటన్ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఆ దేశం ఇద్దరిని మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. -
మాల్యా, మోదీ, మెహుల్కు నిర్మలాజీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల బ్యాంకింగ్ కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనడానికి భారత్కు రప్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ గురువారం స్పష్టం చేశారు. బీమా సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా అడిగిన ఒక ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కు సంబంధించి బ్యాంకింగ్ను దాదాపు రూ.9000 కోట్ల మేర మోసం చేసి బ్రిటన్కు పారిపోయిన విజయ్మాల్యాను ఆ దేశం నుంచి రప్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 2016 నుంచీ ఆయన బ్రిటన్లో ఉంటున్నారు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో దాదాపు రూ.14,500 కోట్లకుపైగా రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన 49 సంవత్సరాల నీరవ్ మోదీ లండన్ పారిపోయారు. అయితే ఈడీ, సీబీఐ విజ్ఞప్తి మేరకు ఆయనను 2019లో అక్కడి అధికారులు తమ అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ, నీరవ్ మోదీకి మేనమామ. చోక్సీ భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వా అండ్ బార్బుడాలో ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే మోదీ, చోక్సీలకు చెందిన దాదాపు రూ.2,600 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి విదితమే. బీమాలో ఎఫ్డీఐలు 74 శాతానికి: రాజ్యసభలో బిల్లు ఆమోదం కాగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా (సవరణ) బిల్లు, 2021పై జరిగిన చర్చకు ఆర్థికమంత్రి సమాధానం ఇస్తూ, దేశంలోకి బీమా రంగం సేవలు మారుమూలకు విస్తరించడానికి ఈ చొరవ దోహదపడుతుందని తెలిపారు. సంబంధిత వర్గాలతో బీమా రంగం రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సమగ్ర చర్చల అనంతరమే ఈ రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 74 శాతానికి పెంచాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 2015లో అప్పటికి 26 శాతంగా ఉన్న ఎఫ్డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడం జరిగింది. జీవిత బీమా సేవలు దేశంలో మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో జీవిత బీమా ప్రీమియం ప్రస్తుతం 3.6 శాతంగా ఉంది. అంతర్జాతీయగా చూస్తే దీని సగటు 7.13 శాతం. ఇక జనరల్ ఇన్సూరెన్స్ చూస్తే, ప్రపంచ సగటు 2.88 శాతంకాగా, భారత్ జీడీపీలో కేవలం 0.94 శాతం. 2015లో 49 శాతానికి పరిమితులు పెంచిన తర్వాత దేశీయ బీమా రంగంలోకి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం రూ.26,000 కోట్లని ఆర్థికమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీమా కంపెనీలు ద్రవ్యపరమైన (లిక్విడిటీ) ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి తాజా నిర్ణయం దోహదపడుతుందన్నారు. -
పీఎన్బీ స్కాం: చోక్సీకి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్నేషనల్ బ్యాంకు కుంభకోణం (పీఎన్బీ స్కాం)లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, నీరవ్మోదీ మేనమామ, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. వేలకోట్ల రూపాయల మేర పీఎన్బీ బ్యాంకునకు కుచ్చుటోపీ పెట్టి, ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ పౌరసత్వాన్ని ఆంటిగ్వా అండ్ బార్బుడా రద్దు చేసింది. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్టు సమాచారం. గత సంవత్సరమే తన పౌరసత్వాన్ని ఆంటిగ్వా రద్దు చేయడంతో, సెయింట్ జాన్లోని సివిల్ కోర్టును ఆశ్రయించాడు. చోక్సీ. అయితే భారత బ్యాంకులను మోసం చేసి, తమ దేశంలో స్థిర పెట్టుబడుల పేరుతో తమ దేశంలో ఆశ్రయం పొందటానికి వీల్లేదన్న అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో, చోక్సీ పిటిషన్ను కొట్టివేసి అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలో హామీ ఇచ్చినట్టుగా చోక్సీని భారత్కు అప్పగించే చర్యలు త్వరితగతిన ప్రారంభమవు తాయని వారు తెలిపారు. కాగా దౌత్యపరమైన ఒత్తిడి తరువాత మెహుల్ చోక్సీ పౌరసత్వ ఉపసంహరణకు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలోనేఅంగీకరించారు. నేరస్థులకు, ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి తమ దేశంలో చోటు లేదని 2019 జూన్లో స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే పీఎన్బీ స్కాంకు సంబంధించి లండన్ కోర్టు తీర్పు అనంతరం, ఈ కేసులోప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు రంగం సిద్ధ మవుతున్న సంగతి తెలిసిందే. -
నీరవ్ మోదీ (వజ్రాల వ్యాపారి).. రాయని డైరీ
వెళ్లడం తప్పేలా లేదు. తప్పించుకుని వెళ్లే వీలూ లేదు. నన్ను బ్రిటన్ జైల్లోనే ఉంచి, ఇండియాలో విచారణ జరిపిస్తే బ్రిటన్కి గానీ, ఇండియాకు గానీ పోయేదేమీ లేదు. కొంచెం డబ్బు ఖర్చవచ్చు. ఖర్చెందుకు దండగ అనుకున్నట్లున్నాయి ఇండియా, బ్రిటన్! మరీ ఇంత మనీ మైండెడ్ అయితే మనీ ఎలా çసంపాదిస్తారు? డబ్బు కావాలనుకుంటే డబ్బును వెదజల్లాలి. వ్యాపారంలో ఇది మొదటి సూత్రం. సూత్రాలు కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. ఆలోచిస్తే ఇంకో సూత్రమేదైనా దొరుకుతుంది. ఆర్థికమంత్రులు, దేశాధినేతలు ఆ ఇంకో సూత్రం గురించి ఆలోచించరులా ఉంది! ఆలోచించే బదులు నీరవ్నో, మాల్యానో దేశం రప్పిస్తే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని నిర్మలా సీతారామన్, నరేంద్ర మోదీ అనుకుంటూ ఉండొచ్చు. నిర్మల, నరేంద్ర, నీరవ్.. ముగ్గురి పేర్లూ ‘ఎన్’ తో భలేగా మొదలయ్యాయే అనే ఆలోచన వచ్చింది నాకు! వాళ్లకూ ఈ అర్థంలేని ఆలోచన వచ్చి ఉంటుందా? మాల్యా పేరు కూడా ‘ఎన్’ తో స్టార్ట్ అయుంటే నాకు నిస్సందేహంగా నవ్వొచ్చి ఉండేది. ముంబై వెళ్లి జైల్లో కూర్చున్నాక కూడా పగలబడి నవ్వుతూ ఉండేవాడిని. మాల్యా కూడా బ్రిటన్లోనే ఉన్నా, బ్రిటన్లో నేనున్నంత ధైర్యంగా మాల్యా లేడు! ఫోన్ చేస్తే ‘ష్.. ఇప్పుడు కాదు’ అనేవాడు. ‘ఎక్కడున్నావో అదైనా చెప్పు’ అని అడిగేవాడిని. ‘ఇద్దరం ఇండియాలోనైతే లేము కదా. ఇండియాలో లేనప్పుడు ఎక్కడున్నా మనం ఒకే చోట ఉన్నట్లు. ఒకేచోట ఉన్నప్పుడు ఫోన్లెందుకు? ఇండియాలో ఉన్నవాళ్లకు ఫోన్ చేసి మరీ మన ఫోన్ నెంబర్లు ఇవ్వడం కాకపోతే..’ అనేవాడు! ఓసారెప్పుడో తనే చేశాడు.. ‘ఎక్కడున్నావ్?!’ అని. ‘నీ అంత పిరికివాణ్ని కాదు. నువ్వెక్కడున్నావో చెప్పు నేనే నీ దగ్గరకు వస్తాను’ అన్నాను. ‘నా దగ్గరికి రావడానికీ నీకు ధైర్యం అక్కర్లేదు నిజమే కానీ, నీ దగ్గరకు రావాలంటే మాత్రం నేను ధైర్యంగానో, పిరికిగానో ఉండాలి. నువ్వెక్కడున్నావో చెబితే అక్కడికి రావడానికి నాకు ధైర్యం అవసరమా, పిరికితనం అవసరమా నిర్ణయించుకుంటాను. కొన్నిసార్లు పిరికితనం కూడా ధైర్యం చేసినంత మేలు చేస్తుంది. కొన్నిసార్లు ధైర్యం కూడా పిరికితనమంత కీడు చేస్తుంది’’ అన్నాడు. తర్వాత ఫోన్ కట్ అయింది. మళ్లీ మాల్యా నాకు గానీ, నేను మాల్యాకు గానీ ఫోన్ చెయ్యలేదు. ఆ ఫోన్ మాల్యా కట్ చేశాడా, నేను కట్ చేశానా అన్నదీ గుర్తు లేదు. ఆ రోజు.. ‘ఎక్కడున్నావ్?’ అని ఎందుకు అడిగి ఉంటాడా అని మాత్రం అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంటుంది. ౖటñ మ్ చూసుకున్నాను. చూసుకున్నాను కానీ టైమ్ ఎంతైందో చూసుకోలేదు. ఈ క్షణమో, మరు క్షణమో ఇండియా ఫ్లయిట్ ఎక్కవలసి రావచ్చు. చివరిసారి బ్రిటన్లో ఎవరైనా ఆప్తులతో మాట్లాడాలనిపించింది. ఆప్తులు అనుకోగానే మాల్యానే గుర్తొచ్చాడు. ఫోన్ చేశాను. లిఫ్ట్ చేశాడు! ‘‘ఎలా ఉన్నావ్ మాల్యా? వెళ్లిపోతున్నాను..’’ అన్నాను. ‘‘నన్ను ఒంటరిని చేసి..’’ అన్నాడు. అతడి గొంతులో ధ్వనించిన దిగులును వింటే.. నాతో పాటే నేనెక్కిన ఫ్లయిట్లోనే నా పక్క సీట్లో కూర్చొని ఇండియా వచ్చేసేట్లున్నాడు. ‘‘ఫోన్ చేస్తుంటాన్లే..’’ అన్నాను. ఏంటో ఈ ఆర్థిక వ్యవస్థలు, వ్యవహారాలు! మాల్యా డబ్బు మొత్తం చెల్లించేస్తానంటే తీసుకోనంటున్నారు. నేను ఒక్క రూపాయి కూడా చెల్లించలేనంటే నన్ను తీసుకుపోతున్నారు! -
నీరవ్ మోదీ కోసం బ్యారక్ 12 సిద్ధం
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని యూకే, భారత్కి అప్పగిస్తుండడంతో, నీరవ్ మోదీ కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ప్రత్యేక సెల్ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నీరవ్ని ముంబైకి తీసుకొచ్చిన వెంటనే ఆయన్ను ఆర్థర్ రోడ్ జైలులో అత్యధిక భద్రత ఉన్న బ్యారక్ నంబర్ 12లోని మూడు సెల్లలో ఒకదానిలో ఉంచనున్నారు. నీరవ్కు జైల్లో కల్పించే వసతులను గురించి మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తక్కువ మంది ఖైదీలున్న సెల్లో అతడిని ఉంచుతామని జైలు అధికారులు వెల్లడించారు. బ్యారక్లో నీరవ్కు మూడు చదరపు మీటర్ల స్థలం మాత్రమే ఉంటుంది. ఒక కాటన్ పరుపు, తలదిండు, ఒక దుప్పటి, కప్పుకోవడానికి బ్లాంకెట్ ఇస్తామని అధికారి తెలిపారు. అక్కడ తగు మాత్రంగా గాలి, వెలుతురు సోకుతుందని, ఆయనకు సంబంధించిన వస్తువులు పెట్టుకునే స్థలం కూడా ఉంటుందని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. విజయ్మాల్యాని యూకే నుంచి భారత్కి అప్పగిస్తే ఇదే ఆర్థర్ రోడ్ జైల్లో, 12వ నంబర్ బ్యారక్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసినట్టు జైలు అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్, మోసం కేసులో విజయ్ మాల్యా మార్చి 2016 నుంచి యూకేలో ఉన్నాడు. -
నీరవ్ మోదీని భారత్కు అప్పగించండి
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని తిరిగి దేశానికి తీసుకువచ్చే విషయంలో భారత్కు నిర్ణయాత్మక విజయం లభించింది. మోదీని పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో భారత్లోని కోర్టులో విచారించాల్సిన అవసరం ఉందని బ్రిటన్లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ జడ్జి శామ్యూల్ గూజీ గురువారం తీర్పునిచ్చారు. భారత్లోని కోర్టులో తనకు న్యాయమైన విచారణ జరగదన్న నీరవ్ మోదీ వాదనను తోసిపుచ్చారు. భారత్లో నిష్పక్షపాత విచారణ జరగదన్న వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను సుమారు 200 కోట్ల డాలర్ల(రూ. 14.5 వేల కోట్లు) మేరకు మోసం చేసిన ఆరోపణలపై, నగదు అక్రమ చెలామణి ఆరోపణలపై మోదీపై భారత్లో సీబీఐ, ఈడీ పలు కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. నీరవ్ మోదీ వాదిస్తున్నట్లు ఈ కేసులో ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన కూడా లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వైద్యపరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భారత ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశారు. వాండ్స్వర్త్ జైలు నుంచి నీరవ్ మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. ‘పీఎన్బీ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ పేర్కొన్న నగదు అక్రమ చెలామణి, సాక్ష్యులను బెదిరించడం, సాక్ష్యాధారాలను నాశనం చేయడం వంటి ఆరోపణలకు సంబంధించి నీరవ్ దీపక్ మోదీని దోషిగా నిర్ధారించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలున్నాయ’ని ఈ సందర్భంగా జడ్జి శ్యామ్యూల్ గూజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా కేసును న్యాయమూర్తి ఉదహరించారు. దీర్ఘకాలం జైలులో ఉండడంతో నీరవ్ మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదన్న విషయాన్ని అంగీకరిస్తూనే.. అది భారత్కు ఆయనను అప్పగించేందుకు అడ్డంకిగా భావించడం లేదని జడ్జి స్పష్టం చేశారు. ఈ కేసులో 16 బండిళ్ల సాక్ష్యాధారాలను, మరో 16 బండిళ్ల నిపుణుల నివేదికలను భారత ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వాటిని పరిగణనలోకి తీసుకున్నానన్నారు. అయితే, భారత అధికారులు వాటి డాక్యుమెంటేషన్ను సరిగ్గా చేయలేదని వ్యాఖ్యానించారు. యూకేలోని నేరస్తుల అప్పగింత చట్టం–2003 ప్రకారం .. తన తీర్పు కాపీని న్యాయమూర్తి హోం మినిస్టర్ ప్రీతి పటేల్ పరిశీలనకు పంపిస్తారు. అనంతరం, రెండు నెలల లోపు భారత్, యూకేల మధ్యనున్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం, ఆమె నీరవ్ మోదీని భారత్కు అప్పగించే విషయమై నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా కోర్టు తీర్పు మేరకే మంత్రి నిర్ణయం ఉంటుంది. అయితే, నీరవ్ మోదీకి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు అనంతరం రెండు వారాల్లోగా ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. నీరవ్పై కేసు ఎప్పుడు, ఎలా..? జనవరి 29, 2018: నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు కలిసి 2.81 బిలియన్ రూపాయల మోసానికి పాల్పడ్డారంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నీరవ్ మోదీపై ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 5, 2018: ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 16, 2018: నీరవ్ మోదీ ఇంటి నుంచి రూ.56,74 బిలియన్ల విలువైన డైమండ్లు, బంగారం, నగలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 17, 2018: సీబీఐ ఈ కుంభకోణంలో తొలి అరెస్టులు చేసింది. ఇద్దరు పీఎన్బీ ఉద్యోగులు, నీరవ్ మోదీ గ్రూప్కి చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ని సీబీఐ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 17, 2018: ఈకుంభకోణంలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల పాస్పోర్టులను నాలుగు వారాల పాటు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 21, 2018: నీరవ్ మోదీ సీఎఫ్ఓ, మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను సీబీఐ అరెస్టు చేసింది. నీరవ్ ఫాంహౌస్ని కూడా సీల్ చేసింది. ఫిబ్రవరి 22, 2018: నీరవ్కి సంబంధించిన 9 ఖరీదైన కార్లను ఈడీ సీజ్ చేసింది. ఫిబ్రవరి 27, 2018: నీరవ్కి మెజిస్ట్రేట్ కోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఆగస్టు 3, 2018: నీరవ్ను అప్పగించాల్సిందిగా యూకే అధికారులకు భారత్ అభ్యర్థన డిసెంబర్ 27, 2018: నీరవ్ తమ దేశంలో ఉన్నట్టు భారత్కి తెలిపిన యూకే. మార్చి 9, 2019: బ్రిటిష్ పత్రిక ‘ద టెలిగ్రాఫ్’ లండన్ వీధుల్లో నీరవ్ ఉన్నట్లు ధృవీకరించింది. మార్చి 18, 2019: భారత్ కోరిన మేరకు లండన్లోని వెస్ట్మినిస్టర్ కోర్టు నీరవ్ అరెస్టు వారెంట్. మార్చి 20, 2019: లండన్లో నీరవ్ని అరెస్టు చేసి, వెస్ట్మినిస్టర్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నీరవ్ కి బెయిలు నిరాకరించింది. మార్చి 20, 2019: నీరవ్ని మార్చి 29 వరకు హర్ మెజెస్టీస్ ప్రిసన్(హెచ్ఎంపి)కి పంపారు. ఏప్రిల్9: 2వసారి నీరవ్ బెయిల్ తిరస్కరణ. మే 8, 2019: మూడోసారి నీరవ్ బెయిల్ తిరస్కరణ. తిరిగి యూకే జైల్లోనే నీరవ్. జూన్ 12, 2019: నీరవ్ పారిపోయే ప్రమాదం ఉందని నాలుగోసారి కోర్టు బెయిలు నిరాకరణ. ఆగస్టు 22, 2019: నీరవ్ రిమాండ్ సెప్టెంబర్ 19 వరకు పొడిగించిన యూకే కోర్టు. నవంబర్ 6, 2019: నీరవ్ కొత్త బెయిలు పిటిషన్ను తిరస్కరించిన యూకే కోర్టు. మే 11, 2020: పీఎన్బీ కేసులో నీరవ్పై యూకేలో ప్రారంభమైన ఐదు రోజుల విచారణ. మే 13: మనీలాండరింగ్ కేసులో నీరవ్కి వ్యతిరేకంగా భారత్ మరిన్ని ఆధారాలు సమర్పణ. డిసెంబర్ 1, 2020: నీరవ్ రిమాండ్ పొడిగింపు. జనవరి 8, 2021: ఫిబ్రవరి 25, 2021న నీరవ్ అప్పగింత కేసులో తీర్పు ప్రకటించాలని నిర్ణయించిన యూకే కోర్టు. -
మంచి పరిణామమేగానీ...
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ. 14,000 కోట్ల మేర కుచ్చు టోపీ పెట్టి హఠాత్తుగా 2018 ఫిబ్రవరిలో మాయమై చివరకు ఆ మరుసటి ఏడాది లండన్లో పట్టుబడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు అప్పగించవచ్చంటూ బ్రిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు కీలక మైనది. భారత్కు పంపితే తన మానవ హక్కులు హరించుకుపోతాయని నీరవ్ చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. తనను నిర్బంధించే జైలు సౌకర్యవంతంగా వుండదన్న వాదనను కూడా కొట్టిపారేసింది. బ్యాంకు సిబ్బంది తోడ్పాటుతో మోసపూరితంగా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్ఓయూ)లను అపహరించి, వాటి ఆధారంగా భారీ మొత్తంలో డబ్బు కైంకర్యం చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తుండగా... ఆ నిధులు సరిహద్దులు దాటిన వైనాన్ని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. సాక్ష్యాధారాలు మాయం చేయటం, సాక్షుల్ని బెదిరించటం, వేధించి ఒకరి మరణానికి కారకుడు కావటం వంటి ఆరోపణలు కూడా ఆయనగారిపై వున్నాయి. కేవలం బ్యాంకు సొమ్ము కొట్టేయాలన్న ఏకైక ఉద్దేశంతో వ్యాపారం పేరు చెప్పి నీరవ్ మోదీ ఏడేళ్ల వ్యవధిలో వేల కోట్లు కొట్టేశారు. అయినా సులభంగా దేశం విడిచి పారిపోగలిగాడు. అతనికి రెండేళ్ల ముందు మరో ఎగవేతదారు విజయ్ మాల్యా సైతం ఈ మాదిరే పరారయ్యాడు. మాల్యాను దేశం తీసుకు రావటానికి చేసిన ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాలేదు. రకరకాల సాకులు చెబుతూ, ఏవేవో అభ్యంతరాలు లేవనెత్తుతూ మాల్యా అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. నీరవ్ మోదీ ఎప్పటికి వస్తాడన్నది ఎవరూ చెప్పలేరు. అయితే మాల్యా బెయిల్ తీసుకోగా, ప్రస్తుతానికైతే నీరవ్ మోదీ జైల్లో వున్నాడు. ఆయన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే వుంది. మన బ్యాంకుల చేతగానితనానికి, వాటిలో ఉన్నత స్థాయిలో పనిచేసేవారి చేతివాటుతనానికి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తదితరులు నిదర్శనం. ఒక సాధారణ వ్యక్తి రుణం తీసుకోవటానికి ప్రయత్నిస్తే సవాలక్ష య„ý ప్రశ్నలేసే బ్యాంకులు ఇలాంటి మోసగాళ్లముందు ఎంత సులభంగా మోకరిల్లుతాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2011లో నీరవ్ మోసపూరిత పనులకు పాల్పడటం మొదలుపెడితే 2018 వరకూ... అంటే ఏడేళ్లపాటు అవి యధేచ్ఛగా సాగిపోయాయి. రికార్డుల్లో ఎక్కడా చూపకుండా నీరవ్ మోదీ, ఆయన సంబంధీకులు ఎల్వోయూలను ఉపయోగించుకుని విదేశీ ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. తమ ఖాతాదారు చెల్లించాల్సిన మొత్తానికి పూచీపడుతూ బ్యాంకులు ఈ ఎల్ఓయూలు జారీ చేస్తాయి. వీటి ఆధారంగానే విదేశాల్లోని బ్యాంకులు రుణాలిస్తాయి. అలా ఇచ్చేముందు ఎల్ఓయూ జారీ చేసిన బ్యాంకును సంప్రదిస్తాయి. ఇవన్నీ ‘సజావుగానే’ పూర్తయ్యాయి! వేల కోట్లు నీరవ్ మోదీ చేతుల్లో వాలిపోయాయి. ఈ మొత్తం వ్యవహారమంతా మన బ్యాంకింగ్ వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెట్టింది. పకడ్బందీ తనిఖీ వ్యవస్థ అనుకున్నది సైతం ఏడేళ్లపాటు అక్కరకు రాకుండా పోయిందంటే...ఏటా జరిగితీరాల్సిన అంతర్గత ఆడిటింగ్లో కూడా ఇది దొరకలేదంటే ఏమను కోవాలి? ఈ లావాదేవీలు ఎక్కడా నమోదు కాకుండా నీరవ్ చూడగలిగాడు. అందుకే మొదట్లో బ్యాంకుకు రూ. 11,300 కోట్ల మేర నష్టం జరిగిందని లెక్కేయగా...తవ్వినకొద్దీ అది పెరగటం మొదలెట్టింది. నీరవ్ మోసాన్ని యధేచ్ఛగా సాగనీయటమే కాదు...‘మోసం బట్టబయలైంద’ని ఆ బ్యాంకులో కీలక బాధ్యతల్లో వున్నవారు ఉప్పందించారు. ఇది జరిగాకైనా బ్యాంకులు అప్రమత్తంగా వున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు 2019–20 సంవత్సరంలో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే బ్యాంకింగ్ మోసాలు రెండున్నర రెట్లు పెరిగాయి. నీరవ్ మోసం వెల్లడైన 2018–19లో ఈ మాదిరి మోసాల పరిమాణం మొత్తంగా రూ. 71,500 కోట్లు కాగా...2019–20లో అది రూ. 1.85 లక్షల కోట్లకు చేరుకుంది. మరి నీరవ్ కేసు బ్యాంకుల్ని ఏం అప్రమత్తం చేసినట్టు? మోసాలను నివారించటం సంగతలా వుంచి...వాటిని వెనువెంటనే గుర్తించటంలో, మాయగాళ్లను చట్టానికి పట్టివ్వటంలో బ్యాంకులు బాగా వెనకబడి వున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. నీరవ్ మోదీ ఇక్కడ కూడబెట్టిన ఆస్తుల్ని బ్యాంకులు స్వాధీనం చేసుకోగలిగాయి. కానీ ఈ కొట్టేసిన డబ్బంతా పెట్టి అంతకు అనేక రెట్లు విలువచేసే విలాసవంతమైన భవంతుల్ని, ఇతర ఆస్తుల్ని లండన్, న్యూయార్క్వంటి చోట్ల అతను కొనుగోలు చేశాడు. అతని ఆచూకీ రాబట్టడంలో మన నిఘా విభాగాలు విఫలమైనా, బ్రిటన్ దినపత్రిక ‘డైలీ టెలిగ్రాఫ్’ పాత్రికేయులు ముగ్గురు నీరవ్ను గుర్తించి బయటపెట్టారు. ఇప్పుడు బ్రిటన్ కోర్టులో నీరవ్ వాదన వీగిపోయేలా చూడ టంలో మన న్యాయవాదులు విజయం సాధించటం సంతోషించదగ్గదే. అయితే ఇదింకా అయి పోలేదు. నీరవ్ వినతిపై బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ నిర్ణయం తీసుకోవాలి. అందుకామెకు గరిష్టంగా రెండు నెలల సమయం పట్టొచ్చు. ఆమె నిర్ణయం తనకు ఆమోదయోగ్యం కానట్టయితే ఆ తర్వాత మరో 14 రోజుల్లో నీరవ్ హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అక్కడ విచారణ ఎన్నాళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇదంతా సాధ్యమైనంత త్వరగా పరిష్కారమై, నీరవ్ను ఇక్కడికి తీసుకొచ్చి విచారించి శిక్షించగలిగితే ఈ తరహా మోసగాళ్లకు అదొక గుణపాఠమవుతుంది. -
నీరవ్ మోదీకి భారీ షాక్: యూకే కోర్టు కీలక తీర్పు
-
నీరవ్ మోదీకి భారీ షాక్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతడిని భారత్కు తీసుకువచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించింది. మనీలాండరింగ్ కేసులో భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సరైనవేనన్న కోర్టు.. నీరవ్ మానసిక స్థితి సరిగా లేదన్న వాదనను కొట్టిపారేసింది. బ్యాంకుల ఉన్నతాధికారులతో లింక్ను ధ్రువీకరించిన న్యాయస్థానం... బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకులను అతడు మోసగించినట్టు నిరూపణ అయిందని పేర్కొంది. ఈ క్రమంలో.. నీరవ్ మోదీపై మనీ లాండరింగ్ అభియోగాలు రుజువు కావడంతో గురువారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అయితే తమ ఉత్తర్వులపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. కాగా కోర్టు తీర్పుతో లండన్ ప్రభుత్వం అతడిని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ ఆర్థిక నేరగాడు స్వదేశానికి రానున్నాడు. కాగా బ్యాంకులకు రూ.13,700 కోట్లు టోకరా పెట్టి నీరవ్ మోదీ లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. చదవండి: ప్రైవేటు బ్యాంకులకు సై -
పీఎన్బీ స్కాం సంచలనం : నీరవ్కు భారీ షాక్
సాక్షి, ముంబై: బ్యాంకింగ్ రంగాన్ని పట్టికుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమైపోయాయంటూ నీరవ్ సోదరి పూర్వి, ఆమె భర్త మైయాంక్ మెహతా సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను ఇస్తామంటూ అప్రూవర్గా మారేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. పీఎన్బీ స్కాం, నీరవ్ నుంచి తమను దూరం చేయాలని కోరుతూ పూర్వి మోదీ, ఆమె భర్త కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని, సాక్ష్యాలను అందించేందుకు అంగీకరించారు. అతని నేరపూరిత కార్యకలాపాలు మూలంగా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు స్థంభించి పోయాయని వాపోయారు. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వీరిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు అనుమతించింది. క్షమాపణ తెలిపిన తరువాత నీరవ్ చెల్లెలు పూర్వి మోడీ, ఆమె భర్తను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు తెలిపింది. ప్రస్తుతం బెల్జియం పౌరసత్వంతో ఆదేశంలో ఉన్న పూర్వి మోదీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా పీఎన్బీ స్కాంలో నీరవ్ మోడీ , అతని మామ మెహుల్ చోక్సీ, కొంతమంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలతో పీఎన్బీని రూ .14 వేల కోట్లకు ముంచేశాడు. అనంతరం విదేశాలకు పారిపోయిన నీరవ్ను 2019 మార్చిలో భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ జైల్లో ఉన్న నీరవ్ను భారత్కు అప్పగించే అంశం విచారణలో ఉంది. -
నవంబర్ 3 వరకు నీరవ్ మోదీ రిమాండ్ పొడిగింపు
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ జ్యుడీషియల్ రిమాండ్ను యూకే కోర్టు నవంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. నీరవ్ మోదీని భారత్కు అప్పగించడానికి సంబంధించిన కేసు తదుపరి విచారణ నవంబర్ 3న జరగనుండడంతో అప్పటివరకు రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.14 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోదీ విదేశాలకు పరారయ్యాడు. లండన్లో తలదాచుకుంటున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన లండన్ కోర్టు మెజిస్ట్రేట్ అతడి రిమాండ్ను నవంబర్ 3 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పం -
న్యాయవ్యవస్థపై మార్కండే కట్జు సంచలన వ్యాఖ్యలు
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే కట్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సరైన న్యాయ విచారణ జరగదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరస్తుడు మోదీకి ఇండియాలో న్యాయం జరగదంటూ లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదనల సందర్భంగా డిఫెన్స్ సాక్షిగా ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా మోదీ దోషిగా తేలతాడు ఏ న్యాయవాది అతని కేసును తీసుకోడు. దేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోయిందంటూ శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా 130 నిమిషాల వాదనలో కట్జు న్యాయవ్యవస్థ, పరిశోధనా సంస్థలపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోయిందని, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి పరిశోధనా సంస్థలు రాజకీయ నేతల ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని ఆరోపించారు. న్యాయస్థానాలు అవినీతి, అక్రమాలకు నెలవయ్యాయని ఆరోపించడం సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందుకు కొన్ని కేసులను ఆయన ఉదహరించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు 2019 అయోధ్య తీర్పు, పదవీ విరమణ అనంతరం ఆయన రాజ్యసభ ఎంపిగా నామినేట్ కావడంవంటి అనేక ఆరోపణలను కట్జు గుప్పించారు. గత 50 సంవత్సరాల్లో అత్యంత అవమానకరమైన తీర్పు అయోధ్య తీర్పు అని కూడా వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. అంతేకాదు విచారణ పూర్తి కాకుండానే నిందితుడు మోదీని "నేరస్థుడు"గా పేర్కొంటూ న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ (మే నెలలో ఒక విలేకరుల సమావేశంలో)చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇలాంటి తీర్పు చెప్పడానికి ఆయనేమీ న్యాయమూర్తి కాదు కదా, ఆయనేం న్యాయశాఖా మంత్రి అంటూ ఏద్దేవా చేశారు. మోదీ నేరస్థుడని భారత ప్రభుత్వం నిర్ధారించేసుకుంది. కోర్టులు వారు చెప్పినట్టే చేస్తాయి. ఇక న్యాయమైన విచారణను ఎలా ఆశించగలమని ఆయన మండిపడ్డారు. కేంద్రాన్ని నాజీ జర్మనీతో పోల్చుతూ..ఆర్థిక మాద్యం,నిరుదోగ్యం, ఇతర సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి బలిపశువు అవసరం. ఆ బలిపశువే నీరవ్ మోదీ అని సుప్రీం మాజీ న్యాయమూర్తి పేర్కొన్నారు. సీబీఐని పంజరంలో చిలుక అని పేర్కొన్న 2013 నాటి సుప్రీం వ్యాఖ్యలను కట్జు గుర్తుచేసుకున్నారు. సీబీఐ, ఈడీ రాజకీయాలకు అతీతంగా లేవని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేతలుడిగి చూస్తోందని మండిపడ్డారు. ఇవన్నీ రాజకీయ అధినేతల చేతుల్లో పావులుగా మారిపోయాయని వ్యాఖ్యనించారు. నీరవ్ మోదీపై సీబీఐ, ఈడీ ఆర్థిక నేరాల ఆరోపణల గురించి తాను ఏమీ చెప్పలేనన్న కట్జు ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయమైన విచారణ జరగదంటూ పదే పదే నొక్కి వక్కాణించారు. కాగా కట్జు వ్యాఖ్యలపై భారతదేశం తరఫున వాదిస్తున్న న్యాయవాది హెలెన్ మాల్కం స్పందిస్తూ.. హై ప్రొఫైల్ కేసులో వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఐదు రోజుల విచారణలో చివరి రోజున, జస్టిస్ శామ్యూల్ గూజీ తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. మోడీని స్వదేశానికి రప్పించే అంశంపై తుది తీర్పు డిసెంబరులో రానుందని భావిస్తున్నారు. -
పీఎన్బీ స్కాం : నీరవ్ భార్యకు రెడ్ కార్నర్ నోటీసు
సాక్షి,న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ భార్య అమీ మోడీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. మనీలాండరింగ్ ఆరోపణలతో నమోదైన కేసులో భాగంగా దర్యాప్తు సంస్థ ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. (చదవండి: నీరవ్ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ) న్యూయార్క్ నగరంలో 30 మిలియన్ డాలర్ల విలువైన రెండు అపార్టుమెంట్ల కొనుగోలుకు సంబంధించి మోడీ అక్రమ లావాదేవీలకుపయోగించిన పలు కంపెనీలకు డైరెక్టరుగా ఉన్న అమీ పేరును తొలిసారిగా గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుబంధ చార్జిషీట్లో జత చేసింది. తాజాగా అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్గా భావించే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. ఈ కుంభకోణంలో ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించక ముందే, 2018 జనవరి మొదటి వారంలో అమీ, భర్త నీరవ్ మోడీ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లండన్ కు పారిపోయారు. కాగా అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన 13,500 కోట్ల రూపాయల పీఎన్బీ స్కాంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (48), అతని మామ, మెహుల్ చోక్సీ( 60) ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ, ఈడీ పలు చార్జ్ షీట్లను మోదు చేయడంతోపాటు, కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చింది. దర్యాప్తులో భాగంగా పలు విదేశీ, స్వదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. గత ఏడాది లండన్లో అరెస్టయి, ప్రస్తుతం వాండ్స్వర్త్ జైలులో ఉన్న మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన సాధారణ రిమాండ్ విచారణ అనంతరం లండన్ కోర్టు మోడీని ఆగస్టు 27 వరకు రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. -
నీరవ్ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద నీరవ్ మోదీకి సంబంధించిన రూ.329.66 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ బుధవారం వెల్లడించింది. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో 200 కోట్ల అమెరికన్ డాలర్ల మోసానికి సంబంధించి నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీతోపాటు మరికొందరిని ఈడీ విచారిస్తున్నది. ఈడీ జప్తు చేసిన నీరవ్ మోదీ ఆస్తుల్లో ముంబైలోని వర్లిలోని సముద్రమహల్లో నాలుగు ఫ్లాట్లు, సముద్ర తీరంలోని ఒక ఫాంహౌజ్, అలీబాగ్లో ఓ స్థలం, జైసల్మేర్లోని విండ్ మిల్లు, లండన్లోని ఒక ఫ్లాట్, యూఏఈలోని రెసిడెన్షియల్ ఫ్లాట్లు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఆస్తుల జప్తు గురించి ఈడీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ముంబైలోని స్పెషల్ కోర్టులో డిసెంబర్ 5న నీరవ్ మోదీని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. గత నెల 8న ఇదే కోర్టు ఈడీకి నీరవ్ మోదీ ఆస్తులను జప్తు చేసే అధికారం ఇచ్చింది. 49 ఏండ్ల నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైల్లో ఉన్నాడు. 2019 మార్చిలో లండన్లో అరెస్టయినప్పటి నుంచి మోదీ జైల్లో గడుపుతున్నాడు. -
నీరవ్ మోదీ,మెహూల్ చోక్సీకి షాక్ ఇచ్చిన ఈడీ
-
2,300 కిలోల వజ్రాలు, ముత్యాలు వెనక్కి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించారంటూ ప్రముఖ వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ(48), మెహుల్ చోక్సీ(60)పై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. హాంకాంగ్లోని వారి సంస్థల నుంచి 2,340 కిలోల పాలిష్డ్ వజ్రాలు, ముత్యాలను బుధవారం వెనక్కి తీసుకొచ్చింది. వీటి విలువ రూ.1,350 కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 108 బ్యాగేజీల్లో వీటిని తీసుకొచ్చారు. ఇందులో నీరవ్ మోదీకి చెందినవి 32, చోక్సీకి చెందినవి 76 ఉన్నాయి. ఈ మొత్తం వజ్రాలు, ముత్యాలు, నగలను 2018లో వారు హాంకాంగ్ నుంచి దుబాయ్కి తరలించేందుకు ప్రయత్నించారు. ఇండియా దర్యాప్తు అధికారులు అప్రమత్తం కావడంతో అది ఫలించలేదు. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తప్పుడు గ్యారంటీలు చూపించి, 2 బిలియన్ డాలర్ల రుణం తీసుకున్నారు. ఈ రుణం తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. దీనిపై కేసు నమోదు చేసి ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా హాంకాంగ్లో నీరవ్ మోదీ, చోక్సీ సంస్థల నుంచి వజ్రాలు, ముత్యాలు, వెండి నగలను వెనక్కి తీసుకొచ్చింది. వీటిని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సీజ్ చేసింది. 2018లో విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఈడీ అధికారులు గతేడాది లండన్లో అరెస్టు చేశారు. -
నీరవ్ మోదీకి ఈడీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పీఎన్బీని రుణాల పేరుతో రూ 14,000 వేల కోట్ల మేర మోసగించి విదేశాల్లో తలదాచుకున్న నీరవ్ మోదీకి ఈడీ గట్టిషాక్ ఇచ్చింది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల కంపెనీలకు చెందిన రూ 1350 కోట్ల విలువైన వజ్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలను హాంకాంగ్ నుంచి ఈడీ స్వాధీనం చేసుకుంది. వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. నీరవ్ను అప్పగించాలని భారత్ దాఖలు చేసిన పిటిషన్పై గత ఏడాది లండన్ కోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్లోని వాండ్స్వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్బీని మోసగించిన కేసులో నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి : నీరవ్ మోడీకి షాకిచ్చిన స్పెషల్ కోర్టు -
నీరవ్ మోడీకి షాకిచ్చిన స్పెషల్ కోర్టు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంక్(పీఎన్బీ)ను మోసం చేసి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ప్రత్యేక న్యాయస్థానం షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా నీరవ్ మోడీకి చెందిన రూ.1,400 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ, ఐటీ జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అయితే ఆస్తులను జప్తు చేసే ముందు నీరవ్ మోడీకి అప్పీలు చేయడానికి 30 రోజుల సమయం ఇవ్వాలని కోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో నీరవ్ మోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్లో ఉంటున్నారు. భారత్ దాఖలు చేసిన పిటిషన్పై గత ఏడాది లండన్ కోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్లోని వాండ్స్వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోడీని కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి: బెదిరిస్తున్న నీరవ్ మోదీ -
పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీ విచారణ షురూ!
సాక్షి. న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ (49) పై లండన్ కోర్టులో విచారణ మొదలు కానుంది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీని విచారణ కోసం యుకె కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం సౌత్వెస్ట్ లండన్లోని వర్డ్స్వర్త్ జైల్లో ఉన్న ఆయనను అధికారులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మోడీని భారత్కు అప్పగించాలని దాఖలైన పిటిషన్పై 5 రోజుల పాటు విచారణ జరగనుంది. వేలకోట్ల రూపాయల మేర బ్యాంకును మోసం చేసి లండన్కు పారిపోయిన మోడీని అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్పై లండన్లోని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కోవిడ్-19 వాప్తి, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో వీడియో లింక్ ద్వారా ఆయనను విచారించే విషయాన్ని కూడా డిస్ట్రిక్ జడ్జి శామ్యూల్ గూజీ పరిశీలిస్తున్నారు. ''కొన్ని జైళ్లు నిందితులను వ్యక్తిగతంగా ప్రవేశపెడుతున్నందున ఈ నెల 11న నీరవ్ మోదీని కోర్టు ముందుకు తీసుకురావాలని ఆదేశిస్తాం. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో లైవ్ వీడియో లింక్ ద్వారా విచారిస్తాం..'' అని న్యాయమూర్తి గూజీ పేర్కొన్నారు. (మరో మెగా డీల్కు సిద్ధమవుతున్న అంబానీ) నీరవ్ మోడీని అప్పగించాలంటూ గతేడాది భారత్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం నుంచి ఐదు రోజుల పాటు లండన్ కోర్టు విచారణ జరపనుంది. గత ఏడాది మార్చి 19న అరెస్టు అయినప్పటి నుండి నైరుతి లండన్లోని వాండ్స్వర్త్ జైలులో మోడీ పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. (కరోనా : అనుకోని అతిధి వైరల్ వీడియో) -
నీరవ్ మోదీకి షాక్ ఇచ్చిన తమ్ముడు!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) లో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన ఆరోపణలతో లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. తన అన్న అక్రమాలకు, నేరపూరిత కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపిస్తూ నీరవ్ తమ్ముడు నిషాల్ మోదీ ముందుకు వచ్చాడు. నీరవ్ మోదీ అవినీతి గురించి తనకు తెలియందటూ నిషాల్ ఈడీని ఆశ్రయించాడు. ఈ మేరకు తాను దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు ఒక లేఖ రాశాడు. తన వ్యాపార ప్రయోజనాల కోసం బ్యాంకులతో నీరవ్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నదీ తనకు తెలియదనీ, వార్తల్లో వచ్చేంతవరకు తనకు ఈ కుంభకోణం గురించి తెలియదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాననీ, చట్టం ప్రకారం సహాయం చేస్తానని ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆంట్వెర్ప్లో ఉన్న తనను కలవాలని ఈడీని కోరారు. నీరవ్ మోదీ సంపదకు తాను లబ్ధిదారుడిని కాదని నొక్కిచెప్పిన నీషల్ ఫైర్స్టార్ డైమండ్ డైరెక్టర్గా వేతనంతోపాటు వ్యాపారం ద్వారా వచ్చే చట్టబద్ధమైన ఆదాయాన్ని మాత్రమే తాను పొందానని, క్రమం తప్పకుడా పన్నులు కూడా చెల్లించానని రాశాడు. మరోవైపు ఈ లేఖ విషయాన్ని ధ్రువీకరించిన ఈడీ అధికారి ఒకరు నీషల్ నిందితుడు కాబట్టి, అతని సమాచారానికి విలువ వుండదని పేర్కొన్నారు. అంతేకాదు విచారణకు సహకరించదల్చుకుంటే అతనే భారతదేశానికి రావాలని తెలిపారు. కాగా దాదాపు రూ.14వేల కోట్ల పీఎన్బీ స్కాంలో ప్రధాన ఆరోపణలపై నీరవ్ మోదీని 2019 మార్చిలో లండన్లో అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో మరో ప్రధాన నిందితుడు అతని మామ మెహుల్ చోక్సీ, నీరవ్ సోదరుడిపై కూడా ఇప్పటికే పలు ఆరోపణలు కింద సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్న నీరవ్ను వీడియో ద్వారా విచారించిన వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు అతడి జ్యుడీషియల్ రిమాండ్ను ఏప్రిల్ 28వ తేదీవరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
జైల్లోనే నీరవ్ మోదీ
లండన్/ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్కు కుచ్చుటోపీ, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను యూకే కోర్టు గురువారం అయిదోసారి తిరస్కరించింది. గతేడాది మార్చిలో అరెస్టయినప్పటి నుంచి నీరవ్ నైరుతీ లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్నాడు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి బాకీ ఉన్న పన్నుల వసూలుకు గాను ఆ సంస్థ వజ్రాల వ్యాపారి, పీఎన్బీ స్కాంలో నిందితుడి నీరవ్ మోదీకి చెందిన 3 ఆస్తులను అటాచ్ చేసింది. నీరవ్ బీఎంసీకి రూ. 9.5 కోట్ల పన్ను చెల్లించాలని, ఇందుకుగాను అతని 4 ఆస్తుల్లో మూడింటిని అటాచ్ చేసినట్లు బీఎంసీ తెలిపింది. రుణాల ఎగవేతదారు నీరవ్ మోదీ ఆస్తులను వేలం వేయగా రూ. 51 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు వచ్చినట్లు అధికారులు గురువారం తెలిపారు. వేలం వేసిన వస్తువుల్లో రోల్స్ రాయిస్ కారు, పలు ప్రముఖ చిత్రలేఖనాలు, డిజైనర్ బ్యాగు సహా మొత్తం 40 వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
వేలానికి నీరవ్మోదీ విలాస వస్తువులు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకును రుణాల రూపంలో రూ.14,000 కోట్లకు పైగా మోసగించి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త నీరవ్మోదీకి చెందిన విలాస వస్తువులు వేలానికి రానున్నాయి. అరుదైన పెయింటింగ్లు, చేతి గడియారాలు, లగ్జరీ కార్లు ఇలా 112 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫున ‘శాఫ్రోనార్ట్’ అనే సంస్థ వేలం వేయనుంది. వీటికి సంబంధించి మార్చి 5న ప్రత్యక్ష వేలం నిర్వహించనుంది. అలాగే, మరో 72 వస్తువులకు మార్చి 3, 4వ తేదీల్లో ఆన్లైన్ వేలం కూడా చేపట్టనుంది. తొలుత ప్రత్యక్ష వేలాన్ని ఈ నెల 27న నిర్వహించేందుకు నిర్ణయించగా, ఈడీ నుంచి వచ్చిన ఆదేశాలతో మార్చి 5కు మార్చినట్టు శాఫ్రోనార్ట్ స్పష్టం చేసింది. విలువైన పెయింటింగ్లు.. ♦ 1935నాటికి చెందిన అమృత షేర్ గిల్ వేసిన పెయింటింగ్ ‘బోయ్స్ విత్ లెమన్స్’’ అధికంగా రూ.12–18 కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ వేసిన 1972 నాటి పెయింటింగ్ను కూడా వేలం వేయనున్నారు. దీనికి కూడా దగ్గర దగ్గర ఇంతే ధర వస్తుందని భావిస్తున్నారు. అలాగే వీఎస్ గైతోండే, మంజిత్బవా, రాజా రవివర్మ పెయింటింగ్లను వేలంలో అందుబాటులో ఉంచనున్నారు. ♦ జాగర్ లీకోల్చర్ పురుషుల ‘రివర్స్ గైరోటర్బిల్లాన్ 2’ అనే లిమిటెడ్ ఎడిషన్ చేతి గడియారానికి రూ.70 లక్షలు వస్తుం దని అంచనా. పటేక్ ఫిలిప్ నాటిలస్ అనే బంగారం, వజ్రాల చేతి గడియారానికి కూడా రూ.70 లక్షలు లభిస్తుందని భావిస్తున్నారు. ♦ రోల్స్ రాయిస్ గోస్ట్ కారు రూ.95 లక్షలు పలుకుతుందని అంచనా. n బ్రాండెడ్ హ్యాండ్బ్యాగులను కూడా వేలంలో ఉంచనున్నారు. n ఇక మార్చి 3, 4న జరిగే వేలంలో పోర్షే ప్యానెమెరికా ఎస్ కార్ తదితర 72 వస్తువులను వేలానికి ఉంచనున్నట్టు శాఫ్రోనార్ట్ తెలిపింది. -
కంపెనీ డైరెక్టర్ను చంపేస్తానని బెదిరించిన నీరవ్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్కు దాదాపు రూ.13వేలకోట్లు ఎగ్గొట్టి పరారైన వజ్రాలవ్యాపారి నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం చార్జిషీట్ దాఖలు చేసింది. తన సంస్థలోని ఒక డమ్మీ డైరెక్టర్ను నీరవ్ బెదిరించారని మహారాష్ట్రలోని ప్రత్యేక కోర్టుకు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈజిప్టులోని కైరో నుంచి ఇండియాకు తిరిగొస్తే చంపేస్తానని డైరెక్టర్లలో ఒకరైన ఆశిష్ మోహన్ భాయ్ లాడ్ను నీరవ్ బెదిరించాడని తెలిపింది. బ్యాంకు స్కామ్ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి లాడ్ దుబాయ్ నుంచి కైరోకు పారిపోయాడు. తర్వాత 2018లో భారత్కి తిరిగి రావాలని అనుకున్నప్పుడు నీరవ్ తరఫున నేహాల్ మోదీ బెదిరించాడని వెల్లడించింది. యూరప్ కోర్టులో జడ్జి ముందు నీరవ్కి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలని, దీనికి లాడ్కు నేహాల్ రూ.20 లక్షలు ఇవ్వజూపారని, అయితే దీనిని లాడ్ తిరస్కరించాడని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది. -
ఇండియాకు వెళ్తే నిన్ను చంపేస్తా : నీరవ్ మోదీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పై శనివారం క్రిమినల్ చార్జ్షీట్ దాఖలు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మహారాష్ట్ర స్పెషల్ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఒకరైన ఆశిష్ మోహన్భాయ్ లాడ్ ను చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ తెలిపింది. 'కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఆశిష్ లాడ్ కూడా ఉన్నారు. కాగా ఈ కేసులో ఆశిష్ లాడ్ అరెస్టవ్వకుండా ఉండేందుకు దుబాయ్ ద్వారా కైరో వెళ్లి తలదాచుకున్నాడు. జూన్ 2018లో మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నఆశిష్ లాడ్ను తన సోదరుడు నేహాల్ మోదీ ద్వారా నీరవ్ మోదీ ఫోన్లో నువ్వు తిరిగి ఇండియాకు వెళితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని' సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. నీరవ్మోదీ మాట్లాడక ముందు అతని సోదరుడు నేహాల్ మోదీ ఆశిష్కు యూరోపియన్ కోర్టులో జడ్జి ముందు నీరవ్ మోదీకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ రూ. 20 లక్షలు ఆఫర్ చేశారు. అయితే దీనిని ఆశిష్ లాడ్ తిరస్కరించడంతో నిన్ను చంపేస్తామంటూ నీరవ్ మోదీ బెదిరింపులకు పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. కాగా ఈ కేసులో అరెస్టవ్వకుండా ఉండేందుకు నీరవ్మోదీ విదేశాలకు పారిపోయాడు. దీంతో నీరవ్మోదీని తిరిగి రావాలంటూ భారతదేశానికి చెందిన పలు దర్యాప్తు సంస్థలు, కోర్టులు సమన్లు జారీ చేసిన తిరిగి రాకపోవడంతో అతనిపై ఫ్యజిటివ్ ఎకనమిక్ అపెండర్ చట్టం కింద పలాయన ఆర్థిక నేరస్తుడిగా పేర్కొంది. నీరవ్ మోదీ ప్రస్తుతం నైరుతి లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్నాడు. అతని మామ మెహుల్ చోక్సీతో కలిసి బ్యాంకుకు రూ .13,570 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నీరవ్ మోదీను ఈ ఏడాది మార్చిలో స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా నీరవ్ మోదీ
ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి దాదాపు 2 బిలియన్ డాలర్ల టోకరా వేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీని ’పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి’గా (ఎఫ్ఈవో) ముంబై కోర్టు ప్రకటించింది. ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనతో ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది. దీంతో మోదీ ఆస్తుల జప్తునకు మార్గం సుగమమైంది. 2018లో ఎఫ్ఈవో చట్టం వచ్చిన తర్వాత.. వ్యాపారవేత్త విజయ్ మాల్యా తర్వాత పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి ముద్ర పడినది నీరవ్ మోదీకే. పీఎన్బీ స్కామ్ వెలుగులోకి రావడానికి ముందే 2018 జనవరిలో నీరవ్ మోదీ దేశం విడిచి వెళ్లిపోయారు. 2019 మార్చిలో లండన్లో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం తనను భారత్కు తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతోంది. -
నీరవ్ మోదీకి భారీ షాక్
న్యూఢిల్లీ : పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి ముంబైలోని స్పెషల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా నీరవ్ను గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ముంబైలోని అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు అతడిని ఆర్థిక నేరగాడిగా పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ.14వేల కోట్ల మేర మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్కు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని అప్పగించాలంటూ భారత్ యూకేను కోరుతోంది. ఈ నేపథ్యంలో లండన్లో అరెస్టైన నీరవ్.. బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకోగా నాలుగుసార్లు తిరస్కరణకు గురైంది. దీంతో అతడిని నైరుతి లండన్లోని వాన్డ్స్వర్త్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న వీడియో లింక్ ద్వారా అతడిని కోర్టు విచారించనుందని వార్తలు వెలువడ్డాయి. కాగా నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ను భారత్ తరపున వాదిస్తున్న న్యాయవాది లండన్ కోర్టులో సవాల్ చేశారు. ఇక భారత్కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్ మోదీ బెదిరించిన విషయం తెలిసిందే. కాగా భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్మాల్యాను ముంబై కోర్టు ఆర్థిక నేరస్తుడిగాఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో మాల్యా తర్వాత ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన రెండో వ్యక్తిగా నీరవ్ నిలిచాడు. -
భారత్కు అప్పగిస్తే చచ్చిపోతా
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం నాలుగోసారి అతడు పెట్టుకున్న పిటిషన్ను లండన్ కోర్టు తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ని రూ.14వేల కోట్ల మేర మోసం చేసిన ఆరోపణలపై అతడిని అప్పగించాలంటూ భారత్ కోరుతున్న విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నందున నీరవ్కు బెయిల్ ఇవ్వాలని లాయర్లు వాదించారు. బాండ్ మొత్తాన్ని రూ.18 కోట్ల నుంచి రూ.36 కోట్ల(4 మిలియన్ పౌండ్లు)కు పెంచేందుకు అంగీకరించినా వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు. విచారణ ముగిసిన తర్వాత అతడిని నైరుతి లండన్లోని వాన్డ్స్వర్త్ జైలుకు తరలించారు. డిసెంబర్ 4న వీడియో లింక్ ద్వారా అతడిని కోర్టు విచారించనుంది. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ను భారత్ తరపున వాదిస్తున్న న్యాయవాది సవాల్ చేశారు. తనను భారత్కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్ మోదీ బెదిరిస్తున్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జైలులో తన క్లైంట్పై దాడి జరిగిందని నీరవ్మోదీ తరపు లాయర్ వెల్లడించారు. అతడిపై భారత్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, దీనికి అక్కడి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు. -
నీరవ్ మోదీ కార్లను వేలం వేయనున్న ఈడీ
ముంబయి : వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకోనుంది. తాజాగా అతనికి చెందిన 13 కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) వేలం వేయనుంది. కాగా, ఈ వేలం నవంబర్ 7న జరగనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీని గతేడాది మార్చిలో లండన్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లండన్లోని వాండ్స్వర్త్ జైళ్లో ఉన్న నీరవ్ మోదీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విచారణ నవంబర్ 6న జరగనుంది. అయితే ఈ ఏడాది ఆగస్టులో నీరవ్ మోదీ ఆస్తులన్నింటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు నీరవ్కు చెందిన విలువైన వాచ్లు, పెయింటింగ్స్, కార్లను వేలం వేయడానికి అనుమతి పొందింది. ఇందులో భాగంగానే నవంబర్ 7న కార్ల వేలం వేయనున్నారు.అయితే వేలం వేయనున్న కార్లలో బెంట్లీ ఆర్నేజ్ , రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఎంహెచ్, పోర్స్చే పనామెరా, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. -
పీఎన్బీ స్కాం: నీరవ్ రిమాండ్ పొడిగింపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ (48)కి మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. లండన్ వాండ్స్వర్త్ జైలు జైల్లో ఉన్న నీరవ్మోదీ బెయిల్ నిరాకరించి, రిమాండ్ను మరో 28 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 17 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతినిస్తూ వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆదేశించింది. ఇప్పటికే మూడుసార్లు బెయిల్ నిరాకరించారు. కాగా దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాని నిందితుడు. బ్యాంకును సుమారు 13వేల కోట్ల రూపాయలకు పైగా ముంచేసి లండన్కు పారిపోయిన నీరవ్ మోదీని తిరిగి భారత్కు రప్పించేందుకు కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈనేపథ్యంలోనే ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయడంతో లండన్ పోలీసులతో కలిసి నీరవ్ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం నీరవ్ లండన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
నీరవ్కు మరో దెబ్బ, నేహాల్పై రెడ్ కార్నర్ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఇప్పటికే నీరవ్ సోదరి పూర్వి మోదీ మెహతాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాగా తాజాగా సోదరుడు నేహాల్ దీపక్ మోదీ(40) పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఈ నోటీసు జారీ చేసింది. నీరవ్ విదేశాలకు పారిపోవడంలో నేహాల్ పాత్రకీలకమైందని ఆరోపిస్తూ అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఈడీ ఇటీవల ఇంటర్ పోల్ను అభ్యర్థించింది.మనీలాండరింగ్, సాక్ష్యాలను నాశనం చేసేందుకు, నేహాల్ ఉద్దేశపూర్వకంగా సహాయపడ్డాడని ఈడీ ఆరోపించింది. కాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్బ్యాంకులో ఎల్ఓయుల ద్వారా రూ.13వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ విదేశాలకు చెక్కేశాడు. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఇప్పటికే నీరవ్ కేసులు నమోదు చేయడంతో పాటు పలు ఆస్తులను ఎటాచ్ చేశాయి. అటు నీరవ్ పాస్పోర్ట్ను రద్దు చేసిన కేంద్రప్రభుత్వం ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. అతనిని తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
రాయని డైరీ.. నీరవ్ మోదీ (ఆర్థిక నేరస్తుడు)
‘‘ఎక్కడున్నావ్?’’ అన్నాడు విజయ్మాల్యా ఫోన్ చేసి, ముందూ వెనుకా ఏమీ లేకుండా. ‘‘ఎవర్నువ్వు?’’ అన్నాను. ‘‘ఆ.. ఎవర్నా! నిర్మలా సీతారామన్ని. విజయ్మాల్యా గొంతుతో మాట్లాడుతున్నా ఇండియా నుంచి’’ అన్నాడు! ‘‘మాల్యా.. మందులో ఉన్నట్లున్నావ్. తాగినవాడు మాట్లాడుతూ కూర్చుంటే తాగనివాడు వింటూ కూర్చోవడం బ్యాంకులకు ఎగ్గొట్టిన అప్పుల్ని తీర్చడం కన్నా కష్టమైన విషయం. నాకు వినే మూడ్, మాట్లాడే మూడ్.. రెండూ లేవు. ఫోన్ పెట్టేయ్’’ అన్నాను. ‘‘ఎక్కడున్నావ్?’’ అన్నాడు మళ్లీ, ఫోన్ పెట్టేయకుండా. వినేలా లేడు. ఇండియాలో ఉన్నప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీలు, సీఈవోలు ఇలాగే సమయం సందర్భం లేకుండా ఫోన్లు చేసేవాళ్లు.. ‘ఎప్పుడు కడతావ్?’ అని. ‘భోజనం చేస్తున్నా’ అనేవాడిని. అయినా వినకుండా ‘ఎప్పుడు కడతావ్?’ అనేవాళ్లు. ‘బాత్రూమ్లో ఉన్నా’ అనేవాడిని. అయినా వినకుండా ‘ఎప్పుడు కడతావ్?’ అనేవాళ్లు. ‘ఏంటి కట్టడం?’ అన్నాను ఓ రోజు. ‘భోజనం చేస్తున్నారా?’ అని అడిగారు! ‘ఏంటి కట్టడం?’ అన్నాను మళ్లీ ఇంకో రోజు. ‘బాత్రూమ్లో ఉన్నారా?’ అని అడిగారు! కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి, కొత్త వ్యక్తి ఫోన్ చేశాడు. ‘‘మిస్టర్ నీరవ్ మోదీ.. మీరు భోజనం చేస్తూ గానీ, బాత్రూమ్లో స్నానమాచరిస్తూ గానీ లేకపోతే నేను చెప్పబోయేది వినడం కోసం రెండు నిముషాలు వెచ్చించగలరా? మీరిక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే.. నేను మిమ్మల్ని ఏమీ అడగబోవడం లేదు. చెప్పబోవాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాను. నేనిప్పుడు మీకెంతో ప్రియమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్గా మీకు పరిచయం అవుతున్నాను. నన్ను కొనసాగించమంటారా?’’ అని అభ్యర్థించాడు! బ్యాంకుల సంస్కరణ అంతగా ఎప్పుడు జరిగిందో నేను గుర్తించనే లేదు! ‘కొనసాగించండి’ అన్నాను. అతడు మొదలుపెట్టాడు. ‘మిస్టర్ నీరవ్ మోదీ.. బ్యాంకులో మీరు డబ్బు వేసుకుంటే మీకు వడ్డీ వస్తుంది కదా. అలాగే బ్యాంకు మీ దగ్గర డబ్బు వేసుకుంటే బ్యాంకుకూ వడ్డీ రావాలి కదా. గాట్ మై పాయింట్..’ అన్నాడు. ‘గాట్ యువర్ పాయింట్ .. ‘ఎప్పుడు కడతావ్’ అనే కదా మీరు అడుగుతున్నారు’ అన్నాను. ‘వాట్ ఐ మీన్..’ అంటూ ఏదో చెప్పబోయాడు. ఫోన్ పెట్టేశాను. తర్వాత లండన్ వచ్చేశాను. ‘‘మాట్లాడవేంటి.. ఎక్కడున్నావ్..’’ అన్నాడు మాల్యా మళ్లీ. ‘‘నీలాగా బెయిల్ మీద ఉంటే ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లోనో, బ్రిక్ లేన్లోనో, ఆబే రోడ్లోనో ఉన్నానని చెప్పేవాడిని’’ అన్నాను. ఆ మాటకు బాగా హర్ట్ అయినట్లున్నాడు మాల్యా. ‘‘మందులో ఉన్నవాడికీ కొన్ని ఎథిక్స్ ఉంటాయి నీరవ్. జైల్లో ఉన్నవాడిని బెయిల్లో ఉన్నవాడు ‘ఎక్కడున్నావ్ ?’ అని అడక్కూడదని నాకూ తెలుసు. నా ఉద్దేశం ఏమిటంటే నిన్ను ఏవిధంగానూ సంతోషపెట్టని వాళ్ల మధ్య నువ్వీ క్షణంలో లేవు కదా అని..’’ అన్నాడు. ‘‘లేను చెప్పు’’ అన్నాను. ‘‘నీ బ్యాంకులో నీవి ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా’’ అన్నాడు. ‘‘నావేమిటి? నేను కట్టాల్సినవి’’ అన్నాను. మాల్యా నవ్వాడు. ‘‘ఇకనుంచీ నువ్వు ‘డబ్బు కట్టలేకపోయానే’ అనే చింతతో అనుక్షణం కుమిలిపోనక్కర్లేదు అని చెప్పడానికే ఫోన్ చేశాను నీరవ్. లాభాల కోసమట.. ఇండియాలో బ్యాంకుల్ని కలిపేస్తున్నారు. నీకు సంతోషం కలిగించే విషయం చెప్పనా.. నీ బ్యాంకులో కూడా రెండు పెద్ద బ్యాంకులు కలుస్తున్నాయి’’ అన్నాడు! -
పీఎన్బీకి 7,200 కోట్లు చెల్లించండి
పుణే: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు రూ. 7,200 కోట్లు వడ్డీతో కలిపి చెల్లించాలని పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని రుణ రికవరీ ట్రిబ్యునల్ శనివారం ఆదేశించింది. పీఎన్బీని మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు అనుకూలంగా రుణ రికవరీ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దీపక్ కుమార్ రెండు ఉత్తర్వులు జారీ చేశారు. ‘జూన్ 30, 2018 నుండి సంవత్సరానికి 14.30 శాతం వడ్డీతో రూ. 7,200 కోట్ల మొత్తాన్ని ఏకమొత్తంగా లేదా విడతలవారీగా దరఖాస్తుదారునికి (పీఎన్బీ) చెల్లించాలని ప్రతివాదిని, అతని భాగస్వాములను ఆదేశిస్తున్నట్టు డీఆర్టీ ఉత్తర్వులో పేర్కొంది. మరో ఉత్తర్వును వెలువరిస్తూ, జూలై 27, 2018 నుండి 16.20 శాతం వడ్డీతో రూ. 232 కోట్లు చెల్లించాలని న్యాయమూర్తి నీరవ్ని ఆదేశించారు. లేనిపక్షంలో అధికారులు తదుపరి చర్యలను ప్రారంభిస్తారని ట్రిబ్యునల్ అధికారి స్పష్టం చేశారు. -
నీరవ్ మోదీకి సింగపూర్ హైకోర్టు షాక్..!
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త నీరవ్ మోదీ కుటుంబసభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలంటూ సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మెహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఈ అకౌంట్స్లో సుమారు 6.122 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 44.41 కోట్లు) ఉన్నట్లు పేర్కొంది. బ్యాంకులను మోసం చేయడం ద్వారా వచ్చిన సొత్తులో ఇది కూడా భాగమేనని, దీన్ని నిందితులు విత్డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే నీరవ్ మోదీకి స్విస్ బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేశాయి. వీటిలో దాదాపు రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎన్బీని నీరవ్ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. -
పిఎస్బి స్కాంలో నీరవ్ మోదీకి షాక్
-
సింగపూర్లో నీరవ్ మోదీకి చుక్కెదురు
పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సింగపూర్లో మోదీ సన్నిహితులకు చెందిన ఆస్తులను ఎటాచ్ చేయాలని సింగపూర్ హైకోర్టు ఆదేశాలచ్చింది. నీరవ్మోదీ సోదరి, ఆమె భర్త నిర్వహిస్తున్న కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ. 44.41 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రూ. 44కోట్లను, బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు సొమ్మును భారత బ్యాంకులనుంచి అక్రమంగా తరలించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ అభ్యర్థన మేరకు సింగపూర్ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో నకిలీ పత్రాలు, లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్ఒయు) లాంటి అక్రమ పద్ధతుల ద్వారా వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో వ్యాపారి నీరవ్ మోదీ కీలక నిందితుడు. భారీగా రుణాలను ఎగవేసి లండన్కు చెక్కేసిన మోదీని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడుగా భారత ప్రభుత్వం ప్రకటించడంతోపాటు తిరిగి భారత్కు రప్పించాలని భారీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లండన్ పోలీసులు సహకారంతో గత ఏడాది నీరవ్మోదీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం లండన్లో జైల్లో ఉన్న మోదీ బెయిల్ పిటిషన్ను వెస్ట్ మినిస్టర్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
స్విస్ షాక్ : రూ.283 కోట్లు ఫ్రీజ్
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ కుంభకోణం విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వేల కోట్లకు పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి స్విస్ అధికారులు భారీ షాకిచ్చారు. కోట్ల రూపాయల విలువైన వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. పీఎన్బీ స్కాంను విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విజ్ఞప్తి మేరకు వారు ఈ చర్య చేపట్టారు. మనీలాండరింగ్ నివారణ (పిఎంఎల్ఎ) చట్టం కింద ఈడీ అభ్యర్థన మేరకు స్విట్జర్లాండ్లోని నాలుగు బ్యాంకు ఖాతాలను అక్కడి అధికారులు సంభింపచేశారు. నీరవ్మోదీ, ఆయన సోదరి పుర్వీ మోదీకు చెందిన ఖాతాలతో సహా మొత్తం నాలుగు అకౌంట్లలోని రూ. 283.16 కోట్ల రూపాయలను స్విస్ అధికారులు ఫ్రీజ్ చేశారు. భారతీయ బ్యాంకుల నుండి అక్రమంగా స్విస్ బ్యాంకు ఖాతాల్లో మళ్లించారని స్విస్ అధికారులకు ఈడీ తెలిపింది. కాగా లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్ఒయు) ద్వారా పీఎన్బీలో రూ. 14వేల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చీ రాగానే నీరవ్మోదీ, బంధువులతో సహా లండన్కు పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. అటు భారత ప్రభుత్వం నీరవ్ పాస్పోర్టును రద్దు చేసింది. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన సీబీఐ లండన్ పోలీసుల సహాయంతో, ఈ ఏడాది మార్చి నెలలో మోదీని అరెస్టు చేసింది. వాండ్స్వర్త్ జైలులో ఉన్న మోదీ బెయిల్ పిటిషన్లను పలుసార్లు లండన్ కోర్టు తిరస్కరించింది. ఆర్థికనేరగాళ్ల చట్టం కింద మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయ్నత్నిస్తోంది. మరోవైపు ఇదే కేసులో మరో కీలక నిందితుడు, నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీ కూడా ఆంటిగ్వాకు పారిపోయాడు. అయితే చోక్సీని అప్పగించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆంటిగ్వా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకు మోసాలు.. @ రూ.2 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ : దేశీయ బ్యాంకులు మోసగాళ్లకు లక్ష్యంగా మారుతున్నాయి. గత 11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల మేర భారీ మోసాలు ఇక్కడి బ్యాంకుల్లో చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. సంఖ్యా పరంగా ఎక్కువ ఘటనలు అత్యధికం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లోనే జరిగినట్టు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీగా మోసపోయినది మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంకు!!. ఈ బ్యాంకులో మోసపు ఘటనలు 2,047 నమోదయినప్పటికీ, విలువ మాత్రం 28,700 కోట్ల మేర ఉంది. ముఖ్యంగా వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఒక్కరే రూ.13,000 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన విషయం గమనార్హం. పీఎన్బీ తర్వాత ఎస్బీఐకి మోసాల సెగ ఎక్కువగా తగిలింది. 23,734 కోట్ల మేర మోసాలు జరిగాయి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు బదులుగా ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. 2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం53,334 మోసపూరిత కేసులు నమోదయ్యాయి. పీఎన్బీలో భారీగా... పీఎన్బీలో రూ.28,700 కోట్ల మొత్తానికి సంబంధించి 2,047 మోసాలు జరిగాయి. ఐసీఐసీఐ బ్యాంకులో రూ.5,033.81 కోట్లకు సంబంధించి 6,811 కేసులు ఈ కాలంలో నమోదయ్యాయి. ప్రభుత్వరంగంలోని ఎస్బీఐలో 6,793 మోసపు ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి విలువ రూ.12,358 కోట్లు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనూ రూ.1,200.79 కోట్లకు సంబంధించి 2,497 మోసపూరిత ఘటనలు జరిగాయి. బ్యాంకు ఆఫ్ బరోడాలో 2,160 మోసపూరిత కేసులు నమోదు కాగా, వీటి మొత్తం రూ.12,962.96 కోట్లుగా ఉంది. విదేశీ బ్యాంకుల్లోనూ...: భారత్లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకులు సైతం మోసపూరిత ఘటనల బారిన పడినట్టు తెలుస్తోంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఇదే కాలంలో 1,862 మోసపూరిత కేసులను రిపోర్ట్ చేసింది. వీటి మొత్తం రూ.86.21 కోట్లు. అలాగే, సిటీ బ్యాంకులో రూ.578 కోట్లకు సంబంధ/æంచి 1,764 కేసులు వెలుగు చూశాయి. హెచ్ఎస్బీసీలో రూ.312 కోట్ల మేర రూ.1,173 మోసాలు, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ పీఎల్సీలో రూ.12.69 కోట్ల మేర 216 కేసులు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో రూ.1,221.41కోట్లతో ముడిపడిన 1,263 ఘటనలు వెలుగు చూశాయి. -
బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ
లండన్ : పీఎన్బీ స్కామ్లో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టులో బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ను బ్రిటన్ కోర్టు తోసిపుచ్చింది. మోదీకి బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్ష్యాలకు అవరోధం కల్పించవచ్చనేందుకు ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. పీఎన్బీ స్కాంతో పాటు మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. మోదీ అప్పగింతపై విచారణ సాగుతున్న క్రమంలో దిగువ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నీరవ్ మోదీ బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా మోదీ బెయిల్ పిటిషన్ను బ్రిటన్ కోర్టు తిరస్కరించడం ఇది నాలుగవసారి కావడం గమనార్హం. నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్బీ నుంచి రూ 11,400 కోట్ల మేర రుణాలు పొంది తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
బెయిల్ కోసం మళ్లీ బ్రిటన్ కోర్టుకు నీరవ్ మోదీ
లండన్ : పీఎన్బీ స్కామ్లో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ కోసం మరోసారి బ్రిటన్లో ఎగువ కోర్టును ఆశ్రయించారు. నీరవ్ మోదీకి గతంలో బెయిల్ ఇచ్చేందుకు దిగువ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. మోదీ అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్మినిస్టర్ మేజిస్ర్టేట్ కోర్టు ఇప్పటికే ఆయన బెయిల్ వినతిని మూడు సార్లు తోసిపుచ్చింది. కాగా మోదీని ఉంచిన వ్యాండ్స్వర్త్ జైలులో కనీస సౌకర్యాలు లేవని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు నివేదించినా బెయిల్ మంజూరుకు న్యాయస్ధానం అంగకరించలేదు. వ్యాండ్స్వర్త్ జైలుకు ప్రత్యామ్నాయంగా మోదీ లండన్లోని తన లగ్జరీ ఫ్లాట్లోనే 24 గంటల పాటు ఉండేందుకు అనుమతించాలన్న ఆయన న్యాయవాదుల అప్పీల్ను కోర్టు అంగీకరించలేదు. పీఎన్బీ స్కామ్లో విచారణ ఎదుర్కొంటున్న మోదీని భారత్కు అప్పగించడంపై బ్రిటన్ కోర్టులో వాదోపవాదాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నీరవ్ మోదీని ఈ ఏడాది మార్చి 20న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్చేశారు. నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్బీ నుంచి రూ 11,400 కోట్ల మేర రుణాలు పొంది తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
ఏడాదిలో రూ.71వేల కోట్ల మాయం!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 6,801 కేసులు నమోదు కాగా.. విలువపరంగా ఇవి రూ. 71,500 కోట్లు ఉండొచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. 2017–18లో రూ. 41,167 కోట్లకు సంబంధించి 5,916 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలిస్తే 2018–19లో పరిమాణం ఏకంగా 73 శాతం పెరిగిందని సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఆర్బీఐ వివరణ ఇచ్చింది. గడిచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో 53,334 ఫ్రాడ్ కేసులు నమోదు కాగా, రూ.2.05 లక్షల కోట్ల మేర మోసాలు జరిగాయి. ఆర్బీఐకి నివేదించిన ఫ్రాడ్ కేసులకు సంబంధించి ఆయా బ్యాంకులు క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే ఈ కేసుల్లో తీసుకున్న చర్యల గురించి పూర్తి సమాచారం సిద్ధంగా లేదని పేర్కొంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వ్యాపారవేత్తలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కుంభకోణాలపై దృష్టి సారించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ప్రత్యేకంగా అధ్యయనం చేసి, టాప్ 100 ఫ్రాడ్లపై నివేదిక కూడా రూపొందించింది. మోసాలకు పాల్పడిన తీరు, నగదు పరిమాణం, రుణ లావాదేవీల తీరుతెన్నులు, విధానపరమైన లొసుగులు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంది. ప్రధానంగా 13 రంగాల్లో చోటు చేసుకున్న ఫ్రాడ్స్ను పరిశీలించింది. తయారీ, వజ్రాభరణాలు, వ్యవసాయం, మీడియా, ఏవియేషన్, ట్రేడింగ్, ఐటీ తదితర రంగాలు వీటిలో ఉన్నాయి. అటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర ఏజెన్సీలు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నాయి. -
బిటన్ హైకోర్టులో నీరవ్ బెయిల్ పిటిషన్
లండన్: భారత్లో మోసాలకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన నీరవ్ మోదీ బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. గతంలో మూడుసార్లు బెయిల్ పిటిషన్ను తిరస్కరించినప్పటికీ బ్రిటన్ హైకోర్టులో శుక్రవారం ఆయన మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ జూన్ 11వ తేదీన విచారణకు రానుందని భారత్ తరపున వాదనలు వినిపిస్తున్న క్రౌన్ ప్రోసెక్షన్ సర్వీస్ తెలిపింది. గురువారం నీరవ్ కేసుపై విచారణ జరిపిన కోర్టు, ఆయన రిమాండ్ను జూన్ 27 వరకు పొడిగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14 వేల కోట్లు మోసం చేసి బ్రిటన్ పారిపోయిన నీరవ్ను ఇక్కడకు తీసుకురావడానికి భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 19న బ్రిటన్ పోలీసులు అరెస్టు చేసినప్పటినుంచి నీరవ్ మోదీ రిమాండ్లోనే ఉన్నారు. -
నీరవ్ మోదీకి మళ్లీ షాక్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి మరోసారి చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నీరవ్ దాఖలు చేసిన పిటిషన్ను బ్రిటన్లోని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు బుధవారం మూడోసారి తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో నీరవ్కు బెయిల్ మంజూరుచేస్తే ఆయన తిరిగి విచారణకు హాజరుకాకపోవచ్చని చీఫ్ మెజిస్ట్రే్టట్ ఎమ్మా అర్బత్నాట్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నీరవ్ న్యాయవాది క్లేర్ మాంట్గొమెరి వాదిస్తూ..‘లండన్ శివార్లలో ఉన్న వాండ్స్వర్త్ జైలులో పరిస్థితులు మనుషులు జీవించేలా లేవు. కోర్టు బెయిల్ కోసం ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తాం. అలాగే పూచికత్తుగా 20 లక్షల పౌండ్లు సమర్పిస్తాం. నీరవ్ 24 గంటలు నిఘానీడలో ఇంటిలోనే ఉండేలా కోర్టు ఆదేశించినా మాకు అంగీకారమే’ అని చెప్పారు. ఇది సాధారణ కేసు కాదనీ, నీరవ్ గతంలోనే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరించేందుకు ప్రయత్నించారని భారత న్యాయవాది నిక్ హెర్న్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు మే 30కి వాయిదా వేసింది. -
ఆ మోదీ వేరు... ఈ మోదీ వేరు
ఈ దొంగలందరి పేర్లలో మోదీ అన్న పదం ఎందుకుందో...అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తే...ఆ మోదీ వేరు...మేం వేరు అంటున్నారు మోదీనగర్ వాసులు. రాహుల్ వ్యాఖ్యలతో తమకే సంబంధం లేదని, తామెవరం దొంగలం కామని వారు స్పష్టం చేస్తున్నారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య మోదీనగర్ పేరుతో ఉన్న పట్టణవాసులకు ఇబ్బందికరంగా మారింది. లలిత్ మోదీ తాతగారి ఊరైన ఈ మోదీనగర్ ఢిల్లీకి ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘజియాబాద్–మీరట్ మధ్యలో ఉన్న ఈ పట్టణం ఒకప్పుడు పలు రకాల మిల్లులు, ఫ్యాక్టరీలతో చరిత్ర ప్రసిద్ధిగాంచింది. రాహుల్ వ్యాఖ్యలతో ఈ పట్టణం రాజకీయ రొంపిలో చిక్కుకుంది. రాజకీయ రొంపిలోకి తమను లాగవద్దని వారు కోరుతున్నారు. మోదీ అన్నది మా పట్టణం పేరు. ఇది దొంగల నగరం కాదు. రాహుల్ అలా అనడం తప్పు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేశ్ కుమార్ అగర్వాల్ అనే మోదీనగర్ వాసి. ‘ఇక్కడ మోదీ పేరుతో చక్కెర కర్మాగారం ఉంది. పరిశ్రమలున్నాయి. ఆలయం కూడా ఉంది. మోదీ అన్న పేరు ఇక్కడ ఎంతో గొప్పది’అని అగర్వాల్ స్పష్టం చేశారు. 1923 ప్రాంతంలో లలిత్మోదీ తాతగారైన రాజ్ బహదూర్ గుజర్మల్ మోదీ పాటియాలా నుంచి ఇక్కడికి వచ్చి అనేక ఫ్యాక్టరీలు, డిగ్రీ కాలేజీ పెట్టారు. ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం కూడా అందజేసింది.మొదట్లో ఈ పట్టణాన్ని బేగమాబాద్ అని పిలిచేవారని, గుజర్మల్ మోదీ చేసిన అభివృద్ధికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఆయన పేరు పెట్టిందని 76 ఏళ్ల మిథిలేశ్ చెప్పారు. మోదీలను కించపరచడానికి వారు కేవలం ఏదో ఒక వర్గం వారు కాదని, పార్శీలు, ముస్లింలు, ఇతర సామాజిక వర్గాల వారిని ఇక్కడ వృత్తిరీత్యా మోదీలుగా పిలుస్తారని మిథిలేశ్ తెలిపారు. నిజాయితీకి, కష్టించే తత్వానికి ప్రతీకగా మోదీ పేరు నిలుస్తుందన్నారు. -
24 వరకు రిమాండ్లో నీరవ్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టు మే 24 వరకు రిమాండ్ విధించింది. భారత్కు నీరవ్ను తిరిగి అప్పగించే కేసు లండన్లోని వెస్ట్మినిస్టర్ కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నీరవ్ గత నెలలో అరెస్టయ్యారు. అప్పటినుంచి వాండ్స్వర్త్ జైలులోనే ఉంటున్నారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు రాగా, వెస్ట్మినిస్టర్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నాట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీరవ్ హాజరయ్యారు. మే 30న పూర్తి స్థాయి వాదనలు వింటామని, ఆ రోజు వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఎమ్మా ఆదేశించారు. అయితే మే 24న మరోసారి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని నీరవ్ తరఫు న్యాయవాది జెస్సికా జోన్స్ను అడగగా.. ఏమీ లేవని బదులిచ్చారు. దీంతో నీరవ్ తరఫున వేరే బెయిల్ పిటిషన్ ఏదీ దాఖలు కాలేదని ఎమ్మా రుజువు చేసుకుని విచారణ కొనసాగించారు. నీరవ్కు బెయిల్ మంజూరు చేస్తే తిరిగి లొంగిపోరనే కారణంతో మార్చి 29న ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. నీరవ్ కార్ల వేలం.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన 13 లగ్జరీ కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేలం వేసింది. నీరవ్కు చెందిన 11 కార్లు, చోక్సీకి చెందిన రెండు కార్లను ఈ–వేలం వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3.29 కోట్ల ఆదాయం వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద వారి కార్లను ఈడీ అటాచ్ చేసింది. వాటిని వేలం వేసుకోవచ్చని ఈడీకి మార్చిలోనే ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు అనుమతులిచ్చింది. దీంతో గురువారం వాటిని ఈడీ ఆన్లైన్లో వేలం వేసింది. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ వేలాన్ని నిర్వహించింది. -
నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ
లండన్ : పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రూ 13,000 కోట్ల పీఎన్బీ స్కామ్, మనీల్యాండరింగ్ కేసుల్లో నిందితుడైన నీరవ్ మోదీ అప్పగింత ప్రక్రియపై భారత్ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణను మే 24కు లండన్ కోర్టు వాయిదా వేసింది. గత నెలలో నీరవ్ మోదీ అరెస్టయిన తర్వాత లండన్లోని వ్యాండ్స్వర్త్ జైలులో గడుపుతున్నారు. కాగా గత నెలలో విచారణ సందర్భంగా నీరవ్ మోదీ సాక్షులను బెదిరించినట్టు, స్కామ్కు సంబంధించి కీలక ఆధారాలున్న సర్వర్, మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైంది. విజయ్ మాల్యా అప్పగింత కేసు తరహాలోనే నీరవ్ న్యాయవాదులు సైతం నీరవ్పై ఆరోపణలను తోసిపుచ్చడంతో పాటు బ్రిటన్లోనే తమ కేసు విచారణ సక్రమంగా సాగుతుందని కోర్టుకు నివేదించారు. పీఎన్బీ స్కామ్ వెలుగుచూడక ముందు గత ఏడాది జనవరిలో నీరవ్ మోదీ తన కుటుంబంతో కలిసి భారత్ను విడిచివెళ్లారు. -
రూ. 5 కోట్ల కారు కోటి రూపాయలకే..
ముంబై : 5 కోట్ల రూపాయిల విలువైన రోల్స్ రాయిస్ కారు ముంబైలో కేవలం రూ 1.3 కోట్ల నుంచే అందుబాటులో ఉంది. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి చెందిన 13 కార్లలో ఈ లగ్జరీ కారు ఒకటి కావడం గమనార్హం. ఈ 13 కార్లను ఈడీ ఆన్లైన్ వేలంలో విక్రయించనుఒంది. వేలం వేయనున్న నీరవ్ మోదీకి చెందిన 13 లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, పోర్షే పనమెరా, రెండు మెర్సిడెస్ బెంజ్, టొయోటా ఫార్చూనర్, ఇన్నోవా, రెండు హోండా బ్రియోస్లున్నాయి. కాగా, రూ 13,000 కోట్ల విలువైన పీఎన్బీ స్కామ్ వెలుగుచూసిన అనంతరం స్వాధీనం చేసుకున్న నీరవ్ మోదీ కార్లను వేలం వేసేందుకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్ధానం ఈడీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వేలం ప్రక్రియలో భాగంగా బిడ్డర్లు ఈనెల 21 నుంచి 23 వరకూ ఆయా కార్లను తనిఖీ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే వారికి వాహనాలను టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకువెళ్లేందుకు మాత్రం అనుమతించలేదు. ఈ 13 వాహనాల ఫోటోలను మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ సైట్లో అప్లోడ్ చేశారు. ఇందులోనే వాహనం ప్రారంభ ధర, తనిఖీ చేసుకునే ప్రదేశం, రిజిస్ర్టేషన్ నెంబర్, మోడల్ వంటి వివరాలను పొందుపరిచారు. కాగా, అంతకుముందు నీరవ్ మోదీ పెయింటింగ్లను వేలం వేసిన ఈడీ రూ 54 కోట్లను సమకూర్చుకుంది. పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకోగా, ఆయనను తమకు అప్పగించాలని భారత దర్యాప్తు ఏజెన్సీలు బ్రిటన్ను కోరుతున్నాయి. కాగా నీరవ్ మోదీ బెయిల్ అప్పీల్ను లండన్ కోర్టు తిరస్కరించింది. -
న్యాయ్పై అనుమానమెందుకు?
శ్రీనగర్ (ఉత్తరాఖండ్): బడావ్యాపారవేత్తలు నీరవ్మోదీ, మెహుల్ చోక్సీలాంటి వారి జేబులు నింపడానికి సందేహించని బీజేపీకి, న్యాయ్ పథకం అమలుపై అనుమానాలెందుకని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎత్తిపొడిచారు. ఉత్తరాఖండ్లో జరిగిన పార్టీ ఎన్నికల ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. ‘మీ(ప్రజలు) నుంచి తీసుకున్న డబ్బును ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, అనిల్ అంబానీ లాంటి వారికి ప్రధాని మోదీ ఇచ్చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే న్యాయ్ పథకం అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ అడుగుతున్నారు’ అని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండానే ఈ పథకాన్ని అమలు చేయవచ్చంటూ ఆర్థిక వేత్తలు చెప్పారని ఆయన అన్నారు. దాదాపు 25 కోట్ల మంది నిరుపేద ప్రజలకు ఐదేళ్లలో ఏడాదికి రూ.72 వేల చొప్పున అందించేందుకు రూ.3.6 లక్షల కోట్ల మేర అవసరమవుతాయని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో రైతులు, యువతకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. -
రోల్స్ రాయిస్ సహా 13 లగ్జరీ కార్లు వేలానికి
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్మోదీపై దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఫ్యుజిటివ్ వ్యాపారి మోదీకి చెందిన ఖరీదైన పెయింటింగ్లను గత వారం వేలం వేసిన ఈడీ, సిబీఐలు తాజాగా మరో వేలానికి సిద్ధపడ్డాయి. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మెటల్ స్ర్కాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్టీసీ) ద్వారా 13 విలాసవంతమైన కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చే వారం వేలం నిర్వహించనుంది. రోల్స్ రాయిస్ ఘోస్ట్, పోర్షే పనమేరా, రెండు మెర్సిడెస్ బెంజ్ కార్లు, మూడు హోండాకార్లు, ఒక టొయాటా ఫార్చునర్, ఇన్నోవా తదితర కార్లను వేలానికి పెట్టింది. ఏప్రిల్ 18న ఆన్లైన్ ద్వారా వీటిని విక్రయించనుంది. వేలం వేయనున్న కార్లకు సంబంధించిన ధర, ఫోటోలు, కంపెనీ తదితర వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనుంది. పీఎంఎల్ఏ కోర్టు ప్రత్యేక అనుమతితో ఈడీ వీటిని వేలం వేయనుంది. మరోవైపు లండన్ వాండ్స్వర్త్ జైల్లో ఉన్న నీరవ మోదీ గత శుక్రవారం పెట్టుకున్న రెండవ బెయిల్ పిటిషన్ కూడా వెస్ట్మినిస్టర్ కోర్టు నిరాకరించింది. దీంతో ఏప్రిల్ 26 తదుపరి విచారణ వరకు మోదీ జైలు ఊచలు లెక్క బెట్టాల్సిందే. కాగా 14 వేల కోట్ల రూపాయల పీఎన్బీస్కాం విచారణలో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 350 సీడీఐలు, టొయోటా ఫార్చునర్, ఇన్నోవా కారు, పోర్షే పనమేరా, మూడు హోండా కార్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 7.80 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, షేర్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : నీరవ్ మోదీ గుండె పగిలే వార్త