జైలు నుంచి నలుగురు ఖైదీలు పరార్‌ | Four Prisoners Escape From Jail In Neemuch Madhya Pradesh | Sakshi
Sakshi News home page

జైలు నుంచి నలుగురు ఖైదీలు పరార్‌

Published Sun, Jun 23 2019 4:01 PM | Last Updated on Sun, Jun 23 2019 5:09 PM

Four Prisoners Escape From Jail In Neemuch Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని నిమూచ్‌ జైలు నుంచి నలుగురు ఖైదీలు తప్పించుకోని పారిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్ర పోలీసులు ముప్పుతిప్పలకు గురిచేస్తోంది. పారిపోయిన నలుగురిలో ఇద్దరు గంజాయి, మరో ఇద్దరు హత్యానేరం మోపబడిన ఖైదీలు ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఘటనపై ఆరాతీసిన జైలు సూపరింటెండెంట్‌.. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ సరిహద్దుల్లో వారికోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. పారిపోయిన వారిలో నార్‌సింగ్‌ (20) పంకజ్‌ మోంగియా (21) లేఖరాం (29), దూబేలాల్‌ (19) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిని పట్టించిన వారికి 50వేల రూపాయల నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement