
నిరాడంబరంగా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక ఆదివారం ఢిల్లీలో నిరాడంబరంగా సాగింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఉపాధ్యక్షుడు రాహుల్ రాలేదు.
మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ హోం మంత్రి షిండే, అగ్రనేతలు ఆంటోనీ, మోతీలాల్ ఓరా, అంబికా సోని తదితరులు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై మాకు జనామోదం లభించలేదని, ఇతరులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు సోనియా బదులిచ్చారు.