సంజయ్‌దత్‌కు ‘ఫర్లాఫ్’పై దర్యాప్తు | Dutt 'investigation pharlaphpai | Sakshi
Sakshi News home page

సంజయ్‌దత్‌కు ‘ఫర్లాఫ్’పై దర్యాప్తు

Published Sat, Dec 27 2014 4:44 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

సంజయ్‌దత్‌కు ‘ఫర్లాఫ్’పై దర్యాప్తు - Sakshi

సంజయ్‌దత్‌కు ‘ఫర్లాఫ్’పై దర్యాప్తు

ముంబై: ప్రముఖ హీరో, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి సంజయ్‌దత్‌కు పదేపదే ఫర్లాఫ్ (తాత్కాలిక సెలవులాంటిది) మంజూరు చేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. జైలు అధికారులు సంజయ్‌దత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న సమాచారం మేరకు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జైళ్లశాఖ డీఐజీని ఆదేశించింది. ‘‘ఫర్లాఫ్ కోసం నలుగురైదుగురు దరఖాస్తు చేయగా అందులో సంజయ్‌దత్‌కు మాత్రమే పదే పదే ఇస్తున్నారు. ఏ చట్టం ప్రకారం ఇది జరుగుతుందో, చట్టంలో ఈ వెసులుబాటు ఉంటే మిగతావారికి ఎందుకు వర్తించడంలేదో తెలుసుకోవాల్సి ఉంది’’ అని రాష్ర్ట హోం శాఖ మంత్రి రామ్ షిండే చెప్పారు. సంజయ్‌దత్ బుధవారం ఎరవాడ జైలునుంచి 14 రోజుల ఫర్లాఫ్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement