CBI invesitgation
-
కోల్కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐకి ఎదురుదెబ్బ
కోల్కతా: బెంగాల్లోని ఆర్జీకార్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అభయ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో నిందితుడి విషయంలో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి నార్కో అనాలసిస్ పరీక్ష చేయడానికి సీబీఐ సిద్ధమైంది ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా సీబీఐకి ధర్మాసనం షాకిచ్చింది. కోల్కతా హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్కు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. నిందితుడికి నార్కో పరీక్షకు అనుమతివ్వాలన్న సీబీఐ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో, సీబీఐ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. RG Kar Medical College and Hospital rape-murder case | Arrested accused Sanjay Roy refuses to give consent for Narco analysis test. The Sealdah Court in Kolkata rejected the CBI's prayer for Sanjay Roy's narco-analysis test.— ANI (@ANI) September 13, 2024 అయితే, అభయ హత్యాచార ఘటన కేసులో నిందితుడు సంజయ్ రాయ్కు సీబీఐ ఇప్పటికే పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను సీబీఐ బయటకు వెల్లడించలేదు. ఇక, పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుడులు చెప్పిన విషయాలను అధికారులు గోప్యంగా ఉంచారు. మరోవైపు.. పాలీగ్రాఫ్ టెస్టులో సంజయ్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని సీబీఐ అధికారులకు చెప్పాడనే లీకులు బయటకు రావడం గమనార్హం. తాను వెళ్లేసరికే ఆ వైద్యురాలు చనిపోయి ఉందని, తాను భయంతో పారిపోయానని అతడు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అభయ కేసుకు సంబంధించి అసలు నిజాలను రాబట్టేందుకే నిందితుడు సంజయ్ రాయ్కు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ భావించింది. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case | West Bengal: Arrested accused Sanjay Roy being brought out of Sealdah Court in Kolkata.He was brought to the Court from Presidency Correctional Home for a hearing related to his Narco test. CBI filed a petition to… pic.twitter.com/XhReY58vdb— ANI (@ANI) September 13, 2024 నార్కో టెస్ట్ ఇలా.. ఈ పరీక్షకి ముందు కొన్ని మందులు లేదంటే ఇంజెక్షన్లు(సోడియం పెంటోథాల్, స్కోపలామైన్, సోడియం అమైథాల్) ఇస్తారు. తద్వారా నిందితుడు/అనుమానితుడు అపస్మార స్థితిలోకి జారుకుంటాడు. మనస్సుపై నియంత్రణ కోల్పోతాడు. అప్పుడు అతని ద్వారా నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో, సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవచ్చు. డోస్ ఎక్కువగా ఇస్తే కోమాలోకి వెళ్లిపోవడం లేదంటే చనిపోవచ్చూ కూడా. కాబట్టి, నార్కో టెస్ట్కు కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థల అనుమతి తప్పనిసరి. అంతేకాదు.. అతను నార్కో టెస్ట్కు అర్హుడేనా? అనేది కూడా బాడీ టెస్ట్ ద్వారా ధృవీకరించుకుంటారు. ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, మనస్తత్వవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగే టైంలో వీళ్లలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆ టెస్ట్ ఆపేయాల్సిందే!.. ఇక కొందరు ఈ పరీక్షలో కూడా దర్యాప్తు బృందం నుంచి తప్పించుకుంటున్నారు. అందుకే ఈ పరీక్షపైనా తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, మన దేశంలో నార్కో టెస్ట్, పాలీగ్రాఫ్ టెస్ట్ల ద్వారా కేసుల దర్యాప్తులో పురోగతి సాధించిన సందర్భాలు, కేసుల చిక్కుముడులు విప్పిన దాఖలాలే ఎక్కువగా నమోదు అయ్యాయి.గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్ మర్డర్స్, 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో కసబ్ విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు.పాలీగ్రాఫ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే.. పాలీగ్రాఫ్ టెస్ట్.. నేర పరిశోధనలో ప్రయోగాత్మకమైన పద్ధతి. దీన్ని లైడిటెక్టర్ పరీక్ష అని కూడా వ్యవహరిస్తుంటారు. నిజాలను రాబట్టడం అనడం కంటే.. అబద్ధాలను గుర్తించడం అనే ట్యాగ్తో ఈ పరీక్షగా ఎక్కువగా పాపులర్ అయ్యింది. 1921లో కాలిఫోర్నియా యూనివర్సిటీ మెడికో జాన్ అగస్టస్ లార్సన్ ఈ విధానాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వైర్లు, ట్యూబుల్లాంటి వాటితో శరీరానికి సెన్సార్ల వంటి నిర్దిష్ట పరికరాలను జోడించి.. బీపీ, పల్స్, వివిధ భావోద్వేగాలు, శరీర కదలికలను జాగ్రత్తగా పర్యవేక్షించడం ద్వారా ఈ టెస్ట్ నిర్వహిస్తుంటారు.శరీరం ఎలా స్పందిస్తుందో నిశితంగా గమనించి ఆ వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో అనే నిర్ధారణకు అధ్యయనం చేపట్టడం ద్వారా వస్తారు. క్రిమినల్ కేసుల దర్యాప్తుల్లో కీలకంగా వ్యహరిస్తుంటుంది ఈ పరీక్ష. కానీ, ఇదే ఫైనల్ రిజల్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. నేరస్థులు ప్రాక్టీస్ ద్వారా ఈ పరీక్ష నుంచి తప్పించుకున్న దాఖలాలు బోలెడు ఉన్నాయి. అందుకే ఈ పరీక్ష కచ్చితత్వంపై తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి.ఇది కూడా చదవండి: ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి -
ఇది అన్యాయం: డీకే శివకుమార్
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.ఈ పరిణామంపై బెంగళూరులో డీకేఎస్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది కచ్చితంగా ఎదురుదెబ్బే. ఏం చేయమంటారు?. పైగా ఇది అన్యాయం’’ అని అన్నారాయన. నాపై సీబీఐ కేసు.. దర్యాప్తు రాజకీయ ప్రతీకార చర్య అని ప్రతీ ఒక్కరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐకి అన్ని అనుమతులు ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐకి ఇచ్చిన అనుమతుల్ని వెనక్కి తీసుకుని, లోకాయుక్తాకు ఆ కేసు అప్పగించింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశం. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించా. కానీ, వాళ్లు(సుప్రీం ధర్మాసనం) కుదరదని చెప్పారు అని డీకే శివకుమార్ అన్నారు. అయితే న్యాయపరంగా ఉన్న అన్నిమార్గాలను పరిశీలించి.. మరోసారి అప్పీల్ చేస్తానని చెప్పారాయన.ఇదిలా ఉంటే.. ఇవాళ సుప్రీం కోర్టులో డీకేఎస్ పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. అయితే.. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, ఇందులో జోక్యం చేసుకునేందుకు ఏ కారణం కనిపించడం లేదని బెంచ్ వ్యాఖ్యానిస్తూ ఆ పిటిషన్ను తిరస్కరించింది.2013-18 కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మంత్రి హోదాలో డీకే శివకుమార్ అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం. 2020లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పజెప్పింది. దర్యాప్తు జరిపిన సీబీఐ దాని విలువ రూ.74 కోట్ల రూపాయలపైమాటేనని అభియోగాలు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ను ఆయన కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయగా.. కోర్టు సైతం దర్యాప్తు సంస్థకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. -
లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్.. కవితకు కొత్త టెన్షన్!
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్నారు. వారిని ఈ కేసు విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిస్తోంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిచ్చిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. కవిత పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుపుతామో ఈరోజు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ అంశంలో తన రిప్లై ఇచ్చేందుకు సమయంలో ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో, సీబీఐ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ పదో తేదీకి వాయిదా వేసింది. అనంతరం, అప్పటి వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న తర్వాతే ఎలాంటి ఆదేశాలైనా జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐకి స్పెషల్ కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో.. అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. జైలులో కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. -
సంధ్య ఆక్వా డ్రగ్స్ కేసు: సీబీఐ మరో కీలక నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సీబీఐ నోటీసులు పంపించింది. వివరాల ప్రకారం.. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా సీబీఐ తాజాగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. ఇదే సమయంలో ఏపీలో పలువురు ఆక్వా బిజినెస్ ప్రతినిధులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. పెద్ద మొత్తంలో ఈస్ట్ ఆర్డర్ చేసుకోవడంలో ఆంతర్యమేంటనే దానిపై ప్రశ్నలు సంధించనున్నట్టు సమాచారం. మరోవైపు.. సీబీఐ అడిగిన ప్రశ్నలకు సంధ్య ఆక్వా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ‘సంధ్యా’ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్ఎస్కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. -
విశాఖ డ్రగ్స్ కేసులో CBI దూకుడు
-
81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికి వరకు ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. ఏకంగా 81.5 కోట్ల భారతీయులు వివరాలు డార్క్ వెబ్లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' (Resecurity) వెల్లడించింది. లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, పాస్పోర్ట్ సమాచారం, మొబైల్ నెంబర్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 9న pwn0001 పేరుతో ఒక హ్యాకర్ దాదాపు 815 మిలియన్స్ (8.15 కోట్లు) భారతీయుల ఆధార్, పాస్పోర్ట్ రికార్డ్స్ యాక్సెస్ పొందినట్లు రిసెక్యూరిటీ పేర్కొంది. ఈ డేటా వివరాలను 80000 డాలర్లకు (రూ. 66.60 లక్షలు) విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. లీకైన వివరాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయులకు సంబంధించినవి తెలుస్తోంది. ఈ విషయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే.. డేటా చోరీ జరగటం దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. జూన్లో కొవిన్ వెబ్సైట్ నుంచి వ్యాక్సినేషన్ చేసుకున్న లక్షలమంది భారతీయుల సమాచారం లీకయింది. అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్లో ఔట్పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాక్ చేశారు. ఆధార్ వివరాలతో హ్యాకర్స్ ఏం చేస్తారు! భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి వాటి కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అలాంటి ఈ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే బ్యాంకింగ్ దోపిడీలు, ట్యాక్స్ రిఫండ్ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ది వైర్ సంచలన కథనం
-
వివేకా కేసు: కోర్టుకు హాజరుకాని దస్తగిరి.. విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఉన్న ఐదుగురు నిందితులను సీబీఐ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిని హాజరుపరిచారు. అయితే, వివేకా కేసులో కీలక నిందితుడు దస్తగిరి ఈరోజు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో, కోర్టు.. కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా -
తల్లికి హార్ట్ సర్జరీ.. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్న అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐకి తెలిపారు. వివరాల ప్రకారం.. తన తల్లి అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల కారణంగా సీబీఐని వారం రోజులు సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. ఆమెకు హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరముంటుందని డాక్టర్లు సూచించారు. ఈ కారణంగా సర్జరీ సమయంలో తాను విచారణ హాజరుకాలేనని అవినాష్ రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి: బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం మాకు మాటల్లేని ఆనందం: పేర్ని నాని -
వివేకా కేసు: ఎంపీ అవినాష్ రెడ్డి ఫుల్ వీడియో
సాక్షి, వైఎస్సార్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, వివేకా హత్యకు సంబంధించి తన దగ్గరున్న సమాచారంతో ఎంపీ అవినాష్ రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ అవినాష్ రెడ్డి వీడియోను విడుదల చేశారు. వివేకా లెటర్ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? సీబీఐ అధికారి రాంసింగ్ ఎవరిని కాపాడుతున్నారు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? అన్న వివరాలను అవినాష్ రెడ్డి ఇందులో వివరించారు. "వివేకా హత్య తర్వాత శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ చేశారు. నేను పులివెందుల రింగ్ రోడ్ దగ్గర ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. వివేకా మరణించినట్టు శివప్రకాష్ రెడ్డే నాకు చెప్పారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని వివేకా పీఏ కృష్ణారెడ్డిని అడిగాను. ఎలాంటి అనుమానాలు లేవని వివేకా పీఏ చెప్పారు. మేము వెళ్లకముందే వివేకా రాసిన లేఖ, మొబైల్ దాచిపెట్టమని హైదరాబాద్ నుంచి సునీత భర్త ఫోన్ లో ఆదేశించారు. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దని వివేకా లెటర్లో రాశారు. హత్య అని తేల్చే లేఖను ఎలా దాచిపెడతారు? లెటర్ దాచిపెట్టమని నేనే చెప్పానని సునీత పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వివేకా చనిపోయారు, చాలా బ్లడ్ ఉందని మాత్రమే నేను సీబీఐకి చెప్పాను. సీబీఐ విచారణ తీరు ప్రజలకు తెలియాలి. వివేకా హత్య కేసు చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడవద్దనే.. ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నామని" అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: సీబీఐ స్టేట్మెంట్లో వివేకా రెండో భార్య షమీమ్ సంచలన విషయాలు వివేకా కుటుంబానికి హత్య విషయం తెలిసినా చాలా సేపటివరకు మౌనంగా ఉన్నారని, హత్య విషయం తెలిసినా వెంటనే ఎందుకు పోలీసులకు చెప్పలేదని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. వివేకా కుటుంబం మౌనంగా ఉండడం.. పోలీసులకు చెప్పకపోవడం వెనక అనుమానాలున్నాయని అన్నారు. ఆ కోణంలో సిబిఐ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదని, తనను ఇరికించేందుకే సిబిఐ కుట్ర పన్నినట్లు తెలుస్తోందని, ఈ కేసులో అన్ని విషయాలు నిజాయతీగా నిగ్గుతేలాల్సిన అవసరం ఉందని అన్నారు అవినాష్ రెడ్డి. -
వివేకా రెండో భార్య షమీమ్ సంచలన స్టేట్మెంట్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన రెండో భార్య షమీమ్ స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ఈ సందర్బంగా సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో షమీమ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో షమీమ్.. సీబీఐకి మూడు పేజీల స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇక, స్టేట్మెంట్లో వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు. షమీమ్ తన స్టేట్మెంట్లో 2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు వివాహం జరిగిందన్నారు. 2015లో తమకు షేహన్ షా(కొడుకు) జన్మించినట్టు స్పష్టం చేశారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రెడ్డి బెదిరించేది. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా.. నాతో ఫోన్లో మాట్లాడారు. బెంగళూరు భూ సెటిట్మెంట్లో 8 కోట్లు వస్తాయని వివేకా చెప్పారు. మా వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు, మమ్మల్ని దూరం పెట్టారు. షేహాన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తా అని వివేకా చెప్పేవారు. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారు. ఆ కారణంగానే చనిపోయాడని తెలిసినా రాలేకపోయాను. అన్యాయంగా వివేకా చెక్ పవర్ను తొలగించారు అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయ్’ -
‘సమాచారం ఇచ్చిన వ్యక్తిని ఎందుకు విచారించలేదు?’
హైదరాబాద్: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి పాత్ర లేకపోయినా అనూహ్యంగా సీబీఐ టార్గెట్ చేసిందని తెలంగాణ హైకోర్టులో అవినాష్రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ సందర్భంగా వాదనలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అవినాష్ తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ.. ‘అప్రూవర్గా మారిన దస్తగిరి కడపలో కూర్చొని ట్రయల్స్ చేస్తున్నాడు. ఇక్కడ కోర్టులో చేసిన వాదనలకు అక్కడ కౌంటర్ కామెంట్స్ చేస్తున్నాడు. అవినాష్పై, ప్రభుత్వంపై దస్తగిరి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ని పలుకుబడితో..ట్రాన్స్ఫర్ చేశాడని ఆరోపణలు చేశాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారిని మార్చారు. తప్పుడు ఆరోపణలు చేసిన దస్తగిరిని సునీత న్యాయవాది సమర్ధిస్తున్నాడు. సీబీఐ ఆఫీసర్ రామ్ సింగ్ను మార్చింది సుప్రీం కోర్టు.. అవినాష్ రెడ్డి అని ఎలా అంటారు..?, నేరం చేశారు అనడానికి సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కుటుంబ గొడవలు, భూ వివాదాలు, వివాహేతర సంబంధాలు వివేకా హత్యకు కారణమై ఉండొచ్చు. సీబీఐ ఇప్పటి వరకు 2 చార్జీ షీట్లు వేసింది. మొదటి చార్జిషీట్కు ముందే దస్తగిరి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనూహ్యంగా అవినాష్ను సీబీఐ టార్గెట్ చేసింది. ఎక్కడా అవినాష్ రెడ్డి పాత్ర లేదు’ అని తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తిని ఎందుకు విచారించలేదు? వివేకా చనిపోయిన రోజు ఉదయం గం. 6.26ని.లకు అవినాష్కు వివేకా చనిపోయినట్లు చెప్పింది శివప్రకాష్రెడ్డి. వాళ్లు ఫోన్ చేసే వరకూ అవినాష్కి వివేకా మరణం గురించి తెలియదు. అవినాష్ రెడ్డికి సమాచారం ఇచ్చిన వారిని సీబీఐ ఎందుకు విచారించడం లేదు. ఆరోజు పలువురు వ్యక్తులు వివేకా ఇంట్లోనే ఉన్నారు. గుండెపోటు అని రూమర్స్ ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ ప్రకారమే గుండెపోటు అని అవినాష్రెడ్డి చెప్పారు’ అని అవినాష్రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్రెడ్డి హైకోర్టుకు స్పష్టం చేశారు. -
అయినా.. సీబీఐ తీరు మారలేదు
సాక్షి, అమరావతి: ‘న్యాయం జరగటమే కాదు. న్యాయం జరుగుతున్నట్లు కనిపించాలి’ ‘ఈ కేసులో రాజకీయ కోణాన్ని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ సేకరించలేదు. సీబీఐ దర్యాప్తు సమగ్రంగా లేదు’... ఇవీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల రెండు సందర్భాల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు. సీబీఐ విచారణ తీరుపై ఈ వ్యాఖ్యలు చేయటంతోనే సుప్రీంకోర్టు సరిపెట్టలేదు. దర్యాప్తు ఎలా చేయాలో స్పష్టత ఇస్తూ... దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించింది కూడా. సీబీఐ అన్ని కోణాలనూ దర్యాప్తు చేయటం లేదని, కొందరిని దోషులుగా తేల్చాలన్న నిర్ణయాన్ని ముందే తీసేసుకుని దానికి తగ్గట్టుగా దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తోందని కేసులో నిందితుడైన శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ వేశారు. దానిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశిస్తూ పిటిషనర్కు ఊరటనిచ్చింది. దాని ప్రకారమే ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం కొత్తగా ఏర్పాటైంది. కానీ మునుపటి దర్యాప్తు అధికారి ఎక్కడైతే ఆగారో అక్కడి నుంచి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఈ బృందం నేరుగా వైఎస్ అవినాశ్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నట్టు గడిచిన రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. మరి ఇలాగైతే సుప్రీంకోర్టు తీర్పువల్ల పిటిషనర్కు ఏం ఊరట కలిగినట్టు? అసలు పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలన్న ఉద్దేశంతోనే కదా సుప్రీంకోర్టు కొత్త బృందాన్ని ఏర్పాటు చేయమన్నది. మరి ఆ బృందం కనీసం ఆ అంశాలవైపు చూడకుండా పాత దర్యాప్తుకు కొనసాగింపుగా చేసుకుంటూ పోతే ఏమనుకోవాలి? సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని సీబీఐ ఖాతరు చేయాల్సిన అవసరం లేదా? వివేకానందరెడ్డి హత్యకు బలమైన కారణాలుగా భావిస్తూ తులసమ్మ లేవనెత్తిన నాలుగు కీలక కోణాలను అసలు పట్టించుకోవడమే లేదెందుకు? ఇలాగైతే బాధ/æతులకు న్యాయం జరుగుతుందా? దర్యాప్తు అసమగ్రం.. దర్యాప్తు బృందాన్ని మార్చడమే నిదర్శనం ఓ కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడం అత్యంత అరుదు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు అటువంటి అసాధారణ నిర్ణయాన్నే తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు సమగ్రంగా లేదని భావించటంతో... న్యాయసూత్రాల ఆధారంగా దర్యాప్తు ఎలా చేయాలో చెప్పటమే కాక, దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ రామ్సింగ్ను తొలగించమని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో ఎస్పీ వికాస్ సింగ్, అదనపు ఎస్పీ ముకేశ్ కుమార్లతో కొత్త బృందాన్ని సీబీఐ నియమించింది. పాత బృందం తప్పటడుగుజాడల్లోనే... పాత దర్యాప్తు బృందాన్ని మార్చమని సుప్రీంకోర్టు చెప్పిందంటేనే ... ఆ బృందం చేసిన దర్యాప్తు సక్రమంగా లేదని కదా!. వివేకాను హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్గా మార్చి, అతని వాంగ్మూలం ఆధారంగానే పాత దర్యాప్తు బృందం విచారణ కొనసాగించింది. ఆ దర్యాప్తు నివేదికలో ఎలాంటి ఆధారాలూ లేవని సుప్రీంకోర్టు చెప్పింది. దానర్థం అప్పటివరకు దర్యాప్తులో పట్టించుకోని కొత్త కోణాలను గుర్తించి, తగిన సాక్ష్యాలను సేకరించమని సుప్రీం కోర్టు చెప్పినట్టే కదా!. కానీ అది సీబీఐకి వినిపించలేదు. సీబీఐ కొత్త దర్యాప్తు బృందం కూడా హంతకుడైన దస్తగిరి వాంగ్మూలం చూట్టూనే దర్యాప్తును పరిమితం చేస్తోంది. అసలు వాస్తవాల జోలికి పోవటమే లేదు. దానికి తార్కాణాలివిగో... కనీసం విచారించకుండానే అరెస్టులా...!? ఉదయ్ కుమార్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డిలను సీఐబీ అరెస్టు చేసిన తీరు సహజ న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే ఏ నిందితుడినైనా విచారించకముందు అరెస్టు చేయటమనేది ఉండదు. కానీ ఈ దర్యాప్తు బృందం వారిని విచారించకుండానే అరెస్టు చేసేసింది. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని, పూర్తిగా సహకరిస్తానని భాస్కర్రెడ్డి మొదటి నుంచీ చెబుతున్నారు. పాత దర్యాప్తు బృందం ఓసారి ఆయన్ను విచారణకు రావాలని ఫోన్ చేసి పిలిచింది. దాంతో కడప జైలు వద్ద సీబీఐ అధికారుల కార్యాలయానికి వెళ్లారు. చాలాసేపు నిరీక్షించినా సీబీఐ ఆయన్ని విచారణకు పిలవ లేదు. పైగా నోటీసులివ్వకుండా ఎందుకు వచ్చారన్నట్టు మాట్లాడారు. వైఎస్ భాస్కర్రెడ్డి పుట్టినరోజు, పెళ్లి రోజు ఒకేరోజు. గత 20ఏళ్లుగా ఆ రోజున తీర్థయాత్రకు వెళుతున్నారు. ఈ ఏడాది కూడా సీబీఐ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని వెళ్లారు. అంటే సీబీఐ అధికారుల విచారణకు ఆయన మొదటి నుంచీ పూర్తిగా సహకరిస్తూనే ఉన్నారు. అటువంటి భాస్కర్రెడ్డిని కొత్త దర్యాప్తు బృందం కనీసం విచారించకుండానే నేరుగా వచ్చి అరెస్టు చేయడం విస్మయపరుస్తోంది. నోటీసులిచ్చి విచారించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్న కనీస నిబంధనను కూడా పట్టించుకోలేదు. పైగా ఆయన విచారణకు సహకరించడం లేదని కోర్టులో చెప్పటం చూస్తే... విచారణ ఏ రీతిన సాగుతోందో అర్థమవుతుంది. అసలు ఆయన్ని విచారించేందుకు నోటీసే ఇవ్వని సీఐబీ ఆయన విచారణకు సహకరించడం లేదని ఎలా చెబుతుంది? పైగా వైఎస్ భాస్కర్రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేశాక.. విచారణ కోసం 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరడం ఉద్దేశపూర్వకంగా వేధించటానికేనని స్పష్టంకాక మానదు. – ఉదయ్ కుమార్రెడ్డిని కూడా అదే రీతిలో... ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా చెప్పాలని దర్యాప్తులో భాగంగా రామ్సింగ్ తనను వేధించారని గతంలో ఉదయ్కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొత్త దర్యాప్తు బృందం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఎవరైనా భావిస్తారు. కానీ కొత్త బృందం ఉదయ్ని కనీసం విచారించకుండా... ఆయన ఆరోపణకు ఆధారం ఏమిటో అడగకుండా పులివెందులలోని ఆయన ఇంటికి నేరుగా వచ్చి... తమతో కడప రావాలని చెప్పి దార్లో అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్కు తరలించారు. ఒక్క కొత్త ఆధారాన్ని సేకరించనే లేదు... సుప్రీం కోర్టు కొత్త దర్యాప్తు బృందాన్ని నియమించమని ఆదేశించిందంటే... పాత దర్యాప్తు బృందం సరిగా విచారించ లేదని తేల్చినట్టే. కాబట్టి కొత్త బృందం ఈ కేసులో అప్పటివరకు విస్మరించిన కోణాలేమైనా ఉంటే వాటిని పరిశీలించాలి. అప్పటివరకు వెలుగుచూడని సాక్ష్యాలుంటే వెలికితీయాలి. కానీ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో బృందం ఈ అంశాలు వేటినీ పట్టించుకోనే లేదు. ఈ కేసులో ఒక్క కొత్త ఆధారాన్నీ సేకరించలేదు. సాక్షులెవరినీ విచారించనేలేదు. అంతకుముందు రామ్సింగ్ బృందం ఏకపక్షంగా చేసిన దర్యాప్తునకు కొనసాగింపుగానే వ్యవహరిస్తోంది. ఆ తప్పటడుగుల్లోనే నడుస్తోంది. అంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని బేఖాతరు చేస్తోంది. రాజకీయ కోణానికి ఆధారాలేవి? వివేకా హత్య వెనుక రాజకీయ కోణం ఉందని నిరూపించే ఒక్క ఆధారాన్నీ సీబీఐ చూపించలేకపోయిందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కొత్త దర్యాప్తు బృందం కూడా ఆ దిశగా ఒక్క సాక్ష్యాన్ని కూడా సేకరించనే లేదు. కానీ భాస్కర్రెడ్డి అరెస్టు రిమాండ్ రిపోర్ట్లో మాత్రం రాజకీయ అంశాలను ఏకపక్షంగా ప్రస్తావించేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి గతంలో భాస్కర్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొనడం హాస్యాస్పదమే. పాత బృందం ఇదే మాట అంటే అసలు రాజకీయ కోణం ఉన్నదనడానికి ఆధారాలేవని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి ఒక్క ఆధారమూ చూపకుండానే ఈ బృందం కూడా అవే వ్యాఖ్యలను ఏకంగా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిందంటే ఏమనుకోవాలి? భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యమూ లేదు... ఈ కేసులో భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పనే లేదన్నది కీలకం. పైగా వైఎస్ అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డిల ప్రమేయం ఉనట్టుగా చెప్పాలని తమను సీబీఐ వేధిస్తోందని పలువురు సాక్షులు పేర్కొన్నారు. భాస్కర్రెడ్డిని ఏ ప్రాతిపదికన అరెస్టు చేశారంటే... దస్తగిరి అప్రూవర్గా ఇచ్చిన వాంగ్మూలాన్నే చూపిస్తుండటం చిత్రాతిచిత్రం. ఎందుకంటే వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేసింది దస్తగిరి. ‘నేనే నరికి చంపా’ అని అంగీకరించింది దస్తగిరి. అలాంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చడమే సీబీఐ చేసిన పెద్ద పొరపాటు. ఇక దస్తగిరిని ఢిల్లీ తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి మరీ అప్రూవర్గా మార్చారని ఈ కేసులో మరో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి గతంలోనే చెప్పారు. మరోవైపు ఈ కేసులో ఇతర నిందితులను అరెస్టు చేస్తూ... వారికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని వాదిస్తున్న సీబీఐ... వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని ఒప్పుకున్న నిందితుడు దస్తగిరి బెయిల్ పిటీషన్ను వ్యతిరేకించకపోవడం విడ్డూరమే. ఈ అంశాలన్నింటినీ కొత్త దర్యాప్తు బృందం కనీసం విశ్లేషించనే లేదు. హంతకుడైన దస్తగిరి బయట తిరుగుతుంటే... అప్రూవర్గా అతనిచ్చిన అహేతుకమైన వాంగ్మూలం ఆధారంగా పలువురిని అరెస్టు చేస్తుండటమే విస్మయకరం. ఆ నాలుగు కోణాల్లో దర్యాప్తే చేయని సీబీఐ! ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ కీలకమైన నాలుగు అంశాలను ప్రస్తావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కోణాల్లో దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న ఆమె వాదనను న్యాయస్థానం నమోదు చేసింది కూడా. ఆమె లేవనెత్తిన అంశాలు ఇవీ... 1. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆర్థిక విభేదాలు తలెత్తాయి. 2. వివేకానందరెడ్డికి కొందరితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, సెటిల్మెంట్ వ్యవహారాలున్నాయి. 3. వివేకానందరెడ్డి అక్రమ లైంగిక సంబంధాలున్నాయి. దీనిపై ఆయన పట్ల కొందరు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు. 4. వివేకా రాజకీయ వారసత్వం కోసం ఆయన సొంత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలున్నాయి. కాకపోతే ఈ అంశాలపై కొత్త సీబీఐ బృందం కనీసం దృష్టి కూడా పెట్టలేదు. -
అవినాష్రెడ్డి సీబీఐ విచారణ మంగళవారానికి వాయిదా
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేటి సీబీఐ విచారణ రేపటికి(మంగళవారం) వాయిదా పడింది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం అవినాష్రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆ విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు విచారణకు రావాలని అవినాష్రెడ్డికి సీబీఐ స్పష్టం చేసింది. నేటి విచారణలో భాగంగా హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్రెడ్డి హాజరయ్యే క్రమంలో విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ మేరకు అవినాష్రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టులో నేటి మధ్యాహ్నం అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఉన్నందునే సీబీఐ తన విచారణను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. చదవండి: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ అవినాష్ రెడ్డి -
‘సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వివేకా హత్య కేసులో విచారణ సక్రమంగా జరగడం లేదన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి. సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోందని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకుంటే న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి.. ‘ సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. భాస్కర్రెడ్డి అరెస్ట్ అక్రమం. ఏ కేసులోనైనా నిష్పక్షపాత విచారణ జరగాలి.వివేకా హత్యకు జగన్కూ ఏం సంబంధం. హత్య ఎందుకు జరిగిందనే దానిపై లోతుగా దర్యాప్తు జరగాలి’ అని పేర్కొన్నారు. చదవండి: విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది: అవినాష్ రెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ స్థానికుల ర్యాలీ -
వివేకా కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు ఇవాళ(సోమవారం) ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. సుప్రీం కోర్టులో వివేకా హత్య కేసు నిందితుడి భార్య ఒక పిటిషన్ దాఖలు చేసింది. శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి రామ్సింగ్ను మార్చాలని తులసమ్మ పిటిషన్లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే.. దర్యాప్తు అధికారి బాగానే పని చేస్తున్నారంటూ కోర్టుకు సీబీఐ బదులిచ్చింది. ఈ క్రమంలో దర్యాప్తు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. మరో అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నిస్తూనే, కేసు విచారణ పురోగతిపై సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. -
తీర్పు వచ్చేవరకు ఎంపీ అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు విన్న అనంతరం అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తాము తీర్పు వెలువరించే వరకు ఈ మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తనను విచారణకు హాజరు కావాలని ఆదేశించడంపై స్టే విధించాలని కోరుతూ అవినాశ్రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ విచారణ చేపట్టినా ఆడియో, వీడియో రికార్డింగ్తోపాటు దర్యాప్తు పారదర్శకంగా సాగేలా సీబీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిష న్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్పైనా తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. (చదవండి : రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు) రాజకీయ ఒత్తిళ్లతోనే అభియోగాలు.. ‘సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉంది. కొందరు రాజకీయ నేతల ఒత్తిళ్లతోనే ఆమె పిటిషనర్పై అభియోగాలు మోపారు. తన తండ్రి పిటిషనర్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారని, ఇంటింటికి తిరిగారని హత్య జరిగిన అనంతరం కూడా చెప్పిన సునీత ఏడాది తర్వాత మాట మార్చారు. ఆ తర్వాత నుంచి పిటిషనర్పై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. వివేకా హత్య కేసులో అల్లుడు రాజశేఖర్రెడ్డి, హతుడి రెండో భార్య షమీమ్ పాత్రపై సీబీఐ విచారణ సాగించడం లేదు. వివేకా 2010లో రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించాడు. రెండో పెళ్లి కారణంగానే వివేకా కుటుంబంలో విభేదాలు వచ్చాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్ఫర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలో తన పేరుతో ఉన్న ఆస్తులను రెండో భార్య పేరుతో రాయాలని వివేకా భావించారు. ఆస్తుల గొడవల వల్లే వివేకా హత్య జరిగింది. ఈ కేసులో రెండో పెళ్లి కూడా కీలక అంశం. సీబీఐ ఆ దిశగా విచారణ చేయాలి. వివేకాది గుండెపోటని పిటిషనర్ ఎక్కడా చెప్పలేదు. స్థానిక రాజకీయ నేత శశికళతో పిటిషనర్ అసలు మాట్లాడనే లేదు. ఆమె కూడా ఇదే విషయాన్ని సీబీఐకి చెప్పింది. ఇదే కోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అందులో శశికళ గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు సీబీఐ రెండు చార్జీషీట్లు దాఖలు చేసినా ఎక్కడా సిట్ దర్యాప్తు నివేదికను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 14న సీబీఐ విచారణకు పిటిషనర్ హాజరుకాకుండా ఆదేశాలివ్వాలి’ అని నిరంజన్రెడ్డి కోరారు. (చదవండి : వివేక హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు?) సీల్డ్ కవర్లో వివరాలు... వివేకా హత్య కేసు డైరీని సీబీఐ సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. 35 మంది సాక్షుల వాంగ్మూలం, 10 డాక్యుమెంట్లు, కొన్ని ఫొటోలు, హార్డ్డిస్క్లను కోర్టు ముందుంచింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖ, ఎఫ్ఎస్ఎల్ నివేదికను సైతం సమర్పించింది. కేసుకు సంబంధించి ఆధారాలను ధ్వంసం చేసినట్లు పిటిషనర్పై ఆరోపణలున్నాయని, ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయవద్దని కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ కార్యాలయం ఎదుట మీడియాకు వివరాలను ఎంపీ వెల్లడించడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. ఈనెల 14న విచారణ హాజరు నుంచి మినహాయింపు కోరే అంశంపై సీబీఐనే ఆశ్రయించాలంది. ఈ కేసు విచారణ హైదరాబాద్కు బదిలీ అయ్యాక పిటిషనర్ తండ్రి భాస్కర్రెడ్డిని కడపలో హాజరు కావాలని ఎందుకు పిలిచారని సీబీఐని ప్రశ్నించింది. తాము పిలవలేదని సీబీఐ తెలిపింది. కాగా తన మీద, తన కుటుంబంపైనా ఆరోపణలు చేశారని అందుకే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశానని సునీత నివేదించారు. -
వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు విస్మరిస్తున్నారని చాలా రోజులుగా ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఓ కేసు కూడా నమోదయింది. గత ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో దేవిరెడ్డి శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై స్పందించిన న్యాయస్థానం ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. ఇన్నాళ్లూ సీబీఐ కప్పిపుచ్చేందుకు యత్నించిన కొన్ని కీలక వాస్తవాలు న్యాయస్థానంతో పాటు ప్రజల దృష్టికి వచ్చాయి. ఆ వివరాలు, సమాధానాలు లేని ప్రశ్నలు ఓ సారి చూద్దాం. 1. లేఖ విషయం ఎందుకు దాచి పెట్టారు? మార్చి 15, 2019న వివేకానందరెడ్డి హత్యకేసు వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం వివేకా స్వదస్తూరితో రాసిన లేఖ, ఆయన వాడుతున్న సెల్ఫోన్. వీటి విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత అనుమానస్పదంగా ఉంది. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్ఫోన్ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వారు పులివెందుల చేరుకున్న తర్వాత సెల్ఫోన్లోని మెసేజ్లు, ఇతర వివరాలను డిలీట్ చేసిన తర్వాతే వాటిని పోలీసులకు అప్పగించారని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని దేవిరెడ్డి శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ కూడా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. వివేకా హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర సందేహాస్పదంగా ఉందని ఆమె కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 2. హత్యకు, వివేకానందరెడ్డి రెండో పెళ్లి, కుటుంబానికి ఉన్న లింకేంటీ? షమీమ్ అనే మహిళను కొన్నాళ్ల కింద వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. ఇది కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నచ్చలేదు. ముఖ్యంగా ఈ పెళ్లి కారణంగా వివేకానందరెడ్డికి, ఆయన కుమార్తె, అల్లుడు, పెద్దబావమరిదితో బాగా అంతరం పెరిగినట్టు పులివెందులలో చెబుతారు. ఇదే విషయాన్ని కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ పేర్కొన్నారు. ‘వైఎస్ వివేకానందరెడ్డి షమీమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయి. బెంగళూరులో భూ సెటిల్మెంట్ ద్వారా వచ్చే రూ.4 కోట్లను తన రెండో భార్య షమీమ్కు ఇస్తాననడంతోపాటు ఆమె ద్వారా తనకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. ఇది మొదటి భార్య, కుటుంబానికి నచ్చలేదు.‘ రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలే ఈ హత్యకు కారణమని ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. 3. వివేకాకు ఉన్న వివాదాలేంటీ? వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దాంతో కక్ష పెంచుకున్న పరమేశ్వరరెడ్డి... వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్ రవికి సన్నిహితుడిగా మారారు. ఈ విషయాన్ని దేవిరెడ్డి శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ కూడా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ‘ వివేకా హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకు పరమేశ్వరరెడ్డి 2019 మార్చి 13న అనారోగ్యం నెపంతో కడపలోని సన్రైజ్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్షకు అతను తిరస్కరించడం సందేహాలకు తావిస్తోందని‘ తులసమ్మ కోర్టుకు విన్నవించారు. అలాగే వైఎస్సార్ కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్సీపీలోకి తీసుకురావాలని వివేకా భావించడంతో కక్ష పెంచుకున్నాడని, వైఎస్ వివేకాపై అప్పటికే కక్షగట్టిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి హైదరాబాద్లో వైజీ రాజేశ్వరరెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారని కూడా తులసమ్మ తెలిపారు. 2019 మార్చి 14న పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్ ఉద్దేశ పూర్వకంగానే వివేకా ఇంటికి ఉత్తరం వైపు తలుపు గడియ పెట్టకుండా వెళ్లిపోయారని, హంతకులు ఆ రోజు వివేకా ఇంటిలోకి ప్రవేశించి హత్య చేసేందుకు వీలుగా ఈ పని జరిగిందని ఆరోపించారు. సీబీఐ ఈ కేసు విషయంలో అనుసరిస్తున్న తీరుపట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్గా మార్చడంతోపాటు అతని ముందస్తు బెయిల్ను వ్యతిరేకించక పోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఈ హత్యలో అసలు కుట్రదారులుగా భావిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్లను సీబీఐ విచారించనే లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు -
సీబీఐ విచారణతో వాస్తవాలు తెలుస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొ న్నారు. ఈ కేసులో వాస్తవాలు బయ టకు రావాలని బీజేపీ కోరుకుంటోందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలి పా రు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను దాచి పెట్టి, అసత్య ప్రచారంతో బీజేపీని బద్నామ్ చేసే కుట్రకు తెరతీసిందని మండిపడ్డారు. ‘ఫాంహౌస్ కేసులో కర్త, కర్మ, క్రియ.. ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆరే. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్కు ‘ప్రగతి భవన్’అడ్డాగా మారింది. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు కేసీఆర్ ప్రభు త్వం ఆడుతున్న డ్రామాపై ప్రజల్లో చర్చ జరుగు తోంది’అని అన్నారు. నేరస్తు లను కాపాడ టానికే ‘సిట్’ విచారణ సాగుతున్నట్లుగా కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసుల్లో ‘సిట్’ విచారణ జరిపినా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక పోవడమే ఇందుకు నిదర్శనమని ఎద్దేవాచేశారు. లిక్కర్, డ్రగ్స్, అవినీతి కేసుల్లో నిండా కూరు కుపోయిన తన కుటుంబాన్ని కాపా డుకు నేందుకు, ప్రజల దృష్టిని మ ళ్లించడానికి కేసీఆర్ అల్లిన కట్టుకథనే ఫాంహౌస్ కేసు అని వ్యాఖ్యానించారు. ఫాంహౌస్కేసులో దోషులెవరో గుర్తించడానికే సీబీఐ విచారణ అవసరమని ప్రజలు కోరుతున్నారన్నా రు. సీబీఐ విచారణతో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని బీజేపీ భావిస్తోందన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందని మొదటి నుంచీ తా ము చెబుతున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించామని మీడియా తో అన్నారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ దర్యాప్తులో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతికి ఆ తర్వాతే..!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతికి వెళ్లాలన్న ఆదేశాలు వెలువడిన కాసేపటికే మరో పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తుది కాపీ వచ్చేదాకా.. ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్లో ఉంచాలని, తీర్పును ఇంప్లిమెంట్ చేయొద్దని సిట్ తరపున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కోరారు. దీనికి హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు.. ఆర్డర్ కాపీ అందిన తర్వాతే అప్పీల్కు వెళ్తామని ధర్మాసనానికి స్పష్టం చేశారు ఏజీ. దీంతో అప్పీల్కు వెళ్లే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి ఏజీకి స్పష్టం చేశారు. అంతకు ముందు.. కేసును సిట్ దర్యాప్తు నుంచి సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే.. తక్షణమే సీబీఐకి అప్పగించాలని తెలిపినప్పటికీ.. ఏజీ అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే సిట్ అప్పీల్కు వెళ్లనుంది. ఈ పరిణామంతో.. డివిజన్ బెంచ్లో తీర్పు తర్వాతే సీబీఐ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతే తన కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి మీడియాకు తెలిపారు. -
డ్యామిట్.. కేసీఆర్ సర్కార్కు ఎదురుదెబ్బ.. ఇప్పుడేం చేస్తారో?
సాక్షి, హైదరాబాద్: ఫామ్హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ సర్కార్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి.. ఆ దర్యాప్తు ద్వారా ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టాలని తీవ్రంగా యత్నించింది బీఆర్ఎస్ అండ్ కో. కానీ, కేసును సీబీఐకి అప్పగించాలన్న ఇవాళ్టి తెలంగాణ హైకోర్టు తీర్పుతో కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. కేంద్ర ఏజెన్సీకి అప్పగిస్తే.. కేసు నిర్వీర్యం అయిపోతుందని, ప్రత్యర్థులపై విరుచుకుపడే అవకాశం కోల్పోతామేమో అనే ఆందోళన చెందుతోంది బీఆర్ఎస్. కోర్టు తీర్పు వెలువరిన వెంటనే.. ఆ తీర్పును స్వాగతిస్తున్నాం అంటూ బీజేపీ నేత, అడ్వొకేట్ రామచంద్ర రావ్ ప్రకటన చేయడం గమనార్హం. సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని ఆయన వాదించారు. అంతకు ముందు.. ఈ కేసులో కుట్రకోణం దాగుందని, సంబందం లేని వారిని కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు వెల్లడించారు. తెలంగాణ రంగారెడ్డి పరిధిలోని మొయనాబాద్లోని ఓ ఫామ్ హౌజ్లో అక్టోబర్ 26వ తేదీ సాయంత్రం ఆకస్మిక సోదాలు నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు.. బీఆర్ఎస్(పాత టీఆర్ఎస్) ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగా వంద కోట్ల రూపాయలతో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే యత్నం జరిగిందని ప్రకటించి సంచలనానికి తెర తీసింది. ఈ కేసులో దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రామచంద్ర భారతి, సింహయాజులు, నంద కుమార్ల పేర్లను నిందితులుగా చేర్చింది ఆ బృందం. ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్రెడ్డి, రోహిత్రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడిచిందన్నది తెలిసిందే. ఈ క్రమంలో.. అధికార ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ వ్యవహారం వెనుక బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ వచ్చారు. మరోవైపు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సైతం సాక్ష్యాలంటూ వీడియో ఫుటేజీలతో.. మీడియా ముందుకు వచ్చి బీజేపీ బడా నేతలను సైతం ఇందులో భాగం చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీని విమర్శిస్తూనే.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సిట్ విచారణలో భాగంగా నిందితుల అరెస్ట్.. ఆపై బెయిల్.. ఆ వెంటనే వేర్వేరే కేసుల్లో నిందితులను మళ్లీ అదుపులోకి తీసుకోవడం.. ఇలా హైడ్రామా నడిచింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై ఉన్నత న్యాయస్థానం.. సుదీర్ఘ వాదనల తర్వాత టెక్నికల్ గ్రౌండ్స్ను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో నగదు లేనప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ ఎలా వర్తిస్తుందని, పైగా సీఎం కేసీఆర్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారని, అసలు దర్యాప్తు ఆధారాలు ఆయన చేతికి ఎలా వెళ్లాలని, అసలు ఏసీబీ చేయాల్సిన దర్యాప్తును సిట్ ఎలా చేస్తుందని?, సీబీఐకి అప్పగిస్తే అసలు వ్యవహారం బయటపడుతుందని.. ఇలా పిటిషనర్ తరపు వాదనలన్నీ తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అందుకే.. సిట్ ఏర్పాటును రద్దు చేస్తూ సీబీఐకి కేసు అప్పగించాలని ఆదేశించింది. ఒకవేళ రాష్ట్రంలో సీబీఐని నిషేధించినా.. హైకోర్టు ఆదేశాలతో విచారణ జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో.. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని సిట్ అనుకుంటోంది. దీంతో.. సిట్ అభ్యర్థనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. కేసులో కీలక పరిణామాలు October 26 - తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు November 25 - హైకోర్టు జడ్జీలు బదిలీ December 1 - నిందితులకు బెయిల్ మంజూరు December 26 - కేసు సీబీఐకి అప్పగింత -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. సీబీఐ విచారణకు అనుమతిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బీజేపీ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు.. మిగిలిన పిటిషన్లకు మాత్రం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. సిట్ విచారణ సరిగా జరగట్లేదన్న వాదనతో ఏకీభవించింది హైకోర్టు. సిట్ ఏర్పాటును కొట్టేస్తూనే సిట్ విచారణ నిలిపివేతకు ఆదేశించింది. అలాగే.. కేసును సిట్ నుంచి సీబీఐకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు వివరాలు సీబీఐకి అందజేయాలని సిట్ను ఆదేశించింది హైకోర్టు బెంచ్. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని సిట్ యోచిస్తోంది. గత అక్టోబర్లో తెరపైకి వచ్చింది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. అధికార పార్టీ బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కుట్ర జరిగిందని, అందుకు రంగారెడ్డి మొయినాబాద్లోకి ఓ ఫామ్హౌజ్ వేదిక కావడం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
లిక్కర్ స్కామ్తో మరొకరికి లింక్!
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కామ్ మొత్తం హైదరాబాద్ నుంచే జరిగినట్టు సీబీఐకి స్పష్టమైన ఆధారాలు లభించడంతో, మనీలాండరింగ్ సైతం ఇక్కడినుంచే జరిగినట్టు భావిస్తున్న ఈడీ విచారణ వేగవంతం చేసింది. హైదరాబాద్ లింకులను ఛేదించే పనిలో పడింది. మొదట్లో అరుణ్ రామచంద్రన్ పిళ్లై వరకే ఉందని భావించినా..తర్వాత బోయినిపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్సాగర్రావు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఆడిటర్ బుచ్చిబాబు పేరుతో పాటు రాబిన్ డిస్టిలరీ, మరో ఎనిమిది కంపెనీలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు, సోదాలు కొనసాగిస్తున్న ఈడీ బృందాలు సోమవారం వెన్నమనేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించడం కేసులో పెద్ద మలుపు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలతో ఈ కేసులో పాత్ర ఉన్నట్టుగా అనుమానిస్తున్న ప్రముఖులు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వెన్నమనేని శ్రీనివాసరావు విచా రణలో మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. దగ్గరి బంధువుకు లింకులు ఇరవై ఏళ్లుగా లిక్కర్, పబ్ల వ్యాపారాల్లో ఉన్న శ్రీనివాసరావు దగ్గరి బంధువుకు ఈ స్కామ్లో లింకులున్నట్టుగా ఈడీ అనుమానిస్తోంది. ఆ వ్యక్తికి శ్రీనివాసరావు బినామీగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి. దీంతో ఆ వ్యక్తి ఎవరో అన్న చర్చ మొదలైంది. ఢిల్లీలో లిక్కర్ మార్టుల ఏర్పాటులో ఆయన హస్తం కూడా ఉందా? ఆయనకు సంబంధించిన డబ్బు ఏమైనా శ్రీనివాసరావు ద్వారా ఢిల్లీ వెళ్లిందా అన్న కోణంలో ఈడీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని సోదాలు, నోటీసులు? ఇప్పటివరకు నాలుగు సార్లు జరిపిన సోదాలు, విచారణలు, స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా మరికొంత మంది కీలక వ్యాపారులు, నేతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాలని ఈడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పెన్డ్రైవ్లు, మెయిల్స్, సిగ్నల్.. వాట్సాప్ యాప్ల నుంచి రిట్రీవ్ చేసిన సందేశాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి పలువురికి నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. దీంతో ఈ స్కామ్ ఎటు తిరిగి ఎవరికి చుట్టుకుంటుందోనన్న జరుగుతోంది. -
వెయ్యి బస్సుల కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి బస్సుల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపణలపై సీబీఐతో ప్రాథమికంగా దర్యాప్తు చేయించాలని హోం శాఖ సిఫారసు చేసింది. ఢిల్లీ రవాణా శాఖ బస్సుల కొనుగోలు, వార్షిక నిర్వహణ కాంటాక్టు (ఏఎంసీ)ల్లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపించగా, దీనిపై విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజాల్ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఏఎంసీలో విధానపరమైన లోపాలున్నాయని, దానిని రద్దు చేయాలంటూ ఆ కమిటీ సిఫారసు చేసింది. దాంతో దీనిపై సీబీఐతో విచారణకు హోంశాఖ ఆదేశించింది. -
వైఎస్ వివేకా హత్య కేసులో ఏడుగురిని విచారించిన సీబీఐ
కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ బృందం మంగళవారం ఏడుగురిని విచారించింది. వారిలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యూసీఐఎల్)లో ఉద్యోగిగా పనిచేస్తూ, పులివెందులలో ఉంటున్న ఉదయ్కుమార్రెడ్డి, పులివెందులకు చెందిన కాంపౌండర్ ప్రకాష్రెడ్డి, తిరుపతిలోని సంకల్ప హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ సతీష్కుమార్రెడ్డి, డాక్టర్ మధు, యూసీఐఎల్లో పనిచేస్తున్న మరో ఉద్యోగి కిషోర్కుమార్రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన ట్రాక్టర్ షెడ్ యజమాని భాస్కర్రెడ్డి, పులివెందులకు చెందిన డాక్టర్ నాయక్లు ఉన్నారు. -
కోటి అందింది.. రాజా ఇంకా పది కోట్లివ్వాలి!
-
Mehul Choksi: అదృశ్యం.. రంగంలోకి దిగిన సీబీఐ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అదృశ్యమయిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న చోక్సీ ఆదృశ్యమైనట్లు అక్కడి పోలీసులు తెలిపారు. దాంతో ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులు తనను పిలిచి మాట్లాడారని చోక్సీ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయమై ఆంటిగ్వా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని వెల్లడించారు. అతని భద్రత గురించి కుటుంబ సభ్యులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. అక్కడి ప్రముఖ రెస్టారెంట్లో విందు కోసం చోక్సీ సోమవారం సాయంత్రం వెళ్లినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. దీంతో అంటిగ్వా పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. అయితే ఆయన క్యూబాకు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. 2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. 2018లో పీఎన్బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్మోదీతోపాటు మెహుల్ చోక్సీ దేశం విడిచి పరారయిన సంగతి తెలిసిందే. చదవండి: పీఎన్బీ స్కాం: చోక్సీకి భారీ షాక్ -
వాళ్లందరికీ భద్రత కల్పిస్తున్నాం..
న్యూఢిల్లీ/లక్నో: హాథ్రస్ దళిత యువతి సామూహిక అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణను పర్యవేక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అదే విధంగా దర్యాప్తునకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిందిగా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరింది. అదే ఫైల్ను యూపీ పోలీస్ చీఫ్ ద్వారా సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తామని, కాబట్టి తమ అభ్యర్థనను మన్నించాల్సిందిగా యోగి సర్కారు విజ్ఞప్తి చేసింది. ఇక బాధితురాలి కుటుంబానికి, ఈ కేసులోని సాక్షులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే, బాధితురాలి ఇంటి వద్ద విధులు నిర్వరిస్తున్న పోలీసు సిబ్బంది, ఇతరత్రా వివరాలతో కూడిన అఫిడవిట్ను దాఖలు చేసింది. బాధిత కుటుంబ నివాస ప్రాంగణంలో ఎనిమిది సీసీటీవీలను బిగించామని, తద్వారా నిరంతరం అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో సుప్రీంకోర్టు గురువారం తదుపరి విచారణ చేపట్టనుంది. (చదవండి: హథ్రస్లో మరో ఘోరం!) సామూహిక అత్యాచారానికి గురై, అత్యంత దారుణ పరిస్థితుల్లో ఢిల్లీ ఆస్పత్రిలో మరణించిన 20 ఏళ్ల దళిత యువతి మృతి కేసులో సీబీఐ మంగళవారం విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫోరెన్సిక్ నిపుణులతో సహా నేరం జరిగిన చోటుకు వెళ్లిన దర్యాప్తు బృందం, బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఆమె తల్లి, సోదరుడిని క్రైంసీన్ వద్దకు తీసుకువెళ్లి వివరాలు సేకరించింది. అనంతరం, అర్ధరాత్రి దాటిన తర్వాత బాధితురాలి మృతదేహాన్ని హడావుడిగా దహనం చేసిన చోటుకు వెళ్లి పరిశీలించింది. ఇక ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సైతం విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ మేరకు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేయడం గమనార్హం.(చదవండి: అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే) కాగా.. ఈ కేసులో ఆది నుంచి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. బాధిత యువతి భౌతిక కాయాన్ని అర్థరాత్రి దహనంచేయడం మానవహక్కుల ఉల్లంఘన అని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాథ్రస్ లాంటి ఘటనల్లో శవ దహనానికి మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. -
సుశాంత్ గంజాయి తాగేవాడు: రియా
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సీబీఐ విచారించడం తనకెంతో సంతోషంగా ఉందని అతడి ప్రేయసి రియా చక్రవర్తి అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. సుశాంత్ మరణం వెనుక గల అసలు కారణాలేమిటో తాను కూడా తెలుసుకోవాలనుకుంటున్నానన్నారు. జూన్ 8న తాను సుశాంత్ ఫ్లాట్ను వీడిన నాటి నుంచి జూన్ 14 వరకు మధ్యకాలంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందని, ఆ సమయంలో సుశాంత్ సోదరి అక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు. కాగా సుశాంత్ మృతి కేసులో సీబీఐ సమన్లు అందకోక మునుపు రియా ప్రముఖ జాతీయ మీడియాకు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు, వదంతుల కారణంగా కుటుంబం ఎంతో వేదన అనుభవిస్తోందని.. అందుకే ఇన్నాళ్ల తర్వాత తాను మౌనం వీడాలనుకుంటున్నట్లు తెలిపారు.(చదవండి: ‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’ ) వివిధ ప్రశ్నలకు రియా స్పందన సుశాంత్ మరణానికి గల కారణం ఏమిటి? రియా: నేను కూడా ఇదే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఈ కేసును సీబీఐ విచారించడం చాలా సంతోషంగా ఉంది. సుశాంత్ ఇంకా ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. మీ ఇన్స్టా పోస్టులో సీబీఐ విచారణ కావాలని అన్నారు కదా. మీకున్న అనుమానాలు ఏమిటి? అసలు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు? నిజానికి నేను వచ్చిన తర్వాత అక్కడ(సుశాంత్ ఫ్లాట్) ఏం జరిగిందో తెలియదు. అది తెలుసుకోవాలనే సీబీఐ విచారణ అడిగాను. ఇంకో విషయం సీబీఐ ఎంటర్ కాకముందు నేను సుప్రీంకోర్టుకు వెళ్లాను. ముంబై పోలీసుల విచారణకు సహకరిస్తున్నా బిహార్ పోలీసులు రావడం నాకు గందరగోళంగా అనిపించింది. ఈ వాట్సాప్ చాట్స్ చూడండి. గౌరవ్ ఆర్యాకు ఇచ్చిన మెసేజ్లో హార్డ్ డ్రగ్స్ తీసుకోలేదు. ఎండీఎంఏ ఒకసారి ట్రై చేశా అన్నారు. మీ దగ్గర ఎండీ(డ్రగ్) ఉందా? శామ్యూల్ మిరండా మీ తమ్ముడు షౌవిక్ దగ్గర స్టఫ్ ఉందా అని అడిగాడు. ఎందుకు? నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. ఈ సంభాషణను ఖండిస్తున్నా. ఇప్పుడేం మాట్లాడినా ఎన్సీబీ(నార్కొటిక్) విచారణపై ప్రభావం పడుతుంది. డ్రగ్ టెస్టుకు నేను సిద్ధంగా ఉన్నా. నిజానికి సుశాంత్కు డ్రగ్స్ తీసుకునేవాడు. అతడు గంజాయి పీల్చేవాడు. తన చుట్టూ ఉన్నవాళ్లను అడిగితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అవునా. సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటాడని మీకెప్పుడు తెలిసింది? నన్ను కలిసే కంటే ముందు నుంచే అతడికి ఈ అలవాటు ఉంది. నాకు తెలిసి కేదార్నాథ్ షూటింగ్ సమయంలో అనుకుంటా అలవాటు చేసుకున్నాడు. మానుకోమని చెప్పడం వరకే నా పాత్ర. ఈ విషయం గురించి సుశాంత్ మేనేజర్ శ్రుతి మోదీతో నేను చాలా సార్లు చర్చించాను. (చదవండి: రియాపై సీబీఐ ప్రశ్నల వర్షం) సుశాంత్ హంతకురాలు మీరరేనని ఆయన తండ్రి అంటున్నారు కదా? ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇదే వాళ్ల చివరి అస్త్రం. సుశాంత్ ఐదుగురు సైక్రియార్టిస్టులను కలిశాడు. నేను అధిక మోతాదులో మెడిసిన్ ఇచ్చాననడం అబద్ధం. తను జనవరిలోనే చికిత్స ఆపేశాడు. ఇక విష ప్రయోగం అనేదాని కంటే మరో చెత్త ఆరోపణ ఏమీలేదు. నిజానికి నేను తనతో థెరపీ సెషన్కు వెళ్లి బయటే కూర్చునేదాన్ని అంతే. మందుల విషయంలో నాకేమీ తెలియదు. సుశాంత్కు, తన తండ్రికి మధ్య బంధం ఎలా ఉండేది? సుశాంత్ వాళ్ల నాన్న తనను వదిలేశాడు. ఐదేళ్లుగా తన తండ్రిని కలవలేదని చెప్పాడు. నిజానికి తనకు వాళ్ల అమ్మ అంటేనే చాలా ఇష్టం. మహేష్ బట్తో మీ వాట్సాప్ చాట్ గురించి? మీ జీవితంలో జరిగే అన్ని విషయాలు ఆయనకు తెలుసా? ‘‘భట్ సాబ్ నాకు తండ్రిలాంటి వారు. యాంగ్జైటీతో నేను బాధపడేదాన్ని. ఏడాది కాలంగా జాగ్రత్తగా కాపాడుకున్న నా బాయ్ఫ్రెండ్ నన్ను ఇంటికి వెళ్లిపొమ్మన్నాడు. తను కూర్గ్ వెళ్లాలనుకున్నాడు. జనవరిలో పవ్నాకు షిఫ్ట్ అవుదామనుకున్నాడు. తన సోదరి మీతూ అక్కడికి వస్తా అన్నారు. ఇంక నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదనుకున్నా. ఒకవేళ వాళ్ల ఫ్యామిలీ తనను చూసుకుంటే నేనెందుకు జోక్యం చేసుకునేదాన్ని. సుశాంత్ను ప్రేమించినందుకు, తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు నా దక్కిన బహుమానం ఈ ఆరోపణలు. నాకు సుశాంత్ ఎన్నడూ డబ్బు ఇవ్వలేదు’’ అని రియా చెప్పుకొచ్చారు. ఇక సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే తనను తాను సుశాంత్ విడోనని చెప్పుకుంటోందని, అతడు ఇచ్చిన డబ్బుతో ఫ్లాట్ కొన్న విషయం ఏమైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. రియా శుక్రవారం సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుశాంత్తో పరిచయం నాటి అతడి ఫ్లాట్ విడిచివెళ్లేంత వరకు జరిగిన పరిణామాల గురించి ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. -
సుశాంత్ ఇంటి ముందు ఆ ‘మిస్టరీ గర్ల్’ ఎవరంటే!
ముంబై: ‘‘అక్కడ ఉంది నేనో, మరెవరో కాదు! ఏ విషయాన్నైనా ప్రచారం చేసే ముందు ఒకసారి నిజ నిర్ధారణ చేసుకోవాలి.. తను అతడి పీఆర్ పర్సన్ రాధికా నిహలానీ, తనతో పాటు అక్కడ ఉంది ఆమె అసిస్టెంట్. చాలు చాలు! ఇకనైనా నకిలీ వార్తలను కట్టిపెట్టండి! నేను మౌనంగా ఉన్నానంటే.. నా గురించి అబద్దాలు ప్రచారం చేసి నాపై ద్వేషం పెంచే హక్కు మీకు ఇచ్చినట్లు కాదు’’ అంటూ బాలీవుడ్ సింగర్, నటి షిబానీ దండేకర్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. సంబంధం లేని విషయాలతో తన పేరు ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు. ఇంతకీ విషయమేమిటంటే... బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘విష ప్రయోగం వల్లే సుశాంత్ మృతి’) ఈ క్రమంలో అతడి మరణానికి ముందుకు జరిగిన పరిణామాలపై నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ టాలెండెడ్ యాక్టర్ది హత్యేనంటూ అతడి ఫ్యాన్స్ చేస్తున్న వాదనలకు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతి చెందడానికి ముందు రోజు ఓ మహిళ.. అతడి అపార్డుమెంటు ముందు పనిమనిషితో మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ ‘మిస్టరీ గర్ల్’ ఎవరన్న విషయం చర్చకు దారితీసింది. సదరు మహిళ ముఖానికి మాస్కు ధరించి వెనక్కి తిరిగి ఉండటంతో ఆమె గురించి కనుక్కోవడం నెటిజన్లకు కష్టంగా మరింది. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియా.. తను షిబానీ అని పేర్కొంటూ కథనం ప్రసారం చేసినట్లు సమాచారం. (చదవండి: సుశాంత్ ఫ్లాట్లో డమ్మీ టెస్ట్ నిర్వహించిన సీబీఐ) ఇక ఈ విషయంపై ఘాటుగా స్పందించిన షిబానీ.. ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని, ఆ అమ్మాయి సుశాంత్ పీఆర్ పర్సన్ అని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయంపై రాధికా నిహలానీ ఎలా స్పందిస్తారో చూడాలి! కాగా సుశాంత్ మృతి కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. This is NOT me nor is it Simone! Please fact check before you speculate .. this is his PR person Radhika Nihalani @radhikahuja and her assistant. Stop with the fake news! Enough! My silence doesn’t give you the right to continue spreading lies and hate https://t.co/AyVeelxuel — shibani dandekar (@shibanidandekar) August 23, 2020 -
‘కరోనా రిపోర్టు రాకముందే పోస్ట్మార్టం ఎందుకు?’
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురి విచారించిన సీబీఐ అధికారులు సుశాంత్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన డాక్టర్లను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వారు సంతృప్తికర సమాధానాలు చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా జూన్ 14న సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం అతడి భౌతిక కాయాన్ని డా. ఆర్ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఐదుగురు వైద్యుల బృందం అదే రోజు అర్ధరాత్రి హడావుడిగా పోస్ట్మార్టం నిర్వహించినట్లు వార్తలు వెలువడ్డాయి.(‘ఆ రోజు సుశాంత్ బెడ్రూం తాళం నేనే పగలగొట్టాను’) ఈ నేపథ్యంలో విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఇందుకు గల కారణాల గురించి వైద్యులను ప్రశ్నించారు. అప్పటికే ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో ముందుగా కోవిడ్ పరీక్ష నిర్వహించినప్పటికీ.. ఆ రిపోర్టు రాకముందే పోస్ట్మార్టం ఎలా చేశారని వైద్యులను అడిగారు. అయితే అందులో ఓ డాక్టర్ ముంబై పోలీసులు ఆదేశాల మేరకు అర్ధరాత్రి దాటిన తర్వాత తాము పని పూర్తి చేశామని చెప్పగా.. కోవిడ్ ఫలితం వెల్లడికాక ముందు పోస్ట్మార్టం నిర్వహించకూడదని ఏ ప్రొవిజన్లోనూ లేదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. (సహ జీవనం.. జూన్ 8 వరకు తనతోనే: రియా) కాగా కూపర్ ఆస్పత్రి వైద్యులు సుశాంత్ది ఆత్మహత్యగానే ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే అవయవాల్లో విషపూరితాలు ఉన్నాయో లేదో పరీక్షించేందుకు నటుడి అవయవాలను అనంతరం జేజే ఆసుపత్రికి తరలించారు. ఇక సుశాంత్ది హత్యేనంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అతడి తండ్రి కేకే సింగ్ అనుమతితో బిహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోరగా.. సుప్రీంకోర్టు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తి ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. -
నా భర్తని హత్య చేశారు: ఎమ్మెల్యే భార్య
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ ఆత్మహత్యపై ఆయన సతీమణి కోల్కత్తా హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త మృతిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ పథకం ప్రకారం జరిగిన హత్య అని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ కక్షలతోనే ఎమ్మెల్యేను హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కోల్కత్తా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆమె తరుఫు న్యాయవాది బ్రిజేష్ ఝూ తెలిపారు. కాగా ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. (ఎమ్మెల్యే రాయ్ మృతికి ఉరే కారణం) ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని బిందాల్ గ్రామంలో తన నివాసానికి సమీపంలోని మార్కెట్లో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపుతున్నారు. అయితే ఎమ్మెల్యే జేబులో లభించిన లేఖ ఆధారంగా ఆయనది ఆత్మహత్యగానే భావిస్తున్నారు. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులే ఆయన్ని హత్య చేశారంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. ఆయన మృతికి ఉరే కారణమనీ, శరీరంపై ఎటువంటి ఇతర గాయాలు లేవని మంగళవారం పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. (బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మ‘హత్య’) -
చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి
సాక్షి, విశాఖపట్నం: గడచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్తోపాటు దాదాపు మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తే రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు వెలుగు చూశాయన్నారు. మాజీ పీఎస్ శ్రీనివాస్ తప్పు లేదన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ముంబైలో 2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలో తనిఖీలు చేయగా.. అప్పటి ఏపీ మంత్రులు ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్లు వెల్లడైందన్నారు. ఈ ప్రముఖ సంస్థల్లో ఒకటి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడికి చెందినది కాగా.. మరో రెండు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, లోకేశ్ పార్టనర్ రాజేశ్కు చెందినవని చెప్పారు. లూసిడ్ డయోగ్నస్టిక్స్ ఏర్పాటు అభినందనీయం విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని రానున్న తరుణంలో మంచి వైద్య సేవలందించాలనే లక్ష్యంతో లూసిడ్ డయోగ్నస్టిక్స్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకు వస్తున్నామని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. -
రాయపాటి కేసులో సీబీఐ ఆరా
-
బంగారు చీర కానుకపై సీబీఐ ఆరా!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆర్థిక లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ సంస్థ ఖాతాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇతర ఖాతాలకు నిధులు మళ్లించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2013 నుంచి 2015 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నమయ్యారు. ఎంత డబ్బు రుణాల రూపంలో వచ్చింది.. వాటిని ఎలా ఖర్చు పెట్టారు? ఏయే ఖాతాలకు ఎంతెంత మళ్లించారు? అలా మళ్లించిన వాటిలో విదేశీ ఖాతాలు కూడా ఉన్నాయా? తదితర విషయాల గురించి ఆరా తీస్తున్నారని సమాచారం. ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇలాంటి సంస్థకు పోలవరం పనులు కట్టబెట్టడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. 2015లో ఖాతాను స్తంభింపజేసినా.. ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని, 2015లోనే బ్యాంకుల కన్సార్షియం సదరు సంస్థ ఖాతాను ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ – నిరర్థక ఖాతా)గా ప్రకటించింది. దీంతో ఇతర ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణ లున్నాయి. దేశీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. ఇతర ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లించారని సీబీఐ అనుమానిస్తోంది. రూ.264 కోట్ల నిధుల మళ్లింపుపై యూనియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న క్రమంలో ఈ విషయాలన్నీ వెలుగు చూస్తున్నట్లు తెలిసింది. అంత బంగారం ఎక్కడిది.? ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ పలుమార్లు ఇచ్చిన విరాళాలపైనా సీబీఐ దృష్టి సారించినట్లు సమాచారం. 2012 నవంబర్ 17న తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన బంగారు చీరను కానుకగా సమర్పించారు. ఆ బంగారు చీర తయారీకి ఎనిమిది కిలోల బంగారం (8086.97 గ్రాములు), 879.438 గ్రాముల వజ్రాలు, పగడాలు ఉపయోగించడం గమనార్హం. 2013 డిసెంబర్ 5న తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.3.42 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ నిధులు వారికి ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. కాగా, 2013కు ముందు ఈ సంస్థ ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులు, బ్యాలెన్స్ షీట్లను కూడా పరిశీలించనున్నారని సమాచారం. -
‘ట్రాన్స్ట్రాయ్’ కేసులో.. తవ్వుతున్న సీబీఐ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డైరెక్టర్, ప్రమోటర్ చైర్మన్గా ఉన్న ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ రుణాల ఎగవేత కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కంపెనీకి రుణాల జాబితా పెద్దమొత్తంలోనే ఉంది. తాజాగా రూ. 264 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతపై సోమవారం సీబీఐ కేసు నమోదు చేసిన దరిమిలా..కంపెనీకి చెందిన పలు ఆర్థిక లావాదేవీలు వెలుగుచూస్తున్నాయి. 2013లో భారీగా రుణాలు పొందిన ట్రాన్స్టాయ్ తరువాతకాలంలో వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో ప్రస్తుత బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. 14 జాతీయ బ్యాంకుల వద్ద..: తాము పలు ఇరిగేషన్, రోడ్లు, మెట్రో, మెట్రో అండ్ రైల్వేస్, ఆయిల్ గ్యాస్ల ప్రాజెక్టులు చేపడతామని ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ చెబుతోంది. వాస్తవానికి ఇంతవరకూ ఈ కంపెనీ కేవలం రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులను విజయవంతంగానే పూర్తి చేసింది. మిగిలిన రంగాల్లో ఇంతవరకూ ఎలాంటి పనులు చేపట్టలేకపోయింది. ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో కుమరంభీమ్ ప్రాజెక్టు, అనంతపురంలోని చాగల్లు బ్యారేజ్లను పూర్తి చేసింది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్ ఫేస్–1 పనులను, మధ్యప్రదేశ్లో రెండు భారీ, తమిళనాడులో ఓ భారీ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసింది. 2013 ప్రారంభంలో ట్రాన్స్ట్రాయ్ తాను దక్కించుకున్న రూ.4,717 కోట్ల విలువైన పోలవరం హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ పనులతోపాటు, ఇతర అభివృద్ధి పనులు చూపి 14 బ్యాంకుల కన్సార్షియం వద్ద వివిధ దశల్లో రూ.8,800 వరకు రుణాలు పొందింది. ఈ 14 జాతీయ బ్యాంకుల్లో రూ.990 కోట్లు వరకు అప్పిచ్చిన కెనరా బ్యాంకు లీడ్ బ్యాంకుగా ఉంది. తమ నుంచి నిధులను రుణాలుగా పొందినా తిరిగి చెల్లించడంలో ట్రాన్స్టాయ్ జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ 2015 నుంచే బ్యాంకుల కన్సార్షియం రుణాల రికవరీకి ప్రయత్నాలు ప్రారంభించాయి. అదే మే నెలలో ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ ఖాతాను ఎన్పీఏ (నిరర్ధకఖాతా)గా ప్రకటించాయి. ఇక 018 లోనే నేషనల్ కంపనీస్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను కెనరాబ్యాంకు ఆశ్రయించింది. తాజా గా తమ నుంచి తీసుకున్న రుణాల్లో రూ.264 కోట్లను వేరే ఖాతాలకు మళ్లించారన్న యూనియన్బ్యాంకు ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా.. ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ పలుమార్లు తానిచ్చిన విరాళాలతో మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2012 నవంబరు 17న తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన వజ్రాలు, పగడాలు పొదిగిన బంగారు చీరను కానుకగా సమర్పించారు. అప్పట్లో ఇది బాగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2013 డిసెంబరు 5న తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు 3.42 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. -
ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం
సాక్షి, గుంటూరు: పన్నెండు ఏళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు శనివారం ఆమె మృతదేహానికి రీ పోస్ట్మార్టం నిర్వహించారు. సీబీఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య నేతృత్వంలో అధికారులు గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని ముస్లింల శ్మశాన వాటికలో ఉన్న ఆయేషా సమాధిని తవ్వి, మృతదేహాన్ని వెలికితీశారు. ఆయేషా తండ్రి సయ్యద్ ఇక్బాల్బాషా, మత పెద్దలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో సీబీఐ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం సభ్యులు శవ పరీక్ష నిర్వహించారు. ఉదయం 8.51 గంటలకు సమాధి వద్దకు చేరుకున్న అధికారులు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు పరీక్షలు జరిపారు. సమాధి నుంచి ఎముకలు, ఇతర అవశేషాలను సేకరించారు. వాటితో అస్థిపంజర నిర్మాణం చేసి, అణువణువునూ క్షుణ్నంగా పరిశీలించారు. కేసు దర్యాప్తునకు అవసరమవుతాయన్న భావనతో ఆయేషా మృతదేహం కింది దవడ ఎముక, ఉరోస్థి(స్టెర్నమ్), మోచేతి పైఎముక(హుమెరస్), పుర్రె ఎముకలను సేకరించి సీల్డు కవర్లు, బాక్సుల్లో భద్రపరచి, పరీక్షల కోసం హైదరాబాద్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి(సీఎఫ్ఎస్ఎల్) తరలించారు. రీ పోస్ట్మార్టానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించకుండానే అధికారులు వెళ్లిపోయారు. రీ పోస్ట్మార్టం సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. త్వరలో దోషుల గుర్తింపు? ఆయేషా హత్య కేసులో అసలు దోషులను సీబీఐ అధికారులు త్వరలో గుర్తిస్తారని సీనియర్ న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ చెప్పారు. ఏడాది క్రితం కేసు నమోదు చేసిన సీబీఐ ఇప్పటికే పలువురు సాక్షులను విచారించిందని, అంతేకాక న్యాయస్థానంలో కేసును నిరూపించేందుకు అవసరమైన శాస్త్రీయ ఆధారాలన్నింటినీ సేకరిస్తోందని తెలిపారు. అసలు దోషులను గుర్తించడంలో రీ పోస్ట్మార్టం నివేదిక కీలకం కానుందన్నారు. దర్యాప్తులో ఆ ఎముకలు కీలకం? ఆయేషా హత్య కేసు దర్యాప్తులో వైద్య/ఫోరెన్సిక్ నిపుణుల బృందం సేకరించిన ఎముకలు కీలకం కానున్నాయని తెలుస్తోంది. ఆయేషా మృతదేహానికి సంబంధించి పోస్ట్మార్టం నివేదిక తప్పుల తడకగా ఉందని, మెడ కింది భాగం, శరీరంపై అనేక గాయాలున్నాయని, వాటిని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడించలేదని, అంతేకాక డీఎన్ఏ రిపోర్టు సైతం లోపభూయిష్టమంటూ ఆమె తల్లిదండ్రులు, వారి తరఫు న్యాయవాది ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయేషా తలను తలుపుకేసి మోదడమే కాకుండా కర్ర, ఇతర ఆయుధాలతోనూ దాడి చేశారని వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఛాతీ ప్రాంతంలో ఉండే ఉరోస్థి, చేతికి సంబంధించిన హుమెరస్, పుర్రె, దవడ ఎముకలను నిపుణులు సేకరించారు. వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షించి నివేదిక రూపొందించనున్నారు. రీ పోస్ట్మార్టం నివేదికలో ఈ ఎముకలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికైనా న్యాయం జరగాలి మా మత ఆచారాలను పక్కనపెట్టి మరీ రీ పోస్ట్మార్టానికి ఒప్పుకున్నాం. 12 ఏళ్లుగా మా పోరాటం కొనసాగిస్తున్నాం. గతంలో ‘సిట్’ దర్యాప్తు దాదాపు ఏడాది పాటు జరిగినా న్యాయం జరగలేదు. ఇప్పటికైనా సీబీఐ దర్యాప్తుతో మాకు న్యాయం జరగాలి. అసలు దోషులను శిక్షించాలని కోరుతున్నాం. – శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా, ఆయేషా మీరా తల్లిదండ్రులు -
‘ఈఎస్ఐ’ కుంభకోణంపై దర్యాప్తు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈఎస్ఐ మందుల కుంభకోణంపై దర్యాప్తు చేస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించింది. కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, వరంగల్లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన ‘జనజాగరణ సభ’లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుకు దేశవ్యాప్తంగా ప్రజామోదం లభించిందన్నారు. కశ్మీర్తో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. -
విశాఖ భూ స్కాంపై పునర్విచారణ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణంలో అక్రమాలను వెలికితీయ డంతోపాటు దోషులను నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు సర్కారు హయాంలో విశాఖపట్నం జిల్లాలో భూ రికార్డుల మాయం.. ట్యాంపరింగ్ ద్వారా లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయన్న విషయం తెలిసిందే. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక రాజధాని అయిన విశాఖలో జరిగిన ఈ భారీ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని అన్ని రాజకీయ పక్షాలు అప్పట్లో డిమాండు చేశాయి. ఈ స్కామ్లో పాత్రధారులు, సూత్రధారులు అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలేనని మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. అధికార పార్టీలోని ఒక మంత్రి కూడా ఇదే విధమైన ఆరోపణలు బహిరంగంగానే చేశారు. నాటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్పై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలొచ్చాయి. దీంతో సీబీఐకి కేసును అప్పగిస్తే ప్రభుత్వ పెద్దల బండారం బయటపడుతుందనే భయంతో విశాఖ పోలీస్ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపిస్తున్నట్లు చంద్రబాబు హడావుడిగా ప్రకటించారు. అప్పటి రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన కేఈ కృష్ణమూర్తి విశాఖ వెళ్లి ఈ కుంభకోణానికి సంబంధించిన ఫిర్యాదులను వ్యక్తిగతంగా స్వీకరిస్తామని కూడా ప్రకటించారు. కానీ, ఆ మర్నాడే ఆయన పర్యటన వాయిదా పడేలా చంద్రబాబు ‘సిట్’ ప్రకటించారు. దీంతో ‘సిట్’ గురించి తనకు తెలీదని కేఈ స్వయంగా ప్రకటించడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. మరోవైపు.. 2014లో సంభవించిన హుద్హూద్ తుపానులో రికార్డులు కొట్టుకుపోయాయంటూ కేసును నీరుగార్చేందుకు అప్పటి సర్కారు పెద్దలు యత్నించి అభాసుపాలయ్యారు. అయితే, తుపాను 2014లో సంభవిస్తే 2017 వరకూ రికార్డులు కొట్టుకుపోయినట్లు గుర్తించలేదా? అన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం కరువైంది. నాడు ‘సిట్’కు పరిమితులు ఇదిలా ఉంటే.. ‘సిట్’ దర్యాప్తులో నిజాలు వెలుగుచూడకుండా అప్పటి ప్రభుత్వం అనేక పరిమితులు విధించింది. జిల్లా మొత్తానికి సంబంధించిన ఈ స్కామ్పై దర్యాప్తును కేవలం రెండు మూడు మండలాలకే పరిమితం చేసింది. అలాగే, ఈ బాగోతాన్ని పక్కదోవ పట్టించేందుకు 2004 నాటి నిరభ్యంతర పత్రాలనూ ‘సిట్’ పరిధిలోకి తెచ్చింది. కాగా, సీఎం కుటుంబంతోపాటు మంత్రులపై అభియోగాలున్నందున రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులతో దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు బయటకు రావని, సీబీఐతోనే దర్యాప్తు జరిపించాలని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్తోపాటు బీజేపీ, సీపీఐ, సీపీఎం.. ప్రజా సంఘాలు డిమాండు చేశాయి. అలాగే, అసైన్డ్ భూములను కొనుగోలు చేసి విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా)కు భూ సమీకరణ కింద ఇచ్చి వందల కోట్ల విలువైన భూమిని అప్పట్లో ఒక టీడీపీ నేత కొట్టేశారని కూడా ఆధారాలతో సహా వార్తలొచ్చాయి. వీటన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా.. మధురవాడలోని 178, కొమ్మాదిలోని 92 ఎకరాలకు సంబంధించిన 25 రికార్డులు మాత్రమే టాంపరింగ్ అయినట్లు ‘సిట్’ అధికారులు ప్రకటించి తూతూమంత్రంగా నివేదికను సమర్పించారు. దీనిని కేబినెట్ ఆమోదించినట్లు చంద్రబాబు వెల్లడించినప్పటికీ ఆ నివేదికను మాత్రం బహిర్గతం చేయలేదు. పక్కా ఆధారాలతోనే పునర్విచారణ ఈ నేపథ్యంలో.. భీమిలీ, మధురవాడ తదితర ప్రాంతాల్లో అత్యంత విలువైన భూముల రికార్డులను తారుమారు చేసి సొంతం చేసుకున్నట్లు ఒక మంత్రితోపాటు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై పక్కా ఆధారాలున్నా వారి పేర్లు దోషుల జాబితాలో లేకుండా తప్పించినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. అందువల్ల ఈ బాగోతంపై మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్న సదుద్దేశంతో నిజాయితీ గల ఐఏఎస్, లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో దీనిని జరిపించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
ఉన్నావ్ రోడ్డు ప్రమాదం కేసులో పురోగతి
సాక్షి: ఉన్నావ్ రేప్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన కేసులో ట్రక్ డ్రైవరు ఆశిష్ కుమార్ పాల్, క్లీనర్ మోహన్లకు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీని విధించింది. ట్రక్ యజమానిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే శనివారం ఉదయం ఈ కేసులో కీలక విషయం తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనం నెంబర్ కనబడకుండా గ్రీస్ పూసారని తెలిసింది. ప్రమాదం జరిగిన రోజు ఉదయం గం. 05.20లకు ఘటనా స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని టోల్ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో ట్రక్కు నంబర్ ప్లేట్పై ఎలాంటి మచ్చలు, మరకలు గానీ లేని విషయం బయటపడింది. దీంతో ఈ ప్రమాదం కావాలనే చేశారనే వాదనకు బలం చేకూరినట్టైంది. ఈ విషయం వాహన యజమానిని ప్రశ్నించగా, ఈఎమ్ఐలు కట్టకుండా తప్పించుకోవడానికి తరచూ అలా చేస్తుంటామని చెప్పడం గమనార్హం. ఈ కేసులో 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. -
గుంటూరులో మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
-
ఎవరిని కాపాడాలనుకుంటున్నారు?
సాక్షి, హైదరాబాద్ : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగలు, పింక్ డైమండ్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినుతల శశిధర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్పై తీవ్రంగా మండిపడ్డారు. రమణకుమార్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారని, తన హయంలో ఆరోపణలు వస్తే ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. రమణకుమార్ మీడియా ప్రకటనను చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పకుండా రిటైర్డ్ అధికారులతో ఎందుకు మట్లాడిస్తున్నారని నిలదీశారు. ఎవరో చెప్పిన మాటలు విని నివేదికలు తయారు చేసే అధికారులు టీటీడీలో ఉన్నారా ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయాలు బయటకి వస్తాయని శశిధర్ అన్నారు. -
చిదంబరంను ప్రశ్నించనున్న సీబీఐ?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బడ్జెట్ రెండో దశ సమావేశాలు, కాంగ్రెస్ ప్లీనరీ నేపథ్యంలో ఐఎన్ఎక్స్ మీడియా అవీనితి కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరంను సీబీఐ ప్రశ్నించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో ఆయన కొడుకు కార్తీ అరెస్టయిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు ‘నీరవ్ మోదీ..’ అని నినాదాలు చేస్తే తాము ‘చిదంబరం..’ అని నినదిస్తామని కొందరు బీజేపీ ఎంపీలు బహిరంగంగానే ప్రకటించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం ద్వారా తమ ప్రతిష్టకు జరిగిన నష్టాన్ని కొంతవరకైనా భర్తీ చేసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. -
రామాగౌడ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలి
బెల్లంపల్లి : నెన్నెలకు చెందిన రామాగౌడ్ ఆత్మహత్యపై ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సబ్కలెక్టర్ రాహుల్రాజ్కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ తప్పుడు అట్రాసిటీ కేసుపై రామాగౌడ్ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తెలిపారు. రామాగౌడ్ ఆత్మహత్యకు నెన్నెల కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, పల్లె మహేష్, ఎంపీపీ భర్త భీమాగౌడ్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎమ్మెల్యే చిన్నయ్య కారకులని అన్నారు. రామాగౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మృతికి కారకులను కఠినంగా శిక్షించాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో జి.మల్లేష్, సిహెచ్.నర్సయ్య, యం.మల్లేష్, టి.మల్లేష్, పి.సుభద్ర, ఎస్.సంజీవ్రెడ్డి, కె.ఏమాజీ, రాజేశ్ తదితరులున్నారు. -
‘ఇందు’ కే రామోజీ చిందులు
జగన్కు బెయిలు రావటంతో ‘ఈనాడు’ రోజుకో కథనం ఆఖరికి బాబు అర్థంలేని సందేహాలనే పేర్చి బ్యానర్ స్టోరీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై సీబీఐ దర్యాప్తును రెండేళ్లకు పైగా డ్రైవర్ సీట్లో కూర్చుని నడిపించిన రామోజీ రావుకు దర్యాప్తు ముగియటం ఏమాత్రం మింగుడు పడటం లేదు. సుప్రీంకోర్టు గడువుతో... కోర్టు ధిక్కరణ భయంతో... సీబీఐ దర్యాప్తును ముగించగా... దానివల్ల జగన్కు బెయిలు రావటం ఎల్లో ముఠాధిపతికి అస్సలు గిట్టడం లేదు. అందుకే కోర్టు విచారణకు సైతం స్వీకరించని చార్జిషీట్ల పేరు చెబుతూ... వారం రోజులుగా జగన్ను టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. ఆఖరికి తన సియామీ కవల చంద్రబాబు వ్యక్తం చేసిన అర్థంలేని సందేహాలతో బుధ, గురువారాల్లో పతాక కథనాల్ని కూడా వండేశారు. బహుశా... ఇలా ప్రతిరోజూ ఒక కథనానికి కారణం నిద్రలేని రాత్రులు మొదలుకావటమేనేమో!! ఇందుకు భూ విందు అంటూ... బుధవారం అడ్డగోలు రాతలు అయినా విచారణకు స్వీకరించని చార్జిషీటు రామోజీకెలా వచ్చింది? అవి ఎకరా రూ. 20 వేలు కూడా విలువ చేయని భూములు అలాంటి వాటికి ఎకరాకు రూ. 1.75 లక్షల ధర నిర్ణయం అనంతపురంలో పరిశ్రమలు రావాలన్నదే వైఎస్ ఆలోచన 2006లో సైన్స్ సిటీ కోసం ఏపీఐఐసీ భూ సేకరణ ప్రకటన నీరు లేక అది వెనక్కెళ్లటంతో సేకరణ నిలిపివేత ఆ తరవాత ఏ పరిశ్రమా రాలేదు; ముందుకొచ్చిన లేపాక్షి సోమశిల నుంచి నీటి కేటాయింపు; దాన్ని తేవడానికే భారీ ఖర్చు అవన్నీ పరిగణనలోకి తీసుకుని రుణం మంజూరు చేసిన బ్యాంకు ప్రభుత్వ రేటు వేరు; బ్యాంకు రేటు వేరంటూ 2002లో నిబంధన ఆ నిబంధన తెచ్చింది చంద్రబాబు; దాని ప్రకారమే కేటాయింపులు అప్పటి నిబంధనల ప్రకారమే ఇందూకు రుణమిచ్చిన బ్యాంకులు దాన్ని విక్రయ విలువగా కట్టేసి... 1,207 కోట్ల లాభమంటూ పిచ్చి రాతలు హైదరాబాద్ నడిబొడ్డున ఐఎంజీకి 850 ఎకరాలు కేటాయించిన బాబు ఎకరా కేవలం రూ. 50 వేలకు; భళా అంటూ సమర్థించిన రామోజీ జీఎంఆర్కు 2,000 ఎకరాలు చాలన్నా... 5,500 ఎకరాల కేటాయింపు లండన్ హీత్రూ విమానాశ్రయం కూడా 3,000 ఎకరాల్లోనే బాబు ఏది చేసినా రైటనే తీరులో ఈనాడు తందాన తాన కోర్టులు ఆదేశాలిచ్చినా ఆయనవైపు చూడనే చూడని సీబీఐ ఎకరా ఇరవై వేలు చెప్పినా కొనటానికి ముందుకు రాని భూములవి. భూగర్భ జలాల జాడ క నపడదు. వర్షం ఊసే ఉండదు. అప్పులు తెచ్చి పంట పెడితే రైతుకు మిగిలేది అప్పు మాత్రమే. అలాంటి వెనకబడిన జిల్లాలో... ఎడారిని తలపించే భూముల్లో... ఓ పారిశ్రామిక పార్క్ పెడితే పెద్ద ఎత్తున పరిశ్రమలొస్తాయని భావించారు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అలాంటి ప్రయత్నం ఏ చంద్రబాబు నాయుడో చేస్తే... ఎల్లో మీడియాకు పూనకం వచ్చేసుండేది. ఇక ఆ జిల్లా సింగపూర్లా మారిపోతుందంటూ అమెరికా ఫొటోలు వేసి మరీ కథనాలు వార్చేసేది. ఆ కంపెనీ ప్రతినిధులు పచ్చి దొంగలైనా సరే... ఇంద్రులు- చంద్రులంటూ పొగిడేసేది. కానీ అలాంటి ప్రయత్నం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేయటం దానికి ససేమిరా గిట్టలేదు. అందుకే... అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ను ఆది నుంచీ అది అడ్డుకుంటూనే వస్తోంది. ఇందూ ప్రాజెక్ట్స్ నుంచి గానీ, దాని అధిపతి శ్యాంప్రసాద్రెడ్డి నుంచి గానీ జగన్మోహన్రెడ్డి సంస్థల్లోకి రూపాయి పెట్టుబడి రాకున్నా... దాన్నీ ‘క్విడ్ ప్రో కో’ గాటన కట్టేసింది. ఎల్లో మీడియా కనుసన్నల్లో సాగిన దర్యాప్తులో సీబీఐ కూడా తందాన తాన అనేసింది. అది వేసిన చార్జిషీటంటూ... మళ్లీ అదే ఎల్లో కథనాన్ని బుధవారం వండి వార్చింది ఈనాడు. ‘లేపాక్షి పేరుతో ఇందూకు భూ విందు’ పేరిట బుధవారం పతాక శీర్షికలో ప్రచురించిన కథనంలో నిజానిజాలేంటి? ఇందూ ప్రాజెక్ట్స్ నిజంగానే జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిందా? అక్కడ భూముల విలువ నిజంగా ఎంత? బ్యాంకులు ఎందుకు ఎకరాకు రూ.15 లక్షల రుణమిచ్చాయి? ఇలా రుణం తీసుకోవటం తప్పా? ఇవన్నీ వివరించేదే ఈ ‘ఏది నిజం?’ అనంతపురం - బెంగళూరు మధ్య దూరం 240 కిలోమీటర్లు. దీనికి నడిమధ్యలో... అంటే అటు అనంతపురానికి, ఇటు బెంగళూరుకు దేనికైనా 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిలమత్తూరు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చూసినా 100 కిలోమీటర్ల దూరం. గోరంట్ల, చిలమత్తూరు మండలాలు రెండూ చిత్రావతి నది పరివాహక ప్రాంతం పరిధిలోనివే. కాకుంటే 1996లో రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కర్ణాటక ప్రభుత్వం చిత్రావతిపై పరగోడు వద్ద ఓ బ్యారేజీని నిర్మించింది. దాంతో నది ఎండిపోయింది. భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లదీ అదే పరిస్థితి. వాటిపై ఆధారపడి సాగుచేస్తున్న భూములూ బీడువారాయి. పంటలు లేక, భూగర్భ జలాలూ లేక అల్లాడుతున్న ఆ గ్రామాల్లో పరిశ్రమలొస్తే జిల్లా రాత మారుతుందని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భావించింది. 2006లో సైన్స్ సిటీకి పచ్చజెండా ఊపింది. ఏపీఐఐసీ భూ సేకరణ ప్రకటనలిచ్చింది. కానీ నీటివసతి లేకపోవటంతో అక్కడ తమకు అవసరం లేదంటూ సైన్స్ సిటీ యాజమాన్యం వెనక్కెళ్లిపోయింది. దీంతో ఏపీఐఐసీ ఇతర పరిశ్రమల్ని ఆహ్వానించింది. ఎవ్వరూ ముందుకు రాలేదు. భూ సేకరణ నిలిపేసింది. ఆ తరవాత ముందుకొచ్చింది లేపాక్షి సంస్థ. ఆ సంస్థ ఇచ్చిన నిధులతోనే భూసేకరణ చేసింది ఏపీఐఐసీ. అదీ... లేపాక్షి భూముల అసలు కథ. 100 కిలోమీటర్లంటే సమీపమా? ఇంకా విచారణకు స్వీకరించని చార్జిషీటును ఉటంకిస్తూ ‘ఈనాడు’ తన కథనంలో రాసిన అతిశయోక్తులు, అసత్యాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది... ఈ భూములు బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్నాయని రాసేయటం. అసలు 100 కిలోమీటర్ల దూరాన్ని ‘సమీపంలో’ అని రాయటం ఏటైపు జర్నలిజం? విశాఖపట్నానికి, శ్రీకాకుళానికి మధ్య దూరమెంత? 100 కిలోమీటర్లు కాదా? దానర్థం విశాఖపట్నానికి శ్రీకాకుళం సమీపంలో ఉన్నట్లేనా? మధ్యలో ఒక జిల్లా కూడా ఉందే!!! అయినా నిందితుడికి కూడా అందని చార్జిషీటు ‘ఈనాడు’కెలా వచ్చింది? సీబీఐతో ఉన్న బంధం వల్లా? ధర ఎన్నడైనా రూ.70 వేలు మించిందా? లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూమి కేటాయించేదాకా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో భూమి ఎన్నడూ ఎకరా రూ.65-70 వేలు మించలేదు. దీనికి ఆధారం 2008లో ఆయా మండలాల్లో జరిగిన లావాదేవీలే. ఈ లావాదేవీల ప్రకారం 2008లో అక్కడ భూ విలువలు సర్వే నంబర్లను బట్టి రూ.20,000 నుంచి రూ.50,000 వరకు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం లేపాక్షికి ఎకరాకు రూ.1.75 లక్షల ధరను నిర్ణయించింది. 8 వేల ఎకరాల కోసం భూసేకరణ పూర్తికాక ముందే రూ.119 కోట్లను మూడు విడతలుగా ఏపీఐఐసీకి చెల్లించింది లేపాక్షి సంస్థ. ఆ నిధులతోనే భూసేకరణ చేసింది ఏపీఐఐసీ. ‘ఈనాడు’ మాత్రం అవాస్తవాలతో చెలరేగిపోయింది. 2006లో ఏపీఐఐసీ భూసేకరణ ప్రకటనలిచ్చిందని, దీనికి వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు రావటంతో నిలిపేసిందని రాశారు రామోజీ. నిజానికి సైన్స్ సిటీ ప్రతిపాదన, అది వెనక్కెళ్లిపోవటం ‘ఈనాడు’కు తెలియనివేమీ కావు. కానీ 2006 నుంచే లేపాక్షి కోసం భూములు సేకరించారని చెప్పే కుట్రలో ఇదో భాగం. అంతే!! ఇవన్నీ తలతిక్క లెక్కలు కాదా? రామోజీ, సీబీఐ లెక్కలు ఎంత తలతిక్కవో ఇది చూస్తే తేలిగ్గానే అర్థమవుతుంది. ఎకరాను రూ. 1.75 లక్షలకు కొనుక్కున్న లేపాక్షి సంస్థ... దాన్లో 4,650 ఎకరాలను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రూ.830 కోట్లను రుణంగా తెచ్చుకుందని, ఈ లెక్కన మొత్తం భూమి విలువ రూ.1,326 కోట్లని, దాన్లో ప్రభుత్వానికి చెల్లించిన 119 కోట్లను మినహాయిస్తే లేపాక్షి సంస్థకు రూ.1,207 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లని సీబీఐ పేర్కొందంటూ రామోజీ రాసి పారేశారు. అసలు రుణానికి, అమ్మకానికి తేడా లేదా రామోజీ? ఆ సంస్థ భూముల్ని తనఖా పెట్టి రుణం తెచ్చుకుంటే... ఆ విలువను మొత్తం భూములకు వర్తింపజేసి... లెక్కగట్టేసి... ఆ లెక్కన చూస్తే దానికి 1,207 కోట్లు లాభమనటం ఏ స్థాయి పైత్యం? ఆ సంస్థేమైనా ఆ భూముల్ని ఎకరా రూ.15 లక్షల చొప్పున విక్రయించిందా? అప్పుడు కదా దానికి లాభం వచ్చిందని చెప్పగలిగేది? రుణం తీసుకుంటే ఆ రుణం చెల్లించొద్దా? అందరూ రామోజీ మాదిరి రుణాలు ఎగ్గొట్టి కోర్టుల చుట్టూ తిప్పించేవారే ఉంటారా? అసలు ఫిలిం సిటీలో ఎకరా రూ.లక్ష చొప్పున కొని దాన్ని బ్యాంకుల వద్ద తనఖా పెట్టినపుడు ఎకరాకు రూ.లక్ష చొప్పునే రుణం తీసుకున్నారా? మరి అన్ని వేల కోట్ల అప్పులు ఎలా పుట్టాయి రామోజీ? బాబు హయాంలోనే ఆ నిబంధనలు... లేపాక్షి భూముల విషయానికొస్తే అవన్నీ ఎడారి భూములు. అక్కడ ఏ పరిశ్రమ లేదా ప్రాజెక్టు రావాలన్నా నీరు తప్పనిసరి. అందుకే సోమశిల నుంచి దీనికి ప్రభుత్వం నీరు కేటాయించింది. ఆ నీటిని తీసుకురావటానికి కడప జిల్లా నుంచి లేపాక్షి దాకా పైప్లైన్లు వేయాలంటే... ఆ ఖర్చు ఎకరాకు రూ.10 నుంచి 15 లక్షలు అవుతుంది. అది లేపాక్షి సంస్థ భరించాల్సిందే. ఆ ఖర్చు భరించి పైప్లైన్ వేస్తేనే.. సోమశిల నీళ్లు తెస్తేనే ఇక్కడ పెట్టే పరిశ్రమలకు నీళ్లందుతాయి. అప్పుడే ఏ ప్రాజెక్టయినా ఇక్కడకొస్తుంది. బ్యాంకులు రుణాలిచ్చే ముందు ఆ భూములకు విలువ కట్టే ముందు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటాయి. అందుకే బ్యాంకుల విలువకు అక్కడ ప్రభుత్వం కట్టిన విలువతో సంబంధం ఉండదు. ఈ నిబంధనను 2002లో అమల్లోకి తెచ్చింది, అమలు చేయించింది కూడా చంద్రబాబే. బాబు హయాంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఇదే రకంగా తనఖాలూ పెట్టుకున్నాయి. అప్పటి నుంచి ఇటీవలి దాకా అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఈ నెల్లోనే మార్చారు. ఇకపై బ్యాంకులు అక్కడి మార్కెట్ విలువకన్నా ఎక్కువ మొత్తాన్ని రుణంగా మంజూరు చేయరాదనే నిబంధన విధించారు. మరి నిబంధనల ప్రకారం బ్యాంకులు రుణాలిచ్చినపుడు అది తప్పెలా అవుతుంది? రుణం వేరు... అమ్మకం వేరన్న సంగతి సీబీఐకి గానీ, రామోజీకి గానీ తెలియదనుకోవాలా? చిలమత్తూరు, గోరంట్ల, కోడూరు మండలాల్లో లేపాక్షి సంస్థ రాకముందు ఎకరా రూ.50 వేలు కూడా పలకని పరిస్థితి ఉండేదని, అందుకే రూ.1.75 లక్షలుగా నిర్ణయించేసరికి చాలామంది తమ భూములు కొనుక్కోవాలంటూ డిమాండ్లు చేశారని సీబీఐకి తెలియదా? రామోజీకి తెలియదా? తెలుసుకోవాల్సిన అవసరం దర్యాప్తు సంస్థలకు లేదా? జగన్ సంస్థల్లో ఇందూ పెట్టుబడులు సున్నా! లేపాక్షికి భూముల్ని కేటాయించినందుకు ప్రతిగా శ్యామ్ ప్రసాద్రెడ్డి రూ.50 కోట్లను జగన్మోహన్రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారని ‘ఈనాడు’ రాసిపారేసింది. నిజానికి జగన్ సంస్థల్లోకి శ్యామ్ప్రసాద్రెడ్డి నుంచి గానీ, ఇందూ ప్రాజెక్ట్స్ నుంచి గానీ రూపాయి కూడా పెట్టుబడిగా రాలేదు. ఇందూ ప్రాజెక్ట్స్కు చెందిన ఇందూ టెక్జోన్కు శంషాబాద్ అవతల భూమి కేటాయించకముందే... లేపాక్షికి భూములు కేటాయించక ముందే... ‘సాక్షి’లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడిని ఇందూతో ముడిపెడుతోంది సీబీఐ. దాన్ని కావాలని వదిలిపెట్టి నేరుగా ఇందూ పెట్టుబడులు సాక్షిలోకి వచ్చాయని రాసేశారు రామోజీ!! నిజానికి నిమ్మగడ్డ ప్రసాద్కు, శ్యామ్ప్రసాద్రెడ్డికి అంతకు ముందు నుంచే వ్యాపార లావాదేవీలున్నాయి. అందులో భాగంగానే శ్యామ్ప్రసాద్రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు ప్రసాద్. నిజానికి అప్పటికే ప్రసాద్ చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. కేర్ ఆసుపత్రి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మా టీవీ... ఇలా చాలా సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రసాద్... వాటిలో భాగంగానే శ్యామ్ప్రసాద్ రెడ్డికి చెందిన సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్ట్మెంట్లు చేయడానికే ఆయన ఒక ఫండ్ను కూడా ఏర్పాటు చేశారంటే ఆయన ఎంతటి సీరియస్ ఇన్వెస్టరో అర్థం చేసుకోవచ్చు. మ్యాట్రిక్స్ నుంచి మొదలుపెడితే ప్రతిచోటా విజయవంతమైన ఇన్వెస్టరుగా అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఆర్జించారాయన. అలాంటి ప్రసాద్ కేవలం జగన్ మోహన్రెడ్డి సంస్థలో పెట్టుబడులు పెట్టారనే కారణంతో... ఆయనకు ఇందూ శ్యామ్ప్రసాద్రెడ్డితో సంబంధాలున్నాయనే కారణంతో... ఇందూకు ఆ తరవాత ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను చూపెట్టి వీటన్నిటికీ లింకు పెట్టడాన్ని ఏమనుకోవాలి? మోకాలు కూడా కాకుండా... బోడిగుండుకూ, అరికాలుకూ లింకు పెడుతున్నారనుకోవద్దా? ఇంతకన్నా ఘోరమేమైనా ఉంటుందా? పారిశ్రామిక వేత్తగా, సీరియస్ ఇన్వెస్టర్గా నిమ్మగడ్డ ప్రసాద్కు ఈ రాష్ట్రంలో ఎందరో పారిశ్రామిక వేత్తలతో సంబంధాలుండొచ్చు. అలాంటి ప్రసాద్ కేవలం సాక్షిలో ఇన్వెస్ట్ చేశారనే కారణంతో... ఆ పారిశ్రామికవేత్తలందరినీ వెదికి, వారిలో ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టిన ప్రతివారినీ పట్టుకుని లింకులు పెట్టుకుంటూ పోతే... వాటికి ‘క్విడ్ ప్రో కో’ ఆపాదిస్తూ పోతే ఏమవుతుంది? దాన్ని దర్యాప్తు అంటారా? అలాంటి వార్తలు రాసేవాటిని పత్రికలంటారా? ఇదేమైనా ఐఎంజీ బాగోతమా? లేపాక్షి సంస్థ భూములకు దరఖాస్తు చేసేనాటికి ఆర్ఓసీలో రిజిస్టరు కూడా కాలేదని, ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందని రాసేసింది ‘ఈనాడు’. అసలు ఏ ప్రాజెక్టయినా ఒప్పందం కుదిరే వరకూ దాని మాతృసంస్థ పేరుతోనే నడుస్తుంది. ఖరారయ్యాక, ఒప్పందం చేసుకునే ముందు మాత్రమే దాన్ని ఏ పేరుతో పెట్టాలనుకున్నారో ఆ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేస్తారు. ఆ సంగతి సీబీఐకిగానీ, రామోజీకి గానీ తెలియదనుకోవాలా? ఈ దేశంలో ఏ సంస్థయినా ఇలానే చేస్తుంది కదా!! ఒప్పందం, కేటాయింపు ఇవన్నీ సదరు గ్రూప్ సంస్థ అనుభవం, సత్తా ఆధారంగానే జరుగుతాయి కదా? ఇవన్నీ తెలియదా? అయినా ఇందూ సంస్థ ఏమైనా ఐఎంజీ లాంటిదా? ఎక్కడో అనంతపురంలో ఎకరా రూ. 1.75 లక్షలకు చేసిన భూ కేటాయింపును ప్రస్తావిస్తున్న రామోజీరావుకు గానీ, సీబీఐకి గానీ... హైదరాబాద్ నడిబొడ్డున... 850 ఎకరాలను... ఎకరా కేవలం రూ. 50 వేల చొప్పున ఊరూపేరూ లేని బోగస్ సంస్థకు కట్టబెట్టిన బాబు బాగోతం ఎన్నడూ కనిపించదెందుకు? దీనిపై దర్యాప్తునకు ఆదేశించినపుడు కూడా సీబీఐ తనకు సిబ్బంది లేరని తప్పించుకుందంటే ఏమనుకోవాలి? దీనిపై కోర్టు విచారణకు ఆదేశించినపుడు సైతం ఒక్క కథనం రాసే ధైర్యం రామోజీరావు చెయ్యలేదంటే ఎలా భావించాలి? ఊరూపేరూ లేని సంస్థ తరఫున బిల్లీరావు, పేట్రావు అనే ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేయటం... చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఆగమేఘాలపై భూ కేటాయింపు చేసేయటం... భూములతో పాటు స్టేడియాలను కూడా అప్పగించటం... ఇవన్నీ ఏమనుకోవాలి? అనంతపురంలో ఎకరా రూ. 1.75 లక్షలకు కేటాయిస్తే అది తప్పా? అది పరిశ్రమల కోసం కాదా? హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా రూ.50 వేలకు కట్టబెట్టేస్తే... అది ఈ రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడానికా? ఒలింపిక్ విజేతలు పుట్టకురావటానికా? ఎందుకింత దౌర్భాగ్యపు రాతలు రామోజీ? అప్పట్లో ఐఎంజీని ఆకాశానికెత్తేసింది మీ పత్రికే కదా? ఎందుకని? అది చంద్రబాబు కేటాయించింది కాబట్టా? ఇదేమో రాజశేఖరరెడ్డి కేటాయించింది కనకనా? ఇవేం విలువలు? భూ కేటాయింపుల్లో బాబును మించేదెవరు? అసలు భూ కేటాయింపుల్లో చంద్రబాబును మించిన వారెవరైనా ఉన్నారా? ఆయన కేటాయింపుల్లో అవకతవకలపై ఎన్ని ఆరోపణలొచ్చినా, ఆఖరికి కోర్టులు కూడా ఆదేశాలు జారీ చేసినా ఎన్నడూ సీబీఐ అటువైపు చూడదెందుకు? ఎన్నడూ రామోజీ ఒక్క రాత కూడా రాయరెందుకు? అసలు జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హైదరాబాద్లో 2,000 ఎకరాలు సరిపోతుందని కేంద్ర సంస్థలు సైతం నివేదికలు ఇవ్వలేదా? వాటన్నిటినీ పక్కనబెట్టి ఏకంగా 5,500 ఎకరాలు కేటాయించిన ఘనత బాబుది కాదా? అదెన్నడూ రామోజీకి తప్పుగా ఎందుకు కనిపించలేదు? ఎక్కడైనా ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికైనా ఇన్ని వేల ఎకరాలిచ్చారా? అంతర్జాతీయ ఖ్యాతి పొందిన సింగపూర్ చాంగీ విమానాశ్రయానికి కూడా మొత్తం భూమి 3,200 ఎకరాలే. ప్రపంచంలోనే అత్యధిక ఎయిర్ట్రాఫిక్ ఉండే న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం మొత్తం ఏరియా కూడా 4,900 ఎకరాలు. లండన్లోని హీత్రూ విమానాశ్రయాన్ని చూస్తే మొత్తం ఏరియా 3,000 ఎకరాలు. అత్యంత బిజీ ఎయిర్పోర్టయిన ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం కొలువైంది కూడా 4,900 ఎకరాల్లోనే. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ విమానాశ్రయానికి 5,500 ఎకరాలివ్వటమే అంతర్జాతీయ రికార్డు.