ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ | governor narasiman met narendra modi in delhi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ

Published Mon, Jul 25 2016 1:59 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ - Sakshi

ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ

న్యూఢిల్లీ :  గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు సహా తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం.  భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానితో సమావేశానికి  ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు.

హైకోర్టు విభజనపై ప్రధానమంత్రితో చర్చించలేదని ఆయన తెలిపారు. జల వివాదాలపై తాను జోక్యం చేసుకోనని, అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ అంశంపై మాట్లాడనని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. కృష్ణా పుష్కరాల పనులు సకాలంలో పూర్తవుతాయని ఆయన తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement