Law and order
-
శాంతిభద్రతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే నేడు జీవన్రెడ్డి అంటున్నారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో...రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కొన్ని నెలల నుంచి జనం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా ఆవేదనతో చెబుతున్నారని పేర్కొన్నారు.ఇకనైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలని కేటీఆర్ కోరారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని సూచించారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని.. వారి పని వారిని చేసుకొనిస్తే శాంతి భద్రతలు, రాష్ట్రంలో సామరస్యాన్ని కాపాడగలుగుతారని అన్నారు.A senior congress leader & a Former Minister, MLC Jeevan Reddy Garu today is echoing what the rest of Telangana has been saying since the last few months Law & Order in Telangana has been a major concern. Without a full time Home Minister and more importantly with police being…— KTR (@KTRBRS) October 22, 2024 -
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది: హరీశ్రావు
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. అందుకు వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనమని మాజీ మంత్రి హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. .. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నది. రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షంచే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. .. గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నాం అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. భట్టి కౌంటర్హరీష్రావు చేసిన ట్వీట్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘‘గత పదేళ్ళ పాలనను హరీష్ రావు మర్చిపోయారా?. బీఆర్ఎస్ ప్రభుత్వం లో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది’’ అని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి భట్టి.. అవాంఛనీయ సంఘటనలకు పాల్డడే వ్యక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. -
UP: మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. ముజఫర్నగర్లో బుధవారం(ఏప్రిల్ 10) జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఎవరి పేరు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేదో వాళ్ల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాఫియా లీడర్ కాన్వాయ్కి ఏకంగా సీఎం కాన్వాయ్ దారి ఇచ్చే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మాఫియా ప్యాంట్లు తడుస్తున్నాయి’అని యోగి అన్నారు. ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు -
Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్!
హైదరాబాద్: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా రెండు షిఫ్ట్లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేర్వేరు చోట్ల వాహనదారులకు శ్వాస పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించారు. వెస్ట్జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, పంజగుట్ట, బోరబండ, ఎస్ఆర్నగర్, మాసబ్ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు ఎనిమిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్పరిధిలో డైమండ్ హౌజ్, ఫిలింనగర్ విజేత సూపర్మార్కెట్ వద్ద నిర్వహించిన డ్రంక్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 24 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎస్ఆర్నగర్ ఐసీఐసీఐ వద్ద రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు, జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 26 మంది పట్టుబడ్డారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్టడీ సర్కిల్, గ్రీన్ బావర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్ల్యాండ్స్ వద్ద, బంజారాహిల్స్ పార్క్ హయత్ వద్ద రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. -
ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్!
సాక్షి, కరీంనగర్: 'ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకోవడానికి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. పలువురు విద్యార్థులు, యువత ఇంటర్నెట్లో ఎన్నికల చట్టాలు– నిబంధనల గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎన్నికల చట్టాలను వివరించే కథనం.' సెక్షన్ 123: జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఒత్తిడికి లోను చేస్తే.. ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125: ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా జరిమానా రెండింటినీ విధించే అవకాశం ఉంటుంది. 126: ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలు లేదా జరిమానా విధిస్తారు. 127: ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా.. పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా. 128: బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా. 129: ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా, ప్రభావం కలిగించినా శిక్షార్హులు. దీనికిగాను 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. 130: పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే రూ.250 జరిమానా పడుతుంది. 131: పోలింగ్ కేంద్రానికి సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా, రెండూ అమలుచేయొచ్చు. 132: ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించనివారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా. 134: అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షార్హులే. ఇందుకు రూ.500 జరిమానా విధిస్తారు. 134(అ): ఠాణా పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం నిషేధం. అలా వెళ్లినవారికి 2 నెలల జైలుశిక్ష, జరిమానా వేస్తారు. 135: పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే శిక్షార్హులు. ఏడాది పాటు జైలుశిక్ష, రూ.500 జరిమానా. 135(ఇ): పోలింగ్, కౌంటింగ్ రోజున మద్యం విక్రయించడం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశచూపడం నేరం. అందుకు 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల వరకు జరిమానా. 133: ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష, జరిమానా. 135(ఆ): ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవుగా మంజూరు చేసినా శిక్ష, అందుకు రూ. 5వేల జరిమానా విధించొచ్చు. 49వీ: ఒక వ్యక్తి ఓటు మరొకరు వేస్తే పోలింగ్ ఆఫీసర్కు సదరు ఓటరు 49–వీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అధికారం కల్పిస్తారు. 134(అ): ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా గానీ పోలింగ్ ఏజెంటుగా గానీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. ఇవి కూడా చదవండి: కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’ -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ... రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
యాదాద్రి : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఉప్పల్లోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన భునవగిరి జోన్ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసి ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తీసుకెళ్లే రూట్ను చెక్ చేసుకోవాలని, చెక్పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమస్యలు సృష్టించేవారిపై నిఘా ఉంచాలి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సీపీ సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా పంపే సందేశాలు, వీడియోలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ అంబర్ కిషోర్, డీసీపీ రాజేష్ చంద్ర, రాచకొండ ట్రాఫిక్ డీసీసీ–1 అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి, ఎస్ఓటీ డీసీపీ–1 గిరిధర్, మహేశ్వరం డీసీపీ శ్రీని వాస్, ఎస్బీ డీసీపీ బాలస్వామి, సెబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ఎల్పీనగర్ డీసీపీ సాయిశ్రీ, ట్రాఫిక్ డీసీపీ–2 శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్, క్రైమ్ డీసీపీ అరవింద్, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు. -
మణిపూర్ పరిణామాలపై నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితుల పునరావాసంతోపాటు శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలు, ఆయుధాల స్వాధీనం వంటి అంశాలపై తాజా నివేదికను సమరి్పంచాలని మణిపూర్ ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, కర్ఫ్యూ సమయాన్ని ఐదు గంటలకు కుదించామని మణిపూర్ ప్రభుత్వం తెలియజేసింది. మణిపూర్లో మైనారీ్టలైన కుకీ తెగ గిరిజనులకు రక్షణ కలి్పంచాలని కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఆగస్టు 10కి వాయిదా పడింది. మరోవైపు, వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం పునఃప్రారంభమైంది. మణిపూర్ పరిణామాలకు సంబంధించిన పిటిషన్లపై విచారణను మొదలుపెట్టింది. -
ప్రశాంత విశాఖ..
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత విశాఖే లక్ష్యంగా అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు సిద్ధమైంది. విశాఖను టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి విస్తరించింది. విశాఖ పోలీస్ కమిషనరేట్నంతా టాస్క్ ఫోర్స్ పోలీస్స్టేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులు మే 24 నుంచి అమల్లోకొచ్చినట్టుగా పరిగణిస్తున్నట్టు కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఇటీవల ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, వైఎస్సార్సీపీ నేత, బిల్డర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. మరో బిల్డర్ కిడ్నాప్ కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. మరోవైపు అరకు జిల్లా పరిధిలో గంజాయి సాగును ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసినా.. ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని భావించింది. అసాంఘిక శక్తులపై కేసులు నమోదుచేయనున్న టాస్క్ఫోర్స్ ఇప్పటివరకు ఏ ప్రాంతంలోని కేసులను అక్కడి పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కేసుల దర్యాప్తు, విచారణ, శిక్షలు పడేలా చేయడం మొదలైన ప్రక్రియలో కొంత సమన్వయలోపం కనిపిస్తోంది. ఇక నుంచి విశాఖలో ఏ ప్రాంతంలో అసాంఘిక శక్తులపైన అయినా సరే టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తుల కట్టడి బాధ్యత టాస్క్ఫోర్స్ పోలీసులు చేపడతారు. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులు, గంజాయి అక్రమ రవాణాదారులు, విక్రేతలు, ఈవ్ టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడేవారు... ఇలా అన్ని తరహా కేసులను టాస్క్ఫోర్స్ పోలీసులు చేపడతారు. అందుకోసం టాస్క్ఫోర్స్ పోలీస్ స్టేషన్కు అదనపు అధికారులు, సిబ్బదిని కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. -
ఈ మంటలు ఆర్పండి!
నెలన్నర దాటిపోయింది. ఇప్పటికి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర బలగాలకు తోడు కేంద్ర బలగాలు రంగంలోకి దిగి చాలాకాలమైంది. సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి వచ్చి పర్యటించారు. అయినా పరిస్థితి మారలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇవాళ్టికీ అగ్నిగుండమై మండుతోంది. శాంతిభద్రతలు క్షీణించి, మూకస్వామ్యం రాజ్యమే లుతోంది. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా ఇవ్వాలంటూ మైతై తెగ ప్రజలు చేస్తున్న డిమాండ్కు వ్యతిరేకంగా మే మొదటివారంలో జరిగిన గిరిజనుల ప్రదర్శన హింసాత్మకంగా మారినప్పుడు మొదలైన ఈ జ్వాల మణిపూర్లోని తెగల మధ్య చీలికలను ఎత్తిచూపింది. మరి, ఈ మంటల్ని చల్లార్చి, శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత తల మీద ఉన్న సర్కారు ఇప్పటి దాకా ఏం చేసినట్టు? సమస్యను చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక వర్గం వైపు నిలబడి, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. కుకీలు ఎక్కువుండే కొండ ప్రాంత జిల్లాల నుంచి మైతైలు వలసపోతుంటే, మరోపక్క మైతైలు అధికంగా ఉండే ఇంఫాల్ లోయ నుంచి కుకీలు తరలిపోతున్నారు. కేంద్ర మంత్రి నివాసం సహా రెండు వర్గాలకు చెందిన 4 వేల గృహాలు ఇప్పటికే అల్లర్లలో అగ్నికి ఆహుతి అయ్యాయి. శరణార్థి శిబిరాలు కిక్కిరిశాయి. అమాత్యుడి ప్రైవేట్ నివాసంపై దాడి గత మూడు వారాల్లో ఇది రెండోసారి. జాతుల మధ్య విద్వేషం ఇంతగా పెచ్చరిల్లుతుంటే, కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా అధికారంలో ఉన్న పాలకపక్షం ఏం చేస్తోందన్నది ప్రశ్న. నిజానికి, కేంద్ర హోమ్ మంత్రి ఇటీవలే సంక్షుభిత మణిపూర్ను సందర్శించినప్పుడు, సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్నా ఆ ఆశ నెరవేరలేదు. భౌగోళికంగా బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ల మధ్య చిక్కిన ఈశాన్య రాష్ట్రాల్లో తెగల మధ్య తరచూ ఘర్షణలు కొత్త కావు. 1949లో భారత యూనియన్లో చేరినప్పటి నుంచి మణిపూర్లోనూ అవి ఉన్నవే. కానీ, మధ్యవర్తులుగా ఉండాల్సినవారే తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అనుమా నంతో ఇరువర్గాల మధ్య విశ్వాసం సన్నగిల్లడం విషాదం. అపనమ్మకం నిండినచోట భద్రతా దళాలైనా తగిన చర్యలు చేపట్టడం కష్టం. మణిపూర్ రైఫిల్స్ సహా రాష్ట్ర పోలీసు బలగాలు మైతైలకే మద్దతుగా నిలుస్తున్నాయని కుకీల భావన. మైతైలేమో కుకీ ప్రాబల్య పర్వత ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా గంజాయి సాగు చేస్తున్నా అస్సామ్ రైఫిల్స్ చూసీ చూడనట్టున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది చాలదన్నట్టు భద్రతాదళాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. పారా మిలటరీ దళాలు తమ పనిలో జోక్యం చేసుకుంటున్నాయని పోలీసుల ఆరోపణ. వెరసి, పాలన మృగ్యమైన మణి పూర్లో నేటికీ రహదారులు సాయుధ మూకల నియంత్రణలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్రిక్తతల్ని చల్లబరచడానికి పాలకుల వైపు నుంచి ఏ మాత్రం ప్రయత్నాలు జరుగుతు న్నాయంటే అనుమానమే. ఎంతసేపటికీ దీన్ని శాంతి భద్రతల సమస్యగానే వారు చూస్తున్నారు. అది పెద్ద చిక్కు. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలో ముఖ్యమంత్రి బీరేన్సింగ్ పదే పదే విఫలమైనా, కేంద్రం ఉపేక్షించింది. విద్వేషాగ్నిలో ఈశాన్యం కాలిపోతున్నా, మూడు వారాల పైచిలుకు తర్వాత కానీ హోమ్ మంత్రి అక్కడకు రాకపోవడం ఏ రకంగా సమర్థనీయం? కొన్ని వారాలుగా ఇలా ఉన్నా ప్రధాని తన రాజకీయ సభల్లో కానీ, ఇతరత్రా కానీ ఎక్కడా మణిపూర్ ఊసే ఎత్తలేదు. మాటల ద్వారా మనుషుల మధ్య మత్సరం తగ్గించాల్సిన వేళ పాలకులు మౌనముద్ర దాల్చడం విడ్డూరమే! గౌహతి హైకోర్ట్ రిటైర్డ్ ఛీఫ్ జస్టిస్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘం వేయడం బాగానే ఉంది. కానీ, రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో శాంతి సంఘం ఏర్పాటుకు మాత్రం ఆదిలోనే హంసపాదు పడింది. పక్షపాత సీఎం సభ్యుడిగా ఉన్న కమిటీలో తాము ఉండబోమనేది కుకీ ప్రతినిధులు తేల్చేశారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో బీరేన్ ఆలోచించుకోవాలి. 2017లో తొలి విడత సీఎంగా ఎన్నికైనప్పుడు గిరిజనవాసులతో సన్నిహితంగా మెలిగిన ఆయన 2022లో రెండో విడత అధికారం చేపట్టాక వైఖరి మార్చారు. ప్రభుత్వస్థలంలో ఆక్రమణల పేరిట ఇంఫాల్లో చర్చిలతో సహా అనేకం కూల్చివేతకు ఆదేశించి, కుకీలకు కోపకారణమయ్యారు. సంఖ్యాపరంగా మైతైలున్నందున మెజారిటీ వాదాన్ని స్థానిక గిరిజన తెగలపై రుద్దుతున్నారనే భావన కలగడమూ సమస్యకు కారణమైంది. మైతైలకు ఎస్టీ హోదానిచ్చే అంశం పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్ట్ చెప్పింది సరే, ఆ వివాదా స్పద నిర్ణయంతో తెగల మధ్య అశాంతి నెలకొంటుందని ఊహించకపోవడం ప్రభుత్వ తప్పిదమే. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పర్యవసానాలు ఊహించి సంబంధిత వర్గాల మధ్య అపోహల్ని ముందే తొలగించడం కీలకం. పాలకులు అక్కడే విఫలమయ్యారు. అనుమానాలు పెను భూతాలై, పరిస్థితిని ఇంతదాకా తెచ్చారు. ఇంటర్నెట్పై నిర్బంధాల నేపథ్యంలో క్షేత్రస్థాయి వార్తలు సరిగ్గా తెలియకపోగా, అసలు కథ వదిలేసి దీన్ని రెండు మతాల మధ్య ఘర్షణగా చిత్రించే ఘోర తప్పి దాలూ సాగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రం కలగజేసుకోవాలి. అన్ని తెగలకూ రాజ్యాంగ రక్షణ ఉందన్న భరోసా కల్పించాలి. మూలన విసిరేసినట్టుగా ఉన్న ఆ ప్రాంతాలనూ, ప్రజలనూ పరాయి వారుగా చూసే ధోరణి మారాలి. అక్కడి విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను గౌర విస్తూ, దేశంలో తామూ భాగమనే అభిప్రాయం ఆ ప్రజల్లో కల్పించాలి. మరి, ఆ దిశగా శాంతి స్థాపనకు ఇకనైనా పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అన్నది మాటలకే పరిమితం కాదన్న నమ్మకం వివిధ తెగల మధ్య కల్పిస్తారా? -
బాబు హయాంలో నేరాలు-ఘోరాలు కంటపడలేదేమో?
ఈనాడు మీడియా మరో అడ్డగోలు వార్తకు ఇది నిదర్శనం. ఏపీ ప్రజలపై ఆ మీడియా అక్కసు ప్రదర్శిస్తోందని, ప్రత్యేకించి విశాఖ పట్నంపై విషం కక్కుతోందనడానికి ఇంతకన్నా రుజువు అవసరం లేదు. అరాచక శక్తులకు విశాఖ అడ్డానే అంటూ ఈనాడు పత్రిక రెండు రోజుల క్రితం బ్యానర్ హెడింగ్ పెట్టడం ద్వారా తమ కక్షను ప్రదర్శించారు. పైగా దానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏదో అన్నారట. అవి నూటికి నూరుపాళ్లు నిజమని తేలిపోయిందట. మాఫియా రెచ్చిపోతోందని, ఇంకేదేదో చెత్త రాస్తూ తమ మాఫియా బుద్దిని ఈనాడు చూపెట్టడానికి ఏ మాత్రం సిగ్గు పడడం లేదు. ✍️ విశాఖ లోక్ సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్ జీవీరావులను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేయడం సంచలన వార్తే. ఆ విషయం బయటపడిన కొద్ది గంటలలోనే పోలీసులు వారిని పట్టుకుని బాధితులను విడిపించారు. ఇందుకు విశాఖ పోలీసులను అభినందించవలసిందే. అలా చేయకపోగా అరాచక శక్తుల అడ్డా అంటూ ఈనాడు చెలరేగిపోయింది. దాదాపు అన్ని మీడియా ఛానెల్స్ ఈ వార్తను ప్రముఖంగానే ఇచ్చాయి. అందులో తప్పు లేదు. చాలా వరకు ఫ్రొఫెషనల్ గా కవర్ చేశాయి. కానీ, ఈనాడు మాత్రం తన విద్వేషాగ్నిని బహిర్గతం చేసుకోవడానికి ఈ ఘటనను ఉపయోగించింది. ఈ ఒక్క నేరంతో మొత్తం విశాఖ అంతా పాడైపోయినట్లా? ఎవడైనా బుద్ది ఉన్నవాడు ఇలాంటి చెత్త లాజిక్ తీసుకు వస్తారా?. ✍️ అదే నిజమని అనుకుంటే.. విశాఖ ప్రాంతంలో గత చంద్రబాబు పాలన సమయంలో ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని కొందరు హత్య చేశారే. అది ప్రశాంతతకు చిహ్నమని ఈనాడు ఆనాడు భావించిందా?. ఆ హత్యలతో విశాఖ జిల్లా అంతా హత్యల అడ్డాగా మారిపోయిందని ఈనాడు ఎందుకు రాయలేదు!. ► గత టరమ్ లోనే విశాఖ పట్నం నడిబొడ్డులోనే ఒక మహిళను వివస్త్రను చేసి హత్య చేశారే. ఇందులో టీడీపీ నేతలపైనే ఆరోపణ వచ్చిందే! అప్పుడు మహిళలపై ఘాతుకాలకు విశాఖ కేంద్రం అయిందని రాయలేదే!. ► టీడీపీ హయాంలోనే విశాఖ భూ కబ్జాలపై సిట్ వేశారు. ఆ సందర్భంగా ఒక మంత్రి మరో మంత్రి పై కబ్జా ఆరోపణలు చేసినప్పుడు.. ఇది కబ్జాల మయం అయిందని రాయలేదే. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ కబ్జాలను కొన్నింటిని విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కక్ష అని రాశారే. ► విజయవాడలో ఒక టీడీపీ నేత లైంగిక వేధింపులకు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆ నేతకు జీవిత ఖైదు కూడా పడింది. దాంతో టీడీపీ నేతలంగా లైంగిక నేరస్తులని ఈనాడు రాయాలి కదా!. ‘ఒహో.. టీడీపీ వాళ్లు ఏమీ చేసినా వారికి కమ్మగా ఉంటుంది’’ అని ఎవరైనా విమర్శిస్తే మరి ఏమి చెబుతారు?. ► అదే విజయవాడలో చంద్రబాబు టైమ్ లో కాల్ మనీ సెక్స్ రాకెట్లకు ఎంతమంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఇదేమి దరిద్రపు పాలన అనో, టీడీపీ నేతల నీచ బుద్దులు అనో ఈనాడు రాసిందా?.. లేదే! ఇప్పుడు జరిగిన ఒక కిడ్నాప్ నేరానికి రాజకీయ రంగు పులిమి తమ పైత్యం అంతా ప్రదర్శిస్తోంది. మార్గదర్శి కేసులో ఏపీసీఐడీ చెరుకూరి రామోజీరావును విచారించిన సందర్భంలో.. ✍️ టీడీపీ పాలనలో ఇవేకాదు.. ఇంకా ఎన్నో ఘోరాలు జరిగాయి. విజయవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను నడిరోడ్డు మీద దీక్ష చేస్తున్న సమయంలో టీడీపీ వాళ్లు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని మాజీ మంత్రి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు. ఇందుకు ఈనాడు ఒప్పుకుని విజయవాడ హత్యల నగరం అయిపోయిందని కానీ, టీడీపీ హత్యాకాండలలో పాల్గొంటోందని కాని రాసిందా?. ► పులివెందుల వద్ద ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాత వైఎస్ రాజరెడ్డిని టిడిపి నేతలు హత్య చేస్తే, ఆ టిడిపివారికి హైదరాబాద్ లోని టిడిపి ఆఫీస్ లో రక్షణ కల్పించారన్న అబియోగం అప్పట్లో వచ్చిందే. ► పోనీ కిడ్నాప్ ఘటనలు ఏవీ టిడిపి హయాంలో జరగలేదా! ఆనాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుర్తేడు అనేచోట పది మంది ఐఎఎస్ అదికారులను నక్సల్స్ కిడ్పాన్ చేశారు. వారిని విడిపించడానికి జైలులో ఉన్న తీవ్రవాదులను వదలిపెట్టిన చరిత్ర టిడిపిదే కదా!. ► మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును కూడా నక్సల్స్ కిడ్నాప్ చేస్తే, ఆయన సతీమణి దీక్ష చేసి విడిపించుకోవలసి వచ్చిందే! ► గతంలో హుజూరాబాద్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న దుగ్గిరాల వెంకటరావును కాల్చి చంపారు. మండలాధ్యక్షుడుగా ఉన్న టీడీపీ నేత మలహర్ రావును హత్య చేసిన ఘటన ఉమ్మడి ఏపీలో పెను సంచలనం అయింది. ► ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాలలో స్నానం చేయడం కోసం సామాన్యులను నిలిపివేసిన సందర్భంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. అయినా అది చంద్రబాబు తప్పు కాదని, భక్తుల తప్పని ప్రచారం చేశారే! ✍️ ఇక తెలంగాణలో ఏవైనా నేరాలు జరిగితే ఇలాగే దిక్కుమాలిన వార్తలు ఇస్తున్నారా? ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే వణికే ఈనాడు మీడియా ఎపిలో మాత్రమే ఇలా నీచంగా రాస్తోంది. హైదరాబాద్ రింగ్ రోడ్డు వద్ద ఒక వెటర్నరీ మహిళా డాక్టర్ సామూహిక మానభంగానికి గురవడం, తదుపరి ఆమెను హత్య చేయడం ఎంత దారుణమైన ఘటనన్నది వేరే చెప్పనవసరం లేదు. ఆ దుర్ఘటన జరిగింది కనుక హైదరాబాద్ రేప్ ల అడ్డా అని ఈనాడు ఎందుకు రాయలేదు! ఆ తర్వాత కూడా పలు రేప్ కేసులు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి ఒక మహిళను ఎంత ఘాతుకంగా హతమార్చింది చూశాం. కొన్ని కిడ్పాప్ ఘటనలు, తుపాకి కాల్పులు ,రియల్ ఎస్టేట్ తగాదాలు, హత్యలు కూడా జరిగాయి. అయినా హైదరాబాద్ లో వచ్చే పరిశ్రమలు ఆగిపోతున్నాయా? లేదే! ✍️ దీని అర్ధం ఏమిటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సమాజంలో కొన్ని నేరాలు రకరకాల కారణాలతో జరుగుతుంటాయి. వాటిని అవకాశం ఉన్న మేరకు అదుపు చేయడం పోలీసుల బాధ్యత. నేరం జరిగిపోతే నిందితులను పట్టుకుని శిక్షించడం పోలీసుల కర్తవ్యం. అది జరుగుతోందా?లేదా? అన్నది చూడాలి కాని ప్రతి ఘటనకు ప్రభుత్వానికి , అదికారంలో ఉన్న పార్టీకి పులిమి వార్తలు ఇచ్చి ప్రజలలో వ్యతిరేకత పెంచాలని చూడడం జర్నలిజం అవుతుందా!. మీడియా ఈ రకంగా నైతికంగా పతనం అవడం శోచనీయం. ✍️ అమిత్ షా ఆధ్వర్యంలోనే పోలీసు శాఖ డిల్లీలో పనిచేస్తుంటుంది. కానీ అక్కడ ఎన్ని నేరాలు జరిగాయి.మహిళల రేప్ లు జరిగాయి. దాంతో డిల్లీ అరాచక శక్తుల అడ్డాగా మారిందని ఈనాడు రాయలేదే! యూపీలో ఒక మాజీ ఎంపీని ,ఆయన సోదరుడిని పోలీసుల సమక్షంలో ప్రజలంతా చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ మధ్య కోర్టులోనే కాల్పులు జరిగాయి. అయినా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ శాంతి భద్రతలను బాగా కాపాడుతున్నారని ఎందుకు ప్రచారం జరుగుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పవచ్చు. ఈనాడు మీడియా ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా దానిని వైఎస్సార్సీపీకి అంటకట్టి.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చేస్తున్న కుట్రలు ప్రజలకు అర్దం కాకుండా ఉంటాయా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయికి పోలీసు వ్యవస్థ.. స్నేహపూర్వక పోలీసు విధానం.. దశాబ్దాలుగా బ్రహ్మపదార్థంగా అంతుచిక్కకుండా ఉన్న ఈ రెండు లక్ష్యాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించి చూపించింది. అందుకోసం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రజలు భయ పడకుండా, శాంతి భద్రతలతో జీవించేలా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దింది. అక్రమ వ్యాపారాల నిరోధానికి కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని నెలకొల్పింది. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన గంజాయి సాగును కూకటివేళ్లతో సహా పెకలించివేసింది. నాటు సారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రంలో నేరాల కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నేరాలు, అల్లర్లు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికలే చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. వ్యవస్థాగతంగా బలోపేతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లా పోలీసు కార్యాలయాలు 26కు పెరిగాయి. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి కొత్తగా 16 సబ్ డివిజన్లు, 19 పోలీసు సర్కిళ్లను ఏర్పాటు చేసింది. 2019కు ముందు 98 సబ్ డివిజన్లు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. 2019కు ముందు 197 పోలీస్ సర్కిళ్లు ఉండగా ప్రస్తుతం 216కు చేరాయి. ఇక ఏడాదికి 6,500 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దేశంలోనే విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త వ్యవస్థను సృష్టించింది. రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి గస్తీ విధులు కేటాయిస్తోంది. అసాంఘిక శక్తులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించడం, రౌడీషీట్లు తెరవడం మొదలైన చర్యలతో నేరాలకు ఆస్కారం లేకుండా చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన భద్రత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడులు, వేధింపుల కేసుల్లో తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. దర్యాప్తు వేగంగా చేస్తూ త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేస్తోంది. దాంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపుల కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో 2,382 కేసులు నమోదు కాగా 2022లో 2,229 కేసులకు తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో 15 శాతం కేసులు తగ్గాయి. గంజాయి, నాటు సారాపై ఉక్కుపాదం గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం కొత్తగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసి మరీ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న గంజాయి దందాను కూకటివేళ్లతోసహా పెకలించి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. ముందుగా గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగు ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసి ప్రత్యేక బృందాలను నియమించి మరీ కట్టడి చేసింది. మొత్తం 384 గ్రామాల్లో మూడు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ నిర్వహించింది. మొత్తం 9,093 ఎకరాల్లో ఏకంగా రూ.11,659 కోట్ల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేసింది. స్మగ్లింగ్ను అడ్డుకుని భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేసింది. 2022లో 2 లక్షల కేజీలు, 2023లో ఇప్పటివరకు 3.32 లక్షల కేజీల గంజాయి నిల్వలను కాల్చి బూడిద చేసింది. ♦ దశాబ్దాలుగా గంజాయి సాగే జీవనాధారంగా చేసుకున్న గిరిజనుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచి్చంది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. గతంలో గంజాయి సాగు చేసిన 7,328 ఎకరాల్లో కాఫీ, నిమ్మ, జీడి, కొబ్బరి, రాజ్మా, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తుండటం ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పునకు నిదర్శనం. ♦ అదే రీతిలో నాటుసారా దందాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నాటుసారా తయారీ కేంద్రాలుగా గుర్తింపు పొందిన మొత్తం 2,202 గ్రామాల్లో ఏకంగా 2,184 గ్రామాల్లో సారా బట్టీలన్నవే లేకుండా చేసింది. నాటు సారా కాచే వారిని ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తోంది. మిగతా కొద్ది గ్రామాల్లోనూ త్వరలోనే నాటు సారా రూపుమాపడానికి చర్యలు చేపట్టింది. ఈ నాలుగేళ్లలో నాటు సారా, అక్రమ మద్యం దందాపై విస్తృతంగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసింది. 2019లో 527 కేసులు, 2020లో 922 కేసులు, 2021లో 1,691 కేసులు, 2022లో 1,379 కేసులు నమోదు చేయడం విశేషం. దాంతో రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం దందా గణనీయంగా తగ్గింది. 2023లో ఇప్పటివరకు 497 కేసులే నమోదు కావడమే దీనికి నిదర్శనం. పదే పదే అక్రమ రవాణాకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ కింద ఇప్పటివరకు 705 కేసులు నమోదు చేయడం గమనార్హం. రహదారి భద్రతకు ప్రాధాన్యం ఎక్కువమందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, వైద్య – ఆరోగ్య శాఖలతో సంయుక్త కార్యాచరణ చేపట్టింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై బ్లాక్ స్పాట్లను జియో ట్యాగింగ్ చేసి ట్రాఫిక్ను పర్యవేక్షిస్తోంది. ఆ ప్రదేశాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేకంగా అంబులెన్స్ల ఏర్పాటు మొదలైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో 2019లో 20,575 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2022నాటికి 19వేలకు తగ్గాయి. హత్యలు, ఘర్షణలు కట్టడి ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో నాలుగేళ్లుగా హత్యలు, ఘర్షణలు గణనీయంగా తగ్గాయి. 2018తో పోలిస్తే 2022కి రాష్ట్రంలో హత్యలు 6 శాతం తగ్గగా, అల్లర్లు 36 శాతం తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో 2023 మొదటి త్రైమాసికాన్ని పోలిస్తే హత్యలు 15 శాతం తగ్గాయి. సైబర్ నేరాల కట్టడి యావత్ ప్రపంచానికే సవాల్గా మారిన సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు శాఖ ముందుంది. సైబర్ నేరాల కట్టడికి పోలిసు శాఖ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా సెల్స్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సైబర్ మిత్ర యాప్, 1930 రిపోర్టింగ్ సెల్ సెంటర్లను నెలకొల్పింది. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేసింది. లోన్ యాప్ల వేధింపుల కట్టడికి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. సైబర్ నేరాల బాధితులు గతంలో ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. శాంత్రిభద్రతల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఘర్షణలు, అల్లర్లు, హత్యలను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. గంజాయి, నాటు సారా కట్టడికి విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. – డీజీపీ కేవీ రాజేంద్రానాథ్ రెడ్డి ప్రజల భద్రతకు భరోసానిస్తున్నారు రాష్ట్రంలో నాలుగేళ్లుగా శాంతి భద్రతలు గణనీయంగా మెరుగయ్యాయి. ఘర్షణలు, అల్లర్లకు అవకాశం లేకుండా పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేస్తోంది. బాధితుల ఫిర్యాదులపట్ల సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవసరానికి మేమున్నాం అనే నమ్మకాన్ని పోలీసు యంత్రాంగం కల్పిస్తోంది. – డా.ర్యాలీ శ్రీనివాస్, గోదావరి కవి, తెలుగు అధ్యాపకుడు, రామచంద్రాపురం, కోనసీమ జిల్లా ప్రశాంత పరిస్థితులు నెలకొల్పారు ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే సానుకూల పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల ద్వారా పోలీసు వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకురావడం గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దాంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానం ఆచరణలోకి వచ్చింది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. –సి. స్వరాజ్యలక్ష్మి, రిటైర్డ్ ప్రిన్సిపల్, శ్రీ పద్మావతి డిగ్రీ–పీజీ కళాశాల, తిరుపతి -
అతీక్ అహ్మద్ హత్య ఘటనపై ఒవైసీ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతీక్ అహ్మద్, అతని సోరుడు అష్రఫ్ హత్యలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై సుప్రీకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఒక్క అధికారి కూడా ఉండొద్దన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'హత్య సమయంలో అక్కడున్న పోలీసులు అధికారులను విధుల నుంచి తొలగించాలి. పోలీస్ కస్టడీలోనే అతీక్ అతని సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. నిందితులకు ఆ ఆయుధాలు ఎలా వచ్చాయి? హత్య అనంతరం వారు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. చంపిన తర్వాత మతపరమైన నినాదాలు ఎందుకు చేస్తున్నారు?. టెర్రరిస్టులు అని కాకపోతే వాళ్లను ఏమని పిలవాలి? దేశభక్తులు అనాలా? ఈ ఘటన అనంతరం సంబరాలు చేసుకుంటున్నవారు రాబందులు. ఈ హత్యలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం పాత్ర ఉంది. ఈ ఘటన యూపీలో శాంతి భద్రతలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇలా పబ్లిక్గా హత్యలు జరిగితే ప్రజలకు రాజ్యాంగం, శాంతి భద్రతలపై విశ్వాసం ఉంటుందా? యూపీలో బీజేపీ పరిపాలన చట్ట ప్రకారం జరగడం లేదు, తుపాకీ రాజ్యమేలుతోంది.' అని ఒవైసీ ఫైర్ అయ్యారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వాతావరణం సమీపిస్తున్నందున శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పోలీస్ ఉన్నతాధికారి వారి పరిధిలోని గ్రామాల సందర్శన కొనసాగించాలని సూచించారు. నగరంలో ఏర్పా టు చేసిన డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్కు వచ్చిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా హాట్స్పాట్ల గుర్తింపు, పోలీసుల ప్రవర్తన తదితర అంశాలపై డీజీపీ చర్చించారు. శాంతిభద్రతల అడిషల్ డీజీ సంజయ్కుమార్ జైన్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్భగవత్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పలు సూచనలు చేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి పదిమంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్ నివారణలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అంబేడ్కర్ చిత్రపటానికి డీజీపీ నివాళులర్పిం చారు. -
Yogi Adityanath: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్: సీఎం యోగి
లక్నో: యోగి అదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఉత్తర్ప్రదేశ్లో రౌడీషీట్లరు, గ్యాంగ్స్టర్లు హడలిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఆయన నేరస్థులపై ఉక్కుపాదం మోపడమే ఇందుకు కారణం. గ్యాంగ్స్టర్ కం పొలిటీషియన్ అయిన అతిక్ అహ్మద్ కూడా ఇటీవలే ఓ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు యోగి. ఒకప్పుడు యూపీలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు వసూళ్లకు పాల్పడిన మాఫియా, గ్యాంగ్స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు చేసిన నేరాలకు కోర్టుల్లో దోషులుగా తేలుతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో శాంతిభద్రతలంటే గౌరవం లేకుండా చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారని యోగి వ్యాఖ్యానించారు. శనివారం ఓ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈమేరకు మాట్లాడారు. 'ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడికి ఇవాళ యూపీ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరూ ధిక్కరించలేరు. ప్రజలను భయపెట్టిన మాఫియానే ఇప్పుడు భయంతో వణికిపోతుంది. కోర్టులో శిక్షలు పడటం చూసి వారి ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.' అని యోగి అన్నారు. ఆరేళ్ల క్రితం యూపీ అంటే అరాచకాలు, అల్లర్లకు గుర్తింపు ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని యోగి చెప్పుకొచ్చారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీరామ నవమి రోజు అల్లర్లు చెలరేగినా.. యూపీలో మాత్రం ప్రాశాంతంగా వేడుకలు జరిగాయని గుర్తుచేశారు. చదవండి: దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..? లెక్క చెప్పిన ప్రధాని మోదీ.. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేర పరిశోధన, ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరు, పీడీ చట్టం కింద కేసుల నమోదు, రైతు ఆత్మహత్యలు, కోర్టు కేసులు తదితర అంశాలపై డీజీపీ అంజనీకుమార్ శనివారం తన కార్యాలయం నుంచి సమీక్షించారు. సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్భగవత్, మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీ షికాగోయల్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి జోనల్ ఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజిటింగ్ వీసాలపై రాష్ట్రానికి వచ్చే విదేశీయుల కదలికలపైనా నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. విదేశీయులు రాష్ట్రంలో ఏ అనధికారిక సమావేశాల్లో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, పీడీయాక్ట్ కేసుల నమోదులో నిబంధనలను అనుసరించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో పీడీ చట్టం కేసుల నమోదు ఏకరీతిన ఉండాలని సూచించారు. పీడీ చట్టం ప్రయోగంపై కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నమోదులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వచ్చే వారంలో జరిగే శివరాత్రి పర్వదినం సందర్బంగా ఏ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్) లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో భారీ సంఖ్యలో పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవనున్న నేపథ్యంలో శిక్షణపై దృష్టి పెట్టాలన్నారు. పీడీ చట్టాల నమోదులో తీసుకోవలసిన జాగ్రత్తలపై హైకోర్టులో పోలీస్ శాఖ జీపీ ముజీబ్ వివరించారు. -
చేష్టలుడిగిన భద్రతా మండలి: కొరోసీ
ఐరాస: అత్యంత శక్తిమంతమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పూర్తిగా చేష్టలుడిగిందని ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు సబా కొరోసీ వాపోయారు. వర్తమాన కాలపు వాస్తవాలను అది ఎంతమాత్రమూ ప్రతిబింబించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధాలను నివారించి అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మండలి ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతోంది. దానికి కారణమూ సుస్పష్టం. దాని శాశ్వత సభ్య దేశాల్లోనే ఒకటి పొరుగు దేశంపై దురాక్రమణకు పాల్పడి ప్రపంచాన్ని తీవ్ర ప్రమాదంలోకి, సంక్షోభంలోకి నెట్టింది. ఈ దుందుడుకుతనానికి గాను రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల వీటో పవర్ కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడింది. అందుకే మండలిని సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది. మండలి కూర్పు రెండో ప్రపంచ యుద్ధానంతరపు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో జరిగింది. దాన్నిప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థల పనితీరు ఎలా ఉండాలనే విషయంలో రష్యా దురాక్రమణ పెద్ద గుణపాఠంగా నిలిచిందన్నారు. భారత పర్యటనకు వచ్చిన కొరోసీ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. -
ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. గుంటూరులో గురువారం రోజున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంరతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. చదవండి: (బెంచ్ మార్క్గా సీఎం జగన్ నిర్ణయం: సజ్జల రామకృష్ణారెడ్డి) -
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 2022 ఏడాదిలో పోలీస్ శాఖ సఫలీకృతమైనట్టు డీజీపీ ఎం.మహేందర్రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు సహా కొన్ని రకాల నేరాలు కొంత పెరిగినా...నేరస్తులకు శిక్షలు పడే శాతం గతేడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగి 56 శాతానికి చేరడం సంతృప్తినిచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఏడాది మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించగలిగామన్నారు. మతఘర్షణలు ఇతర నేరాల కట్టడిలో పోలీస్శాఖలోని అధికారులు, సిబ్బంది అంతా ఒక బృందంగా కలిసికట్టుగా పనిచేశారని డీజీపీ తెలిపారు. భవిష్యత్తులో సైబర్నేరాల ముప్పు మరింత పెరగనుందని, ఆ దిశగా పోలీస్శాఖ సమాయత్తమయ్యేలా ఎన్నో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం లక్డీకాపూల్లోని తెలంగాణ పోలీస్ కేంద్ర కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ 2022 వార్షిక నివేదిక, తెలంగాణ పోలీస్ ట్రాన్స్ఫార్మేషనల్ జర్నీ నివేదికలను విడుదల చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా నిలిచిన ఉప్పల్, కోదాడ టొన్, ఆదిలాబాద్ వన్టౌన్, లక్ష్మీదేవిపల్లి, సిరోల్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల)కు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేందర్రెడ్డి సుదీర్ఘంగా ప్రసగించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీస్శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలు, గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సరళి తదితర అంశాలను వివరించారు. నాలుగు మూల సూత్రాలతో ముందుకెళ్లాం.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షణతోపాటు మారుతున్న నేరసరళికి అనుగుణంగా మార్పు చెందేలా పోలీస్శాఖ బలోపేతానికి ప్రాసెస్, టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ అనే నాలుగు మూల సూత్రాలను అనుసరించినట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడ ఉన్నా భద్రంగా ఉన్నామన్న విశ్వాసాన్ని ప్రజల్లో, అదే సమయంలో తెలంగాణలో నేరం చేస్తే తప్పక పట్టుబడతామన్న భయాన్ని నేరస్తుల్లో తేగలిగామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడంలో పోలీస్తోపాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పర్చేలా తీసుకువచ్చిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్శాఖకు చేరిన అదనపు వనరుగా డీజీపీ పేర్కొన్నారు. రానున్న ఐదారేళ్లలో దేశంలోనే ఉత్తమ సంక్షేమ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ స్ట్రీట్ వెండార్స్తో సీసీటీవీల బిగింపు మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా నిఘా నేత్రాలుగా మారిన సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో తొలుత ఎన్నో అనుమానాలు ఉండేవని డీజీపీ గుర్తు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా తొలిసారి సీసీటీవీలను ఏర్పాటు చేసుకునేందుకు బంజారాహిల్స్లో తోపుడు బండ్ల వాళ్లు ముందుకు వచ్చారన్నారు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రజలు, పలు సంస్థలు, ఎన్జీఓల సహకారంతో ప్రస్తుతం 10,25,849 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరి పోలీస్శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. కాగా, దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో కమిషన్ నివేదిక హైకోర్టుకు సమర్పించిందని, దానిపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుందని, ఆ ప్రాసెస్ కొనసాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలిపారు. అన్ని రోడ్లపై స్పీడ్ లిమిట్కు సంబంధించిన సైన్బోర్డులు ఏర్పాటు చేసేలా ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుంటామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్భగవత్, అడిషనల్ డీజీలు నాగిరెడ్డి, సందీప్శాండిల్య, సంజయ్జైన్, ఐజీ కమలాసన్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్స్ ఈనెల 31తో తన పదవీ కాలం పూర్తవుతుందని, గత 36 ఏళ్లుగా తన వృత్తిగత జీవితంలో అనేక అవకాశాలు ఇచ్చిన అన్ని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, సీఎస్లు, ఇతర సిబ్బందికి అందరికీ డీజీపీ ఎం.మహేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన వృత్తిగత జీవితంలో మీడియా ఎంతో సహకరించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. -
రాష్ట్రంలో ప్రతి మహిళ సెల్ఫోన్లో ‘దిశ’ యాప్ ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం... తదితర అంశాలపై సీఎం జగన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు.. ‘దిశ’ చట్టం ప్రగతిపైనా సీఎం సమీక్ష.. – రాష్ట్రంలో ‘దిశ’ అమలుపై సీఎం జగన్ సమీక్షించారు. – ఇప్పటివరకూ 74,13,562 ‘దిశ’ యాప్ను డౌన్లోడ్స్ చేశారని వెల్లడించిన పోలీసు అధికారులు. – దిశ యాప్ ద్వారా 5,238 మందికి సహాయం. – దిశ యాప్ ద్వారా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లు 2021లో 684. – నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేశామన్న పోలీసులు. – వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్నదానిపై నిరంతరం మెసేజ్లు పంపిస్తున్నామన్న పోలీసులు. – దిశ పోలీస్స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చిందన్న పోలీసు అధికారులు. – మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామన్న పోలీసులు. – జీరో ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేస్తున్నామన్న పోలీసులు. – ఫోరెన్సిక్ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటులో వేగం పెరిగిందన్న పోలీసులు. – గతంలో డీఎన్ఏ రిపోర్టుకోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 2రోజుల్లో నివేదిక వస్తుందన్న పోలీసులు. - సంబంధిత కేసుల్లో 7 రోజుల్లో ఛార్జిషీటు వేయగలుగుతున్నామన్న పోలీసులు. ప్రతి మహిళ సెల్ఫోన్లో ‘దిశ’ యాప్ ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్లో ‘దిశ’యాప్ డౌన్లోడ్ కావాలి. వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి. ‘దిశ’యాప్పై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ‘దిశ’యాప్ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలి’’ అని సూచించారు. ‘దిశ’ బిల్లు ఆమోదం ఏ దశలో ఉందో అధికారులు సీఎం జగన్కి వివరాలు అందించారు. శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్లో ఉండడం సరికాదని సీఎం జగన్ అభిపప్రాయపడ్డారు. వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సీఎం సమీక్ష సమీక్ష నిర్వహించారు. పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్లో ఉన్నాయని.. డిసెంబర్ నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. (చదవండి: AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’) మహిళలపై నేరాలకు సంబంధించిన 12 కోర్టులు ఆపరేషన్లో ఉన్నాయని.. కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందని పోలీసులు తెలిపారు. ఈ కోర్టుల్లో గవర్నమెంటు ప్లీడర్లను పూర్తిస్థాయిలో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు.ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలన్న సీఎం, దీనికోసం సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం, వారి పనితీరుపైనా కూడా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ‘దిశ’ ఒన్స్టాప్ సెంటర్ల పనితీరుపైనా, సచివాలయాలల్లో మహిళా పోలీసుల వ్యవస్థపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకూ 2,652 కేసులను దిశ ఒన్స్టాప్ సెంటర్ల ద్వారా హేండిల్ చేశామని అధికారులు తెలిపారు. దేవాలయాల్లో భద్రతకోసం 51,053 సీసీ కెమెరాలు పెట్టించామన్నారు అధికారులు. బాధితులకు సత్వర న్యాయంపై దృష్టిపెట్టండి’: సీఎం జగన్ ‘‘అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. శరవేంగా బాధితులను ఆదుకోవాలి. వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలి. ఘటన జరిగిన నెలరోజుల్లోపు బాధిత కుటుంబాలకు అందజేయాలి. ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి’’ అని సీఎం జగన్ సూచించారు. (చదవండి: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్’ ) సైబర్ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు సీఎం ఆదేశం ‘‘సైబర్ క్రైం నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి. సమర్థత ఉన్న అధికారులను, సమర్థవంతమైన న్యాయవాదులను ఇందులో నియమించండి. ఏపీలో డ్రగ్స్ వ్యవహారం నిజం కాదని తెలిసికూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి’’ అన్నారు సీఎం జగన్. కేసుల సంఖ్యను పట్టించుకోవద్దు.. ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకొచ్చే పరిస్థితుల కల్పనే ముఖ్యం అన్నారు సీఎం జగన్. బాధితులు స్వేచ్ఛగా ముందుకురావాలి, వారు ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. బాధితుడికి భరోసాగా పరిస్థితులు ఉండడం అన్నది ముఖ్యం అన్నారు సీఎం జగన్. (చదవండి: మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: అడవి శేషు) కాలేజీలు, యూనివర్శిటీలు డ్రగ్ ఫ్రీగా ఉండాలి కాలేజీలు, యూనివర్శిటీలు ‘మాదక ద్రవ్య రహితంగా తయారు కావాలి. ఇందుకుగాను తక్షణ చర్యలకు సీఎం జగన్ ఆదేశించారు. ‘‘రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ ఉండాలి. మాదకద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయా.. లేవా.. సమీక్షించాలి. ఉంటే డ్రగ్స్ని ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండకూడదు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించండి’’ అని సూచించారు. ‘మద్యం అక్రమ తయారీ, రవాణాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. – రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, అక్రమ రవాణాలపై ఎస్ఈబీ సహా... పోలీసులు ఉక్కుపాదం మోపాలి. – అధికారంలోకి రాగానే 43వేల బెల్టుషాపులు తీసేశాం.. మద్యం అమ్మే దుకాణాలను మూడోవంతు తగ్గించాం. – ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి, మద్యం రేట్లు పెంచడం వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది – మద్యం అక్రమ రవాణా, తయారీకి ఆస్కారం ఇవ్వకూడదు. – దీన్ని నిరోధించడానికి అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. – ఎస్ఈబీతోపాటు, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి. – ఇసుక అక్రమ రవాణాపైన కూడా చర్యలు తీసుకోవాలి. – గుట్కా నిరోధంపైనా కూడా దృష్టిపెట్టాలి. – ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులను నియమించాం. – ఈ మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వాలి.. డిసెంబరు నాటికి పూర్తిచేయాలి. – వచ్చే ఏడాది కనీసంగా 6 నుంచి 7వేల మంది పోలీసుల నియామకాలపై దృష్టిపెట్టాలి. – దీనికి సంబంధించి సంబంధిత శాఖలు సిద్ధం కావాలన్న సీఎం జగన్ సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఇంటలిజెన్స్ చీఫ్ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, వివిధ రేంజ్ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: దిశ యాప్ ఉంటే.. ఓ అన్న మీ వెంట ఉన్నట్టు..! -
లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది: ఉత్తమ్
మఠంపల్లి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని, పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఈనెల 13న స్థానిక సేవాలాల్ జాతరలో టీఆర్ఎస్ కార్యకర్తలు జరిపిన దాడిలో ఇళ్లు ధ్వంసమై, తీవ్రంగా గాయపడిన బాధిత కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఎంపీ సంతోష్ ద్వారా డీజీపీకి ఆదేశాలిప్పిస్తూ, పోలీసు అధికారులను అనుకూలమైన చోటుకు బదిలీ చేయించుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలపై డీజీపీకి లేఖ రాస్తానని తెలిపారు. -
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్లు.. ఇద్దరిపై కేసు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేసిన ఇద్దరిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరి పోస్టింగ్లపై పోలీసులు సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాలు సింగ్ హిందీలో, మహ్మద్ కలీం ఉర్దులో పోస్టింగ్లు పెట్టడంతో ఇద్దరూ విద్వేశాలు రెచ్చగొట్టడంతోపాటు లా అండ్ ఆడర్ సమస్య తలెత్తే విధంగా ఉన్నాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్లో అల్లర్లకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారం ఉందని సీఎం అన్నారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తుందని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, అడిషనల్ డీజీపీ జితేందర్, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, వై.నాగిరెడ్డి, నిజామాబాద్, వరంగల్ ఐజీలు శివశంకర్రెడ్డి, ప్రమోద్కుమార్ పాల్గొన్నారు. మాకు పక్కా సమాచారం ఉంది.. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫొటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపులకు దిగుతున్నారు. సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు ఈ అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలూ హైదరాబాద్లో నడవవని అరాచకశక్తులకు తెలిసింది. దీంతో మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని ఏ కరీంనగర్లోనో, వరంగల్లోనో, ఖమ్మంలోనో, మరోచోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఏదోచోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థన మందిరాల దగ్గర ఏదో ఒక వికృతచేష్ట చేయాలని చూస్తున్నారు. అలాచేసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పెద్దఎత్తున గొడవలతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది’అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించొద్దు.. ‘హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయవద్దు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కడుపు, నోరు కట్టుకుని నిబద్ధతతో పనిచేసి రాష్ట్రాన్ని ఓ దరికి తెచ్చాం. శాంతిభద్రతల పరిరిక్షణలో రాజీలేకుండా వ్యవహరిస్తున్నాం. పేకాట క్లబ్బులు, గుడుంబాలాంటి మహమ్మారులను దూరం చేశాం. సంఘ విద్రోహశక్తులు, మాఫియా, విచ్చిన్నకర శక్తులపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలు చూశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. శాంతిభద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహశక్తుల అణచివేతలో ప్రభుత్వం మొదటి నుంచి రాజీలేని ధోరణి అవలంభిస్తున్నది. కాబట్టే నేడు హైదరాబాద్ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నాయి. ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎవరి పని వారు ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అనే మంచి పేరొచ్చింది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. యువకులకు ఉపాధి దొరుకుతున్నది. హైదరాబాద్ మహా నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు కోటీ 60 లక్షల జనాభా ఉంది. ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికున్న ప్రధాన బాధ్యత. ప్రభుత్వానికి ఈ రాష్ట్రం బాగుండటం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండటం, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించటం ముఖ్యం. తెలంగాణకు గుండెకాయలాంటి ప్రశాంత హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ఘర్షణలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రశాంతతను ఫణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదు. ఘర్షణలు సృష్టించే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఎంతటి వారినైనా సరే, వారు అధికార పార్టీ సభ్యులైనా సరే వదలొద్దు. ఎక్కడికక్కడ సమాచారం సేకరించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలి’అని సీఎం పోలీసులకు స్పష్టం చేశారు. ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి.. ప్రశాంత హైదరాబాద్లో మతచిచ్చు పెట్టడానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువకులను కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు. పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని, ఎట్టి పరిస్థితుల్లో అరాచక, సంఘ విద్రోహశక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీనిచ్చారు. హైదరాబాద్లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఎక్కడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనా జరగకుండా చూస్తామని తెలిపారు. -
ఎన్నికల పేరుతో కుట్రలు చేస్తున్నారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల మాటల తూటాలతో హైదరాబాద్లో వాతావరణం వేడెక్కింది. ప్రచారంలో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. చదవండి: గ్రేటర్ వార్ : ఉచితంగా తాగునీరు అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఉందన్న కేసీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను అడ్డు పెట్టుకొని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని అన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. చదవండి: సర్జికల్ స్ట్రైక్ అంటే కంగారెందుకు: విజయశాంతి -
బిహార్లో నేరాలు తగ్గాయా, పెరిగాయా?
సాక్షి, న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీకి మూడ విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర శాంతి భద్రతల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ‘తిరిగి లాలూ ప్రసాద్ యాదవ్ గూండా రాజ్యం కావాలా? లేదా రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎంతో మెరగుపర్చిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం కావాలా?’ అంటూ నితీష్ కుమార్ పార్టీ అయినా జేడీయూతోపాటు దాని మిత్రపక్షమైన బీజేపీ తెగ ప్రచారం కొనసాగిస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్, తన భార్య రాబ్డీదేవీతో కలసి 1990 నుంచి 2005 సంవత్సరం వరకు బీహార్ రాష్ట్రాన్ని పాలించారు. ఆ తర్వాత 2005 నుంచి 2014లో కొన్ని నెలలు మినహా ఇప్పటి వరకు దాదాపు 15 ఏళ్లపాటు నితీష్ కుమార్ పాలించారు. మొదటి విడత ఎన్నికల ప్రచారంలో, ఆదివారమే ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారంలో, నవంబర్ ఏడవ తేదీన జరుగనున్నన మూడవ విడత ఎన్నికల ప్రచారానికి కూడా రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితే ప్రధానాంశం అయినందున నాటి లాలూ ప్రసాద్ హయాంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది ? నితీష్ కుమార్ హయాంలో పరిస్థితిలో మార్పు వచ్చిందా ? నిజంగా శాంతి భద్రతలు మెరగుపడిందా ? ‘నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో’ డేటాను పరిశీలించడం ద్వారా ఏది వాస్తవమో, ఏదవాస్తవమో, ఏ మేరకు వాస్తవమో సులభంగానే గ్రహించవచ్చు. 2018 సంవత్సరం దేశవ్యాప్తంగా నేరాల సరాసరి సగటు రేటు లక్ష జనాభాకు 300లకు పైగా ఉండగా, బీహార్లో నేరాల రేటు సగటు రేటు లక్ష జనాభాకు 222.1 శాతం మాత్రమే ఉందని నితీష్ కుమార్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలనే ప్రస్థావించింది. 2018 సంవత్సరానికి బీహార్లో ఐపీసీ, ఎస్ఎల్ఎల్ కింద మొత్తం 2,62,815 కేసులు నమోదయ్యాయి. ఇది లక్ష జనాభాకు 222.1 శాతం సగటని చెప్పడం కూడా సబబే. అదే 2016లో 1,89,696 కేసులు, 2017లో 2,36,055 కేసులు నమోదయ్యాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉందనే అంశంతో సంబంధం లేకుండా 2001 సంవత్సరం నుంచి బీహార్లో ఏటేటా నమోదవుతున్న నేరాల సంఖ్య పెరగుతూనే వస్తోంది. నేరాల సంఖ్యలో బీహార్ దేశంలోనే 23వ స్థానంలో ఉందని నితీష్ ప్రభుత్వం చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుందని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. దేశం మొత్తంగా జరిగిన నేరాల్లో 5.2 శాతం నేరాలు ఒక్క బీహార్లో జరిగినవేనని, నేరాల సంఖ్య విషయంలో దేశంలో బీహార్ ఏడవ స్థానంలో ఉంది. లక్ష జనాభాతో పోల్చినప్పుడే అది 23వ స్థానంలో కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదైన నేరాలను మాత్రమే తాము పరిగణలోకి తీసుకున్నామని, ఎఫ్ఐఆర్ నమోదుకానీ కేసులను పరిగణలోకి తీసుకోలేదని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సబ్ ఇనిస్పెక్టర్ ఉమేశ్ కుమార్ తెలిపారు. రేప్లు, కులులు, మతాల మధ్య జరిగే కలహాలు, భూముల వివాదాలపై ఎక్కువగా ఎఫ్ఐఆర్లు దాఖలు కావు. బీహార్లో 60 శాతం నేరాలు భూ తగాదాల కారణంగానే జరగుతాయి. ఈ తగాదాల కారణంగా బీహార్లో 2018 సంవత్సరంలో 1,016 మంది హత్యకు గురయ్యారు. వీటిని పరిగణలోకి తీసుకున్నట్లయితే రాష్ట్రంలో జరిగిన హత్యలు 34.6 శాతం. ఇంకా దేశంలో ఎక్కడా లేనివిధంగా జల వివాదాల కారణంగా బీహార్లో 44 మంది హత్యకు గురయ్యారు. ఇక మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో కూడా దేశంలోనే బీహార్ 29వ స్థానంలో ఉందని చెప్పడం కూడా ఒక విధంగా వక్రీకరించడమేనని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఇందులో 33 రేప్లు, 23 కిడ్నాప్లు, 11 హత్యలు మాత్రమే పరిగణలోకి వచ్చాయి. వాస్తవానికి వీటి విషయంలో బీహార్ ఎనిమిదవ స్థానంలో ఉంది. వాస్తవానికి రేప్ల విషయంలో బీహార్ రెండో స్థానంలో, కిడ్నాప్ల విషయంలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. 2016 నాటి గణాంకాలతో పోలిస్తే గతేడాదికి 42 శాతం పెరిగాయి. అవే హత్యలు 20 శాతం పెరిగాయి. 2016లో 2,581 హత్యలు జరగ్గా, గతేడాది 3,138 హత్యలు జరిగాయి. అలాగే 2016తో పోలిస్తే గతేడిదాకి రేప్లు 44 శాతం పెరిగాయి. నితీష్ కుమార్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2005 నుంచి 2010 మధ్యనే బీహార్లో నేరాలు తగ్గాయని, ఆ తర్వాత పెరగుతూనే వచ్చాయని పట్నాలో సెక్యూరిటీ సంస్థ నడుపుతున్న ఆర్కే కాంత్ పేర్కొన్నారు. -
బాబోయ్ ఆ డ్యూటీలా.. వద్దే వద్దు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ పోలీసు కమిషరేట్లో పోస్టు అంటే ఏ పోలీసు అధికారి అయినా ఎగిరి గంతేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేయలేమని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే లూప్లైన్లో పనిచేయడానికైనా సిద్ధమంటున్నట్లు తెలుస్తోంది. తీరిక లేని విధులే ఇందుకు కారణమని సమాచారం. ప్రస్తుత పని విధానం.. ప్రతిరోజు డ్యూటీలో చేరిన వెంటనే టెలీ కాన్ఫరెన్స్కు హాజరు కావాలి. తరువాత స్టేషన్ పరిధిలో అప్పటి వరకు ఉన్న కేసులు పరిశీలించడంతో పాటు వీఐపీల రాక వంటి బాధ్యతలు చూసుకోవాలి. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్, మళ్లీ రాత్రికి వాహనాల తనిఖీ, వీటితో పాటు నిత్యం స్టేషన్లకు వచ్చే కేసుల దర్యాప్తు ఉండనే ఉంటుంది. వీటితో వీక్లీ ఆఫ్లు సరిగా వినియోగించుకోలేని పరిస్థితి. కొత్తగా స్టేషన్లలో విధుల్లో ఉన్న యువ ఎస్ఐలూ మా వల్ల కాదంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ విభాగం పరిధిలోని స్టేషన్లలో కొందరు ఉన్నతాధికారులు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. వీరంతా కొంత కాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఎందుకీ పరిస్థితి.. నగర కమిషనరేట్ పరిధిలో చిన్నచిన్న ఘటనలపైనా మినిట్ టూ మినిట్ వాకబు ఉంటోంది. అధికారులు ఫోన్లలోనే పరిస్థితిని సమీక్షిస్తారు. చిన్న పొరపాట్లకు చార్జీ మెమోలు జారీ. దీంతో మానసిక వేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. పోలీసు బాస్లు మారిన ప్రతిసారి ఆయా పోలీసు అధికారుల తీరు నచ్చకపోతే వారి స్థానంలో కొత్త వారు రావడం సహజంగా జరిగే పనే. అయితే ప్రస్తుతం పనితీరు బాగున్నా కొందరు అధికారులను తప్పించేందుకు కొందరు పావులు కదుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ నగరంలో కీలకమైన ఓ జోన్ పరిధిలోని ఓ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు ఇటీవల తాను శాంతిభద్రతల విభాగంలో పనిచేయలేనని ఓ ఉన్నతాధికారికి తేల్చిచెప్పగా.. మరో అధికారి ఆ జోన్లో ఫోకస్ పోస్ట్ వద్దు బాబోయ్.. లూప్లైన్లో పనిచేస్తానని ఉన్నతాధికారి వద్ద మొర పెట్టుకున్నట్లు తెలిసింది. ఇలా నగర కమిషనరేట్ పరిధిలో పలువురు అధికారులు లూప్లైన్లో పనిచేయడానికి ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్, ఎస్బీ విభాగాలకు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నట్లు తెలిసింది. పోలీసులపై ఒత్తిడి లేదు.. నగర కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదు. అందరూ సమన్వయంతో పనిచేయాలంటున్నాం. విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇచ్చాం. ప్రస్తుతం పోలీసులు సమర్ధవంతంగా పనిచేయడం వలనే పెండింగ్లో ఉన్న 10 వేల కేసులను నాలుగు వేలకు తీసుకురాగలిగాం. పోలీసుల పనితీరు వల్లే ఇది సాధ్యమైంది. పనితీరు బాగాలేకపోతే వారి స్థానంలో కొత్త వారు వస్తారు. –బత్తిన శ్రీనివాసులు, నగర పోలీసు కమిషనర్, విజయవాడ -
శాంతి భద్రతలు అదుపు తప్పాయి : భట్టి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందని, పోలీసు యంత్రాంగం ప్రజల కోసం పనిచేయడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఒక్క హైదరాబాద్లోనే రెండేళ్లలో వేలమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, రోజుకు ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. భట్టి అధ్యక్షతన గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. దిశ ఘటన తమను తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆసిఫాబాద్, వరంగల్లో మహిళలపై జరిగిన ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితులకు ఉరిశిక్ష పడాలని అభిప్రాయపడ్డారు. మహిళలపై దాడులకు మద్యమే ప్రధానకారణంగా కనిపిస్తోందన్నారు. మద్యాన్ని నియంత్రించాలి మద్యం నియంత్రణ కోసం శనివారం ట్యాంక్బండ్ నుంచి రాజ్భవన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి గవర్నర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి చార్జీల పెంపు పేరుతో ఆ భారాన్ని ప్రజలపై ఎందుకు మోపారో అర్థం కావడం లేదన్నారు. సీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (మునుగోడు), పొడెం వీరయ్య (భద్రాచలం)లు గైర్హాజరయ్యారు. భట్టితో పాటు శ్రీధర్బాబు, సీతక్క, జగ్గారెడ్డి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. -
ప్రియాంక హత్య: ‘సున్నా’తో పరిధి సమస్య ఉండదు!
సాక్షి, హైదరాబాద్ : ప్రియాంకరెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేయించడానికి ఆమె కుటుంబీకులు బుధవారం అర్ధరాత్రి రెండు ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇది కేవలం వీరొక్కరికే కాదు... ఏటా అనేక మంది బాధితులకు ఎదురవుతున్న సమస్య. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం జ్యురిస్డిక్షన్లోకి (పరిధి) వచ్చే అంశాలను మాత్రమే కేసుగా నమోదు చేయాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇది ఇక్కడా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రియాంక కేసు స్పష్టం చేసింది. ఠాణాల పరిధులు తెలుసుకోవడం సామాన్యుడికే కాదు ఒక్కోసారి పోలీసులకూ ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిధుల సమస్య ఎక్కువగా ఒకచోట నుంచి మరో చోటుకి ప్రయాణాల నేపథ్యంలో జరిగే మిస్సింగ్, చోరీ, యాక్సిడెంట్ కేసుల్లో ఉత్పన్నమవుతోంది. ప్రతి పోలీసు స్టేషన్కు జ్యురిస్డిక్షన్గా పిలిచే అధికారిక పరిధి ఉంటుంది. ఆయా పరిధుల్లో జరిగిన నేరాలపై మాత్రమే సదరు ఠాణా అధికారులు కేసు నమోదు చేస్తుంటారు. దీన్ని విస్మరిస్తే చట్ట పరంగా అధికారులు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు చెప్తుంటారు. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. అప్పటికే సమస్య ఎదురైన, ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొని నష్టపోయిన బాధితులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు పోలీసుల పట్ల వ్యతిరేక భావాన్ని కలిగేలా చేస్తోంది. ఇలాంటి సమస్యల పరిష్కారానికే ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానం అమలు చేస్తున్నారు. బాధితుడి నుంచి అందుకున్న ఫిర్యాదును పోలీసుస్టేషన్లో కేసుగా నమోదు చేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేస్తారు. ప్రతి ఎఫ్ఐఆర్కు సీరియల్ నెంబర్/ఆ సంవత్సరం సూచిస్తూ సంఖ్య కేటాయిస్తారు. ముంబైలో పరిధులు కాని నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఎలాంటి నెంబర్ కేటాయించకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేస్తున్నారు. 2014లో వెలుగులోకి వచ్చిన సంచలనం సృష్టించిన ముంబై మోడల్పై అఘాయిత్యం కేసే దీనికి ఉదాహరణ. 2013 డిసెంబర్ 31న కొందరు దుండగులు కుట్రతో ముంబై మోడల్ను హైదరాబాద్కు తీసుకువచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. చదవండి : శంషాబాద్లో మరో ఘోరం స్ఫృహలో లేని స్థితిలో ఉన్న ఆమెను ముంబై పంపేశారు. అక్కడకు చేరుకున్న ఆమె వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ‘జీరో ఎఫ్ఐఆర్’తో కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ నేపథ్యలంలో ఉదంతం హైదరాబాద్లో జరిగినట్లు గుర్తించిన అక్కడి పోలీసులు కేసును ఇక్కడకు బదిలీ చేశారు. దాదాపు ప్రతి ఉదంతంలోనూ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేసి, సంబంధిత స్టేషన్కు బదిలీ చేసే ఆస్కారం ఉంది. బాధితుడు ఠాణాకు వచ్చినప్పుడు పరిధులు పేరు చెప్పి తిప్పడం కంటే ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ప్రాథమిక విచారణ చేపడితే ఉత్తమం అని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రియాంక హత్య; అనేక ప్రశ్నలు ప్రియాంక హత్యపై స్పందించిన నిర్భయ తల్లి అందుకే ఆలస్యం: సీపీ సజ్జనార్ -
రెచ్చిపోతున్న అల్లరిమూకలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రశాంతమైన అందరూ ఇష్టపడే ఖమ్మం నగరం ఇప్పుడు అల్లరిమూకలకు అడ్డాగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో బ్యాచ్లుగా విడిపోయి, రోడ్లమీదే తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా పోలీసులకు పట్టడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ జీపు పక్క నుంచే వెళ్తున్నా.. ఖమ్మం నగరంలో దాదాపుగా శాంతిభద్రతలు అదుపు తప్పాయని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీస్ జీపు పక్క నుంచే వెళ్తున్నా, అందులో పోలీస్ అధికారి ఉన్నా రోడ్డుపైనే తన్నుకుంటున్నారు. కనీసం పోలీసులు వస్తున్నారనే మర్యాద కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొందరైతే పోలీస్ స్టేషన్లో పోలీసులనే దుర్భాషలాడుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఖమ్మంలోని రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా రాడ్లు , కర్రలతో పోలీసుల ముందే తన్నుకుంటున్నా, అడ్డుకోబోయిన పోలీస్ సిబ్బందిని నెట్టివేసినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులతోపాటు, రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని, దీంతో ఏమీ చేయలేకపోతున్నామని పోలీస్ అధికారులు వాపోతున్నారు. రోడ్లపై ఘర్షణలకు పాల్పడుతున్న అల్లరిమూకలను స్టేషన్కు తీసుకొచ్చిన 10 నిమిషాలలోపే రాజకీయ నాయకులు ప్రత్యక్షమవుతున్నారని, చివరకు శబ్ద కాలుష్యం ఏర్పడే డీజేలను స్టేషన్కు తరలించినా పైరవీలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తప్పుదారి పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతల అదుపుకోసం అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు , బ్లూకోల్ట్స్ ఏర్పాటు చేసినా అల్లరిమూకలను అదుపు చేసే పరిస్థితి కనిపించడంలేదు. గతంలో స్టేషన్కు ఒక్క పోలీస్ జీప్ ఉన్నా శాంతి భద్రతలను అదుపులో ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదనే విమర్శలు వినపడుతున్నాయి. త్రీటౌన్ పరిధిలో.. నిత్యం వ్యాపారాలతో కళకళలాడే త్రీటౌన్ గ్యాంగ్వార్లకు అడ్డాగా మారిపోయింది. యువకులు రోడ్డుమీదనే తన్నుకుంటున్నా పట్టించుకోనే దిక్కులేదు. పంపింగ్వెల్రోడ్, గాంధీనగర్, వ్యవసాయమార్కెట్ ప్రాంతం, బొక్కలగడ్డ , సారథీనగర్ , జూబ్లీపుర , ప్రకాష్నగర్ ప్రాంతాల్లో ఆకతాయిలు ఎక్కువై అర్ధరాత్రి వరకు మద్యం, గంజాయి వంటివి సేవించి ద్విచక్రవాహనాలు అతివేగంతో నడుపుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు గ్యాంగ్లను పెంచి పోషిస్తూ్త తమ పబ్బం గడుపుకుంటున్నారని, కొందరు పోలీస్ సిబ్బంది కూడా సాయం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో అల్లరిమూకలు మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. వనటౌన్, టూటౌన్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చొరవ తీసుకుని శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చే పోలీస్ అధికారులు సైతం కరువయ్యారనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి అల్లరిమూకలను, వారిని రెచ్చగొడుతున్నవారిపై ఉక్కు పాదం మోపకపోతే ఖమ్మం మరో బెజవాడగా మారే అవకాశం ఉందని, సామాన్యులకు రక్షణ ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్రీటౌన్ సీఐ సీహెచ్. శ్రీధర్ను వివరణ కోరగా.. అల్లరి మూకలపై గట్టి నిఘా పెట్టామని తెలిపారు. రెండుసార్లకు మించి అరెస్ట్యితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అన్నారు. -
సూర్యాపేటలో 30 పోలీస్ యాక్ట్
సాక్షి, సూర్యాపేట : హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని, అక్టోబర్ 24వతేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అధికారుల అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారొకో, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి వీలులేదన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకూడదనే ఈ యాక్ట్ను అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఉత్తర్వుల్లో వెల్లడించారు. -
వదంతులను ప్రచారం చేస్తే సహించేది లేదు
-
నేరాలపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నేరాల అదుపుతోపాటు, శాంతిభద్రతలపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఆ దిశగా సమాయత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశంతో ప్రభుత్వ ప్రాథమ్యానికి తగ్గట్టుగా రక్షక భట యంత్రాంగం కార్యరంగంలోకి దిగింది. అసాంఘిక కార్యకలాపాలు, అన్ని రకాల నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సమాజానికి రుగ్మతగా మారిన అనేక రకాల అరాచకాలను అరికట్టేందుకు పోలీసులు దాడులు విస్తృతం చేశారు. క్రికెట్ బెట్టింగ్లు, గాంబ్లింగ్ క్లబ్లు(పేకాట స్థావరాలు), గంజాయి, గుట్కా స్మగ్లింగ్లపై మెరుపుదాడులు తీవ్రతరమయ్యాయి. ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ‘స్పందన’ను ప్రజలు కూడా బాగా వినియోగించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లడానికి భయపడే జనం ఇపుడు ఈ కార్యక్రమం ద్వారా తమకు జరిగే అన్యాయాలను చెప్పుకుంటున్నారు. పోలీసుల తక్షణ చర్యలతో చాలా ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తోంది. కొత్త అంశాలు కూడా ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. తక్షణం స్పందిస్తున్న పోలీసులు... వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరాలపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. పోలీసులు దాడులు, నమోదు చేసిన కేసుల వివరాలను పరిశీలిస్తే ..నిషేదిత గుట్కాను రవాణా చేస్తున్న స్మగ్లర్లు, అమ్మకందార్లపై 888 కేసులు నమోదు చేసి 1,251 మందిని అరెస్టు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద 107 కేసులను నమోదు చేసి 325 మందిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ చట్టం కింద 1,026 కేసులను నమోదు చేసి 1,147 మందిని జైలుకు పంపారు. పేకాట క్లబ్లపై వరుస దాడులు నిర్వహించి 3,180 కేసుల్లో 9,787 మంది జూదరులను కటకటాల వెనక్కు పంపారు. క్రికెట్ బుకీల స్థావరాలపై దాడులతో 205 క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదయ్యాయి. ‘స్పందన’లో చాలా సమస్యలు వెలుగులోకి.... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రతీ సోమవారం పోలీసు శాఖ చేపట్టిన స్పందన కార్యక్రమానికి బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని ఎస్పీల కార్యాలయాలు, నగర పోలీస్ కమిషనరేట్ల వద్ద దీన్ని నిర్వహిస్తున్నారు. గత నాలుగు సోమవారాల్లో నిర్వహించిన స్పందనలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,079 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. వాటిలో 9,791 ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంతో 97శాతం ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్టు అయ్యింది. స్పందనలో ప్రధానంగా మహిళలపై నేరాలు, సివిల్ వివాదాలు, సెటిల్మెంట్లు, ఆస్థి సంబంధమైన గొడవలు ఎక్కువగా వస్తుండటంతో పోలీసులు ప్రధానంగా వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్పందన ఫిర్యాదుల్లో సివిల్ వివాదాలు 1,900 (19శాతం), మహిళలపై నేరాలు 1,837 (15శాతం), ఆస్తిసంబంధమైన వివాదాలు 1,145 (8శాతం), వైట్ కాలర్ నేరాలు 873(4.7శాతం), కుటుంబ తగాదాలు 472 కేసులతోపాటు ఇతర నేరాలు(15శాతం) ఉన్నాయి. స్పందనలో అత్యధిక విజ్ఞాపనలు వచ్చి పరిష్కరించిన వాటిలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు రూరల్ జిల్లాలు ఉన్నాయి. ‘కోడ్’ ఉల్లంఘనలో టీడీపీవారిపైనే ఎక్కువ కేసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, దాడులు, ఘర్షణలు వంటి కేసులు... 2014లో టీడీపీకి చెందిన వారిపై 2,162 కేసులు, వైఎస్సార్సీపీకి చెందిన వారిపై 1,877 కేసులు నమోదయ్యాయి. 2019 ఎన్నికల్లో టీడీపీకి చెందిన వారిపై 2,049 కేసులు, వైఎస్సార్సీపీకి చెందిన వారిపై 2,038 కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలపై రాజీ లేదు..డీజీపీ గౌతమ్ సవాంగ్ శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా గట్టి చర్యలు చేపట్టాం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పలు నేరాల్లో మొదటి పది స్థానాల్లో ఉంది. దీనిపై ప్రధానంగా దృష్టి సారించాం. మహిళలపై నేరాలు, మానవ అక్రమ రవాణా, ఎస్సీ, ఎస్టీలపై దాడులు, సివిల్ సెటిల్మెంట్లు, సైబర్ క్రైమ్ రేటు తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. నేరస్తులకు శిక్ష పడేలా పక్కా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుమందు పెడతాం. తప్పు చేయడానికి అసాంఘిక శక్తులు భయపడేలా మా ప్రయత్నాలున్నాయ్. నేర నిరూపణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. త్వరలో ప్రతీ ఇంటికీ ఒక సీసీ కెమెరా ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతాం. సమాజంలో ప్రజలు శాంతిభద్రతలతో జీవించేలా పోలీసులుగా మా వంతు కర్తవ్యాన్ని త్రికరణశుద్ధితో నిర్వర్తిస్తాం. రాజకీయ హింస తగ్గుముఖం.. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తరువాత రాజకీయ హింస గణనీయంగా తగ్గింది. దాదాపు 31 శాతం రాజకీయ హింస తగ్గినట్టు పోలీసు అధికారులు లెక్కలు తేల్చారు. దీనికితోడు ఎన్నికలు, దాని అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను 2014తో పోల్చితే 2019లో 15శాతం తక్కువేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 2014లో మొత్తం 908, 2019లో 628 హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఎన్నికల ముందు 2014లో 345, 2019లో 198 సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ సందర్భంగా 2014లో 276, అదే 2019లో 301 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల అనంతరం 2014లో 284 ఘటనలు, 2019లో 129 ఘటనలు జరగడం గమనార్హం. ఎన్నికల సమయమైన 2014 మే, జూన్ మాసాల్లో 3,874 కేసులు, అదే 2019 మే, జూన్ మాసాల్లో 3,323 కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల సమయంలో గుంటూరు రూరల్లో 158 ఘటనలు, అనంతపురం జిల్లాలో 90, తూర్పుగోదావరి జిల్లాలో 87, కడప జిల్లాలో 60, నెల్లూరు జిల్లాలో 54 ఘటనలతో వరుస స్థానాల్లో నిలిచాయి. -
జైపూర్లో ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు
జైపూర్ : జైపూర్లోని శాస్రి నగర్లో సోమవారం ఓ వ్యక్తి ఏడేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో అక్కడ పరిస్థితులు ఉధృతంగా మారాయి. అయితే నగరంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం వరకు పొడిగించినట్లు డివిజనల్ కమిషనర్ కేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవకుండా, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించామని పేర్కొన్నారు. రామ్గంజ్, గాల్టా గేట్, మనక్ చౌక్, సుభాష్ చౌక్, బ్రహంపూర్, నహర్గర్, కొత్వాలి, సంజయ్ సర్కిల్, శాస్రి నగర్, భట్టా బస్తీ, లాల్ కోతి, ఆదర్శ్ నగర్, సదర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 10గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, అత్యాచారానికి గురైన ఏడేళ్ల బాలికకు జైపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్లు తెలిపారు. -
శాంతిభద్రతలకు మొదటి ప్రాధాన్యత
-
నాలుగో సింహానికి మూడో నేత్రం
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్ ప్రొటెక్షన్ వింగ్ వంటి వినూత్న పద్ధతులతో ముందుకు సాగుతున్న రాష్ట్ర పోలీసులు మరో కొత్త ప్రయత్నా నికి శ్రీకారం చుట్టారు. పోలీసింగ్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు శాంతి భద్రతల విభాగం పోలీసులకు బాడీ వోర్న్ కెమెరా లేదా చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు ఇవ్వనున్నారు. ఇవి స్థానిక ఎస్పీ, కమిషనరేట్లతో పాటు, డీజీపీ ఆఫీసుకు కూడా అనుసంధానమై ఉంటాయి. ఫలితంగా ఘటనాస్థలంలో జరుగుతున్న కార్యక్రమాలను డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులు కూడా ప్రత్యక్షంగా వీక్షించగలరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో అన్ని జిల్లాల్లోని ముఖ్యమైన 10 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి వీటిని పంపిణీ చేశారు. తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లకు అందజేస్తారు. అందజేసిన సిబ్బందికి హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో వీటి వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. రాజధానిలో ఫలితాలివ్వడంతో..! చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు హైదరాబాద్లో ట్రాఫిక్ విభాగం పోలీసులు చాలా కాలం నుంచే అమలు చేస్తున్నారు. రాజధానిలో ధర్నాలు జరిగినప్పుడు వీటిని సివిల్ పోలీసులు వినియోగించారు. హైదరాబాద్లో సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు పంపిణీ చేయాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ఘటనాస్థలంలో సాక్ష్యాధారాల సేకరణకు ఈ విధానం దోహదపడనుంది. ఆందోళనలు, అల్లర్లు, విపత్తులు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం ఫోన్లు, వాకీటాకీల ద్వారానే చెప్పే వీలుంది. ఈ విధానం ద్వారా ఉన్నతాధికారులు వేగంగా స్పందించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది. ప్రత్యేకతలేంటి? విదేశాల్లో వీటి వినియోగం ఎప్పట్నుంచో ఉంది. వీటికి 3జీ, 4జీ, ఆడియో, వీడియో సదుపాయంతో పాటు జీపీఎస్ కనెక్షన్ ఉంటుంది. రికార్డింగ్ బటన్ ఆప్షన్తో పాటు 400 నుంచి 500 గ్రాముల బరువు ఉంటాయి. ఈ కెమెరాలను భుజానికి ధరించేందుకు వీలుగా రూపొందిం చారు. వీటిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) ఆదేశాల మేరకు సిబ్బంది వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు వీటిని వాడుతున్నారు. -
ఖాకీలకూ నో ఎంట్రీ!
సాక్షి, సత్తెనపల్లి : ఎన్నికల విధుల్లో పబ్లిక్ సర్వెంట్ అనే పదానికి సాధారణ అర్థం పోలీస్ అధికారి అని కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. యూనిఫామ్లో ఉన్నా .. లేకున్నా పోలీసులు తమ విధుల్లో భాగంగానైనా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. అవసరమైన పక్షంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ఏ ప్రత్యేక కారణం లేకుండా పోలీసులకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి అనుమతి లేదు. పోటీ చేసే అభ్యర్థి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఆయన ఒక్కరే లోపలికి వెళ్లాలి. భద్రతా సిబ్బంది మాత్రం ద్వారం బయటే ఆగాలి. ఎన్నికల విధులలో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలిగించే ఏ పని ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, స్పీకర్ కానీ, వారి అనుచరులు కానీ చేయరాదు. పోటీల్లో ఉన్న అభ్యర్థికి జెడ్ప్లస్ క్యాటగిరి రక్షణ ఉన్నా.. వారి వెంట వచ్చే సిబ్బందిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. మఫ్టిలో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్ మంత్రులు, ఉప మంత్రులకు భద్రతా సిబ్బంది ఉంటారు. వారు కూడా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకూడదు. పోలింగ్ సిబ్బంది రాజకీయ నాయకులు, మంత్రుల మాటలను పట్టించుకోకూడదు. సిబ్బంది ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం ఆజ్ఞాపత్రం ఉంటేనే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలి. పదవుల్లో ఉన్న వారు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించినా, మాటలు, సైగలు చేసినా అది నేరం గానే పరిగణిస్తారు. వెబ్కాస్టింగ్తో పారదర్శకత ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ విధానాన్ని అములు చేయనున్నారు. నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. దీని ద్వారా ప్రతి క్షణం ఓటింగ్ ప్రక్రియ..అవాంఛనీయ ఘటన వివరాలను నేరుగా తెలుసుకునే వీలుంటుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచే పోలింగ్ ప్రక్రియను వీక్షించే సౌకర్యం ఉంటుంది. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిపించడమే దీని లక్ష్యం. -
శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: డీజీపీ
సాక్షి, కడప : కడప జిల్లాలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య తెలిపారు. జిల్లాలో మంగళవారం డీజీపీ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నాయని.. నేరాలు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. రెండు మూడు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈవ్టీజింగ్ అరికట్టేందుకు త్వరలో షీటీమ్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాబోయేది ఎన్నికల సమయం కనుక ఎప్పటికప్పుడు జిల్లా పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంక్ ఓటీపీల కారణంగా సైబర్ నేరాలు అధికం అవుతున్నాయని. బ్యాంక్ల ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిచితులకు తెలపొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా పార్థిగ్యాంగ్ ఆనవాలు లేవని స్పష్టం చేశారు. గత ఏడాది మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది వచ్చారని, కానీ వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అమాయకులపై పార్థిగ్యాంగ్ అంటూ ప్రజలు దాడులు చేయడం సరికాదన్నారు. ఎర్రచందనం డాన్ సాహుల్ భాయ్ను త్వరలోనే రాష్ట్రానికి తీసుకుని వస్తామన్నారు. -
‘బెంగళూరు’ తీర్పే కీలకం!
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కన్నడ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. అధికారం కోసం నువ్వా–నేనా అనే రీతిలో అధికార విపక్షాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాలు, వివిధ వ్యూహాలతో ప్రచారం చేస్తున్న పార్టీలకు రాజధాని బెంగళూరుపై పట్టు చాలా కీలకం. అందుకే ఉద్యాన నగరిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఐటీ హబ్, మెట్రోపాలిటన్ సిటీ కావడంతో ఇక్కడి ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల్లో నగర ఓటర్లు ఏ పార్టీకి అండగా నిలవబోతున్నారు? వీరి ఆకాంక్షలు, అవసరాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏ మేరకు తీర్చగలిగాయి? ప్రజల అభిప్రాయాల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒక్క బెంగళూరు సిటీలోనే 28 స్థానాలున్నాయి. వీటితోపాటు 4 బెంగళూరు రూరల్ నియోజకవర్గాలు కూడా సిటీ పరిధిలోకే వస్తాయి. దీంతో ఈ 32 స్థానాల్లో ఓటరు తీర్పుపై చర్చ జరుగుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో 13, రూరల్లో 2 సీట్లు కలిపి 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. బీజేపీ సిటీలో 12 స్థానాలు కైవసం చేసుకుంది. జేడీఎస్ సిటీలో 3, రూరల్లో 2 స్థానాలు దక్కించుకుంది. అయితే తర్వాత జరిగిన బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో (198 వార్డుల్లో) బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. జేడీఎస్, స్వతంత్రుల సాయంతో కాంగ్రెస్ మేయర్ సీటు కైవసం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బెంగళూరును న్యూయార్క్, లండన్ తరహాలో అభివృద్ధి చేసి ప్రపంచఖ్యాతి కల్పిస్తానని సిద్దరామయ్య ప్రకటించారు. కానీ ఈ దిశగా అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడుకూడా సిటీ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. కనెక్టివిటీ లేని మెట్రో మెట్రోపాలిటన్ సిటీ అయిన బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారుల సంఖ్య ఎక్కువ. వీరు మౌలిక వసతుల కల్పన, మహిళల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, కాలుష్యం వంటి ప్రధానాంశాలపై ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య బెంగళూరును ఇప్పటికీ పట్టిపీడిస్తోంది. మెట్రోరైలు ఏర్పాటు చేసినప్పటికీ సిటీ మొత్తం కనెక్టివిటీ లేకపోవడంతో సిటీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. అలాగే ఐటీ ఉద్యోగులు అర్ధరాత్రి వరకూ విధుల్లో ఉండటంతో మహిళా భద్రత అంశాన్ని నగర ప్రజలు ప్రధానంగా భావిస్తున్నారు. బెంగళూరు సిటీ పరిధిలో 2013లో 70.4లక్షల ఓటర్లున్నారు. ఐదేళ్లలో 17.5 లక్షల మంది ఓటర్లు పెరిగి ప్రస్తుతం ఆ సంఖ్య 89.9 లక్షలకు చేరింది. పెరిగిన ఓటర్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధికోసం బెంగళూరుకు వచ్చి స్థిరపడినవారే. వీరిలో ఎక్కువ మంది మధ్యతరగతి వారే. సిద్దరామయ్య ఏర్పాటుచేసిన ఇందిరా క్యాంటీన్లపై వీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. మిగిలిన అంశాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆరెస్సెస్ ప్రచారం కలిసొచ్చేనా? 50వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు బీజేపీ విజయం కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సిటీ పరిధిలో ఉన్నారు. సిటీలో బీజేపీ బలంగా ఉండటంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రచారం కచ్చితంగా ప్రభావం ఉంటుందని ఆపార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిటీలో ముఖ్యమైన వర్గాలివే బెంగళూరు సిటీలో బ్రాహ్మణులు, లింగాయత్, మైనార్టీ, దళిత వర్గాలతో పాటు తెలుగు, తమిళ ఓటర్లు కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. యడ్యూరప్ప లింగాయత్ కావడంతో బ్రాహ్మణులు, లింగాయత్ ఓటర్లు బీజేపీపై సానుకూలంగా ఉన్నారు. మైనార్టీ, దళిత వర్గాలు కాంగ్రెస్వైపు ఉన్నారు. 2008 ఎన్నికల్లో క్రిస్టియన్లు బీజేపీ వైపు నిలిచినప్పటికీ.. మంగళూరు చర్చిదాడి ఘటనతో పూర్తిగా దూరమయ్యారు. వీరంతా బృందాలుగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 391 మందిపై క్రిమినల్ కేసులు కర్ణాటకలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,560 మంది అభ్యర్థుల్లో 391 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై వేధింపులు, అపహరణ తదితర తీవ్ర అభియోగాలు ఉన్నాయి. కళంకితులను పోటీకి దింపడంలో బీజేపీ ముందువరుసలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థుల్లో 83 మంది (37%)పై నేరారోపణలు ఉన్నాయి. అలాగే 93% మంది బీజేపీ అభ్యర్థులు కోటీశ్వరులే. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 27% మందిపై క్రిమినల్ కేసులుండగా 15% మంది కోటీశ్వరులు. జేడీఎస్లో 21% మందిపై కేసులున్నాయి. -
చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారు చేయడంలో తగినంత ఆధారాలు సేకరించేందుకు పోలీసు పరిశోధనాధికారులు కృషి చేయాలని ఎస్పీ బి.అనురాధ సూచించారు. జిల్లా పోలీసు కార్యాల యం లో శనివారం ఉదయం ‘చిట్ఫండ్ వ్యవహారాల్లో జరిగే మోసాలు–ప్రజలకు చేయాల్సిన న్యాయ సేవలు, ఇతర చట్టాలు’ అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సును ప్రారంభించిన ఎస్పీ అనురాధ మాట్లాడుతూ పోలీసు అధికారులు నూతన చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ సాక్షాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, శ్రీధర్, పీపీపీబాలగంగాధర్రెడ్డి, ఏపీపీ అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
చౌటుప్పల్లో కార్డన్ సెర్చ్
చౌటుప్పల్ (మునుగోడు) : చౌటుప్పల్ మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి నాయకత్వంలో 150మంది పోలీసులు 10బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బుడిగ జంగాల కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వ్యక్తిగత గుర్తింపు కార్డులు, వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి తనిఖీలు చేస్తుండడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులంతా ఇండ్లల్లోకి ఎందుకు వచ్చారో తెలియక మొదట ఆందోళన చెందారు. గంజాయి స్వాధీనం పోలీసుల కార్డన్ సెర్చ్లో కుంబ శ్రీరాములు ఇంట్లో అరకిలో గంజాయి లభించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ధైర్యంగా గంజాయిని ఇంట్లో నిలువచేసుకోవడం పట్ల పోలీసులు విస్తుపోయారు. శ్రీరాములును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అదే విధంగా సరైన పత్రాలు లేని 42ద్విచక్రవాహనాలు, 1కారు, 3ఆటోలు, 1సిలిండర్ పట్టుబడ్డాయి. కాలనీ పరిసరాల్లో మద్యం అమ్మే ముగ్గురు బెల్టు షాపు దుకాణాదారులను అదుపులోకి తీసుకున్నారు.అదే విధంగా మరో ఐదుగురు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకున్నారు. నేరస్తులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకే : డీసీపీ ఈ ప్రాంతంలో ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులు మండల కేంద్రంలోనే సంచరిస్తున్నారన్న సమాచారం తమకు అందింది. అందులో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించామని భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు కార్డన్ సెర్చ్ దోహదపడుతుందన్నారు. పాత, కొత్త నేరస్తుల గుండెల్లో గుబులు పుడుతుందని తెలిపారు. ప్రజలంతా సరైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, వాహనాల ఒర్జినల్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్లు నిరంతరం కొనసాగుతూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఏసీపీలు రామోజు రమేష్, శ్రీనివాసాచార్యులు, స్థానిక సీఐ వెంకటయ్య, ఎస్సై చిల్లా సాయిలు, వివిధ మండలాల సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేటలో 40 ద్విచక్రవాహనాలు.. సూర్యాపేటక్రైం : జిల్లా కేంద్రంలోని అన్నాదురైనగర్లో మంగళవారం తెల్లవారు జామున డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ శంకర్ ఆధ్వర్యంలో 150మంది సిబ్బందితో కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రకాశ్జాదవ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రత, రక్షణ కల్పించడం, దొంగతనాలు నివారించడం, అక్రమకార్యకాలపాలు, సంఘ వ్యతిరేక చర్యలను అడ్డుకోవడం, అనుమానిత వ్యక్తుల గుర్తింపు, శాంతి భద్రతల రక్షణ, సంఘ వ్యతిరేక కార్యకలాపాల అదుపు చేయడము కోసమే జిల్లా వ్యాప్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్డన్సెర్చ్ నిర్వహించేటప్పుడు ప్రజలు ఆందోళన చెందవద్దని, పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తానని నూతన డీజీపీ మన్న మాలకొండయ్య అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పూర్తిస్థాయి డీజీపీగా ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు బాధ్యతలు చేపట్టారు. నండూరి సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. రాష్ట్రంలో తీవ్ర నేరాలను అదుపు చేయడంలో కేసుల నమోదు, అరెస్టులు, దర్యాప్తులు, ప్రాసిక్యూషన్ వంటి కీలక విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలను అదుపు చేసేలా ఇంటెలిజెన్సీ, ఇన్వెస్టిగేషన్ తదితర పోలీస్ శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా పదవీ విరమణ చేసిన డీజీపీ సాంబశివరావుకు పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన∙ తనకు చదువు చెప్పిన గురువులను తలచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. -
'శాంతి భద్రతలకే అత్యంత ప్రాధాన్యం'
సాక్షి, హైదరాబాద్: 2018 లో 8 లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయనిక్కడ శనివారం మీడియాతో మాట్లాడుతూ 2018 పోలీసు శాఖకు ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ-చలాన్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా యూనిట్స్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ తరహాలో అన్నీ పీఎస్లను తీర్చిదిద్దుతామన్నారు. అన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోలు సెంటర్లు ఏర్పాటు చేసి.. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేస్తామని తెలిపారు. నేరాల సంఖ్య గతంతో పోలిస్తే 12.93 శాతం పెరిగిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్తామని.. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖలో త్వరలో 18, 290 పోస్టును భర్తీ చేయనున్నట్టు డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. -
శాంతి భద్రతలే ప్రగతిపథ వారథులు
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సాక్షి, హైదరాబాద్: దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే శాంతి భద్రతల పరిరక్షణ అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణా, దొంగ నోట్ల వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి పటిష్టమైన భద్రత ఉండాలని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్వైకే)ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో జరిగిన ‘జాతీయ భద్రతపై యువ సమ్మేళనం’అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఎంతో కాలం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండబోదని, దేశం పురోగమించడానికి ఇదే మంచి సమయమని పేర్కొన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల వయసు లోపు వారేనని, ఈ యువత వృద్ధాప్యం పొందేలోపు మన దేశం సంపన్న దేశంగా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. ప్రతి పౌరుడిని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతోనే కేంద్రం ప్రజాసంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తోందని చెప్పారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. నెహ్రూ యువక కేంద్ర సంఘటన్ వైస్ చైర్మన్ శేఖర్రావు, యువకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆ బాధ్యత మాపై ఉంది: చినరాజప్ప
అమరావతి: ఏపీలో శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉందని ఏపీ ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప తెలిపారు. ఇందులో భాగంగానే అనుమతి లేని సభలను నియంత్రిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వాళ్లు వచ్చి ఆంధ్రాలో సమస్యలు సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రాలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
శాంతిభద్రతలపైనే అభివృద్ధి ఆధారం
జిల్లా ఎస్పీ రవిప్రకాష్ అనపర్తి: జిల్లా ప్రజలు శాంతికాముకులని, జిల్లాలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని బదిలీపై పశ్చిమ గోదావరికి వెళ్తున్న జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. అనపర్తిలో నూతనంగా నిర్మించిన సర్కిల్ కార్యాలయాన్ని ఆయన గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ ఒక ప్రాంతం అభివృద్ధి ఆ ప్రాంతంలో ఉన్న శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందన్నారు. అభివృద్ధిని కోరుకునే ప్రజలు ఇక్కడ ఉండబట్టే శాంతిభద్రతలు అదుపులో ఉంటున్నాయన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన గురుతర బాధ్యత పోలీసులపై ఉందని, ఆ విధంగానే తాను కృషి చేసినట్లు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఆస్తినష్టం కలగకుండా కృషి చేయడంలో తాను కృత్యుడనైనట్లు తెలిపారు. కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నా..ప్రాణ నష్టం కలగకుండా చూశామన్నారు. అవినీతికి తావులేకుండా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ విధి నిర్వహణ కొనసాగించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, అడిషనల్ ఎస్పీ దామోదర్, డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, సీఐ శీలబోయిన రాంబాబు తదితరులు మాట్లాడారు. అనంతరం ఎస్పీని ఉచితరీతిన సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి(దొరబాబు), ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరి, అడిషనల్ ఎస్పీ దామోదర్, ట్రైనీ ఏఎస్పీ అజిత, జిల్లా స్పెషల్ బ్రాంచి డీఎస్పీలు ఆర్.విజయభాస్కరరెడ్డి, ఎస్.అప్పలనాయుడు, మండపేట సీఐలు లక్ష్మణరెడ్డి, గీతాకృష్ణ, రామచంద్రపురం సీఐ కె.శ్రీధర్కుమార్, ఎస్సైలు పి.దొరరాజు, ఎన్.రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు కబ్జాలు.. ఆరు దోపిడీలు!
మూడేళ్లలో రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు ► కాల్మనీ నుంచి హవాలా వరకు అభాసుపాలు ► సవాలుగా మారిన ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ ► అక్రమార్జన కోసం అధికార పార్టీ నేతల బరితెగింపు ► చోద్యం చూడటం తప్ప చర్యలు తీసుకోలేకపోతున్న పోలీసులు ► నలిగిపోతున్న సామాన్యులు.. అడకత్తెరలో ఉద్యోగులు ► 2015 కంటే 2016లో పెరిగిన హత్యల శాతం 1.60 ► దాడుల శాతం 4.01 ►ఆర్థిక నేరాల శాతం 11.16 ► మహిళలపై వేధింపుల శాతం 10.98 ఆంధ్రప్రదేశ్ అంటే అశాంతికి చిరునామాగా మారింది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ఆర్థిక నేరాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, కాల్ ‘నాగు’ల విషపు కాట్లు, కేటుగాళ్ల కేరింతలు.. ఇదీ రాష్ట్రంలో మూడేళ్ల ప్రగతి. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించాలన్న ఏకైక లక్ష్యంతో అధికార పార్టీ నేతలు బరితెగించడం సర్వత్రా కలవరపెడుతోంది. ‘అన్యాయం జరిగిందయ్యా.. న్యాయం చేయండ’ని వేడుకుని మరిన్ని ఇక్కట్ల పాలయ్యేకంటే నోరు కట్టేసుకుని కుమిలి పోవడమే ఉత్తమం అనే దుస్థితి దాపురించింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా శాంతిభద్రతలు అదుపు తప్పాయి. గడిచిన మూడేళ్లలో చోటుచేసుకున్న అకృత్యాలు, అరాచకాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో మూడేళ్లుగా చోటుచేసుకున్న నేరాల్లో పోలీస్ రికార్డులకు ఎక్కినవి కొన్నే. నేర పరిశోధన విభాగం (సీఐడీ) గణాంకాలు పరిశీలిస్తే 2015 కంటే 2016లో హత్యలు, దాడులు, మహిళలపై వేధింపులు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాదీ హత్యలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు బాగా పెరిగాయి. మహిళల అక్రమ రవాణా (ఉమన్ ట్రాఫికింగ్) గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నా అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారు. రాజధానిలో రాకాసి మూక రాజధాని ప్రాంతం అరాచక శక్తులకు అడ్డాగా మారుతోంది. భూములు ఇవ్వని రైతుల పాకలు, అరటి తోటలను ధ్వంసం చేసి తగలబెట్టిన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేపోయారు. విజయవాడలో ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరుల దందాలో ఆదుకునే దిక్కులేక చిన్నారి సాయిశ్రీ క్యాన్సర్తో బాధపడుతూ చికిత్సకు నోచుకోక మే 15న మృత్యువాత పడింది. కండ్రికలో కార్పొరేషన్ భూమిని బొండా ఉమ సోదరుడు ఆక్రమించినా అధికారులు ప్రేకక్షపాత్ర వహించారు. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ అనుచరుల పేరుతో బెజవాడలో కొందరి దందాలు కేసుల వరకు వెళ్లాయి. గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్.. తాను అద్దెకు ఉంటున్న ఇల్లునే బ్యాంకు వేలం ద్వారా దక్కించుకోవడం దుమారమే రేపింది. స్పీకర్ కోడెల తనయుడు శివరాం తన అనుచరులతో నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే కాంట్రాక్టర్ మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో దాడి చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కృష్ణా నదికి ఇరువైపులా టీడీపీ ప్రజాప్రతినిధుల అండతో ఇసుక మాఫియా కోట్లకు పడగలెత్తుతోంది. కొత్త సవాళ్లతో పోలీసులు సతమతం అధికారులు, పోలీసులపై టీడీపీ నేతల దాడులు శాంతిభద్రతలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. 2015 జూలై 8న ముసునూరు మహిళా తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి, 2015 జూలైలో చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండల తహసీల్దార్ నారాయణమ్మపై టీడీపీ నేతల దాడి ఘటనల్లో చర్యలు లేవు. వైజాగ్లో 2015 నవంబర్లో అనూషా(హిజ్రా) హత్య మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అనంతపురం జిల్లాలో అయితే టీడీపీ నేతల ఆగడాలు మితిమీరాయి. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూతురు డాక్టర్ మాధవికి అన్యాయం జరిగినా పట్టించుకోలేదు. తాము చెప్పినట్టు వినలేదనే అక్కసుతో విజయవాడ నడిబొడ్డున సీనియర్ ఐపీఎస్ అధికారి, ట్రాన్సుపోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యంను ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ద వెంకన్నలు దుర్భాషలాడారు. ఆయన గన్మెన్పై ఎమ్మెల్యే బొండా ఉమ చేయి చేసుకున్నా చట్టపరమైన చర్యలు లేవు. ఎమ్మెల్యే చింతమనేని ఏకంగా పోలీసులపైనే దాడి చేసి కొట్టినా దిక్కులేదు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషితేశ్వరి, ఫ్రొఫెసర్ వేధింçపుల కారణంగా గుంటూరులో పీజీ మెడికో విద్యార్థిని బాల సంధ్యారాణి ఆత్మహత్య ఘటనల్లో పోలీసులు విమర్శలనెదుర్కొన్నారు. ఆయా ఘటనల్లో నిందితులు అధికార పార్టీ వారు కావడంతోనే చర్యలు తీసుకోలేక, బాధితులకు న్యాయం చేయలేక పోలీసులు సతమతమవుతున్నారు. ► ఎర్రచందనం స్మగ్లర్లకు చెక్ పెడతామని, స్మగ్లింగ్ను అరికడతామని ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఆచరణలో అమలు కాలేదు. అసలు స్మగ్లర్లను పట్టుకోలేక చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో 2015 ఏప్రిల్లో 20 మంది కూలీలను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ► విజయవాడ నగరంలో కాల్మని కాలనాగులు కోరలు చాచి మహిళలపై లైగింక వేధింపులకు పాల్పడటం అధికార తెలుగుదేశం పార్టీకి మాయని మచ్చను తెచ్చింది. ► కొద్ది రోజుల క్రితం విశాఖ, విజయవాడలోను వెలుగు చూసిన హవాలా స్కామ్లోను టీడీపీ పెద్దల జోక్యం పలు అనుమానాలకు తావిచ్చింది. ► టీడీపీ నేతల వేధింపుల కారణంగానే గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి భర్త గుండెపోటుతో మృతి చెందడం, ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేగింది. ► పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రుల్లో ఫుడ్పార్కు విషయంలో నిరసన తెలిపిన మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు దాడి చేయించినా పోలీసులు స్పందించ లేదు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో అసలు నిందితులపై చర్యలు లేవు. ► విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సాగు అవుతున్న గంజాయి రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరుతోపాటు విద్యాలయాలు, శ్రమజీవులు ఉండే ప్రాంతాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మద్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గంజాయి, మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ► ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావతో 2015 జూలైలో జరిగిన గోదావరి పుష్కరాలు తొలి రోజునే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో 29 మంది భక్తులు దుర్మరణం చెందడం, పెద్ద సంఖ్యలో జనం గాయపడటం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ► ఆంధ్ర – ఒడిశా బోర్డర్(ఏఓబి) మల్కన్గిరి ప్రాంతంలో 2016 అక్టోబర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు, గిరిజనులు మృతి చెందడం కలకలం రేపింది. -
నిందితుల ఇళ్ల పరిశీలన
కృష్ణగిరి: పత్తికొండ నిమోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి, అతని అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో కొందరి నిందితుల ఇళ్లను పోలీసులు పరిశీలించారు. జంట హత్యకేసులో 12 మందిపై కేసు నమోదు కాగా, ఆరుగరు తొగర్చేడు గ్రామస్తులు ఈ మేరకు తొగర్చేడు గ్రామాన్ని శుక్రవారం డోన్ సీఐ శ్రీనివాసులు, కృష్ణగిరి ఎస్ఐ సోమ్లానాయక్లు సందర్శించారు. ఈ హత్య కేసులో నిందితుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలోకి ఎవరైన కొత్త వ్యక్తులు వస్తే తమకు సమాచారమందించాలని ప్రజలకు సూచించారు. -
శాంతిభద్రతల పరిరక్షణ.. అందరి బాధ్యత
► సీమ ఐజీ శ్రీధర్రావు చింతకొమ్మదిన్నె : శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని రాయలసీమ ఐజీ ఎన్. శ్రీధర్రావు పేర్కొన్నారు. శుక్రవారం చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఇటీవల నూతనంగా నిర్మించిన పోలీస్స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కొద్దిపాటి చిన్న పనులను వెంటనే పూర్తి చేసి కడప కర్నూలు రేంజ్ డీఐజీకి సమాచారం అందించాలన్నారు. తర్వాత ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తున్న పోలీస్స్టేషన్ భవనం, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, మట్కా, గ్యాబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించాలన్నారు. ప్రస్తుతం మండలంలో నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయని, మండల కార్యాలయాల్లో కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రదేశాలలో మరిన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలు ఎక్కువగా ఇంటిపైన నిద్రిస్తారని, దొంగతనాలు జరగకుండా లాకర్ బీగాలను వాడాలని సూచించారు. ప్రజలు ఎవరైనా ఊర్లకు వెళ్లేటప్పుడు సంబంధిత పోలీస్స్టేషన్లో సమాచారం అందిస్తే.. ఆ ఇంటికి పోలీసుల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ పోలీస్స్టేషన్ నుంచి నిఘా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ సత్య ఏసుబాబు, కడప డివిజన్ డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్, ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, రూరల్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐలు కుళ్ళాయప్ప. చాంద్బాషా పాల్గొన్నారు. -
శాంతిభద్రతలే తొలి ప్రాధాన్యత
డీజీపీకి సూచించిన యూపీ సీఎం ⇒ 15 రోజుల్లో అధికారులు ఆస్తులు వెల్లడించాలి ⇒ అలహాబాద్లో బీఎస్పీ నేత హత్యపై సీరియస్ లక్నో: ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నట్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్, డీజీపీ జావీద్ అహ్మద్, హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దేబాషిష్ పాండాలతో సమావేశమ్యారు. వారికి బీజేపీ మేనిఫెస్టోను అందజేసిన సీఎం.. వీటి అమలు దిశగా కార్యాచరణను మొదలుపెట్టాలని ఆదేశించారు. అలహాబాద్లో జరిగిన బీఎస్పీ కార్యకర్త హత్యపై స్పందిస్తూ.. శాంతిభద్రతల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డీజీపీకి సూచించారు. దీంతోపాటుగా రాష్ట్రంలోని 75 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు, ఇతర పాలనాపరమైన సమస్యపై సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మంత్రులు ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం.. సోమవారం అధికారులకు కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో స్థిర, చరాస్తుల వివరాలన్నీ అందించాలన్నారు. ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ కూడా ఆదిత్యనాథ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 47 మంది మంత్రులకు త్వరలోనే శాఖలు కేటాయించనున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో సాధువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలహాబాద్లో బీఎస్పీ నేత హత్య: అలహాబాద్ సమీపంలోని మవాయిమా పోలీసుస్టేషన్ సమీపంలో బీఎస్పీకి చెందిన మహ్మద్ షమీ (60) అనే నేతను గుర్తుతెలియని ఆదివారం రాత్రి వ్యక్తులు కాల్చి చంపారు. సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే ఈ ఘటన జరగటం కలకలం రేపింది. కాగా, నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా పశువులను వధిస్తుండటంతో అలహాబాద్లో రెండు కబేళాలను అధికారులు మూసేశారు. -
అయ్యో..! అతివ
రాజధాని నగరంలో మహిళల భద్రత ప్రశ్నార్థకమే విజయవాడలో హడలెత్తిస్తున్న మహిళలపై నేరాలు 2016లో అమాంతంగా పెరిగిన కేసుల సంఖ్య ‘శాంతిభద్రతలు... ప్రత్యేకించి మహిళల భద్రత విషయంలో అత్యంత కఠినంగా ఉంటాం. అమరావతి ప్రాంతాన్ని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ విజయవాడలో మహిళల భద్రత గాలిలో దీపంలా మారింది. మహిళలకు ఏమాత్రం రక్షణలేని, దాడులు పెరుగుతున్న నగరంగా విజయవాడ రూపాంతరం చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్న వాస్తవం. – సాక్షి, అమరావతిబ్యూరో సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. మహిళా హత్యలు, వరకట్న హత్యలు, వేధింపులు, ఆత్మహత్య చేసుకునేలా వేధింపులు, లైంగికదాడులు... ఇలా అన్ని రకాల కేసులు పెరుగుతున్నాయి. 2015 కంటే 2016లో నగర పరిధిలో మహిళలపై దాడులు, వేధింపుల కేసులు బాగా పెరిగాయి. 2015లో మొత్తం 464 కేసులు నమోదయ్యాయి. 2016లో ఏకంగా 760 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న వాస్తవం. అంటే నేరాలు 63 శాతం అధికమయ్యాయి. ► 2015లో ఒక్క వరకట్న హత్య కూడా లేదు. 2016లో ఐదు వరకట్న హత్యలు జరిగాయి. ► మహిళలపై వివిధ రకాల వేధింపుల కేసులు 2015లో 175 నమోదయ్యాయి. 2016లో ఏకంగా 411 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ► కమిషరేట్ పరిధిలో మహిళలపై లైంగిక దాడులు అమాంతం పెరుగుతున్నాయి. 2015లో నగరంలో లైంగికదాడులు కేసులు 53 నమోదయ్యాయి. 2016లో 70 నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. ► మహిళలను అపహరించిన కేసులు 2015లో 21 నమోదయ్యాయి. 2016లో 26 కేసులు నమోదు కావడం గమనార్హం. ► మహిళలపై దాడులకు పాల్పడి వారి గౌరవానికి భంగం కలిగిస్తున్న కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. 2015లో ఇలాంటి కేసులు 156 నమోదయ్యాయి. 2016లో 198 కేసులు నమోదు కావడం మహిళలపై పెరుగుతున్న దాడులకు నిదర్శనం. ► 2015లోనూ, 2016లోనూ నగర పరిధిలో వరకట్న వేధింపుల వల్ల ఆత్మహత్యలు 10 చొప్పున నమోదయ్యాయి. ► ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకు గురిచేసిన కేసులు కూడా 2015లో 25 ఉండగా, 2016లో 24 నమోదయ్యాయి. లైంగికదాడులను అరికట్టలేరా! మహిళలపై నేరాల్లో లైంగికదాడులు, వేధింపులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత నగరంలో లైంగికదాడు లు అధికం కావడం విస్మయకర వాస్తవం. ► 2012లో 47, 2013లో 40 లైంగిక దాడులు జరిగాయి. 2014 నుంచి పెరుగుతూ వస్తున్నాయి. 2014లో 61, 2015లో 53 కేసులు నమోదయ్యాయి. 2016లో ఏకంగా 70 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టో...! ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అధికార యంత్రాంగం అంతా విజయవాడలోనే కేంద్రీకృతమై ఉంది. కానీ రాజధానికి తగ్గట్లుగా రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయ లేదు. కేవలం వీఐపీల భద్రత, హంగు ఆర్భాటాలకే పోలీసు వ్యవస్థను వాడుకుంటు న్నారు. దాంతో సామాన్యులకు ప్రత్యేకించి మహిళల రక్షణపై దృష్టిసారించలేకపోతు న్నామని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం. సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిన తరువాత కూడా... మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించిన కేసులను ఏకపక్షంగా నమోదు చేయొద్దని 2014లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. మొదట ఇరువర్గాలతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి వచ్చిన ఫిర్యాదులను యథాతథంగా కేసులుగా నమోదు చేయడం లేదు. ఇరువర్గాలతో సంప్రదించి వీలైనంతవరకు రాజీ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య తగ్గుతుందని అంతా భావించారు. కానీ 2014 తరువాత విజయవాడలో మహిళలపై దాడులు, వేధింపుల కేసులు మాత్రం అమాంతంగా పెరుగుతూనే ఉన్నాయి. అంటే నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. -
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
– ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఉదయం పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహాత్మాగాంధీ ఆచరించిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న భారతదేశం తయారవ్వాలంటే యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, కృష్ణమోహన్, సీఐలు నాగరాజ యాదవ్, మహేశ్వరరెడ్డి, మధుసూదన్, డీపీఓ ఏఓ అబ్దుల్ సలాం, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం... రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబాలకు పోలీసు సంక్షేమ నిధి నుంచి ఎస్పీ ఆకే రవికృష్ణ ఆర్థిక సాయాన్ని అందించారు. ఏఆర్పీసీ రామాంజనేయులు, సివిల్ పీసీ నాగరాజు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలకు గురై మతిస్థిమితం కోల్పోయి రెండేళ్లుగా చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబాలు చంద్రరేణుక, కాంతమ్మలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
బుక్కరాయసముద్రం : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ రాజశేఖర్బాబు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం డీఎస్పీ మల్లికార్జునవర్మతో కలిసి ఎస్పీ బుక్కరాయసముద్రం పోలీస్స్టేషన్ను సందర్శించారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ అనంతపురం నగరంలో 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. నేరాలను తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్యాక్షన్ గొడవలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2017 సంవత్సరం ప్రారంభం నుంచి విప్లవాత్మకంగా నేరాలు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మినారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హింసను ప్రేరేపిస్తే కఠిన చర్యలు
- దాడికి పాల్పడిన 23 మంది అరెస్టు - రౌడీషీట్ ఓపెన్ చేయాలని ఎస్పీ ఆదేశాలు - సిద్దపల్లిలో పర్యటన ఆత్మకూరు: పల్లెల్లో హింసను ప్రోత్సహించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దపల్లి గ్రామంలో జరిగిన దాడుల్లో 23 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి వర్గీయులు దరగయ్య కుటుంబంపై కర్రలు, మారణాయుధాలతో దాడికి పల్పడినట్లు తెలిపారు. ఇలా గ్రామాల్లో అల్లర్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. మరో 9 మంది పరారిలో ఉన్నట్లు చెప్పిన ఎస్పీ.. త్వరలోనే సీఐ ఎదుట లొంగిపోవాలని వారికి సూచించారు. గ్రామాల్లో మళ్లీ ఘర్షణలకు తావులేకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. సిద్దపల్లిలో ఎస్పీ పర్యటన సిద్దపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎస్పీ పర్యటించారు. బాధిత కుటుంబ సభ్యులు, అంతకు ముందు చిన్నారులతో మాట్లాడి దాడికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. ఇరువర్గాల వారితో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దెబ్బతిన్న బైకులు, సైకిళ్లు ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ సుప్రజ, సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు సు«ధాకరరెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, శివశంకర్నాయక్, సిబ్బంది ఉన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో సహకారం అవసరం
ఎస్పీ విశాల్ గున్నీ నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్పీ విశాల్గున్నీ పేర్కొన్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారులు, నగర ప్రజలతో ఉమేష్చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించిన ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నగర ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వివరించారు. ఇందులో భాగంగా నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని దాతలను కోరామని, అనేక మంది ముందుకొచ్చి ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించారని పేర్కొన్నారు. వీరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కొంత మంది నగదు చెల్లించారని, వీరికి నగదును ఇచ్చేస్తామని, డీడీ, చెక్కుల రూపంలోనే సహకారం అందించాలని కోరారు. దాతలు తాము అందించిన విరాళాలకు సంబంధించిన రసీదులను పొందాలని సూచించారు. వ్యాపారులు తమ వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. లాడ్జీల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు గది అద్దెకు కావాలనే వారి నుంచి ఆధార్కార్డు, ఓటర్కార్డు, తదితరాలకు సంబంధించిన జిరాక్స్లను సేకరించిన అనంతరమే అద్దెకు ఇవ్వాలని చెప్పారు. లాడ్జిలో ఎవరెవరు ఉంటున్నారనే విషయాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మొబైల్షాపు నిర్వాహకులు సరైన గుర్తింపు కార్డులను తీసుకున్నాకే సిమ్లను విక్రయించాలని ఆదేశించారు. నగరంలో ఇప్పటికే 106 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, వీటిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్కు అనుసంధానం చేశామన్నారు. విజయవాడ తర్వాత నెల్లూరు జిల్లాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిస్టమ్ను ఏర్పాటు చేశామని, త్వరలోనే డీజీపీ సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంభించి శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొస్తామని చెప్పారు. ఏఎస్పీ శరత్బాబు, ఎస్బీ, నగర డీఎస్పీలు కోటారెడ్డి, వెంకటరాముడు, ఇన్స్పెక్టర్లు మాణిక్యరావు, అబ్దుల్ కరీమ్, సుధాకర్రెడ్డి, రామారావు, సీతారామయ్య, మంగారావు, చెంచురామారావు, ఎస్బీ ఎస్సై శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో బీజేపీ విఫలం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శాంతిభద్రతల విషయంలో బీజేపీ తీరు సక్రమంగా లేకపోవడం వల్లే కశ్మీర్ మరోసారి నెత్తురోడిందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. కశ్మీర్లో దాడులను నిరసిస్తూ బుధవారం శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్ కూడలిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్లో అల్లర్లు జరుగుతున్నా ప్రధాని పట్టించుకోవడం లేదని, ఇటువంటి పాలకులను జమ్ముకశ్మీర్ ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. కశ్మీర్లో భారత ప్రభుత్వ సైనిక దమనఖాండను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, సెమినార్లు జరపాలని సీపీఐ (ఎమ్ఎల్) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు నేతింటి నీలంరాజు, ఎన్.వెంకటరావు, ఎస్.కృష్ణవేణి, బి.భాస్కరరావు, మార్పు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకం
కోడెల గెలిచిన తర్వాతే ఈ దుస్థితి.. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేట: డాక్టర్ కోడెల శివప్రసాదరావు శాసనసభ్యుడిగా గెలిచి స్పీకర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. స్పీకర్ కోడెల మాటలు విని.. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆయనకు,ఆయన కుమారుడికి గుండాలుగా పని చేయటం ప్రమాదకరమైన విషయమన్నారు. రైల్వే కాంట్రాక్టర్పై దౌర్జన్యం కేసులో ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకున్నారంటే ఆయనే ప్రోత్సహిస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడికుడి– శ్రీకాళహస్తి పనులు చేస్తున్న రైల్వే కాంట్రాక్టర్, ఆయన మనుషులు, కూలీలపై స్పీకర్ కోడెల, ఆయన కుమారుడు పంపిన గుండాలు దాడిచేసి ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. దీనిపై కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదుచేస్తే, వారిపై మరో కౌంటర్ కేసును నమోదుచేయటం దారుణమన్నారు. ఈ సంస్కృతి కోడెల శాసనసభ్యుడిగా అయిన దగ్గర నుంచి ఉందని, తెలుగుదేశం వారు ఎవరినైనా కొడితే కేసు పెట్టడానికి వెళ్ళిన వ్యక్తిపైనే కేసు పెట్టి బెదిరించి రాజీచేసే ప్రక్రియకు పాల్పడుతున్నాన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో, సత్తెనపల్లి, నరసరావుపేటల్లో శాంతిభద్రతలు ఏవిధంగా రక్షించబడతాయో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోడెల గెలిచిన తర్వాత సత్తెనపల్లిలో పోలీసులే గుండాలుగా వ్యవహరించి తమ పార్టీ ఎంపీటీసీలను అపహరించుకెళ్ళారన్నారు. సత్తెనపల్లిలోని వెన్నాదేవి దగ్గర పోలీసులకు ఏవిధమైన సంబంధంలేకపోయినా ఒక స్థలం వద్దకు వెళ్ళి ఆ స్థల యజమానిని భలవంతంగా ఖాళీచేయించిన తర్వాత కోడెల శివప్రసాదరావు గుండాలు ప్రవేశించారన్నారు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ప్రజల మానప్రాణాలను రక్షించటానికంటే కోడెల, అతని కుమారుడికి ఖాకీ డ్రస్సు వేసుకున్న గుండాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇది సమాజానికి,. పోలీసులకు మంచిది కాదన్నారు. కమిషన్ లేనిదే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరూ ఏ పనిచేసే పరిస్థితిలేదన్నారు. మొన్న స్పీకర్ను లోకేష్ కలిసిన తర్వాత కాంట్రాక్టర్పై దౌర్జన్య వ్యవహారం చోటుచేసుకుందన్నారు. లోకేష్, స్పీకర్, చంద్రబాబులు ఇప్పటికే ప్రజలను దోచుకుంటున్నారని, అయితే ఇంత దౌర్జన్యంగా ఇక్కడ దోచుకోవటం జరుగుతున్నా పోలీసులు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. అంతా కోడెల కుమారుడి లీల.. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ సంగం డెయిరీ రైతులకిచ్చే బోనస్లో లీటర్కు అర్ధ రూపాయి కమీషన్ కావాలని స్పీకర్ కోడెల కుమారుడు డిమాండ్ చేయటంతో రెండు నెలలుగా ఆ సంస్థ బోనస్ చెల్లించలేదన్నారు. దీనిపై రైతులు తన దృష్టికి తీసుకురావడంతో డెయిరీ మేనేజర్ను ప్రశ్నిస్తే ఈ విషయం వెల్లడైందన్నారు. ఈ విధంగా వ్యవహరిస్తున్న వీరి చేష్టలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. సమావేశంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్మాబు, సత్తెనపల్లి మార్కెటింగ్యార్డు మాజీ ఛైర్మన్ కట్టా సాంబయ్య, రాజుపాలెం మాజీ ఎంపీపీ బాసు లింగారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కోడిరెక్క దేవదాసు తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
సీపీ సుధీర్బాబు పోలీస్ క్రికెట్కప్–2016 ప్రారంభం వరంగల్ : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో యువత.. పోలీసులకు ప్రతినిధులుగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు సహMýరించాలని పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా నిర్వహిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రికెట్ కప్–2016 టోర్నమెంట్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. హన్మకొండలోని పోలీసు మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలన్నారు. పోలీసులకు యువత చేరువ కావాలన్న ధ్యేయంతోనే ఈ క్రికెట్ కప్–2016ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్–ఏ, వరంగల్–బీ జట్ల మధ్య మ్యాచ్ జరగగా కమిషనర్ టాస్ వేయడంతో పాటు బౌలింగ్ చేయగా హన్మకొండ ఏసీపీ శోభన్కుమార్ బ్యాటింగ్ చేశారు. కాగా, తొలుత ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో డీసీపీ యాదయ్య, ఏసీపీలు ఈశ్వర్రావు, శోభన్కుమార్, సురేంద్రనాథ్, రవీందర్రావు, సీఐలు సంపత్రావు, ఎస్ఎం.అలీ, కిషన్, రవికుమార్, శ్రీనివాస్, శివరామయ్య, రమేష్, వేణు, ప్రభాకర్రావు, సత్యనారాయణ, ఆర్ఐలు శ్రీనివాస్, నాగయ్య, సిటీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్కుమార్, క్రికెట్ కోచ్ జైపాల్ పాల్గొన్నారు. వరంగల్ – ఏ, వరంగల్ – బీ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ‘ఏ’ జట్టు విజయం సాధించింది. -
ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ
-
ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ
న్యూఢిల్లీ : గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు సహా తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానితో సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు. హైకోర్టు విభజనపై ప్రధానమంత్రితో చర్చించలేదని ఆయన తెలిపారు. జల వివాదాలపై తాను జోక్యం చేసుకోనని, అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ అంశంపై మాట్లాడనని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. కృష్ణా పుష్కరాల పనులు సకాలంలో పూర్తవుతాయని ఆయన తెలిపారు. -
అదుపుతప్పిన శాంతిభద్రతలు
– ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్ల సమీపంలోనే హత్యలు – డీజీపీ సొంత జిల్లాలో ప్రశ్నార్థమైన లా అండ్ ఆర్డర్ – జిల్లా వ్యాప్తంగా పోలీసుల నిర్లిప్తత – ఎస్పీ రాజశేఖర్బాబు బాధ్యతలు తీసుకుని నేటితో రెండేళ్లు పూర్తి (సాక్షి ప్రతినిధి, అనంతపురం) : 2015 మార్చి 31 : తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో సింగిల్విండో అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నేత విజయభాస్కర్రెడ్డిని సొసైటీ కార్యాలయంలోనే టీడీపీ నేతలు హత్య చేశారు. –2015 ఏప్రిల్ 29 : రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ మాజీ మండల కన్వీనర్ ప్రసాదరెడ్డిని హæత్య చేశారు. –2016 జూలై 21 : అనంతపురం నాలుగో పట్టణ æపోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలో గోపీనాయక్, వెంకటేశ్నాయక్లను హతమార్చారు. ఈ మూడు సంఘటనలే కాదు...టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ‘అనంత’లో తరచూ ఎక్కడో ఒకచోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ 8 హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీలో చురుకైన నేతలు, కార్యకర్తలను తుదముట్టడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తద్వారా జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరిచి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందేలా ఇప్పటి నుంచే ‘అరాచక ప్రణాళిక’ను రచించారు. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సున్నిత ప్రాంతాలను గుర్తించి శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు పరిశీలకులు విమర్శిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ వైఖరితో ప్రతిపక్షపార్టీ శ్రేణులతో పాటు సామాన్యప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్పీ మృదు స్వభావమే కొంప ముంచుతోందా? ఎస్పీ రాజశేఖర్బాబుకు మృదుస్వభావిగా పేరుంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన కిందనున్న కొందరు కీలక పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చాలా సర్కిళ్లలో సీఐలు, ఎస్ఐలను ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినవారినే నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి/ఎమ్మెల్యే అండ ఉంటే చాలని, ఎవ్వరు అడ్డొచ్చినా తన ‘సీటు’ పదిలమనే ధీమాతో కొందరు సీఐలు, ఎస్ఐలు పనిచేస్తున్నారు. ఉన్నతాధికారులను సైతం బైపాస్ చేసి వెళుతున్నారు. పేకాట, మట్కా, క్రికెట్బెట్టింగ్లు జరుగుతున్నా కొందరు పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇంకొంతమంది స్టేషన్లలో స్థలవివాదాలతో పాటు పంచాయితీలు చేస్తున్నారు. ఎస్పీ దృష్టికి వచ్చిన ఘటనలపై ఆయన తక్షణ చర్యలు తీసుకుంటున్నా.. దృష్టికి రానివి మాత్రం చాలానే ఉన్నాయి. ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతుభరోసా యాత్రలో పామిడి సీఐ నరేంద్రరెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్థాయి టీడీపీ నేతలు రోడ్డుపై ఆందోళనకు సిద్ధమవుతున్నారని తెలిసి ప్రతిపక్షనేత కాన్వాయ్ని ముందుకు వెళ్లకుండా నరేంద్రరెడ్డి అడ్డుపడ్డారు. ‘గ్రామస్థాయి లీడర్లు ఆందోళన చేస్తే వారిని అదుపు చేయకుండా.. ప్రతిపక్షనేత కాన్వాయ్ను ఆపడమేంటని’ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తే...‘గ్రామస్థాయి అయినా, మండలస్థాయి అయినా వారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నవారికి, లేనివారికి తేడా ఇలాగే ఉంటుంది’ అంటూ అధికార పార్టీకి తాము అనుకూలంగా వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు రెండేళ్లుగా పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవడానికి. ప్రభుత్వాలు ఐదేళ్లకోసారి మారతాయి. కానీ పోలీసుల పనితీరును ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉంటారు. మొత్తం మీద ఎస్పీ రెండేళ్లలో కొన్ని వినూత్న, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మంచిపేరు తెచ్చుకున్నా, శాంతిభద్రతల పరిరక్షణలో మాత్రం వెనుకబడ్డారనే భావన ప్రజల్లో నెలకొంది. -
శాంతి భద్రతలా... ఎక్కడ?
సాక్షి, చెన్నై: డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ మంగళవారం తన నియోజకవర్గం కొళత్తూరులో పర్యటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, శాంతి భద్రతల పరిరక్షణ ఎక్కడ.. ఏమేరకు ఉన్నదో ప్రజలందరూ గుర్తించాల్సిన విషయంగా వ్యాఖ్యానించారు. కొళత్తూరు నుంచి రెండో సారిగా అసెంబ్లీలోడీఎంకే దళపతి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం, ప్రజల్ని కలిసి వారి మొర ఆలకించేందుకు మంగళవారం స్టాలిన్ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో వీధి వీధిన తిరిగారు. అక్కడక్కడ ఎదురైన సమస్యల్ని గుర్తించి, వాటి పరిష్కారానికి తగ్గ చర్యలు అక్కడక్కడే తీసుకునే విధంగా అధికారుల్ని ఆదేశించారు. తిరువళ్లువర్ నగర్, కన్నగినగర్, తదితర ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యల్ని, తమకు ఎదురు అవుతున్న కష్టాల్ని స్టాలిన్ దృష్టికి తీసుకొచ్చారు. పారిశుధ్య లోపం, కాలువల మరమ్మతులు తదితర అంశాలను పరిశీలించి తగిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చేపట్టనున్న పనులను వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హత్యల పర్వం కొనసాగుతుంటే నోరు మెదపని సీఎం జె జయలలిత, అన్నాడీఎంకేకు చెందిన కౌన్సిలర్ హత్యతో సంతాపం తెలియజేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. తన దాకా సమస్య వస్తే గానీ స్పందించరా? అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణ ఎక్కడ ఉందో, ఏమేరకు ఉన్నదో ప్రజలు గుర్తించాలని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ నిధుల కేటాయింపుల విషయంలో సంబంధిత శాఖ మంత్రి తగిన సమాధానం ఇంత వరకు ఇవ్వలేదని, ఈ విషయంలో కోర్టుకు వెళ్లడానికి తాను సిద్ధం అని స్పష్టం చేశారు. -
పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో పోలీసుల కృషి ఎనలేనిదని, వారి సంక్షేమానికి మరింత కృషి చేస్తామని డీజీపీ అనురాగ్శర్మ అన్నారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా సిబ్బంది కంట్రిబ్యూషన్తో నడుస్తున్న ‘భద్రత’ పొదుపు సంఘం మొదటి సర్వసభ్య సమావేశం ఆదివారం డీజీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా 2014-15 సంవత్సర కార్యకలాపాలను ఐజీ సౌమ్యామిశ్రా, సంఘం కార్యదర్శి గోపాల్ రెడ్డిలు వివరించారు. సిబ్బంది జీతభత్యాలు, వారి కుటుంబ సభ్యుల మేలును దృష్టిలో పెట్టుకొని పొదుపు, ఆరోగ్య భద్రత పథకాలను మరింత ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2,441 మందికి వ్యక్తిగత రుణాల కింద రూ.30.06 కోట్లు అందజేసినట్లు వివరించారు. అలాగే 252 మందికి గృహ అవసరాల కోసం రూ.17.23 కోట్లు, పిల్లల ఉన్నత చదువుల కోసం రూ.8.78 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్య భద్రతపై ప్రత్యేకంగా చర్చించారు. వివిధ జిల్లాల ప్రతినిధులు మాట్లాడుతూ... కొన్ని ఆస్పత్రులు పోలీసు సిబ్బందిని పట్టించుకోవడం లేదని, ఎమర్జెన్సీ సమయంలో చేర్చుకోవడం లేదని అన్నారు. భద్రత సంస్థ చైర్మన్, డీజీపీ అనురాగ్శర్మ మాట్లాడుతూ పోలీసు సంక్షేమం కోసం నూతన పద్ధతులు అవలంబిస్తామని చెప్పారు. భద్రత, ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభిస్తామన్నారు. త్వరలో ప్యానల్లో ఉన్న ఆస్పత్రులను పరిశీలిస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యులు వీవీ శ్రీనివాసరావు, బాలనాగదేవి, కల్పనా నాయక్, శివధర్రెడ్డిలతో పాటు పోలీసు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, కరణ్కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసమే పోలీసులు : ఎస్పీ
ఆదిలాబాద్: ప్రజల కోసమే పోలీసులున్నారని ప్రజా సంక్షేమమే తమ ఆకాంక్ష అని జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ అన్నారు. సోమవారం తిర్యాణి మండలంలోని రోంపల్లి, గుండాల, మంగి గ్రామాల్లో పోలీసులు జనమైత్రి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో రోడ్డు, తాగునీరు, విద్యా, వైద్యం తదితర సౌకర్యాలు ఏర్పడినపుడే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయన్నారు. అసాంఘిక శక్తులకు సహకరించి గ్రామాల వెనకబాటు తనానికి కారణం కావద్దన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లకు మంచి భవిష్యత్ను చూపించాలని మావోయిస్టుల వైపు అకర్షితులు కాకుండా చూడాలన్నారు. అసాంఘిక శక్తులకు సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంగి గ్రామంలో సెల్ టవర్, రోడ్డు నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 23 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని వారు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పునరావాసం కల్పించి ప్రభుత్వం ఉపాది కల్పిస్తుందన్నారు. యువకుల కోసం పోటీపరీక్షల గైడెన్సు, పుస్తకాలు శిక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం అడిషల్ ఎస్పి పనసారెడ్డి మాట్లాడుతూ, ఖైరిగూడలో బల్లార్షను మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాల్చి చంపారని అతడు ఏడు సంవత్సరాల నుంచే పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడ ని వారి లేఖలో పేర్కొన్నార ని అన్నారు. ఏడేళ్ల కుర్రాడు పోలీస్లకు సమాచారం ఇస్తాడా అని ప్రశ్నించారు. రోంపల్లి, మంగి గ్రామాల్లో పోలీ స్ అధికారులు ప్రజలతో కలిసి అల్పాహారం, భోజనం చేశారు. రోంపల్లి నుంచి గుండాలకు కాలినడకన పోలీస్ అధికారులు చేరుకుని అక్కడి ప్రజలతో సమావేశమయ్యారు. బెల్లంçపల్లి డీఎస్పీ రమణారెడ్డి, సీఐ కరుణాకర్, ఎస్సైలు బుద్దేస్వామి, అశోక్ జనమైత్రి గ్రామపోలీస్ అధికారులు కిరణ్, శ్రీనివాస్, మండల వైస్ ఎంపీపీ మెస్రం గణేశ్ పాల్గొన్నారు. -
శాంతి భద్రతలను పరిరక్షించండి : ఎస్పీ
నెల్లూరు: నెల్లూరు నగరంలో శాంతి భధ్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షించాలని ఎస్పీ విశాల్గున్నీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం రాత్రి 11 గంటల తర్వాత ప్రాంతంలో ఆయన తన క్యాంపు కార్యాలయంలో నగర డీఎస్పీ జి.వి.రాముడుతో కలిసి నగర పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, తీసుకొంటున్న చర్యలపై చర్చించారు. అసాంఘీక శక్తులు, ఆకతాయిలపై కఠినంగా వ్యవహరించాలని, నేరాల నియంత్రణకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసి పోలీస్శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్పై అసహనం..? ఈక్రమంలోనే బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రామారావు వ్యవహారశైలిపై ఎస్పీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల రామారావు వ్యవహారశైలిపై పలు ఆరోపణలు వెల్తువెతిన్న విషయం తెలిసిందే. ఇన్స్పెక్టర్ సిబ్బంది నడుమ పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. ఈవిషయాలన్నీ ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దీంతో ఆరోపణలకు దూరంగా ఉంటూ సిబ్బందిని సమన్వయం చేసుకొని విధులు నిర్వహించాలని ఎస్పీ ఆయన్ను ఆదేశించినట్లు సమాచారం. -
నవ్వుతూనే వుండు!
హ్యూమర్ దేవుడికి మనిషంటే చాలా ప్రేమ. అందుకే ఇన్ని కోట్ల జీవరాసుల్లో నవ్వే శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక కుక్కకి సంతోషమొస్తే తోకని విసనకర్రలా ఊపు తుందే తప్ప నవ్వలేదు. ఒక పిల్లికి ఆనందమొస్తే కాళ్ల చుట్టూ మియ్యావ్ అని తిరగు తుందే తప్ప పకపక నవ్వ లేదు. తనకున్న శక్తిని మనం గుర్తించలేక, నవ్వలేక, నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా సృష్టించాం. మనం పుడుతూనే ఏడుస్తూ ఈ భూమ్మీదికి వస్తాం. అక్కడ మనకు చాయిస్ లేదు. కానీ బతికినంతకాలం నవ్వుతూ బతకొచ్చు. ఇక్కడ చాయిస్సుంది. కానీ చాలామంది ఏడుస్తూ, ఏడిపిస్తూ బతుకుతూ వుంటారు. వీళ్లు కచ్చితంగా నరకానికే పోతారు. నవ్వేవాళ్లు స్వర్గానికి పోతారో లేదో నాకు తెలియదు కానీ, నవ్వుతూ వుంటే దానికి మించిన స్వర్గం ఏముంటుంది? దేవుడికి మనిషంటే చాలా ప్రేమ. అందుకే ఇన్ని కోట్ల జీవరాసుల్లో నవ్వే శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక కుక్కకి సంతోషమొస్తే తోకని విసనకర్రలా ఊపుతుందే తప్ప నవ్వలేదు. ఒక పిల్లికి ఆనందమొస్తే కాళ్ల చుట్టూ మియ్యావ్ అని తిరగుతుందే తప్ప పకపక నవ్వలేదు. తనకున్న శక్తిని మనం గుర్తించలేక, నవ్వలేక, నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా సృష్టించాం. అన్నిటిని కల్తీ చేసినట్టే మనం నవ్వుని కూడా కల్తీ చేశాం. పసిపాపలు, పరమయోగుల పెదాలపై మెరిసే నవ్వు నిజమైన నవ్వు. మిగతా అంతా ఎంతో కొంత కల్తీనే. తమాషా ఏమంటే అందరూ ఒకేలా ఏడుస్తారు కానీ ఒకేలా నవ్వలేరు. కొందరు పకపక నవ్వితే, మరికొందరు పగలబడి నవ్వుతారు. కొందరు సోడా కొట్టినట్టు ‘స్స్స్’మని నవ్వితే, మరికొందరికి సౌండే రాదు. బాస్ జోక్లకి మనకి తెగ నవ్వొస్తుంది. తుపాన్లో చెట్లు వూగినట్టు వూగిపోతూ నవ్వుతాం. ఒక్కోసారి జోక్ మొదలు పెట్టకముందే నవ్వుతాం. ‘ఇప్పుడేమైందంటే’ అనగానే ఓహ్హోహ్హో అని నవ్వేస్తాం. జోక్ బిగినింగే ఇంత హాస్యంగా వుంటే, పూర్తిగా వింటే పొట్ట చెక్కలైపోతుందేమో! మా పెద్దమ్మ ఒకావిడ కేవలం నవ్వుతోనే మా పెద్దనాయన్ని కంట్రోల్ చేసింది. ఆమె ప్రతి నవ్వు వెనక ఒక ఆదేశముండేది. ఆ ఆర్డర్ మా పెద్దనాయనకే అర్థమయ్యేది. లాఫింగ్తోనే లా అండ్ ఆర్డర్. విలన్ల నవ్వు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పాతాళభైరవిలో ఎస్వీఆర్ నవ్వుని ఎన్నాళ్లైనా మర్చిపోలేం. రాజనాల, సత్యనారాయణ నవ్వారంటే ఎవరి కొంపకో ఎసరు పెట్టారని అర్థం. ఇక మన రాజకీయ నాయకుల సంగతి. వాళ్లు ఓట్లు వేసే వరకూ మనల్ని చూసి చిరునవ్వు నవ్వుతారు. గెలిచిన తరువాత మనల్ని అంతకంత ఏడిపిస్తారు. హాస్యనటులు అదృష్టవంతులు. కోట్లాది మందిని నవ్వించడం నిజంగా వాళ్లకు దేవుడిచ్చిన ఒక వరం. చిన్నప్పుడు జానపద సినిమాల్లో ఒక సీన్ తప్పకుండా వుండేది. ఎలుగుబంటి హాస్యనటుణ్ని తరుముతూ ఉండే సీన్. దాన్ని చూసి నేను పడీ పడీ నవ్వేవాణ్ని. జీవితమే ఒక ఎలుగుబంటని, అది మనల్ని తరుముతూ వుంటుందని అప్పుడు, ఆ వయసులో నాకు ఏమాత్రం తెలియదు. తెలిసి వచ్చాక నిజం బోధపడింది. ఎప్పుడైనా కానీ మనం పారిపోతుంటే ఇతరులకి హాస్యం. ఇతరులు పారిపోతుంటే మనకి చెప్పలేనంత హాస్యం. మనం జాగ్రత్తగా గమనించాలే కానీ, జీవితంలో అడుగడుగునా హాస్యం కనిపిస్తుంది. సెలూన్ షాప్లో, సిటీ బస్సులో, ఆఫీసుల్లో, అసెంబ్లీలో, సీరియస్ సీరియల్స్లో, తెలుగు సినిమాల్లో... అన్ని చోట్లా హాస్యం ఉంటుంది. పండుతుంది. ఈ మధ్య సెలూన్కెళితే ఒక పెద్దమనిషి గడ్డానికి తెల్లటి నురుగు రాశారు. తీరా చూస్తే బ్లేడ్ లేదు. దానికోసం ఒక కుర్రాడెళ్లాడు, తిరిగి రాలేదు. హిమాలయాల్లో సాధువులా ఈయన వెయిటింగ్. ఆయనలో కోపం, నాకు నవ్వు. నవ్వు మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు నవ్వితే మాత్రం కురుక్షేత్రమే. ఒక చోటికి వెళ్లబోయి, ఇంకో బస్సు ఎక్కేస్తారు. సిటీ బస్సులో వీళ్ల హడావుడి చాలా కామన్. పని రానివాళ్లు చాలా సీరియస్గా పనిచేస్తుంటారు. ఇది ఆఫీస్ కామెడీ. అలాగే ఏడిపిస్తూ నవ్వించేవాళ్లు, నవ్విస్తూ ఏడిపించేవాళ్లు చాలా తక్కువమంది వుంటారు. వీళ్లు జీవితం తప్ప ఇంకేమీ చదువుకోరు. వీళ్లలో చాప్లిన్ ఒకడు. వానలో నడవడం ఇష్టమంటాడు. వానలో తన కన్నీళ్లు ఇతరులకి కనిపించవట. మనసారా నవ్వేవాడికి ప్రతిరోజూ నవ్వుల దినోత్సవమే. నవ్వనివాడికి ఇలాంటి నవ్వుల దినోత్సవాలు వంద వచ్చినా ప్రయోజనం లేదు. ఈ ప్రపంచంలో అందరూ పోయేవాళ్లే. కానీ నవ్వుతూ బతికినోళ్లు ఎప్పటికీ బతికే వుంటారు. ఏడుస్తూ బతికేవాళ్లు, వుండగనే పోయుంటారు. - జి.ఆర్.మహర్షి -
వీళ్లు..మారరు!
అదుపు తప్పిన శాంతిభద్రతలు పెచ్చుమీరుతున్న నేరాలు పట్టించుకోని పోలీసులు ఎస్పీ ఆదేశిస్తే నాలుగు రోజులు కదలిక..ఆపై షరామామూలే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కొందరు.. అత్యాశతో మరికొందరు అనంతపురం: ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించినా అధికార పార్టీ నేతలు మాత్రం భారీగా తవ్వకాలు చేపడుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదు. వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ ‘సాక్షి’ ఈ నెల 24న ‘ఉచితం ఉత్తిదే’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనికి ఎస్పీ రాజశేఖర్బాబు స్పందించి వెంటనే రీచ్లను తనిఖీ చేయించారు. అక్రమార్కులను అరెస్టు చేసి.. కేసులు నమోదు చేశారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ విచ్చలవిడిగా సాగుతోన్న వైనం, పోలీసుల పాత్రను వివరిస్తూ ఈ నెల 27న ‘సాక్షి’లో ‘బెట్టింగ్ హీట్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. తీవ్రంగా పరిగణించిన ఎస్పీ వెంటనే దాడులకు ఆదేశించారు. పలుచోట్ల అరెస్టులు చేశారు.ఈ రెండు ఉదాహరణలు చాలు పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి. ఎస్పీ కన్నెర్ర చేసినప్పుడు మాత్రమే పరిస్థితిలో మార్పు కన్పిస్తోంది. తర్వాతే షరామామూలే. ‘అనంత’ కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. నేరాలు అధికంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో పోలీసులు నిత్యం అప్రమత్తతతో వ్యవహరించాలి. నేరనియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. అయితే.. జిల్లాలో పలుచోట్ల ఎస్ఐలు, సీఐల పనితీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నిరోజులూ ఇసుక అక్రమరవాణా పోలీసులకు తెలిసే జరిగిందనే ఆరోపణలున్నాయి. క్రికెట్ బెట్టింగ్, మట్కా, కాల్మనీ వ్యవహారాల్లోనూ ఇదే తంతు నడిచింది. పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు ‘మీ కనుసన్నల్లో అంతా సవ్యంగా నడుస్తోంద’ని కొందరు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పత్రికల్లో వార్తలు చూసి ఎస్పీ ప్రశ్నిస్తే...అప్పుడు మాత్రం సీరియస్గా స్పందిస్తున్నారు. ఇందుకు ఇటీవల జరిగిన ఘటనలే తార్కాణం. అసలు ‘అనంత’లో క్రికెట్ బెట్టింగ్ లేదని, మట్కాను పూర్తిగా అరికట్టామని, కాల్మనీ ఉదంతాలను కూడా పూర్తిగా నివారించామని ఎస్పీకి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికీ ఈ తరహా నేరాలు జూలు విదిల్చుతూనే ఉన్నాయి. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లూ కారణమే పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వహించకపోవడానికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు కూడా కారణంగా తెలుస్తోంది. స్టేషన్కు 10 ఫిర్యాదులొస్తే కనీసం ఏడింటికి అధికారపార్టీ నేతల నుంచి సిఫార్సులు వస్తున్నాయి. ‘ఫలానా వ్యక్తికి ఫేవర్గా చేయి’అని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ధనార్జనకు అలవాటుపడిన కొందరు పోలీసులు వారి సర్కిల్, స్టేషన్ పరిధిలో పంచాయితీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మచ్చుకు కొన్ని.. ‘అనంత’ ఒకటి, రెండో పట్టణ పోలీసుస్టేషన్ల పరిధిలో మట్కా విచ్చలవిడిగా నడుస్తోంది. ఈ సెంటర్లన్నీ పోలీసులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. తాడిపత్రి, కదిరి, గుంతకల్లులోనూ ఇదే పరిస్థితి. అనంత టూటౌన్ పరిధిలో కాల్మనీ ఉదంతాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై రోజూ పంచాయితీలు స్టేషన్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది.ఈ స్టేషన్కు వచ్చే వారి పట్ల కూడా ఓ పోలీసు అమర్యాదగా మాట్లాడుతున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కొంతకాలం కిందట ఈ పోలీసు తనపై ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళ మీడియా దృష్టికి తెచ్చింది. క్రికెట్ బెట్టింగ్ కూడా ఈ సర్కిల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనంతలో కాల్మనీ బాధితులు స్టేషన్ మెట్లెక్కితే వారించడం, చిన్న పంచాయితీ చేసి పంపడం మినహా బాధితుల పక్షాన కేసులు నమోదు చేయడం లేదు. నగరపాలకసంస్థ పాలకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఇప్పటికీ ‘కాల్మనీ’ నడుపుతున్నారు. కానీ ఆయన ఇంట్లో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ‘అనంత’కు చెందిన ఓ వ్యక్తిని బాగేపల్లి సమీపంలో సజీవదహనం చేశారు. కళ్యాణదుర్గం పరిధిలోని పాలవాయి సమీపంలో మరో వ్యక్తిని హత్య చేసి దహనం చేశారు. ఈ రెండు హత్యలకు ఆర్థిక వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. ఇలాంటి వివాదాలతోనే ఉరవకొండలోనూ హత్య జరిగింది. ‘అనంత’లో హెరాయిన్ విక్రయాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
అతివకు ‘భరోసా’
బాల బాధితులకూ సమగ్ర ఆసరా అన్ని సేవలూ ఒకే గొడుకు కిందికి హాకా భవన్లో ప్రత్యేక కార్యాలయం త్వరలో అందుబాటులోకి: పోలీసు కమిషనర్ నగరంలోని 60 శాంతిభద్రతల ఠాణాలు, మూడు మహిళా పోలీసుస్టేషన్లకు బాధిత మహిళలు నుంచి ప్రతి రోజూ 50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. మైనర్లు, చిన్నపిల్లలపై జరిగే దారుణాలపైనా నిత్యం అనేక ఫిర్యాదులందుతున్నాయి. సిటీబ్యూరో: తీవ్రమైన వేధింపులు, దాడులు ఎదుర్కొన్న మహిళలు, చిన్నారులకు ఊరట లభించాలంటే కేవలం కేసు నమోదు చేస్తే సరిపోదు. దీంతో పాటు వైద్య-న్యాయ సహాయాలు, పునరావాసం, కౌన్సెలింగ్ తదితరాలు ఎంతో అవసరం. ప్రస్తుతం వీటి కోసం బాధితులు పోలీసుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అనేక చోట్లకు తిరగాల్సి వస్తోంది. ఇది వారికి ఎంతో ఇబ్బంది కలిగించే అంశం. ఈ సమస్యలకు పరిష్కారంగా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఆలోచన నుంచి పుట్టిందే ‘భరోసా’ కేంద్రం. మహిళా దినోత్సవం నేపథ్యంలో మంగళవారం దీని వివరాలు వెల్లడించిన కొత్వాల్.. ఇందుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరించారు. దేశంలో మరే ఇతర నగరంలోనూ ఈ తరహా సెంటర్ లేదని అధికారులు చెప్తున్నారు. అంతర్జాతీయ హంగులతో... లక్డీకాపూల్లో ఉన్న హాకా భవన్ గ్రౌండ్ఫ్లోర్లో ‘భరోసా’ రూపుదిద్దుకుంటోంది. ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్న ఈ కేంద్రం పరిధిలోకే ‘షీ-టీమ్స్’, ‘చైల్డ్ లైన్’ విభాగాలనూ తీసుకువస్తున్నారు. కమిషనర్ నేతృత్వంలో ఉండే కమిటీ పర్యవేక్షణలో పని చేసే ఈ కేంద్రానికి మహిళా ఏసీపీ ఇన్చార్జ్గా, వివిధ రంగాలకు చెందిన 36 మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. వివిధ నేరాల్లో బాధితులైన మహిళలు, యువతులు, బాలికలకు ఈ కేంద్రం సేవలందిస్తుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో పని చేసే ‘భరోసా’లో దాదాపు అంతా మహిళా ఉద్యోగులు, అధికారులే ఉంటారు. కేసు... కౌన్సెలింగ్... సహాయం... కుటుంబం, సమాజం, పని చేసే ప్రాంతాల్లో మానసిక, శారీకర, లైంగిక వేధింపులు, నేరాల బారినపడే అతివలు, నేరాల్లో బాధితులుగా మారే బాలికలు భరోసా కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు. దీనికి వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునే సిబ్బంది అవసరమైన పోలీసుస్టేషన్, విభాగంలో కేసు నమోదు అయ్యేలా చూస్తారు. వైద్య, న్యాయ సహాయాలు అవసరమైన వారికి వాటిని అందిస్తారు. పునరావాసం, కౌన్సెలింగ్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషిస్తారు. ఈ సహాయ, సహకారాలు అందుతున్న విధానాన్నీ పర్యవేక్షిస్తారు. వీడియో లింకేజ్ ద్వారా విచారణ... వివిధ రకాలైన నేరాల్లో బాధితులుగా ఉండి, ఈ కేంద్రం ద్వారా సహాయం పొందిన వారు సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. న్యాయ సాధికారిక సంస్థతో ఒప్పందం ఉన్న నేపథ్యంలో ఈ కేంద్రంలో ఉండే ప్రత్యేక వీడియో లింకేజ్ రూమ్ నుంచి కోర్టుకు సాక్ష్యం ఇచ్చే సౌలభ్యం కల్పించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ విభాగం, పలు స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తూ అవగాహన ఒప్పందాలు చేసుకున్న పోలీసు విభాగం అన్ని సేవల్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చింది. కొత్వాల్ కల సాకారం ‘భరోసా లాంటి కేంద్రం ఉండాలనేది నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి కల. ఆయన కృషి ఫలితంగానే సాకారమవుతోంది. స్త్రీ-పురుషులు సమానమనే స్ఫూర్తిని పెంచే ఈ కేంద్రం ఏర్పాటు సుదీర్ఘ ప్రయాణంలో ఓ అడుగు మాత్రమే.’ - అంజనీకుమార్, అదనపు సీపీ (శాంతిభద్రతలు) సహాయంతో పాటు పర్యవేక్షణ ‘భరోసా సెంటర్ను ఆశ్రయించిన బాధితులకు తక్షణం సహాయ సహకారాలు అందిస్తాం. దీంతో పాటు వారు జీవితంలో పూర్తిగా స్థిరపడేలా, వారికి అన్ని దశల్లోనూ పూర్తిస్థాయి న్యాయం జరిగేలా పర్యవేక్షణ బాధ్యతల్నీ స్వీకరిస్తాం. షీ-టీమ్స్, చైల్డ్ లైన్ తదితరాలనూ దీని పరిధిలోకే తీసుకువస్తున్నాం.’ - స్వాతి లక్రా, అదనపు సీపీ (నేరాలు) రాష్ట్ర వ్యాప్తంగా అమలు యోచన ‘ఈ తరహా కేంద్రాన్ని ప్రభుత్వం పెలైట్ ప్రాజెక్టుగా నగరంలో ఏర్పాటు చేస్తోంది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వారి విధి నిర్వహణనూ పర్యవేక్షిస్తూ విజయవంతం చేస్తాం. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది.’ - డాక్టర్ టి.ప్రభాకరరావు, జేసీపీ (క్రైమ్స్) సుదీర్ఘకాలం కొనసాగేలా ప్రభుత్వ అనుమతితో ఏర్పాటవుతున్న భరోసా కేంద్రం సుదీర్ఘకాలం కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్రం నుంచి నిర్భయ ఫండ్ ద్వారా, రాష్ట్రం నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూర్చుకోవడంతో పాటు కార్పొరేట్ సంస్థల సీఎస్సార్ ఫండ్స్, స్వచ్ఛదంగా ముందుకు వచ్చే ఆస్పత్రులు, ఎన్జీఓలను భాగస్వాముల్ని చేశాం. బాధితులకు అన్ని రకాల సహాయసహకారాలు అందడంతో పాటు వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న ‘భరోసా’ త్వరలో ప్రారంభమవుతుంది.’ - ఎం.మహేందర్రెడ్డి, నగర పోలీసు కమిషనర్ -
పోలీసు అధికారులతో సీఎం భేటీ
సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణపై ఐదేళ్ల రికార్డును తయారు చేయాలని అధికారులకు బాబు సూచించారు. -
మాజీలపై నజర్!
నక్సల్స్ కార్యకలాపాల సంగతేంటి? విచారణ చేసి నివేదిక ఇవ్వండి పోలీసులకు జిల్లా ఎస్పీ ఆదేశం మావోయిస్టు, సానుభూతి పరుల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కరీంనగర్ : 'జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటం, నక్సల్స్ ప్రభావం లేకుండా చూడటం... ఇవే నా అత్యంత ప్రాధాన్యత అంశాలు'. ఈ నెల 8న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో జోయల్ డేవిస్ చేసిన వ్యాఖ్యలివి. పై వ్యాఖ్యలను పరిశీలిస్తే జిల్లాలో అడుగుపెట్టడానికి ముందే పోలీస్ బాస్ తన ప్రాధాన్యతలేమిటనే దానిపై కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే వచ్చీ రాగానే జిల్లాలో నక్సల్స్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు చెందిన వారిలో ఎవరెవరు మావోయిస్టు, జనశక్తి, ఇతర విప్లవ సంస్థల్లో పనిచేస్తున్నారు? వారికి ఎవరెవరు సహకారం అందిస్తున్నారు? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. దీంతోపాటు ప్రధానంగా గతంలో మావోయిస్టు, జనశక్తి గ్రూపుల్లో పనిచేసి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సలైట్లపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలో ఎంతమంది మాజీ నక్సలైట్లు ఉన్నారు? వారు ఏయే విప్లవ సంస్థలకు చెందిన వారు? వారిప్పుడు ఏం చేస్తున్నారు? అందులో సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్న వాళ్లున్నారా? ఉంటే ఎందరున్నారు? మాజీ నక్సలైట్లలో ఎంతమంది మావోయిస్టులతో ఇంకా సంబంధాలు కొనసాగిస్తున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పైన పేర్కొన్న అంశాలపై లోతుగా విచారణ జరిపి నివేదిక అందజేయాలని కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఐడీ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఎస్పీ ఆదేశాల మేరకు నిఘా అధికారులు లోతు గా విచారణ ప్రారంభించారు. 2000 నుంచి 2014 వరకు పీపుల్స్వార్, ప్రజాప్రతిఘటన, జనశక్తి, మావోయిస్టు సహా మొత్తం 11 విప్లవ సంస్థల్లో వివిధ హోదా ల్లో పనిచేసి లొంగిపోయిన వారు ఎంతమంది ఉన్నారనే దానిపై జాబితా సేకరించారు. నాటి నుంచి గత ఏడాది వరకు జిల్లాలో దాదాపు 750 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసినట్లు గుర్తించారు. ఇందు లో దళ కమిటీ సభ్యుడు మొదలు జిల్లా, జోనల్ కమి టీ సభ్యులు, దళ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుల వరకు వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్లూ ఉన్నారు. ఈ మేరకు ఫోన్ నంబర్లు, అడ్రస్ల ఆధారంగా వారి నివాస ప్రాంతాలకు వెళ్లి రోజువారీ కార్యకలాపాలపై ఆరా తీసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీ సుల విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు జరిపిన విచారణలో కొందరు సెటిల్మెంట్లు, భూకబ్జా దందాలు కొనసాగిస్తుంటే... మరికొందరు మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అలాగే తీవ్రవాద కార్యకలాపాలకు దూరం గా ఉంటూ తమ కాళ్లపై తాము నిలబడుతూ కుటుం బాలను పోషిస్తున్న వాళ్లూ కూడా ఉన్నట్టు తెలుస్తోం ది. మొత్తమ్మీద వారం, పది రోజుల్లో విచారణ పూర్తి చేసి పోలీస్ బాస్కు నివేదిక అందించే పనిలో పడ్డారు. మావోయిస్టులెందరున్నారు? ప్రస్తుతం మావోయిస్టు నాయకుల్లో జిల్లాకు చెందిన వారెందరున్నారు? వారు ఏయే హోదాల్లో ఉన్నారు? ఇప్పటికీ జిల్లా ప్రజలతో సంబంధాలున్న వారున్నారా? తదితర అంశాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులను జిల్లా బాస్ ఆదేశించినట్లు తెలిసింది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలోని తూర్పు ప్రాంతంలో మావోయిస్టులతోపాటు వారి సానుభూతిపరుల కదలికలపై కన్నేసి ఉంచాలని సూచించినట్లు సమాచారం. -
'పోకిరీల ఆటలు ఇక చెల్లవు'
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అరాచక శక్తుల ఆట కట్టిస్తామన్నారు. మహానాడులో మూడో రోజు శాంతి భద్రతలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... హైదరాబాద్ లో శాంతిభద్రతలు పరిరక్షించి మతసామరస్యాన్ని కాపాడింది టీడీపీ అని చెప్పారు. శాంతిభత్రలు నాగరికతకు చిహ్నమన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. పోకిరీల పట్ల కఠినంగా వ్యహరిస్తామన్నారు. ర్యాగింగ్ జోలికి వెళ్లొద్దని, చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. -
టార్గెట్ స్టూడెంట్స్!
వర్సిటీ విద్యార్థులపై మావోయిస్టుల కన్ను ఉద్యమంలోకి ఆక ర్షించే యత్నాలు చాపకింద నీరులా పార్టీ సంస్థాగత నిర్మాణం విద్యావంతులను చేర్చుకుంటున్నట్లు నిఘా వర్గాల హెచ్చరిక అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం కరీంనగర్: మావోయిస్టులు చాపకింద నీరులా ఉద్యమాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఏ మాత్రం లేని ప్రాంతాల్లో యువకులను ఉద్యమంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిఘా వర్గాల వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత కూడా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపు లేనేలేవు. కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతంలో నామమాత్రంగా, ఖమ్మం జిల్లా చింతూరు ప్రాంతంలో (ఛత్తీస్గఢ్ సరిహద్దు) తప్ప ఎక్కడా వారి కదలికలు లేవు. అయితే పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉద్యమంలోకి విద్యావంతులను ఆకర్షించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన ఉత్తర తెలంగాణ పోలీసులు కాలేజీల్లో చదువుకుంటూ అదృశ్యమైన యువకుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచిఇప్పటికే కొందరు విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వారి విచారణలో వెల్లడైంది. ‘విశ్వవిద్యాలయాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై మనం నిఘా వేయాలి. ఇప్పటికే కొందరు విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి’ అని ఇటీవల శాంతిభద్రతలపై సమీక్షలో ఓ ఎస్పీ పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యమంలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులతోపాటు, పరిస్థితుల ప్రభావంతో లొంగిపోయిన మాజీలను కూడా తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. హరిభూషణ్ రాకతో... మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఎన్నికైనప్పటి నుంచి సంస్థాగత నిర్మాణం జోరందుకున్నట్లు తెలుస్తోంది. దళిత, గిరిజన, బలహీన వర్గాలనే కాకుండా మేధావులు, విద్యావంతులను ఆకర్షించాలని భావిస్తున్న మావోయిస్టు అగ్రనేతలు ఆ దిశగా ప్రయత్నాలను తీవ్రం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వర్షాకాలంలో దట్టంగా మారే అడవులను అనుకూలంగా మార్చుకుని ప్రజా దర్బారులు నిర్వహించాలని, పలు సంచనాలతో తమ ఉనికి చాటుకోవాలని మావోయిస్టులు ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటి నుంచే రాజకీయ నేతలు, పోలీసు అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన సమగ్ర వివరాలను ఇప్పటినుంచే సేకరిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లోని అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బందిని సర్కారు అప్రమత్తం చేసింది. రాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ను కూడా పోలీసులు విస్తృతం చేశారు. మావోయిస్టుల దాడులను ఎదుర్కొనడం, ఆయుధాల వినియోగంపైనా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. -
విద్రోహుల పీచమణుస్తాం
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు : రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పే ర్కొన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా కోరమంగళలోని కేఎస్ఆర్పీ మైదానంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఇందుకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పోలీసుల సంక్షేమం కోసం ప్ర భుత్వం అనేక కార్యక్రమాలను రూపొం దిస్తోం దన్నారు. అందులో భాగంగా వారి పిల్లల కోసం ప్రత్యేకంగా త్వరలో గుల్బర్గా, ఉడిపిల్లో ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించనున్నామన్నారు. ఇలాంటి పాఠశాలలు ఇప్పటికే కోరమంగల, మైసూరు, ధార్వాడలో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలీస్ క్యాంటీన్లోని సౌలభ్యాలను విశ్రాంత ఉద్యోగులకూ అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. కాగా, కార్యక్రమం లో భాగంగా పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన 85 మంది సిబ్బందికి ముఖ్యమంత్రి పతకాలను ప్రదానం చేశారు. -
చిత్తూరులో టీడీపీ నేత ఆగడాలు
పిస్తోలు చూపి బెదిరింపులు పోలీసులపైనే తిరుగుబాటు? వెపన్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు చిత్తూరు: ఓ అధికారపార్టీ నేత దూకుడు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి చేరింది. బుధవారం రాత్రి ఆ నేత నగరంలోని తన కార్యాలయం వద్ద కొందరు వ్యాపారులను నిర్బంధించి వారికి దేహశుద్ధి చేయడమే కాక పిస్తోలు చూపి బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ ఢిమాండ్ చేసినట్లు ప్రచారం సాగింది. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నగరంలో పనిచేసే ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ హుటాహుటిన రాత్రి పది గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ జనం పోైగె ఉండడాన్ని గమనించిన సీఐ అందరినీ మందలించే ప్రయత్నం చేయగా, అధికార పార్టీ నేత సీఐపై ఎదురుతిరిగినట్లు సమాచారం. తనజోలికొస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతటితో వదలక ఒక దశలో దమ్ముంటే తనను అరెస్ట్ చేసి చూడాలని ఆ నేత సీఐ కి సవాల్ విసిరినట్లు సమాచారం. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్యుద్ధం జరిగింది. ఇంతలో నేత వద్ద ఉన్న పిస్తోల్,మూడు బుల్లెట్లను గమనించిన సీఐ వాటిని స్వాధీనం చేసుకున్నారు. నాగాలాండ్ లెసైన్సు,తమిళనాడు అడ్రస్సుతో పిస్తోలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి విచారణ జరిపిన తరువాత అది లైసన్సుగల పిప్తోలా ? కాదా అనే విషయాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ సీరియస్: అధికార పార్టీ నేత వ్యవహారాన్ని జిల్లా పోలీసు అధికారి తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనకు భయపడిన బాధితులు ఫిర్యాదు ఇచ్చేందుకు జంకుతున్నట్లు సమాచారం. పిస్తోలు, బుల్లెట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? అవి లైసన్స్డా?కాదా? ఒకవేళ లైసన్స్ ఉన్నవి అయితే ఎవరి పేరు మీద ఉన్నాయి? అనే వివరాలను పోలీసులు ఇప్పటికే ఆరా తీసే పనిలో పడ్డారు. పిస్తోల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకోవడంతో అధికారపార్టీ నేత జిల్లా పోలీసు అధికారిపై హైదరాబాద్ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
ప్రతీది వారికి చెప్పాల్సినవసరం లేదు : పీడీపీ
న్యూఢిల్లీ: శాంతిభద్రతలనేవి రాష్ట్రానికి సంబంధించిన విషయం అని, ప్రతీది ప్రధాని కార్యాలయానికి చెప్పాల్సిన అవసరం లేదని జమ్మూకశ్మీర్లోని అధికార పార్టీ పీడీపీ పేర్కొంది. ప్రత్యేక కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, హుర్రియత్ నేత మసరత్ అలాం విడుదలపై అధికార పీడీపీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోడీ లోక్సభలో వివరణ ఇస్తూ అలాంను పీడీపీ ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ విషయంలో కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పారు. జమ్మూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం దేశానికి వ్యతిరేకమైన నిర్ణయమని, కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో పట్టుబట్టడంతో ప్రధాని ఈ వివరణ ఇచ్చారు. దేశ సమైక్యత తమకు ముఖ్యమని దీనిపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన పీడీపీ ప్రధాని వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించింది. జమ్మూకశ్మీర్లో బీజేపీ-పీడీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
‘పోలీసు స్కాన్’
ఖాకీల పనితీరుకు ప్రజల మార్కులు లా అండ్ ఆర్డర్కు 42 శాతం స్పెషల్ బ్రాంచ్కు 70 శాతం మొదటి స్థానంలో కాలాపత్తర్ చివరి స్థానంలో మాదన్నపేట ఠాణా సిటీబ్యూరో: పోలీసుల పనితీరుకు నగర ప్రజలు ఇచ్చిన మార్కుల ఫలితాలను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి మూల్యాంకనం చేస్తున్నారు. ప్రజలకు ఉత్తమ సేవలందించడంలో ముందు వరుసలో ఉన్న ఠాణాలతో పాటు పూర్తిగా వెనకబడిపోయిన ఠాణాలను సైతం ఆయన గుర్తించారు. పనితీరు సరిగా లేని ఠాణా సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పనితీరును మెరుగుపర్చుకుని ప్రజలతో శభాష్ అనిపించుకోవాలని లేకుంటే బదిలీ వేటు పడుతుందని పేర్కొన్నారు. గతడాది ఆగస్టు 25 నుంచి ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా బాధితులు, ఫిర్యాదుదారులకు నేరుగా ఫోన్ చేసి పోలీసుల పనితీరుపై ఆరా తీయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆరు నెలల పాటు సాగిన ఈ వ్యవహారంలో మూడు నెలలకు ఒకసారి ఠాణాల గ్రేడింగ్ను తీశారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు శాంతి భద్రతల విభాగం పోలీసుల సేవలకు 42 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, స్పెషల్ బ్రాంచ్ విభాగం పనితీరుపై మాత్రం 70 శాతం మార్కులు వేశారు నగర పౌరులు. ప్రజలకు మేలైన సేవలందించడంలో మొదటి స్థానంలో సౌత్జోన్లోని కాలాపత్తర్ పోలీసు స్టేషన్ ఉండగా, చివరి స్థానాన్ని మాదన్నపేట దక్కించుకుంది. ఆరా తీసి మార్కులు... కాల్సెంటర్లో ప్రైవేటు వ్యక్తులుంటారు. వీరు బాధితులు/ఫిర్యాదుదారులకు నేరుగా ఫోన్ చేసి ‘‘ ఫిర్యాదు రాసేందుకు రాణాలో రిసెప్షనిస్టు సహకరించారా? లేదా?, ఫిర్యాదు స్వీకరించే సమయంలో పోలీసులు ఎలా వ్యవహరించారు, డబ్బు డిమాండ్ చేశారా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, నిందితులను అరెస్టు చేశారా’’ అని అడుగుతారు. ఇలా సేకరించిన వివరాలతో పోలీసుల పని తీరుపై మూడు నెలలకు ఒకసారి ఠాణాలకు గ్రేడింగ్ ఇస్తారు. మొదటి మూడు నెలల్లో ఠాణాలకు సగటున 46 శాతం మార్కులు రాగా, రెండో దశలో 42 శాతం మార్కులు వచ్చాయి. మొదటి మూడు స్థానాలు... మొదటి దశ ఫలితాల్లో మొదటిస్థానంలో గోపాలపురం, రెండో స్థానంలో కాలాపత్తర్, ఎస్ఆర్నగర్, మూడో స్థానంలో తిరుమలగిరి ఠాణాలు వచ్చాయి. ఇక రెండో దశ ఫలితాల్లో మొదటిస్థానంలో కాలాపత్తర్, రెండో స్థానంలో కంచన్బాగ్, ఆసిఫ్నగర్, మూడో స్థానంలో బొల్లారం ఉంది. చివరి మూడో స్థానంలో... మొదటి దశ ఫలితాల్లో చివరి స్థానంలో 5 శాతంతో బేగంపేట మహిళా పీఎస్, 31 శాతంతో చంద్రాయణగుట్ట, 32 శాతంతో రెయిన్బజార్ ఉంది. రెండో దశ ఫలితాల్లో 31 శాతంతో మాదన్నపేట, 33 శాతంతో మలక్పేట, ఫలక్నుమా, 34 శాతంలో చాదర్ఘాట్ ఠాణాలు చివరి స్థానాల్లో నిలిచాయి. ఎస్బీపై 70 శాతం సంతృప్తి... స్పెషల్ బ్రాంచ్ విభాగం పోలీసు సేవలపై 70 శాతం ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తపరిచారు. మొదటి దశలో ఇది కేవలం 42 శాతం మాత్రమే ఉండే. రెండో దశకు వచ్చేసరికి 27 శాతాన్ని పెంచుకుంది ఎస్బీ. రెండో దశలో 1442 మంది పాస్పోర్టు దరఖాస్తుదారులకు కాల్సెంటర్ ద్వారా ఫోన్ చేయడంతో ఈ ఫలితాలు ఇలా వచ్చాయి. మొదటి దశలో ఓ అధికారి జీరో శాతం ఉండగా రెండో దశకు వచ్చే సరికి 70 శాతం మార్కులను సాధించడం గమనార్హం. ట్రాఫిక్ విభాగంపై కూడా.. ఇప్పటి వరకు శాంతి భద్రతలు, స్పెషల్ బ్రాంచ్ విభాగాలపైనే ఫీడ్బ్యాక్ తీసుకున్న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ట్రాఫిక్ విభాగంపై కూడా దృష్టి సారించారు. ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై కాల్సెంటర్ నుంచి ఫోన్ చేసే ప్రక్రియ వారం రోజుల క్రితం మొదలైంది. -
లా అండ్ ఆర్డర్లో రాజకీయ జోక్యం
ఆదిలాబాద్ క్రైం : సాధారణంగా లా అండ్ ఆర్డర్ పేరు చెప్పగానే నేరాలు చేసే వారిలో వణుకుపుడుతుంది. నేరం చేయాలన్న ఆలోచన కూడా రాదు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు కాపాడే పోలీసుల చేతుల్లో ఉండాల్సిన లా అండ్ ఆర్డర్ ఇప్పుడు జిల్లాలో కొంత మంది అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లిపోతోందనే ఆందోళన కలుగుతోంది. శాంతిభద్రతల విషయంలో పక్షపాతం లేకుండా బాధితులకు న్యాయం చేసి.. బాధ్యులకు శిక్ష పడేలా చేయడమే లా అండ్ ఆర్డర్ పని. కానీ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రోజురోజుకూ పోలీసుల కేసుల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతోంది. ఒకప్పుడు తప్పు చేసే వారికి పోలీసులంటే భయం ఉండేది. కానీ ప్రస్తుతం తాము ఏ కేసులోనైనా తప్పు చేసినా తమను విడిపించేందకు నాయకులున్నారనే నమ్మకం వారిలో పెరిగిపోయిది. అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతో ఒకే వర్గానికి, నేరం చేసిన వారికి మద్దతు తెలిపి పోలీసులపై ఒత్తిడి తేవడం సరైంది కాదని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో ఎదుటి వ్యక్తికి న్యాయం జరుగదు. ప్రస్తుతం జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోనైతే ఇలాంటి సంఘటనలకు అంతులేకుండా పోతోందని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. చోటామోటా నాయకులదే పెత్తనం.. జిల్లాలోని ఏ పోలీసు స్టేషన్లోనైనా ఒక చిన్న కేసు నమోదైతే చాలు.. ఆ వెంటనే సంబంధిత పోలీసు అధికారికి ఫోన్లు వస్తున్నాయి. ఎలాంటికేసైనా సరే అందులో తమవారున్నారని.. వెంటనే విడుదల చేయాలని హెచ్చరించడం పరిపాటి. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల కంటే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొంత మంది చోటామోటా నాయకులే ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కటేమిటి.. ట్రాఫిక్, ఆర్టీవో నిబంధనలు పాటించని వాహనదారుడికి జరిమానా వేసినా.. ఘర్షణల్లో తోటి వారిపై దాడి చేసినా.. పేకాట ఆడుతూ దొరికిపోయినా.. అక్రమ మద్యం విక్రయిస్తున్నా.. మరే కేసుల్లోనైనా అందులో ఉండే బాధ్యులు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వారుంటే చాలు.. కేసు పక్కతోవ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. తప్పు తమదేనని తెలిసినా.. కేసులో పేరు ఉండకూడదని పోలీసులకు ఫోన్లు రావడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. సంబంధిత పోలీసు అధికారి కేసు విషయంలో రాజీపడని పక్షంలో అధికారంలో ఉన్నామని కొంత మంది చోట నాయకులు హెచ్చరిస్తుండడం శోచనీయం. చిన్నచిన్న కేసుల్లో జోక్యం చేసుకుంటుండడంతో పోలీసులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎఫ్ఐఆర్లో నమోదైన కేసులను సైతం తీసేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటే పరిస్థితి ఎలా తయారైందో చెప్పనక్కర్లేదు. రాజకీయ జోక్యం ఎందుకు..? పోలీసు కేసుల్లో రాజకీయ జోక్యంతో బాధితుడికి న్యాయం జరగకపోగా.. నేరస్థులు కేసు నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. పోలీసులు మనవారే ఉన్నారనే ధైర్యంతో కొంత మంది నాయకులు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న తగదాల్లో జోక్యం చేసుకొని పోలీసు స్టేషన్లకు వచ్చిన వారిని విడిపించేందుకు అధికార పార్టీ నాయకులు కొం దరు ప్రయత్నించడంతో సామాన్యులకు న్యాయం జరగడం లేదు. పోలీసులు సైతం ఇలాంటి కేసుల్లో చేతులె త్తేస్తున్నట్లు తెలుస్తోంది. చట్టాన్ని శాసించి.. చట్టం ఎవరికీ చుట్టం కాదు.. ఇది పోలీసు వ్యవస్థలో ప్రతిఒక్కరూ చెప్పే మాటే. కానీ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను బట్టి చూస్తే చట్టం పోలీసుల చేతుల్లోంచి.. రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోతుందేమోననే భయం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పోలీసు వ్యవస్థలో చట్టాన్ని శాసించే స్థాయిలో రాజకీయ జోక్యం జరుగుతుండడం బాధాకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పోలీసు వ్యవస్థలో రాజకీయ జో క్యం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏపీలో శాంతిభద్రతల సమస్య లేదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల సమస్య లేదని సీఎం నారా చంద్రబాబు చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్రం ఎంపిక చేసిన మూడు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని, పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్రం స్వర్గధామంగా ఉందన్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ (సిటీ ఇండియా ఇన్వెస్టర్స్) సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని లైఫ్ సెన్సైస్, ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దుతామని, విశాఖను పారిశ్రామిక హబ్గా తయారుచేస్తామని చెప్పారు. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం ఖాయమని పేర్కొన్నారు. డెయిరీ, పౌల్ట్రీ, సిమెంట్, పేపర్ పరిశ్రమలలో ఇప్పటికే ముందున్న ఏపీ.. ఫార్మా, బయోటెక్నాలజీ, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమల రంగాలలో దూసుకెళ్లనున్నదని చెప్పారు. ఇండస్ట్రియల్ టౌన్షిప్పులు, పెట్రో కెమికల్ కాంప్లెక్సులను అభివృద్ధి చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కులను, అపెరల్ పార్కులను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు, పీపీపీ పద్ధతిలో భవిష్యత్తులో పది లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇలావుండగా.. విద్యుత్, సహజవాయువు రంగాలలో అతిపెద్ద కంపెనీగా ఉన్న తమ కంపెనీ ఏపీలో వివిధ రంగాలలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని బాబుతో భేటీ అయిన సూయజ్ ఎనర్జీ ఇంటర్నేషనల్ కంపెనీ సీఈవో బెర్నెడ్ చెప్పారు. సన్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుధీర్ వాల్యా కూడా సీఎంతో సమావేశమయ్యారు. రూ.12 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామన్నారు. సుజ్లాన్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఎల్ అండ్ టీ, టాటా ఆపర్చ్యునిటీస్ ఫండ్, బ్లాక్ స్టోన్, ఐడీఎఫ్, ఫిడెలిటీ వరల్డ్ వైడ్, బ్రూక్ ఫీల్డ్, జీఐసీ కంపెనీల ప్రతినిధులు కూడా సీఎంతో భేటీ అయినట్లు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం వెల్లడించింది. -
కాల్ కలకలం
అనీల్ నగరంలోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం ఆఫీసుకు బయల్దేరాడు. బైక్ తీస్తుండగా ఆయన సెల్ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే.. అపరిచిత నంబరు. లిఫ్ట్ చేయగానే.. హలో.. నమస్కారం.. నగరంలో శాంతిభద్రతలపై మీ అభిప్రాయం ఏమిటీ? భద్రత బాగానే ఉందా.. అయితే, ఆప్షన్-2 నొక్కండి.. లేదంటే ఆప్షన్-7 నొక్కండి.. అంటూ రికార్డెడ్ వాయిస్. అనీల్ తేరుకుని ఏదో ఒక నంబరు ప్రెస్ చేయగానే.. ఉన్నట్టుండి కాల్ కట్ అయ్యింది.గురువారం ఉదయం నగరంలోని చాలామంది ఫోన్లకు 83339 99999 నంబరు నుంచి ఇలాంటి వాయిస్ రికార్డెడ్ కాల్సే వచ్చాయి. ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ప్రభుత్వం తరఫున కాల్ చేస్తున్నట్టు ఆ కాల్ సారాంశమే అయినా.. ఇందులోని అంతర్థాన్ని పరిశీలిస్తే.. పోలీస్ కమిషనరేట్లో శాంతిభద్రతలపై ప్రభుత్వానికి సందేహాలు ఉన్నాయా? ఏజెన్సీల నుంచి తగిన సమాచారం లేదని ప్రభుత్వం భావిస్తోందా? ప్రజల నుంచి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? అనే అనుమానం రాకమానదు. సిటీ పోలీస్పై నిఘానా..? కొద్దిరోజులుగా నగర పోలీసులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. శాంతిభద్రతల పేరిట తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ పేరిట జులుం ప్రదర్శించడం, పాత నేరస్తుల కస్టోడియల్ డెత్ వంటి అంశాల్లో వారి వ్యవహారశైలి విమర్శనాత్మకంగా మారింది. అనేక సందర్భాల్లో అధికార పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీస్పరంగా చేపట్టిన కార్యక్రమాలపై విమర్శలు రావడంతో ప్రభుత్వ ఏజెన్సీల నుంచి తగిన సమాచారం రావడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. పైకి చెబుతున్నంత గొప్పగా ఇక్కడ శాంతిభద్రతల పరిస్థితి ఏమీ లేదనే అభిప్రాయంతో వీరున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసుల పనితీరు, శాంతిభద్రతల అంశాలను నేరుగా తెలుసుకోవాలనే ప్రభుత్వం నిర్ణయించి ఇలాంటి ఫోన్కాల్స్ చేస్తోందని సమాచారం. సేఫ్ సిటీ కోసమేనా.. విజయవాడ రాజధాని అయిన క్రమంలో త్వరలో ఇక్కడి నుంచే ప్రభుత్వ పాలన సాగనుంది. వీటన్నింటి దృష్ట్యా నగరంలో శాంతిభద్రతల అంశం ప్రధానంగా మారింది. ఇక్కడికి వచ్చే వారికి భద్రతపై భరోసా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని నగర పరిస్థితులను అంచనా వేసేందుకే ప్రభుత్వం ఇలాంటి ఫోన్కాల్స్తో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోందనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. కమిషనరేట్లో చర్చ పోలీస్లపై ప్రభుత్వం నేరుగా అభిప్రాయ సేకరణ చేయడంపై నగర పోలీసులు అవాక్కవుతున్నారు. గురువారం ఉదయం పలువురికి వచ్చిన ఫోన్ కాల్స్పై పోలీస్ కమిషనరేట్లో తీవ్రమైన చర్చ మొదలైంది. ఎవరెవరికి ఫోన్లు వచ్చాయి? వారే ఏ విధమైన సమాచారం ఇచ్చారు?.. వంటి అంశాలను నిఘా వర్గాల ద్వారా పోలీసులు కూడా సేకరిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా పోలీసుల పనితీరుపై ప్రభుత్వం ఆరా తీయడం ప్రస్తుతం సిటీలో హాట్ టాపిక్గా మారింది. - విజయవాడ సిటీ -
గల్లీగల్లీలో గస్తీ
జహీరాబాద్: గల్లీగల్లీలో గస్తీ నిర్వహిస్తూ.. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. జహీరాబాద్ పట్టణంలో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలు బాగుంటేనే ప్రజలు సుఖశాంతులతో ఉండటంతో పాటు అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తెలంగాణలో శాంతిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్కు ఒక కొత్త జీపును అందించనున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో వీటిని సమకూరుస్తామన్నారు. వీధివీధినా తిరిగేందుకు వీలుగా 1,500 మోటారు సైకిళ్లను అందజేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం కోసం 1,600 ఇన్నోవాలు కొనుగోలు చేశామని తెలిపారు. నగరంలో పోలీసు కంట్రోల్ రూం నిర్మాణం కోసం మొదటి విడత కింద రూ.340 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. 8 ఎకరాల స్థలంలో అత్యాధునికంగా 8 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇస్తామన్నారు. 10 జిల్లాలతో దీనిని అనుసంధానం చే స్తామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని ఏ మూలన చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా రెండు నిమిషాల్లో కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోయినా కూడా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు ఇబ్బందులు సృష్టించేందుకు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు, నీళ్లను అడ్డుకుంటున్నాడని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు కూడా తెలంగాణకు రాకుండా కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. గొలుసు కట్టు చెరువులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ బడ్జెట్లో 9 వేల చెరువుల పునరుద్ధరణకు నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం బడ్జెట్లో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి గాను రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్, జిల్లా కలెక్టర్ రాహూల్ బొజ్జా, వరంగల్ ఐజీ నవీన్చంద్, జిల్లా ఎస్పీ శెముషీ బాజ్పాయ్, డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యచందు పాల్గొన్నారు. -
కేసు పెడితే అంతు చూస్తాం...
* తప్పతాగి డ్రైవింగ్ * పోలీసులపై నైజీరియన్ల దౌర్జన్యం బంజారాహిల్స్: తప్పతాగి బైక్లు నడుపుకుంటూ వస్తున్న ఆరుగురు నైజీరియన్లను పోలీసులు పట్టుకోగా... కేసు నమోదు చేస్తే అంతు చూస్తామని వారు పోలీసులను హెచ్చరించడంతో పాటు దుర్భాషలాడారు. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై నైజీరియన్లు దాడి చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద శనివారం రాత్రి బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంకన్ డ్రైవ్’ తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఆరుగురు నైజీరియన్లు పోలీసులకు పట్టుబడ్డారు. తమపై కేసు నమోదు చేస్తే అంతు చూస్తామని వారు ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కి.. బూతులు తిట్టారు. అంతే కాకుండా బైకులు తీసుకొని పరారయ్యేందుకు యత్నించారు. ఈ దృశ్యాలను చిత్రీకరించబోయిన మీడియా ప్రతినిధులను దుర్భాషలాడి దాడి చేశారు. కెమెరాలు ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఇంతలో చేరుకున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా... శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో 20 బైకులు, 18 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రెండు రోజుల వ్యవధిలో నిర్వహించిన డ్రంకన్డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 76 కేసులు నమోదు చేశారు. -
అవినీతి పాలనొద్దు
మంత్రివర్గ సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతల యత్నం కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్ = ఆందోళనాకారులను అదుపులోకితీసుకున్న పోలీసులు చెరకు మద్దతు ధరపై రైతుల నిరసన మినీ విధానసౌధఎదుట ధర్నా మద్దతు ధరను ఒకే విడతలో చెల్లించాలంటూ నినాదాలు బెంగళూరు : గుల్బర్గా నగరంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అవినీతి కూడా పెచ్చుమీరిపోయిందని నినదించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తక్షణమే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ మంత్రి మండలి సమావేశం జరుగుతున్న మిని విధానసౌధను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు రేవూనాయక బెళమగి, సునీల్ వల్ల్యాపుర, దత్తాత్రేయ పాటిల్, అమరనాథ పాటిల్, ఎంవై పాటిల్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇక ఇదే సందర్భంలో రైతులకు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సిన మద్దతు ధరను విడతల వారీగా చెల్లించవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ స్థానిక చెరకు రైతులు సైతం మంత్రివర్గ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న మిని విధానసౌధ ఎదుట ధర్నాకు దిగారు. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సిన ధరను ఒకే విడతలో చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో సిద్ధరామ భూనసూర అనే రైతు తీవ్ర అవ్వస్థతకు గురికావడంతో అతన్ని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
టీడీపీ పాలనలో శాంతిభద్రతలు ఘోరం
పెట్లూరివారిపాలెం (నరసరావుపేట రూరల్) :రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పెట్లూరివారిపాలెంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో గుంటూరు-కర్నూలు రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. అదే సమయంలో వినుకొండ వెళుతున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడు కూడా రాస్తారోకోలో పాల్గొన్నారు. సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో రహదారికి ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పట్టణ సీఐ ఎం.వి.సుబ్బారావు సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వైఎస్ విగ్రహ ధ్వంసం ఘటనకు బాధ్యులైన వారిని రెండు రోజుల్లో అరెస్టుచేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో పదికిపైగా వైఎస్ విగ్రహాలు ధ్వంసానికి గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. పెట్లూరివారిపాలెం ఘటనపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించి దోషులను అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఇటువంటి చర్యలు శాంతిభత్రలకు విఘాతం కలిగిస్తాయన్నారు. రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వినుకొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఈ పరిస్థితులను ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. రాస్తారోకోలో నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు పిల్లి ఓబుల్రెడ్డి, కె.శంకరయాదవ్, పెట్లూరివారిపాలెం, జొన్నలగడ్డ గ్రామ సర్పంచ్లు చల్లా నారపరెడ్డి, దొండేటి అప్పిరెడ్డి, ఉప్పలపాడు, తురకపాలెం, రంగారెడ్డిపాలెం నాయకులు నంద్యాల సత్యనారాయణరెడ్డి, పొదిలే ఖాజా, మూరే రవీంద్రరెడ్డి, పట్టణ మహిళా కన్వీనర్ ఎస్.సుజాతాపాల్, మున్సిపల్ ప్లోర్లీడర్ మాగులూరి రమణారెడ్డి, సయ్యద్ ఖాదర్బాషా, గ్రామ నాయకులు మేకల రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో ఖాకీ నిఘా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలో ఖాకీ నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో పటిష్టంగా పోలీస్ కార్యకలాపాలు నిర్వహించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. పెరుగుతున్న నేరాలు, శాంతిభద్రతల పరిరక్షణ, వైట్ కాలర్ నేరాలను అరికట్టేందుకు నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్కు నలుగురు ఎస్సైల చొప్పున కేటాయించారు. పని విభజన చేసి వారికి విభాగాల వారీగా కేటాయించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఈ తరహా విధానం కొనసాగుతోంది. ఖమ్మం నగరంతోపాటు జిల్లాలోని ప్రధానస్టేషన్లలోనూ ఇదే విధానాన్ని ప్రవేశపెట్టాలని పోలీసు అధికారుల భావన. కొత్త పంథాలో ముందుకెళ్తున్న నూతన ఎస్పీ జిల్లా ఎస్పీగా షానవాజ్ఖాసిం బాధ్యతలు తీసుకున్న పదిహేను రోజుల్లోనే పోలీస్స్టేషన్ల తనిఖీలు, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్టేషన్ల వారీగా చేయాల్సిన పనులపై ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఖమ్మం నగరంలోని మూడు టౌన్లు, అర్బన్, రూరల్, మహిళా, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఎస్హెచ్వో (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఉన్న ఎస్సైల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని శాంతిభద్రతల అవసరాల దృష్ట్యా నగరంలోని ఒక్కో పోలీస్స్టేషన్కు నలుగురు ఎస్సైలను నియమించారు. అయితే ఆ స్టేషన్ పరిధిలో ఎవరు ఏ రకమైన విధులు నిర్వహించాలనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. స్టేషన్ అవసరాల దృష్ట్యా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సీఐ సూచనల మేరకు ఎస్సైలు విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఇకమీదట స్టేషన్ పరిధిలోని వివిధ అంశాలపై ప్రతి ఎస్సైకి అవగాహన ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్ పరిధిలో క్రైమ్ ఆధారంగా పనిని విభజించనున్నారు. దీని ప్రకారం ఒక్కో ఎస్సైకి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. పని విభజన ఇలా.. పోలీస్స్టేషన్ పరిధిలో ఎనిమిది బీట్లు ఉంటే ఇద్దరు ఎస్సైలకు చెరో నాలుగు బీట్ల బాధ్యత అప్పగిస్తారు. మరో ఎస్సైకి పోలీస్ స్టేషన్ పరిపాలన బాధ్యతలు, రోజువారీ కోర్టు వ్యవహారాలు, పోలీస్ సిబ్బంది పాలనా వ్యవహారాలు అప్పగించాలని యోచిస్తున్నారు. అలాగే మరో ఎస్సైని ప్రత్యేకంగా క్రైమ్ కోసం నియమించనున్నారు. ఈ తరహా పాలన ఇప్పటికే హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో కొనసాగుతోంది. ఎస్సై స్థాయి అధికారుల్లో జవాబుదారీ తనాన్ని పెంచడంతోపాటు ప్రత్యేకంగా ఆయా అంశాలపై పట్టు పెంచేందుకు ఈ తరహా విధానం అనుకూలిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఏయే పోలీస్స్టేషన్లలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారి రోజువారీ విధులు, బందోబస్తు, ఏఎస్సై, ఎస్సైలు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ షానవాజ్ఖాసిం సిబ్బంది మధ్య పని విభజన చేసి బాధ్యతాయుతమైన పోలీసింగ్కు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అతి జోక్యం తగదు..! పోలీస్శాఖ నిర్వహించాల్సిన ప్రధాన విధులు నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోలీసులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఇతర ప్రభుత్వ శాఖలు పోలీసుల సహకారాన్ని కోరినప్పుడు మాత్రమే స్పందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకోరాదని ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఎస్సై స్థాయి అధికారులతోపాటు సిబ్బంది పనుల్లోనూ విభజన చేయాలని యోచిస్తుండటం పట్ల పోలీస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అలాగే ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నియంత్రణపైనా జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో సీసీ కెమెరాలు పనిచేస్తున్న తీరు, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలపై కసరత్తు ప్రారంభమైంది. పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించిన ఉన్నతాధికారులు అన్ని పోలీస్స్టేషన్లలో ఈ తరహా కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇక జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై సైతం ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓఎస్డీగా అడవులను జల్లెడ పట్టిన అధికారిగా, మావోయిస్టు కార్యకలాపాలపై పట్టున్న ఎస్పీ, వరంగల్రేంజ్ డీఐజీ మల్లారెడ్డితో కలిసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం వంటి ప్రాంతాలను చుట్టి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. -
శాంతిభద్రతలు కాపాడుతా..
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ఘర్షణలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెడతామని, శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామని ఎస్పీ తరుణ్జోషి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన ఈయన ఇటీవలే ఆదిలాబాద్కు బదిలీ అయ్యారు. సోమవారం తరుణ్జోషి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న గజరావు భూపా ల్ పుష్పగుచ్చం అందజేసి కొత్త ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. జిల్లాలో అల్లర్లు సృష్టిం చే వారిపై ప్రత్యేక నిఘా పెడుతామన్నారు. మావోయిస్టుల ప్రబల్యం తగ్గించేందు కు, మతఘర్షణలను నివారించేందుకు అంతర్రాష్ట్ర కార్యకలాపాలపై ప్ర త్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు వ్యవస్థకు ప్రజల సహకారం తప్పనిసరని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించడంలో పోలీసు శాఖ కీలక ప్రాత పోషించేలా చూస్తానన్నారు. త్వర లో జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను సందర్శించి పరిస్థితులు తెలుసుకుంటానని వివరించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న గజరావు భూపాల్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్లో పనిచేయడం గొప్పగా భా విస్తున్నానని పేర్కొన్నారు. జిల్లా భౌగోళికంగా పెద్ద ది కావడంతో ఎవైనా అనుకోని సంఘటనలు జరిగి నప్పుడు సమయానికి వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నా రు. ఇక్కడి ప్రజల సహకారం మరువలేనిదన్నారు. ఒకేసారి నాలుగు ఎన్నికలు వచ్చినా సమర్థవంతం గా నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎస్పీ తరుణ్ జోషికి పోలీసు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జగన్మోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. -
ఖాకీలకు ‘ఐటీ’ సాయం
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో పట్టపగలు నడిరోడ్డులో హత్యో, రోడ్డు ప్రమాదమో జరిగితే.. ఫుల్ ట్రాఫిక్ జాం.. పోలీసులు వెళ్లేందుకు ఆలస్యమవుతుంది.. అక్కడేం జరిగిందో తెలియదు.. ఇక ముందు అలాంటి చోట ఎయిర్ కాప్ వాలిపోతుంది. అక్కడ జరుగుతున్నది ఫోటోలు, వీడియోలు తీసి వాయిస్ రికార్డ్తో సహా కంట్రోల్ రూం సర్వర్కు పంపుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటివెన్నో ఐటీ నిపుణులు రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు తెలియజేసేందుకు శనివారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ‘డేవ్థాన్’ సదస్సులో ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడారు. ఐటీ నిపుణులు రూపొందించిన కాప్కామ్, రిపోర్ట్ యాప్, అడాప్టివ్ ట్రాఫిక్, ఎయిర్కాప్, చలాన్ అలర్ట పోలీసులకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఐటీ నిపుణులు ప్రజల భద్రతపై దృష్టి సారించడం శుభపరిణామమన్నారు. అడాప్టివ్ ట్రాఫిక్ టెక్నాలజీని ఐటీ నిపుణులు కునాల్, చందన్లు రూపొందించారన్నారు. ఎయిర్ కాప్ను నిరంజన్ తయారు చేశాడని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయలేని వారు ఒకే ఒక్క మొబైల్ యాప్తో పోలీసులకు రిపోర్టు చేయవచ్చన్నారు. ఈ యాప్ను ఐటీ నిపుణులు హిమబిందు, నితిన్రెడ్డి రూపొందించారని తెలిపారు. ఈ యాప్ను సద్వినియోగం చేసుకుంటే ప్రజలతోపాటు పోలీసులకు కూడా మేలు చేకూరుతుందని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ శశిధర్రెడ్డి, డీసీపీలు ఎ.ఆర్.శ్రీనివాసులు, రామారాజేశ్వరి, కార్తికేయతో పాటు పలువురు ఐటీ నిపుణులు ఉన్నారు. -
హోంగార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేయండిలా..
నోటిఫికేషన్ వివరాలు... మొత్తం పోస్ట్లు 150 ఎంపికైన వారు హైదరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం, ప్రత్యేక విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. భారతీయుడై ఉండాలి. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని వారై ఉండాలి. ఏడోతరగతి పాసై కనీసం పదేళ్లు పూర్తికావాలి. 50 ఏళ్లలోపు వయస్సు వారే అర్హులు. లైట్ మోటార్, హెవీ వెహికిల్ లెసైన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 160 సెం.మీ ఎత్తు ఉండాలి. దరఖాస్తు విధానం... అడిషనల్ డీజీపీ హోంగార్డ్స్, తెలంగాణ పేరిట దరఖాస్తు చేయాలి. ఇందుకు ttp://www.hyderabadpolice.gov.in/HGForm.pdf లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు ఆఖరు తేదీ... అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తులో ఉన్న కాలమ్స్లో వివరాలు పూరించండి. విద్యార్హత పత్రాలు, వయస్సు ధ్రువీకరించే పత్రం, వాహన లెసైన్స్ జిరాక్స్ జత చేయాలి. 4 పాస్పోర్ట్ కలర్ ఫొటోలు. స్థానికత ధ్రువీకరణ పత్రం. రూ.25 రుసుమును దరఖాస్తుతో ఇవ్వాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఆ రుసుం ఉండదు) చెక్లు, డీడీలు అనుమతించరు. దరఖాస్తులను 22-11-2014లోపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు జామ్బాగ్లోని గోషామహల్ స్టేడియంలో అందజేయాలి. దరఖాస్తును పోస్ట్ లేదా ఇతరుల ద్వారా పంపకూడదు. అభ్యర్థే స్వయంగా సంబంధిత అధికారికి సమర్పించాలి. అప్పటికప్పుడు దరఖాస్తును పరిశీలించి హాల్టికెట్ జారీ చేస్తారు. అభ్యర్థుల ఎంపిక విధానం... డ్రైవింగ్ స్కిల్స్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలు ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తారు. వీటితోపాటుగా మెడికల్గా ఫిట్నెస్ ఉన్నట్టు ధ్రువీకరణ వస్తేనే ఎంపిక చేస్తారు. గమనిక: దరఖాస్తులు అమ్మబడవు. ఏ పోలీస్ స్టేషన్లోనూ అందుబాటులో ఉండవు. కేవలం పైన పేర్కొన్న వెబ్లో నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. హెచ్చరిక: దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా ఉండాలి. ఒక వేళ తప్పుడు ధ్రువీకరణతో ఎంపికైనా మధ్యలో జరిగే విచారణలో బహిర్గతమైతే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగిస్తారు. -
ఇక వచ్చి పోదామంటే కుదరదు
ఠాణాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం ఆర్డర్లీ వ్యవస్థకు చెక్ పాదర్శకంగా విధి నిర్వహణ పోలీసు సిబ్బంది పనివేళల్లో పారదర్శకతను పెంచేందుకు ఠాణాలలో త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకు వచ్చేందుకు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి భావిస్తున్నారు. పోలీసు స్టేషన్లో సిబ్బంది ఎవరు విధుల్లో ఉన్నారు.. ఎంత మంది ఉన్నారు.. ఎంత సేపు బయటికి పోయారు, ఏ సమయానికి వచ్చారు.. అనేది గుర్తించేందుకు ఈ కొత్త పద్ధతిని అమలు చేయనున్నారు. సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతుండడంతో శాంతి భద్రతల అదుపు, నేరాల నివారణ, బాధితులకు సత్వర పరిష్కారంపై మరింత దృష్టి కేంద్రీకరించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగమే ఈ బయోమెట్రిక్ విధానం. సిబ్బంది తమ విధుల్లో పారదర్శకంగా ఉండేవిధంగా ప్రతి ఠాణాలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో స్టేషన్లో ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు 50 నుంచి 90 మందికి పైగా ఉంటారు. వీరంతా సమయానికి డ్యూటీకి వస్తున్నారా, విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా.. అనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారింది. పలుకుబడి, అధికారుల అండ గల సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడం, బాధితులకు అందుబాటులో ఉండకపోవడం, ఫలితంగా బాధితులు స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టడం జరుగుతోంది. కొంతమంది సిబ్బంది అధికారుల స్వంత పనులపై వెళ్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అధికారుల పిల్లల్ని స్కూల్కు తీసుకుపోవడం, కూరగాయాలు తీసుకురావడం తదితర పనులకు అనధికారికంగా సిబ్బందిని వాడుకుంటున్నారనే విమర్శ కూడా ఉంది. ఇలాంటి విమర్శలకు సైతం బయోమెట్రిక్ విధానం స్వస్తి చెప్పనుంది. ఇదీ ప్రస్తుత పద్ధతి.. స్టేషన్లో ఉన్న సిబ్బందిని రెండు షిప్టులుగా విభజిస్తారు. 24 గంటలు ఒక షిప్టులో విధులు నిర్వహించిన సిబ్బంది మరుసటి రోజు 24 గంటలు విశ్రాంతి తీసుకుంటారు. ఒక షిప్టులో డ్యూటీ పూర్తి చేసుకున్నవారు, షిప్టులో డ్యూటీకి చేరే సమయంలో స్టేషన్లో ఎస్హెచ్ఓ రూల్కాల్ నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు రూల్కాల్ ఉంటుంది. అంటే ఈ రోజు 10 గంటలకు విధుల్లో చేరిన సిబ్బంది రేపు ఉదయం 10 గంటలకు దిగిపోతారు. వీరు దిగిపోయే సమయంలో కొత్తవారు విధుల్లో చేరుతారు. రూల్ కాల్లో అందరూ ఉన్నారా లేరా.. అనేది స్టేషన్ హౌస్ ఆఫీసర్ పరిశీలిస్తారు. అనంతరం స్టేషన్లో ఉన్న హాజరు పట్టికలో సిబ్బంది డ్యూటీకి హాజరైనట్టు సంతకాలు చేస్తారు. కొంత మంది విషయంలో.. రూల్ కాల్కు హాజరవుతారు, అక్కడి రిజిస్టర్లో సంతకం పెడతారు. ఈ రెండు పనులు కేవలం పది నిముషాల్లో పూర్తి చేసుకుని కొందరు మాయమవుతారు. తిరిగి మరుసటి రోజు డ్యూటీ దిగిపోయే సమయంలో వచ్చి యథావిధిగా రూల్ కాల్కు హాజరవడం పరిపాటిగా మారింది. ఇలాంటి వారికి అధికారుల అండదండలు ఉండడం, వారి సొంత పనులకు ఉపయోగించుకోవడం ఇందుకు కారణం. ఇక నుంచి పారదర్శకం బయోమెట్రిక్ యంత్రంను అమర్చడం ద్వారా డ్యూటీలో చేరే సిబ్బంది తమ వేలిముద్రలను మిషన్కు పెట్టాలి. తద్వారా హాజరుతో పాటు సమయం కూడా కంప్యూటర్లో నమోదవుతుంది. విధి నిర్వహణలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా మిషన్పై వేలి ముద్ర పెట్టి పోవాలి. దీని ద్వారా సిబ్బంది ఎన్ని గంటలు స్టేషన్లో ఉన్నారు, ఎన్ని గంటలు బయట ఉన్నారు, అతని రాకపోకలు, కదలికలు బయోమెట్రిక్ విధానం ద్వారా సమయంతో పాటు తెలిసిపోతుంది. దీంతో డ్యూటీలో నిర్లక్ష్యం వహించడానికి వీలుండదు. దీని ద్వారా ప్రజలకు పోలీసు సేవలు మరింత దగ్గరవుతాయన్నది అధికారుల ఉద్దేశం. -
కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: కరుణానిధి
చెన్నై: ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలైన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అన్నాడీఎంకే పార్టీపై డీఎంకే పార్టీ మండిపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని, వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పార్టీ అధినేత కరుణానిధి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో తీర్మానించారు. అధికారిక అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల దాడులకు నిరసనగా పార్టీ కార్యకర్తలు శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని డీఎంకే తీర్మానించింది. జయలలితకు బెంగళూరు కోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా అన్నాడీఎంకే కార్యకర్తలు మెరుపు దాడికి దిగిన తీరును డీఎంకే పార్టీ తప్పుపట్టింది. -
ఆడపిల్లలను వేధిస్తే కళ్లు పీకేయిస్తం
హైదరాబాద్ : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ బాగుండాలంటే మహిళలకు భద్రత ఉండాలె. ఆడపిల్లలకు రక్షణ లేదంటే తెలంగాణ సర్కారు ఇజ్జత్ పోయినట్టే. ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే లాగులు తడిసే విధంగా చట్టాలను కఠినతరం చేస్తాం. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు హైదరాబాద్ కూడా ఢిల్లీలా తయారైంది. నేరగాళ్లకు ముందే సంకేతాలు ఇస్తున్నా. ఆడపిల్లలపై అఘాయిత్యాలను, వేధింపులను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. కఠిన చర్యలుంటాయి. ఆడపిల్లలను వేధిస్తే కళ్లు పీకేయిస్తం. అది ఎంత వివాదమైనా ఫర్యాలేదు. నేను హిట్లర్నన్నరు. అవును. చెడు పనులు చేసినోళ్లకు చెడు, మంచికి మంచి చేయడానికి నేను హిట్లర్కు తాతనే. ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని పేకాట క్లబ్బులు మూయిస్తే అదికూడా వివాదం చేస్తున్నరు అని కేసీఆర్ పార్టీ ప్లీనరీ సన్నాహక సమావేశంలో అన్నారు. -
భద్రతే ధ్యేయం: సీవీ ఆనంద్
ముగిసిన సైబరాబాద్ పోలీసులకు శిక్షణ సాక్షి, సిటీబ్యూరో: ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసుల బాధ్యత అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఆ దిశగా అధికారులు, సిబ్బంది పని చేయాలని సూచించారు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో బుధ, గురువారాల్లో అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. శాంతి భద్రతలు కాపాడటం, నేరాలను అదుపు చేయడం, ట్రాఫిక్ను నియంత్రించడంతో పాటు వైపరీత్యాలప్పుడు సేవలు అందించడంలో సైబరాబాద్ పోలీసు ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెంపొందించడానికి సిబ్బందికి నిరంతరం పునఃశ్చరణ, అవగాహన తరగతులు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్, క్రైమ్ ఇన్ఛార్జీ డీసీపీ జానకీషర్మిల, సీటీసీ ఏసీపీలు శ్రీనివాస్, గాంధానారాయణతో పాటు డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈకింది అంశాలపై అవగాహన కల్పించారు సెంట్రల్ కంప్లయింట్ సెల్ గురించి క్రైమ్, లా అండ్ ఆర్డర్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, సిటీ క్రైమ్ రికార్డు బ్యూరో, క్లూస్ టీమ్ ఒకదానికొకటి అనుసంధానమై పని చేస్తున్న పద్ధతి స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్టు ఫారిన్ సెక్షన్ యొక్క విధులు, పనిచేసే విధానం ఐటీ సెల్ పని తీరు, కంట్రోల్ రూమ్లోని విధులు భూతగాదాల విచారణ, పరిశోధన, పరిష్కారం కోసం తయారు చేసిన ఎస్ఓపీ విధానం సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్... ఎన్నో రకాల ఒత్తిళ్లకు గురవుతున్న పోలీసులు తమను తాను అర్థం చేసుకోవడానికి, తోటి ఉద్యోగులతో వ్యవహరించేందుకు నిరంతరం ప్రజాసంబంధాలు కొనసాగించడం ప్రజలతో నిరంతరం స్నేహాభావంగా ఉండటం ప్రతి పోలీసు వ్యక్తిగతంగా మంచిగా నడుచుకోవడం సైబరాబాద్ను సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం ప్రజల అవసరాలకు అనుగణంగా సహాయం, సేవలందించడం. పోలీసు సేవలో ప్రజలను భాగస్వాములను చేయడం -
పోలీసుల తీరుపై టీడీపీ సభ్యుడి ఆగ్రహం!
గ్రామాల్లో హత్యలు, దోపిడీలు జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని రాజోలు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని మలికిపురం మండల కేంద్రంలో ఇటీవల సీతారత్నం అనే మహిళను నోటికి, చేతులకు ప్లాస్టర్లు వేసి వాళ్ల ఇంట్లో ఉన్న బంగారం, కొద్దిపాటి నగదు దోచుకుని, చివరకు ఆమెను చంపేశారని ఆయన చెప్పారు. గ్రామంలో చిన్న మెడికల్ షాపు నిర్వహించుకునే వాళ్ల కుటుంబం వివాదాలకు చాలా దూరంగా ఉంటుందని గొల్లపల్లి అన్నారు. ఇప్పటికి ఇలాంటి దోపిడీలు, హత్యలు ఐదారు జరుగుతున్నా పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దీన్ని పట్టించుకుని పోలీసులకు తగిన ఆదేశాలిచ్చి ఆ ప్రాంతంలో రక్షణ కల్పించాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. -
బాబుదే బాధ్యత
శాంతిభద్రతల క్షీణతపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కడప అగ్రికల్చర్: రాష్ట్రంలో అశాంతి పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని , దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప ఇందిరా భవన్లో నియోజకవర్గ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇటీవల విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మీరు ముక్కుసూటిగా వ్యవహరిస్తే కుదరదు మా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలకు విలువ ఇచ్చి వారికి సాయపడితేనే మేం ఉంటాం, లేకపోతే మీకు ఇబ్బంది, మాకూ ఇబ్బంది, చివరకు మీరు అగచాట్లు పడాల్సి వస్తుందని చెప్పడంతోనే’ రాష్ట్రంలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయని బహిర్గతమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనే తేడా లేకుండా బరితెగించి దాడులకు దిగుతుంటే ఇది ప్రజాస్వామ్యమా లేక అధ్యక్షపాలనా అనేది అర్థం కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తిని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని పదేపదే దూషిస్తుంటే ఇదేమి చట్టసభ అని జుగుప్స కలుగుతోందన్నారు. వైఎస్ పరిపాలన సమయంలో వైఎస్సార్ జిల్లాలో ఒక్క సంఘటనైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు వైఎస్ ఉన్నప్పుడు సభలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అప్పుడేమైనా పార్టీ చచ్చిపోయిందా లేక ఎమ్మెల్యేల నోళ్లు మూతపడ్డాయా అని నిలదీశారు. డబ్బు సంచులు మోసిన వారికి, బ్రోకర్లకు, రాజకీయమనే గంధపు వాసన కూడా చూడని వారికి సీట్లిచ్చి వారిని అందలమెక్కించారే మరి మైనార్టీలకు ఒక్క మంత్రి పదవైనా ఎందుకు ఇవ్వలేదని సీఎంను అడిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీ పీలో చేరినవారికి గన్మెన్లు, మంది మార్బలాన్ని ఇచ్చారే మిగతా పార్టీలకు చెందిన నాయకులకు ఎందుకు గన్మెన్లను తొలగిస్తున్నారో సీఎం జవాబు చెప్పాలన్నారు. పదేళ్ల క్రితం తాము కూడా ఇలా ఆలోచించి ఉంటే ఒక్క టీడీపీ నాయకుడు కూడా మిగిలేవారు కాదన్నారు. కరువు పరిస్థితులు ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బాబు వస్తే.. జాబు వస్తుందని చెప్పారు. ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఉద్యోగాలను పీకే స్తూ ఆదర్శ రైతులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు చంద్రబాబు జాబు(ఉత్తరం) రాశారని ఎద్దేవా చేశారు. పార్టీని గ్రామ, మండల, పట్టణ, నగర, రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య మాట్లాడుతూ బీజేపీతో టీడీపీ జతకట్టి మారణకాండను సృష్టించే భయానక పరిస్థితులను తీసుకువస్తోందని ఆరోపించారు. మరో మూడు నెలల్లో రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి ఎ. సాయిప్రతాప్, డీసీసీ ఇన్చార్జ్ అధ్యక్షుడు షేక్ నజీర్ అహ్మద్, జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ సుధాకరబాబు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్, సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయులు, జిల్లా పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు బండి జకరయ్య, డీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్, నగర అధ్యక్షుడు చింతకొమ్మదిన్నె సుబ్బరాయుడు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దర్గాషాషావలి, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఫిరోజ్ఖాన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు సత్తార్, చంద్రశేరరెడ్డి, ఎస్సీ,ఎస్టీ రాష్ట్ర కన్వీనర్ దాసరి శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ జోజప్ప, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలను పట్టించుకోండి కడప అగ్రికల్చర్ : పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను పూర్తిగా విస్మరించారని, కార్యకర్తలు పార్టీకి బలమన్న సంగతి నేతలు మరిచారని, కార్యకర్తలను పట్టించుకోండని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నినదించారు. ఆదివారం కడప నగరంలోని ఇందిరాభవన్లో పార్టీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మొదట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆతరువాత నిర్వహించిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, శాసనమండలిలో విపక్షనేత సి. రామచంద్రయ్య, కేంద్ర మాజీమంత్రి ఎ. సాయిప్రతాప్, ఎమ్మెల్సీ చెంగల్రాయులు, పీసీసీ పరిశీలకులు, ఎమ్మెల్సీ సుధాకరబాబు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్బాష, సుబ్రమణ్యంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయచోటికి చెందిన కార్యకర్త ఒకరు కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కడప నియోజకవర్గ సమావేశంలో పోటీచేసి ఓటమి చవిచూసిన మగ్ధూం మౌలానా మాట్లాడుతూ తనను పార్టీలోకి తీసుకువచ్చిన వారు పార్టీకి ద్రోహం చేసి టీడీపీకి మద్దతు పలికి ఓటు బ్యాంకుకు గండికొట్టారని అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. కడప నగరంలో పార్టీకి ఓటు బ్యాంకు ఉందని, దాన్ని గత ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోలేక పోయామని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దర్గాషాషావలి అన్నారు. అసమర్థుల నాయకత్వంలో పనిచేయలేమని, సమర్థుడైన నాయకుడి కింద పనిచేసేందుకు సిద్ధమని చెబుతుండగా రఘువీరా జోక్యం చేసుకుని స్థానికంగా ఉన్న మీరే కుర్చొని నాయకుడిని నిర్ణయించుకుంటే బాగుంటుందన్నారు. ఆ తరువాత నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఈ అంతర్గత సమీక్షలో డీసీసీ ఇన్చార్జ్ అధ్యక్షుడు ఎస్. నజీర్ అహ్మద్, మాజీ మంత్రి అహ్మదుల్లా, అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని సూచనలు,సలహాలు ఇచ్చారు. -
బాబు తేలుకుట్టిన దొంగ
ఏపీలో శాంతభద్రతలు క్షీణించాయి పీసీసీ అధ్యక్షుడు రఘువీరా, బొత్స ధ్వజం కర్నూలు : ‘శాంతి భద్రతల విషయంపై అసెంబ్లీలో మూడు రోజులుగా చర్చ జరుగుతున్నా తేలుకుట్టిన దొంగలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు... ఈ విషయమై ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. మూడు నెలల టీడీపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి. రాయలసీమలో హత్యలు, దాడులు జరుగుతున్నాయి.. ప్రభుత్వ ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయి..’ అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. శనివారం కర్నూలులోని నిర్వహించిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు..లక్ష కోట్లకుపైగా అవసరమవుతుందని చెప్పారు.. కానీ, బడ్జెట్లో రూ.5 వేల కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించారన్నారు. -
తప్పు చేస్తే మా పార్టీ వాళ్లను కూడా వదలను:చంద్రబాబు
-
'ఏపీలో శాంతి భద్రతలు బాగున్నాయి'
న్యూఢిల్లీ: తిరుపతి, వైజాగ్, విజయవాడ ఎయిర్పోర్ట్లలో వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. దీని ద్వారా ఏపీ పర్యాటానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో మంత్రి యనమల విలేకర్లతో మాట్లాడుతూ... రుణమాఫీకి కేటాయించిన రూ. 5 వేల కోట్లు సరిపోవని తెలిపారు. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు స్వర్ణాంధ్రకు పునాది అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యుత్, వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని అన్నారు. సెప్టెంబర్ 30 నాటికి అధికారుల బదిలీ పూర్తి కావాలని యనమల తెలిపారు. -
మనుషుల ప్రాణాలకంటే ముఖ్యమైనదేముంది?
అసెంబ్లీలో అధికారపక్షాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, హైదరాబాద్ : ‘‘రాష్ట్రంలో మనుషుల ప్రాణాలకంటే ముఖ్యమైనవి ఏమీ లేవు. అందుకే శాంతిభద్రతల సమస్యపై చర్చ జరగాలని పట్టుబడుతున్నాం’’ అని శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మంగళవారం శాంతిభద్రతలపై చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘శాంతిభద్రతల సమస్యపై ఈరోజే చర్చ జరగాలి. బుధవారం దీనిపై అవకాశమిస్తామని చెబుతున్నారు. బుధవారం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్లో మీరు కేటాయింపులు చేసే అంశాలనుబట్టి నిలదీయాల్సి ఉంటుంది. ఈ రెండ్రోజుల్లో మనుషుల ప్రాణాలకంటే ముఖ్యమైన చర్చలు ఏమున్నాయి? సూటిగా ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడగదల్చుకున్నా.. తెలుగుదేశం ప్రభుత్వం అదికారంలోకి వచ్చి మూణ్నెళ్లయింది. ఈ మూడు నెలల్లో జరిగిన హత్యల గురించే అడుగుతున్నాను. గత చరిత్ర గురించి మాట్లాడటంలేదు. వంగవీటి రంగాను చంపిన విషయం గురించి మాట్లాడలేదు. ప్రజల సమస్యలపై చర్చకు ఎందుకు అవకాశమివ్వరు’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
ఏపీలో రౌడీల రాజ్యం
శాంతిభద్రతలపై అసెంబ్లీలో సర్కారును నిలదీసిన విపక్షం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న శాంతిభద్రతల సమస్యపై మంగళవారం కూడా శాసన సభ దద్దరిల్లింది. రాష్ట్రంలో రౌడీలు, పోలీసుల రాజ్యం నడుస్తోందని, దీనిపై చర్చకు స్పీకర్ అనుమతించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్ చర్చకు అనుమతినివ్వకపోవడంతో విపక్ష సభ్యులు.. నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం స్వల్ప విరామం తర్వాత 11.35 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. వెంటనే శాంతిభద్రతల సమస్యపై చర్చకు అనుమతించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని, 344 నిబంధన కింద ఈ చర్చను చేపట్టాలని పట్టుబట్టారు. అయితే శాంతిభద్రతలపై బుధవారం చర్చకు అవకాశమిస్తానని స్పీకర్ చెప్పారు. దీనిపై సంతృప్తి చెందని వైఎస్సార్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభ ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 1.15 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే వైఎస్సార్ సీపీ సభ్యులు శాంతి భద్రతలపై చర్చకు మళ్లీ పట్టుబట్టారు. దీనిపై ఈరోజే చర్చ జరగాలని గట్టిగా కోరారు. ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ‘పరిటాల రవీంద్రను హత్య చేసింది మీరే. మీ చేతులు రక్తంతో తడిశాయి’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతుంటే అధికార పార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగుతున్నారని వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. మంగళవారం ఈ అంశంపై చర్చకు అవకాశం లేదని, అందరూ సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని స్పీకర్ కోరారు. దీంతో వైసీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ‘సభ జరగకుండా చూడటం మా ఉద్దేశం కాదు. ప్రధాన సమస్య అయిన శాంతిభద్రతలపై చర్చకు అనుమతి ఇవ్వండి’ అని స్పీకర్ను కోరారు. ఓ వైపు వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతున్న సమయంలోనే మంత్రి యనమల రామకృష్ణుడును మాట్లాడాల్సిందిగా స్పీకర్ అనుమతించారు. యనమల మాట్లాడుతూ.. ‘రూల్ ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. ఒకవేళ బుధవారం 344 కింద చర్చ జరిగినా ముందుగా మా సభ్యులకు అవకాశమిచ్చిన తర్వాతే ప్రతిపక్షాలకు అవకాశమివ్వాలి. దీనిపై చర్చకు మేము సిద్ధమే. గతంలో జరిగిన హత్యలన్నింటిపైనా మాట్లాడతాం’ అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న రాజకీయ హత్యలపై సభలో చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఇరకాటంలో పడ్డ టీడీపీ సభ్యులు పరిటాల రవి హత్యోదంతాన్ని తెరమీదకు తెచ్చి నినాదాలు చేశారు. ఇరుపక్షాల సభ్యుల నినాదాలతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. -
ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ కడిగిపారేశారు!
అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడిగిపారేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణించి పోతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై చర్చ జరపడానికి 344 నిబంధన కింద నోటీస్ ఇచ్చామని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కు వైఎస్ జగన్ విజ్క్షప్తి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ శాంతి భద్రతల అంశంపై బుధవారం చర్చిస్తామని దాటవేసే ధోరణి ప్రదర్శించారు. స్పీకర్ స్పందనకు సంతృప్తి చెందని వైఎస్ జగన్ .. మనుషుల ప్రాణాలపై చర్చకన్నా మరో అంశమేమైనా ఉందా వైఎస్ జగన్ ప్రశ్నించారు. గత మూడు నెలల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో జరుగుతున్న రాజకీయపరమైన దాడులు, హత్యలు ప్రజల్ని భయభ్రాంతులకు లోను చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై చర్చ కోరడం తప్పా అంటూ సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. సభలో అన్ని అంశాలను చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని వైఎస్ జగన్ సభలో అన్నారు. మూడు నెలల తెలుగుదేశం ప్రభుత్వం పాలన జరుగుతున్న హత్యల గురించి చర్చించాల్సిన అవసరముందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శాంతి భద్రతలపై చర్చించడానికి ఎందుకు పారిపోతున్నారు.. సభలో చర్చ జరగాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో వైఎస్ జగన్ పై అధికారపక్షానికి చెందిన సభ్యులు ఎదురుదాడికి ప్రయత్నించారు. సభలో చర్చను పక్కదారి పట్టించేందుకు అధికార సభ్యులు ప్రయత్నించారు. సభలో ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు మంత్రులు, సభ్యులు కూడా కంగారు పడటం కనిపించింది. చర్చ జరుగుతుండగానే చంద్రబాబు, మంత్రులతో గుసగుసలాడటం కనిపించింది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలదీయడంతో చెప్పడానికి జవాబు లేని పరిస్థితి స్పష్టం కనిపించింది. సభలో ప్రభుత్వంపై వైఎస్ జగన్ స్పందించిన తీరుకు ఓదశలో అధికారపక్షం వద్ద సమాధానం దొరక్క సందిగ్ధంలో పడింది. రాష్ట్ర శాంతిభద్రతలపై వైఎస్ జగన్ అనుసరించిన విధానం, వ్యూహం అందర్ని ఆకట్టుకుంది. -
శాంతిభద్రతలపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు
-
శాంతిభద్రతలపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు
శాంతిభద్రతల అంశంపై తక్షణం చర్చించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీలో పట్టుబట్టారు. తాము సోమవారమే 344 నిబంధన కింద ఈ అంశంపై చర్చ కోసం నోటీసు ఇచ్చామని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాగోలేనందున దీనిపై చర్చ అవసరమని అన్నారు. అయితే.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాత్రం ఈ అంశాన్ని రేపటికి పోస్ట్ చేద్దామని, రేపు చర్చిద్దామని, ప్రస్తుతం ఈ అంశంపై సభా నాయకుడైన ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారని చెప్పారు. దానిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైఎస్ఆర్ కుటుంబంపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో సభలో తీవ్ర దుమారం రేగింది. వైఎస్ఆర్సీసీ సభ్యులు ఒక్కసారిగా సీట్లలోంచి లేచి, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి, 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. 'హత్యా రాజకీయాలపై చర్చ జరపాలి' అని కూడా నినాదాలిచ్చారు. తాను నోటీసు ఇవ్వాలన్నానే తప్ప మంగళవారమే చర్చిస్తామని చెప్పలేదని, ఈ అంశంపై చర్చ రేపు చేపట్టాలని కోడెల చెప్పారు. ఒకవైపు ప్రతిపక్ష సభ్యులు చర్చ కోసం గట్టిగా పట్టుబడుతుండగా, వారికి పోటీగా అధికార పక్ష సభ్యులు కూడా సీట్లలోంచి లేచి అరుస్తుండటంతో ఇరు పక్షాలను సమాధానపర్చడానికి స్పీకర్ ప్రయత్నించారు. అయితే.. రాక రాక సభకు వచ్చి మాట్లాడటం వల్లే అధికార పక్ష సభ్యులు కూడా మాట్లాడుతున్నారని, లేకపోతే వాళ్లు మాట్లాడేవాళ్లు కారంటూ ఆయన చెప్పారు. శాంతిభద్రతల అంశాన్ని లేనిపోని అంశమంటూ టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించింది. సభలో ముఖ్యమంత్రి హావభావాలు కూడా అందుకు అనుగుణంగానే అనిపించాయి. సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో తమ నిరసన కొనసాగించడంతో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు. -
చర్చ కోరితే కుంటి, గుడ్డి సాకులా?
-
చర్చ కోరితే కుంటి, గుడ్డి సాకులా?
ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిపోయిన హత్యల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని, ఇప్పుడు జరుగుతున్న హత్యలు, దాడులపై చర్చ జరపాలని కోరితే కొంతమంది పెద్దలు కుంటి, గుడ్డి సాకులు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. కాలువ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి పెద్దలు మీడియా పాయింట్లోకి వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 11 మంది హత్యకు గురికాగా, 119 మంది మీద అత్యంత దారుణంగా దాడులు చేశారని, వాళ్లంతా ఇంకా ఆస్పత్రులలోనే ఉన్నారని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం జరిగిన పరిటాల రవి హత్య గురించి కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమా మాట్లాడారని చెప్పారు. పరిటాల రవి హత్య సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మీద సీబీఐ విచారణ కావాలని చంద్రబాబు కోరారని, వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణ చేయించారని చెప్పారు. వైఎస్ జగన్ నిర్దోషిగా కోర్టులో విడుదలయ్యారని అన్నారు. తర్వాత పరిణామాల్లో జేసీ సోదరులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లిచ్చి పార్టీలో చేర్చుకున్నారని.. అంటే, వైఎస్ జగన్, జేసీ సోదరులకు అందులో భాగం లేదని చంద్రబాబుకు అప్పుడే తెలిసినా కేవలం కులాల మధ్య చిచ్చు కోసమే ఈ అంశాన్ని వాడుకున్నారని నాని అన్నారు. ఇక ఇటీవలే గుంటూరు జిల్లాలో సాక్షాత్తు స్పీకర్ కోడెల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా మీద దాడిచేసి, ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎత్తుకెళ్లారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ సభ్యులమైన తామంతా నరరూప రాక్షసులమంటూ కాలువ శ్రీనివాసులు చెబున్నారని నాని మండిపడ్డారు. వైశ్రాయ్ హోటల్ కుట్ర తర్వాత ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరో తేల్చాలంటూ స్వయంగా ఆయన కుమారులే సీబీఐ విచారణ కోరినా, చంద్రబాబు స్పందించలేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆయనను మనస్తాపానికి గురిచేసి, ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు నరరూప రాక్షసుడు కాడా అని కొడాలి నాని ప్రశ్నించారు. అయిపోయిన కథలు చెబుతూ కాలక్షేపం చేయడం మానేసి శాంతిభద్రతలను కాపాడే పని చూడాలని కోరుతున్నామని ఆయన అన్నారు. -
19 మంది ఎక్కడెక్కడ చనిపోయారు?
-
19 మంది ఎక్కడెక్కడ చనిపోయారు?
హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 15నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ 19మంది వైఎస్ఆర్ సీపీ నేతలు ఎక్కడెక్కడ చనిపోయారని ప్రశ్నించారు. ఆ వివరాలు వైఎస్ఆర్ సీపీ నేతలు ఇవ్వగలరా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కాగా రైతులు, ప్రజల సమస్యలు వైఎస్ఆర్ సీపీకి పట్టడం లేదని మరోమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. సభా సమయాన్ని ఆ పార్టీ సభ్యులు వృధా చేస్తున్నారని ఆయన అన్నారు. -
గవర్నర్గిరీ తాత్కాలిక నిలిపివేత
హోంమంత్రి హామీ ఇచ్చినట్టు టీఆర్ఎస్ ఎంపీల వెల్లడి న్యూఢిల్లీ: హైదరాబాద్లో శాంతిభద్రతలపై గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్టు టీఆర్ఎస్ ఎంపీలు వెల్లడించారు. సోమవారం పార్లమెంటు వద్ద టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత ఏపీ జితేందర్రెడ్డి, ఎంపీ బీ వినోద్కుమార్లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 సెక్షన్ 8 లోని అంశాలను, తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారాలను లాగేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను హోం మంత్రికి వివరించామని వారు చెప్పారు. శాంతి భద్రతలపై గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చినట్టు వారు తెలిపారు. తమ నోటీసును స్పీకర్ తిరస్కరించగా, తాము ఉభయసభలను అడ్డుకున్నామని వారు చెప్పారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని, రాజ్యసభ నుంచి హోంమంత్రి రాజ్నాథ్ను లోక్సభకు పిలిపించారని వారు వివరించారు. వాయిదా అనంతరం తిరిగి సభ సమావేశమైనపుడు సెక్షన్ 8లోలేని అంశాలను రాజ్నాథ్ దృష్టికి తెచ్చినట్టు ఎంపీలు చెప్పారు. ‘ఈనెల 18వ తేదీన జరిగే సమావేశానికి హోంమంత్రి తమను ఆహ్వానించారని, గవర్నర్ ఆదేశాలకు సంబంధించి వెర్బాటమ్ సవరిస్తామని, ప్రస్తు తం హోంశాఖ జారీచేసిన ఆదేశాలను నిలిపివేస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు.’ అని టీఆర్ఎస్ ఎంపీలు వివరించారు. ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల పట్ల ఒక వర్గం విద్వేషపూరితంగా నేరాలు చేస్తే, ఆ నేరాలపైన గవర్నర్ ఆలోచన చేస్తారని సెక్షన్ 8లో ఉందని,అయితే, జాయింట్ సెక్రటరీ జారీచేసిన ఉత్తర్వులు అందుకు భిన్నంగా, పోలీసు అధికారుల బదిలీ లు కూడా గవర్నర్ పరిధిలో ఉంటాయని ఉంద ని ఎంపీలు తెలిపారు. సెక్షన్ 8 ప్రకారం ఉంటే తప్పుపట్టడంలేదని, అందులో లేని అధికారాలను గవర్నర్కు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అసలు సెక్షన్ 8లో ఏముందనే విషయం హోంమంత్రికి కూడా తెలియదని ఎంపీలు వ్యాఖ్యానించారు. రాష్ట్రపునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 8 ని బూచిగా చూపి కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమించిందని వారు ఆరోపించారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్టు చెప్పారు. శాంతిభద్రతలపై విశేషాధికారాలను గవర్నర్కు ఇచ్చే ఉత్తర్వులను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. గవర్నర్ గిరీపై ‘ సుప్రీం’కు: ఎంపీ కె.కవిత రాష్ట్రాల అధికారాలను లాక్కోవడానికి కేంద్రం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే న్యాయపోరాటం చేస్తామని, హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలపై గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకు వెళతామని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత చెప్పారు. న్యాయం తమవైపే ఉందని, గెలుస్తామన్న నమ్మకముం దని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంటు వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి వారంలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం లాక్కొనే ప్రయత్నం చేసిందని ఆమె ఆరోపించారు. దాన్ని తాము తిప్పికొట్టగా, కొద్దిపాటి మార్పులు, చేర్పులతో హైదరాబాద్లో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్కు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.రాజ్యాంగంలో గవర్నర్కు ఏవైతే అధికారాలు ఉన్నాయో అవే అధికారాలు బిల్లు లో ఉన్నాయని, అంతకు మించి ప్రత్యేక అధికారాలేవీ లేవన్నారు. బిల్లును సాకుగా తీసుకుని కేంద్ర హోంశాఖ రాసిన లేఖ వెనుక తెలంగాణపై కుట్ర ఉందని, దీన్ని తిప్పికొడతామన్నారు. బిల్లులోని నిబంధనల మేరకే గవర్నర్కు అధికారాలిచ్చామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ లోక్సభలో చెప్పారని, కానీ ఆ నిబంధన అలాలేదని కవిత వివరించారు. కేంద్రం ఇలానే మొండిగా ప్రవర్తిస్తే సుప్రీంకు వెళ్తామన్నారు. కేంద్రం ఇచ్చే ప్రతి అంశాన్ని రాష్ట్రాలు అమలు చేయాలని లేదు. రాష్ట్రానికి నచ్చితే అమలు చేయడం జరుగుతుందని ఆమె ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం:కేటిఆర్
-
విశేషాధి’కారం’
-
పెత్తనం కుదరదు
* కేంద్రంపై కేసీఆర్ ఫైర్ * మోడీ ఫాసిస్టు చర్యలను ఖండిస్తున్నట్లు వ్యాఖ్యలు * ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్కు విశేషాధికారాలు కల్పించాలంటూ కేంద్రం తాజాగా పంపిన లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన ఈ ఆదేశాలను అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కబళించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఫాసిస్టు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కూడా లేఖ రాయాలని ప్రధాన కార్యదర్శికి సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖను అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపించాలని, త్వరలోనే సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వివరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు ధోరణిని ప్రతిఘటించేందుకు ప్రజాస్వామ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. కేంద్రం పంపిన లేఖలోని అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక అంశాలను అమలు చేయమని ప్రకటించారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను గవర్నర్కు కల్పించాలని, అందుకు అవసరమైన విధంగా తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ రూల్స్లో మార్పులు చేసుకోవాలని గత నెలలోనే కేంద్ర హోం శాఖ నుంచి లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో ఉమ్మడి పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలని, ఇరు రాష్ట్రాల డీజీపీలతో కమిటీ వేయడంతోపాటు, నగరంలో పోలీసు అధికారుల నియామకానికి సంబంధించి ఇరు రాష్ట్రాల వారిని పరిగణించాలని అందులో సూచించింది. దీనికి రాష్ర్ట ప్రభుత్వం కూడా ఘాటుగానే బదులిచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఉన్న ప్రకారం నడచుకుంటామే తప్ప.. గవర్నర్కు అధికారాలు కల్పించేలా బిజినెస్ రూల్స్ను మార్చబోమని తేల్చి చెప్పింది. ఇదంతా జరిగిన నెల రోజుల తర్వాత కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్కుమార్ పేరిట శుక్రవారం రాత్రి మరో లేఖ రాష్ర్ట ప్రభుత్వానికి అందింది. అయితే ఇందులో ఇరు రాష్ట్రాల పోలీసుల అధికారులను నియమించాలన్న నిబంధనను తొలగించారు. -
పవర్ గవర్నర్దే..
* విశేషాధికారాలపై కేంద్రం మళ్లీ లేఖ * ఇద్దరు పోలీస్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు * సర్కారు నుంచి రికార్డులు తెప్పించుకునే అధికారం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని పరిధిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్యమైన కేంద్ర సంస్థల రక్షణ బాధ్యతలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ప్రాణాలు, ఆస్తులు, స్వేచ్ఛా పరిరక్షణ బాధ్యతలు గవర్నర్ చేతుల్లోనే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. హైదరాబాద్లో గవర్నర్కు విశేషాధికారాలు కట్టబెట్టాలంటూ తాజాగా తెలంగాణ సర్కారుకు మరో లేఖ రాసింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్కుమార్ నుంచి వచ్చిన ఈ లేఖ శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందింది. విభజన చట్టంలోని సెక్షన్ 8, దాని సబ్సెక్షన్లకు సంబంధించి గవర్నర్కు ఉండే ప్రత్యేక బాధ్యతలను పేర్కొనడంతో పాటు, గవర్నర్ నిర్వర్తించే బాధ్యతలను కూడా ఈ లేఖలో వివరించారు. వీటి అమలుకు సంబంధించి పరిపాలన సజావుగా సాగడానికి మార్గదర్శకాలను కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఇవీ మార్గదర్శకాలు * మంత్రి మండలి, ఏదైనా సంస్థ తీసుకునే నిర్ణయాల రికార్డులను, సమాచారాన్ని తెప్పించుకునే అధికారం గవర్నర్కు ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకు, భారీ నేరాల ప్రత్యేక నివేదికలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ ఎప్పటికప్పుడు గవర్నర్కు సమర్పించాలి. * శాంతిభద్రతల నియంత్రణ చట్టానికి అనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారులకు గవర్నర్ ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వవచ్చు. శాంతిభద్రతలు, పరిపాలన అంశాల్లో గవర్నర్కు ఆయన సలహాదారులు సహకారం అందిస్తారు. వీరికి అవసరాన్ని బట్టి గవర్నర్ బాధ్యతలు అప్పగిస్తారు. * శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల భద్రత, ప్రత్యేక పరిస్థితులపై నివేదికలను రెండు కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ, తెలంగాణ హోం శాఖ కార్యదర్శి కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలి. దీనిపై గవర్నర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తారు. ఈ అంశాల్లో గవర్నర్ ఆదేశాలే అంతిమంగా అమలవుతాయి. * ఆ రెండు కమిషనరేట్లలో ఐజీ ర్యాంకుకు తగ్గని సీనియర్ అధికారులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. వీరితోపాటు రంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలోనూ ఏర్పాటు చేయాలి. * బలవంతపు వసూళ్లు, విద్వేషాలు రెచ్చగొట్టే నేరాలపై సత్వర విచారణ నిర్వహించాలి. కోర్టుల్లో వేగంగా విచారణ జరిగేలా చర్య తీసుకోవాలి. ఈ సెల్లోని అధికారుల సెల్ఫోన్ నంబర్లతోపాటు, చిరునామాలకు విస్తృత ప్రచారం కల్పించాలి. * అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల రక్షణకు జంట కమిషనరేట్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి వీరందరిపై సీనియర్ అధికారిని నియమించాలి. ఈ సెల్ సున్నితమైన సంస్థలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ద్వారా గవర్నర్కు నివేదించాలి. ప్రస్తుతం ఈ సంస్థలకు ఎస్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ ద్వారా కల్పిస్తున్న సెక్యూరిటీని సమీక్షించి, పటిష్ట భద్రతను కల్పించాలి. రక్షణ బలోపేతానికి గవర్నర్ చేసే సూచనలను విధిగా అమలు చేయాలి. ఇందుకోసం సీనియర్ అధికారిని నియమించి భద్రతా పరిస్థితిని ఎప్పటికప్పుడు గవర్నర్కు నివేదించాలి. * తెలంగాణ డీజీపీ హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పోలీసు సర్వీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు ద్వారానే డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓల వరకు బదిలీలు, పోస్టింగ్లు ఇవ్వాలి. ఈ బోర్డు చేసిన ప్రతిపాదనలపై గవర్నర్ సలహాలు, సూచనలతో మార్పులు చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. * అత్యవసర పరిస్థితుల్లో బలగాల మోహరింపుపై గవర్నర్ చేసే సూచనలను టీ సర్కారు పరిశీలించి మళ్లీ గవర్నర్కు పంపించాలి. దీనిపై గవర్నర్దే తుది నిర్ణయం. ఉమ్మడి రాజధాని పరిధిలో చట్టాల ఏర్పాటు, కమిషన్ల నియామకం, చట్టాల్లో సెక్షన్ల తొలగింపునకు సంబంధించిన నివేదికను చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం గవర్నర్కు ఉంటుంది. చట్టాల రూపకల్పన, కమిషన్ల ఏర్పాటునకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై నివేదిక కోరే అధికారం ఉంటుంది. * అవసరాన్ని బట్టి ఉద్యోగుల తాత్కాలిక పద్ధతిలో పునర్నియామకానికి ప్రభుత్వాన్ని గవర్నర్ కోరవచ్చు. ఇరు రాష్ట్రాలకు భవనాల కేటాయింపునకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సలహాలతో గవర్నర్ నిర్వహణ సాగిస్తారు. * ఉమ్మడి రాజధానిలో నివసిస్తున్న ప్రజల ఆస్తుల రక్షణకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫిర్యాదుల విభాగం ఏర్పాటుచేయాలి. ఫిర్యాదుదారుల ఆస్తుల రక్షణ, హక్కులపై ప్రభుత్వ అధికారులకు గవర్నర్ అవసరమైన ఆదేశాలు జారీచేస్తారు. వాటిని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రతిని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికీ పంపారు. -
ప్రజా సహకారంతో శాంతి భద్రతలు
విజయనగరం క్రైం: ప్రతి పోలీసూ ప్రజలతో సత్సం బంధాలు కలిగి ఉండాలి. అపుడే పోలీసులకు కచ్చితమైన సమాచారం వస్తుంది. ప్రజల సహకారంతో జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తాను, వైట్కాలర్ నేరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని నూతన ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లా పోలీసుశాఖ మీడియాకు సమాచారం అందించడంలో విఫలమవుతోందని విలేకరులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా ఇకపై అటువంటి సమస్యలు లేకుండా చేస్తానని తెలిపారు. గత మూడు ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన బడ్జెట్లో రూ.50 లక్ష ల వరకూ దుర్విని యోగమైనట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ చేయిస్తానని, అధికార దుర్వినియోగం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై విచారణ జరిపిస్తానని తెలిపారు. మావోయిస్టుల కదలికలపై తమ వద్ద పక్కా సమాచారం ఉందని, మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విదేశీ ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలపై కూడా దృష్టిసారిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.సుందరరావు పాల్గొన్నారు. -
ప్రజల చెంతకే పోలీస్
►శాంతిభధ్రతలను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తా ►మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి ►అక్రమ రవాణాపై ఉక్కుపాదం ►ఎస్పీ సెంథిల్కుమార్ 38వ ఎస్పీగా బాధ్యతల స్వీకరణ నెల్లూరు(క్రైమ్) : పోలీసులున్నది ప్రజల కోసమేనని, వారి కోసమే తాము పనిచేస్తున్నామన్న నమ్మకాన్ని అందరిలో కలిగిస్తామని ఎస్పీ ఎస్.సెంథిల్కుమార్ అన్నారు. జనం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మెరుగైన శాంతిభద్రతలను అందించడంతో పాటు జిల్లాపై అవగాహన పెంపొందించుకుని పోలీసు సేవలను ప్రజలకు చేరువచేస్తామని చెప్పారు. బుధవారం ఉదయం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయన మొదట సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. 38వ ఎస్పీగా 11 గంటలకు తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలను గౌరవించడంతో పాటు వారికి న్యాయం చేయడంలో పేద, ధనిక అనే పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఎర్రచందనం, ఇసుక, సిలికా అక్రమ రవాణాతో పాటు జీరో బిజినెస్ను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తామన్నారు. నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించి శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తామన్నారు. దోపిడీలు, దొంగతనాల నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకెళతామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి కేసుల నమోదు చేస్తామని వివరించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠి నంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎస్పీకి ఘనస్వాగతం : సెంథిల్ కుమార్ తన సొంతూరు కోయంబత్తూరు నుంచి భార్య, కుమార్తెతో కలిసి కేరళ ఎక్స్ప్రెస్లో నెల్లూరు చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో ఆయనకు మూడో నగర ఇన్స్పెక్టర్ కె.వి.రత్నం, ఎస్బీ ఎస్సై శ్రీనివాసులురెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఎస్పీ కుటుంబసభ్యులతో కలిసి పోలీసు అతిథిగృహానికి చేరుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏఎస్పీ రెడ్డి గంగాధర్రావు, డీఎస్పీలు వీఎస్ రాంబాబు, చంద్రశేఖర్, రామారావు, ఇన్స్పెక్టర్లు మద్ది శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, కె.వి రత్నం, జి. రామారావు, ఎస్వీ రాజశేఖర్రెడ్డి, జి. మంగారావు, సుధాకర్రెడ్డి, బాజీజాన్సైదా, బాలసుందరం, వెంకటేశ్వరరావు, నాగేశ్వరమ్మ, ఆర్ఐలు శ్రీనివాసరావు, లక్ష్మణకుమార్, చిరంజీవి, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. ప్రసాదరావు, కార్యదర్శి అంజిబాబు, పోలీసు కార్యాలయ ఏవో రాజశేఖర్, మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలి పారు. అనంతరం ఎస్పీ పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. -
రెండు విడతలుగా కర్ఫ్యూ సడలింపు
సహారన్పుర్: ఉత్తరప్రదేశ్లోని సహారన్పుర్లో కర్ఫ్యూ సడలించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు విడతలుగా కర్ఫ్యూ సడలించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 7 నుంచి 11 గంటలకు వరకు మొదట సడలింపుయిచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటలకు మరోసారి కర్ఫ్యూ సడలించనున్నామని సహారన్పుర్ జిల్లా మేజిస్ట్రేట్ సంధ్య తివారి తెలిపారు. ఈద్గా ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లోని మసీదుల్లో ముస్లిం ప్రార్థనల్లో పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా కర్ఫ్య్యూ అమల్లో ఉండడంతో చాలా మంది పండుగను జరుపుకోవడానికి సన్నద్దం కాలేకపోయారు. శనివారం సహారన్పుర్లో ఒక వివాదాస్పద భూమి విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన హింసలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటివరకు 68 మందిని అరెస్ట్ చేశారు. -
సహారన్పుర్ లో 20 మంది అరెస్ట్
సహారన్పుర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లోని సహారన్పుర్ జిల్లాలో హింసాత్మక ఘటనకు బాధ్యలుగా భావిస్తున్న 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లను అదుపులోకి తీసుకురావడానికి ఆ ప్రాంతంలో విధించిన కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు నేడు కూడా కొనసాగిస్తున్నారు. నిన్నటికంటే పరిస్థితి కొద్దిగా మెరుగైందని జిల్లా మేజిస్ట్రేట్ సంధ్య తివారి తెలిపారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. ఒక వివాదాస్పద భూమి విషయంలో శనివారం చెలరేగిన గొడవ ఇరు వర్గాల మధ్య హింసకు దారితీసింది. ఈ హింసలో వ్యాపారస్తుల నేత హరీశ్ కొచార్తోపాటు మరో ఇద్దరు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. -
ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యం
కర్నూలు: ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తన తొలి కర్తవ్యమని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఆకె రవికృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా, ఎప్పుడైనా తనను కలవవచ్చని, ఏ క్షణంలోనైనా ఫోన్కు అందుబాటులో ఉంటానన్నారు. పోలీస్ అంటే ప్రజలకు మిత్రుడనే భావన కలిగించేలా వ్యవహరిస్తామని చెప్పారు. సిబ్బంది అలసత్వాన్ని సహించనన్నారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఎస్పీ రఘురామిరెడ్డిని పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో రవికృష్ణ నియమితులయ్యారు. 2006 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఈయన నల్గొండ జిల్లాలో శిక్షణ పొందారు. మొట్ట మొదట 2009లో మహబూబ్నగర్ జిల్లా పార్వతీపురం, తరువాత విశాఖ జిల్లా చింతపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో ఏఎస్పీ హోదాలో పని చేశారు. 2012లో ఎస్పీగా పదోన్నతి పొందారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం నుంచి బదిలీపై కర్నూలుకు వచ్చారు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో యాంటీ టైజమ్పై శిక్షణను ఒకరోజు ముందే ముగించుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హుటాహుటిన కర్నూలు చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో క్యాంప్ కార్యాలయానికి వెళ్లడంతో రఘురామిరెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. సాక్షి : కర్నూలు జిల్లా ఎస్పీగా కొత్తగా వచ్చారు.. ఎలా ఫీలవుతున్నారు ? ఎస్పీ: జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా భావిస్తున్నాను. ఈ జిల్లాపై కొంత అవగాహన ఉంది. ఎస్పీ రఘురామిరెడ్డి సమర్థంగా పని చేశారని సిబ్బంది చెబుతున్నారు. ఆయన బాటలో నడిచి క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది సహకారంతో శాంతిభద్రతలను గాడిలో పెడతాను. సాక్షి : శాంతి భద్రతల పరిరక్షణలో మీ ప్రాధాన్య అంశాలేమిటి ? ఎస్పీ : ప్రజల భద్రత, మత సామరస్యం, రోడ్డు ప్రమాదాల నివారణ ప్రాధాన్యతాంశాలు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రధాన దృష్టి సారిస్తా. రోడ్డు ప్రమాదాల్లో యువత మృత్యువాత పడుతున్నారు. రహదారి భద్రతపై మరింత చైతన్యం రావాల్సి ఉంది. జాతీయ రహదారులపై దృష్టి సారించి రహదారి భద్రతకు ప్రణాళిక రూపొందిస్తాం. గతంలో నేను పని చేసిన చోట ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రమాదాల రేటు తగ్గించాను. సాక్షి : మీ గత అనుభవాలు జిల్లాలో రాణించడానికి ఎంత మేరకు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు ? ఎస్పీ : శిక్షణలో ఉన్నప్పుడు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించాను. జిల్లాలో జరిగే నేరాలపై అవగాహన ఉంది. మహబూబ్నగర్ జిల్లా పార్వతీపురం, విశాఖ జిల్లా చింతపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో ఏఎస్పీ హోదాలో పని చేశాను. ఈ అనుభవాలన్నీ సమర్థ విధి నిర్వహణకు ఉపయోగపడుతాయని భావిస్తున్నా. సాక్షి : శాంతి భద్రతల పరిరక్షణకు, సమర్థ పౌర సేవల అమలుకు మీ ప్రణాళిక ఏమిటి ? ఎస్పీ : క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో మాట్లాడి జిల్లాపై అవగాహన పెంచుకుంటా. సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తా. ఫిర్యాదిదారులు పోలీస్ స్టేషన్కు వస్తే న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి అధికారులపై ఉంది. ఒక స్నేహితుడిగా పోలీసులు పని చేయాలి. నేరస్తులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదు. -
చేయనుగాక చేయను
రాజీనామా డిమాండ్పై హోం శాఖ మంత్రి పరిషత్లో నల్లకండువాలు ప్రదర్శించిన బీజేపీ సాక్షి, బెంగళూరు : ఎలాంటి పరిస్థితిల్లోనూ తాను రాజీనామా చేసేది లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ తేల్చి చెప్పారు. విధానపరిషత్లో విపక్ష సభ్యులు శుక్రవారం చేసిన డిమాండ్ను ఆయన తోసిపుచ్చారు. సభా కార్యాక్రమాలకు బీజేపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే విపక్ష నేత కె.ఎస్. ఈశ్వరప్ప మాట్లాడుతూ... ప్రశ్నోతర్త సమయాన్ని వాయిదా వేసి ఫ్రేజర్ టౌన్ ఘటనపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ సభాపతి శంకరమూర్తిని డిమాండ్ చేశారు. ఇందుకు పరిషత్ నేత, మంత్రి ఎస్ఆర్ పాటిల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే సభా కార్యక్రమాలు జరగాలని పేర్కొన్నారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఎమ్మెల్సీ మధుసూదన్ కలుగజేసుకుని ఫ్రేజర్టౌన్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కె.జె.జార్జ్ రాజీనామా చేయాలని అన్నారు. ఆయనకు జేడీఎస్, బీజేపీ ఎమ్మెల్సీలు మద్దతు పలికారు. ఇందుకు మంత్రి జార్జ్ సమాధానమిస్తూ ఎవరెన్ని చెప్పినా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించేందుకు హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ అసమర్థతే కారణమంటూ సభ్యులు మండిపడ్డారు. సభాపతి జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. -
శాంతిభద్రతలపై బిల్లులోనే స్పష్టత
* ఇరు రాష్ట్రాల సీఎస్లతో హోంశాఖ కార్యదర్శి సమావేశం * పాల్గొన్నకేంద్ర అధికారులు * కృష్ణాకు కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి: తెలంగాణ సీఎస్ * ఈఆర్సీ ఆమోదం ఉన్న పీపీఏలను మాత్రమే కొనసాగిస్తాం: ఏపీ సీఎస్ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లో శాంతి భద్రతలను గవర్నర్కి అప్పగించడంపై విభజన బిల్లులోనే స్పష్టంగా ఉన్నందున దానిపై వివాదాలు అవసరంలేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్గోస్వామి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పలు కీలక అంశాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు ఆయన ఇరు రాష్ట్రాల సీఎస్లతో సమావేశమయ్యారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు గంటన్నరపాటు నార్త్బ్లాక్లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజీవ్శర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు పర్యవేక్షిస్తున్న అడిషనల్ కార్యదర్శి సురేశ్కుమార్ సహా పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా హైదరాబాద్లో శాంతిభద్రతల అంశం గవర్నర్కి అప్పగించడం, కృష్ణా జలాల పంపిణీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుతోపాటు ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన విద్యుత్ కేటాయింపుల అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. పలు అంశాలపై ఇరువురు సీఎస్లతో గంటన్నరకు పైగా సమావేశమైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి గోస్వామి వారికి పలు సూచనలు చేశారు. హైదరాబాద్లో శాంతిభద్రతలను గవర్నర్కి అప్పగించే అంశాన్ని ఏపీ సీఎస్ ప్రస్తావించగా... ఈ సమావేశంలో గవర్నర్ అధికారాల అంశాన్ని చర్చించాల్సిన అవసరంలేదని, అది విభజన బిల్లులోనే పేర్కొన్నామని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సూచించినట్టు తెలిసింది. కృష్ణా వాటర్బోర్డు ఏర్పాటుకు అవసరమైన సిబ్బందిని సైతం త్వరగా నియమించాలని ఇరు రాష్ట్రాలకు గోస్వామి సూచించినట్టు సమాచారం. కృష్ణా ట్రిబ్యునల్లో రాష్ట్రాల సంఖ్య నాలుగుకి చేరినందున ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్ను రద్దుచేసి కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎస్ కోరారు. విభజన బిల్లులోనూ ఈ అంశం ఉందని గుర్తుచేశారు. అయితే ఇందుకు తమకు ఇంకా సమయం కావాలని ఏపీ సీఎస్ చెప్పినట్టు తెలిసింది. విద్యుత్ కేటాయింపులకు సంబంధించి పీపీఏ పైనా సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈఆర్సీ ఆమోదం ఉన్న పీపీఏలను మాత్రమే కొనసాగిస్తామని, లేనివాటిని రద్దు చేస్తామని ఏపీ సీఎస్ స్పష్టం చేసినట్టు సమాచారం.ఈనెల 24న కమల్నాథన్ కమిటీ సమావేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమల్నాథన్ కమిటీ ఈనెల 24న ఢిల్లీలో మరోమారు భేటీ కానున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు మార్గదర్శకాలు రూపొందించిన కమిటీ, తుది నివేదికను సమర్పించే ముందు అవసరమైన మార్పులు చేర్పులపై మరోమారు చర్చించనున్నట్ట తెలిసింది. -
త్వరలో 2000 నిఘా నేత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో త్వరలో 2000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏఏ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే విషయంపై కమిషనర్లు మహేందర్రెడ్డి, ఆనంద్ నిఘావర్గాలతో సర్వే చేయిస్తున్నారు. పాతబస్తీలో ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిసింది. గత రెండు దశాబ్దాల కాలంలో నగరంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుం టుందని నిఘా వర్గాలు కమిషనర్లకు సూచించాయి. శివార్లలో కాలనీలు, బస్తీలు విస్తరించడంతో రెండు కమిషనరేట్ల పరిధిలో గతంలో కంటే సమస్యాత్మక ప్రాంతాలు పెరిగాయి. మత ఘర్షణలు, అల్లర్లు, రౌడీమూకల దాడులు జరిగిన ప్రాంతాలు కూడా వీటిలో ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా.. ఎందుకు జరిగింది? కారకులు ఎవరు అనేది సులభంగా తెలిసిపోతుంది. సీసీ కెమెరాల్లోని ఫుటేజీ నిందితుడికి శిక్షపడేందుకు కూడా దోహదపడుతుంది. గతంలో ఏదైనా గొడవ జరిగితే స్థానిక యువకులను అనుమానితులుగా స్టేషన్కు పిలిచి విచారణ పేరుతో వేధించేవారు. సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తే నిందితుడి గుర్తింపు వెంటనే జరిగిపోవడంతో పాటు అమాయకులను వే ధించడం ఆగిపోతుంది. సీసీ కెమెరాల్లో ప్రతి చిన్న విషయం రికార్డు అయిపోతుంటుంది కాబట్టి ఎవ్వరూ నేరం చేయడానికి సాహసించరని, దీంతో నేరాలు అదుపులోకి వస్తాయని పోలీసులంటున్నారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారా వచ్చే ఫుటేజీల పర్యవేక్షణకు జోన్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్లను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరంలో ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ నుంచి నిత్యం ఆయా కూడళ్లలో వాహనాల రద్దీని పరిశీలించి, ట్రాఫిక్ క్లియరెన్స్కు సహకరిస్తుంటారు. అలాగే, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న కెమెరాల ద్వారా ఎక్కడైన గొడవలు జరుగుతుంటే గుర్తించి వెంటనే అదుపులోకి తెచ్చేయవచ్చు. వచ్చే రెండు మూడు నెలల్లో నగరంలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఉపయోగంలోకి తీసుకొస్తామని అధికారులంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ సీసీ కెమెరాలతో పాటు హోటళ్లు, దుకాణాలు, షాపింగ్మాల్స్, సినిమా థియేటర్లు, ఆసుపత్రుల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసేలా యజమానులుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వం తరఫున సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయితే నగర జీవి అనుక్షణం మూడో కన్ను నీడలో పయనించకతప్పదు. -
కొత్త పోలీస్స్టేషన్లకు గ్రీన్సిగ్నల్
సాక్షి, ముంబై: రాష్ట్రంలో పెరుగుతున్న వలసలు, జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా 120 కొత్త పోలీసులు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో 64 పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు ఇప్పటికే స్థలాలను కూడా ఎంపిక చేసింది. మిగతా వాటి కోసం అధ్యయనం చేస్తున్నారు. నివేదిక రాగానే పోలీసుస్టేషన్ల ఏర్పాటు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాడలు పెరిగిపోయాయి. నగరాలు, పట్టణాలు విస్తరించాయి. దీంతో ఉపాధి నిమిత్తం వచ్చే వలస ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పెరిగిన జనాభాను బట్టి శాంతి, భద్రతలు అదుపులో ఉంచడం పోలీసు బలగాలకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో 10 పోలీసు కమిషనరేట్ కార్యాలయాలు ఉండగా, 35 మంది జిల్లా సూపరింటెండెంట్లు ఉన్నారు. వీరి ఆధీనంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,90,035 మంది పోలీసులు, 19 వేల మంది పోలీసు అధికారులు ఉన్నారు. పెరిగిన జనాభా కారణంగా పోలీసులపై అదనపు పని భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 61 వేల పోలీసు పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం మంజూరునిచ్చింది. మొదటి దశలో 13 వేల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఒకపక్క కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే మరోపక్క పరిధి ఎక్కువగా ఉన్న పోలీసు స్టేషన్లను విడగొట్టి అక్కడ కొత్త పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇలా ఐదేళ్ల కాలంలో అదనంగా 120 కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి వినీత్ అగర్వాల్ చెప్పారు. పోలీసు స్టేషన్ల సంఖ్య పెంచడంవల్ల నేరాలు అదుపులోకి వస్తాయి. అదేవిధంగా పోలీసు స్టేషన్లు సమీపంలో ఉండడంవల్ల అన్ని రకాల నేరాల నమోదు సంఖ్య పెరుగుతుంది. ఐదేళ్ల కాలంలో పోలీసులు, పోలీసు అధికారుల సంఖ్య 2.70 లక్షలకుపైగా చేరుకుంటుంది. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో అత్యధిక శాతం పోలీసు బలగాలున్నట్లు రికార్డు నమోదు కానుందని అగర్వాల్ అన్నారు. కొత్త పోలీసులు విధుల్లోకి రావడంవల్ల అదనపు పని వేళలు తగ్గి పోలీసులకు పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పోలీసులు నేరాలు అదుపుచేయడంలో సఫలీకృతులవుతారని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. -
చట్టసభల్లో పోరాడతాం
గవర్నర్కు అధికారాలపై హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని శాంతిభద్రతలపై గవర్నరుకు అధికారాలను అప్పగించడంపై చట్టసభల్లోనూ, న్యాయస్థానాల్లోనూ పోరాటం చేస్తామని రాష్ట్ర సాగునీటి శాఖామంత్రి టి.హరీశ్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నరుకు శాంతిభద్రతల అధికారాలు అప్పగించటం ద్వారా తెలంగాణపై ఆధిపత్యాన్ని కొనసాగించే కుట్రకు ఏపీ సీఎం చంద్రబాబు పాల్పడుతున్నాడని ఆరోపించారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైతే పదేళ్లు కాదు, పది రోజులు కూడా ఉండమంటూనే హైదరాబాద్ను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. హైదరాబాద్లో ఎన్నో దేశాల ప్రజలు నివాసం ఉంటున్నారని, ఎవరికీ లేని భయాందోళనలు ఒక్క ఆంధ్రోళ్లకు ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు దాటినా ఒక్క సీమాంధ్రునిపై అయినా దాడి జరిగిందా అని అడిగారు. గవర్నరుకు అధికారాలు కోరడం అక్రమ కార్యకలాపాలను కొనసాగించడానికా అని హరీశ్రావు అనుమానాన్ని వ్యక్తం చేశారు. సచివాలయంలో బారికేడ్లు పెడితే భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్నట్టుగా ఎందుకంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టి ఇప్పుడేమో ఆంధ్రా పోలీసులను హైదరాబాద్లో పెడ్తారా అని ప్రశ్నించారు. బారికేడ్లను వారు ఒప్పుకోకుంటే ఆంధ్రా పోలీసులు బందూకులు పట్టుకుని తిరుగుతామంటే ఎలా ఒప్పుకుంటామన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు లేని షరతులు, విధానాలు ఒక్క తెలంగాణకే అమలు చేయటంపై టీటీడీపీ, టీబీజేపీ నాయకుల వైఖరిని ప్రశ్నించారు. అక్రమార్కులను రక్షించడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలను తిప్పికొడ్తామని హరీశ్రావు ప్రకటించారు. -
చంద్రబాబు ఇక్కడ అతిథి మాత్రమే
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల అంశం రాష్ట్రం పరిధిలోకి వస్తుందని, దానిని ఉల్లంఘించి గవర్నర్కు అధికారం కట్టబెట్టాలని చేసే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొందరు కావాలని ఇబ్బందులు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడించారు సోమవారం ఆయన ఎంసీఆర్ హెచ్ఆర్డీ వద్ద మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కును మార్పు చేయడానికి వీల్లేదని, దీనిపై అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే.. అభినందించాల్సింది పోయి ఏపీ సీఎం అభిప్రాయాలు చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. గురుకుల్ట్రస్టు, అయ్యప్ప సొసైటీల్లో చంద్రబాబుకు బినామీ పేర్లతో భూములు ఏమైనా ఉన్నాయేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ పరిసరాల్లో ఆయనకు భూములున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై పొరుగు రాష్ట్ర సీఎం స్పందించడం వింతగా ఉందన్నారు. చంద్రబాబు పదేళ్ల వరకు తెలంగాణ ప్రభుత్వ అతిథి మాత్రమేనని, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదన్నారు. -
శాంతి భద్రతలపై
అట్టుడికిన సభ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా తయారయ్యాయని, సీనియర్ పోలీసు అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కాయని ప్రతిపక్షాలు బుధవారం శాసన సభలో ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. కోరమంగలలో పోలీసు సిబ్బంది రాస్తారోకో చేయడం, గుల్బర్గలో రౌడీ కాల్పుల్లో ఎస్ఐ మల్లిఖార్జున బండె మరణించడంపై కూడా విపక్షాలు అస్త్రాలు సంధించాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు ఆర్. అశోక్ మాట్లాడుతూ... రాష్ర్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. అదనపు డీజీపీ రవీంద్ర నాథ్ వ్యవహారం ద్వారా పోలీసు శాఖలో ఎవరి మాటను ఎవరూ పట్టించుకోరని తేలిందని విమర్శించారు. ఈ దశలో హోం మంత్రి కేజే. జార్జ్తో పాటు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి టీబీ. జయచంద్ర, ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్ పాండేలు అశోక్పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ హోరెత్తింది. శాంతి భద్రతలపై చర్చించడానికి వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని అశోక్ స్పీకర్ కాగోడు తిమ్మప్పను కోరారు. ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, అశోక్కు మద్దతుగా నిలిచారు. ప్రశ్నోత్తరాల అనంతరం దీనిపై చర్చకు అవకాశమిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. వాయిదా తీర్మానం గురించి ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వాలని శెట్టర్ కోరారు. బీజేపీ సభ్యులు, జేడీఎస్ పక్షం నాయకుడు కుమారస్వామి ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో స్పీకర్ ఆ అంశాన్ని ప్రస్తావించడానికి అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్పై రవీంద్ర నాథ్ ఆరోపణలు చేయడం, కాఫీ షాపులో మహిళ ఫొటో తీశారనే ఆరోపణపై రవీంద్ర నాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు 1,200 మందికి పైగా కేఎస్ఆర్పీ సిబ్బంది రోడ్డుకెక్కి ఆందోళన చేయడం, మంగళూరులో ఖైదీల మధ్య ఘర్షణ...లాంటి సంఘటనలను అశోక్ ప్రస్తావించారు. తద్వారా పోలీసు శాఖపై ఎవరికీ నియంత్రణ లేదని తేలిపోయిందని ఆరోపించారు. ఈ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుంటూ దీనిపై స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం ఇస్తానని చెప్పడంతో సభా కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. -
రక్తచరిత్ర
మచిలీపట్నం క్రైం : వ్యక్తిగత విభేదాలు.. వివాహేతర సంబంధాలు.. సరిహద్దు వివాదాలు.. ఆర్థిక లావాదేవీల్లో గొడవలు.. కారణాలు ఏమైనా పది రోజులుగా జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు జిల్లా వాసులను వణికిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల నిఘా కొరవడటం వల్లే వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అదుపుతప్పుతున్న శాంతిభద్రతలు! ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు శాఖ ఇటీవల ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నుంచి ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించి అందరి అభినందలు అందుకున్న జిల్లా పోలీసులు ఇటీవల తమ పట్టు సడలించారనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా లోపం వల్లే వరుసగా హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విభేదాలతోనే ఎక్కువ జిల్లాలో ఇటీవల జరిగిన హత్యలు, హత్యాయత్నాలు వ్యక్తిగత కారణాలు, వివాహేతర సంబంధాలకు సంబంధించినవే అధికం. పోలీసులకు ఫిర్యాదులు అందిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరిగితే అప్పుడు పోలీసుల వైఫల్యం అవుతుంది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన హత్యలకు సంబంధించిన కేసుల్లోని నేరస్తులను దాదాపు అరెస్ట్చేశాం. మిగిలిన ఒకటి, రెండు కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయాల్సి ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్కరినీ ఉపేక్షించం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. - జె.ప్రభాకరరావు, ఎస్పీ -
సుబేదారి స్టేషన్లో ఖాకీల కోల్డ్వార్
వరంగల్ క్రైం, న్యూస్లైన్ : సుబేదారి పోలీస్స్టేషన్లో ఓ అధికారి, సిబ్బందికి మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. ఎన్నికల ముందు వచ్చిన సదరు అధికారి వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఆయన వింతపోకడలతో సిబ్బంది ఎవరూ ఆయనకుసహకరించడం లేదని తెలుస్తోంది. కిందిస్థాయి సిబ్బందితోపాటు తనపై అధికారులతో కూడా సత్సంబంధాలు లేకపోవడంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగానే సిబ్బంది ఈ స్టేషన్పరిధిలో ప్రజల శాంతిభద్రతలను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన అధికారి.. ‘సాక్షి’లో మంగళవారం సుబేదారి పోలీస్ అధికారుల పనితీరుపై ‘కాసుల వేటలో కేసులకు పాతర’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనాన్ని చదివి ఒంటికాలిపై లేచిన సదరు అధికారి.. తన పనితనాన్ని నిరూపించుకునేందుకు ఓ పెద్ద పెండిం గ్ కేసు విచారణలో పడ్డారు. అదేదో హత్యో, దోపిడీ కేసు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆయన తన సిబ్బందిని పురమారుంచింది చిన్నదాడి కేసు వ్యవహారంలో. హంటర్రోడ్లో మూడు నెలల క్రితం ఒక వ్యక్తిపై దాడి జరిగిందనే ఆరోపణపై సుబేదారి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసుల విచారణలోనే అది తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగానే బాధితుడిగా పేర్కొన్న సదరు వ్యక్తి ఫిర్యా దు చేసినట్లు వెల్లడైంది. అరుునా ఇదే కేసులో మళ్లీ విచారించే పని ఉందంటూ హుజూరాబాద్లోని అనుమానుతుడి ఇంటికి సదరు అధికా రి ఇద్దరు పోలీసులను పంపించారు. అతడిని పట్టుకుని మాత్రమే స్టేషన్కు రావాలని హుకుం జారీచేశారు. ఇంకేముంది అక్కడికి వెళ్లిన పోలీసులు అనుమానితుడి ఇంటి వద్ద నానా హంగామా సృష్టించారు. ఇంట్లో ఉన్న అతడి భార్యను ఇబ్బందులకు గురిచేశారు. తనకు భయంగా ఉందని, తన భర్త వచ్చిన తర్వాత స్టేషన్కు పంపుతానని ఆమె చెప్పినా వినకుండా సదరు కానిస్టేబుళ్లు అక్కడే రాత్రి వరకు పడిగాపులు కాశారు. విషయం హన్మకొండ డీఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన సదరు అధికారిని ఫోన్ చేసి మందలించినట్లు తెలిసిం ది. అయన మాత్రం ‘డీఎస్పీ కాదు.. ఎస్పీ చెప్పినా వినేది లేదు.. పట్టుకురావాల్సిందే’ అంటూ పంతం పట్టారు. కాగా పోలీసులు ప్రవర్తించిన తీరుపై బుధవారం అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, డీఐజీ డాక్టర్ ఎం కాంతారావుకు ఫిర్యాదు చేయనున్నట్లు హుజురాబాద్కు చెందిన సదరు మహిళ పేర్కొంది. ఇలా అసలు కేసులను వదిలేసి.. ఇలాంటి కేసులకు సంబంధించి కొందరు వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయడం విమర్శలకు తావిస్తోంది. వివాహిత హత్య కేసు సంగతేంటి..? మార్చి 8న విజయపాల్ కాలనీలో పట్టపగలే ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో అనుమానితులుగా భావించి సుమారు 30 మందిని మూడు నెలలుగా పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ప్రతిరోజు వారిని ఉదయం స్టేషన్కు పిలిపించడం, సాయంత్రం వరకూ కూర్చోబెట్టడం రాత్రికి ఇంటికి పంపడం నిత్యకృత్యమైంది. ఇలా కేసు విచారణను పూర్తిచేయలేమని తెలిసినా నాన్చుడు ధోరణి ప్రదర్శించడంలో ఉద్దేశం ఏమిటో సదరు అధికారికే తెలియాల్సి ఉంది. హత్య జరిగి నెలలు గడస్తున్నా కేసు పురోగతి అంగుళం కూడా లేకపోవడం గమనార్హం. దీంతోపాటు నందిహిల్స్లో భారీ దోపిడీ జరిగి రోజులు గడుస్తున్నా దర్యాప్తు ముందుకు సాగడం లేదు. పోలీసుల వైఫల్యంతో ఈ స్టేషన్ పరిధిలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడే తిష్ట వేసేందుకు పైరవీ.. ఎన్నికల బదిలీపై వచ్చిన సదరు అధికారి మళ్వీ త్వరలో జరగబోయే బదిలీల్లో ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే తిష్టవేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈయన ఇక్కడే ఉంటే సుబేదారి పోలీస్స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను గాలికి వదిలేయాల్సిందేనని సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. -
యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: మాయా
లక్నో: సమాజ్వాది పార్టీ పాలనలో ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బహుజన సమాజ్వాది పార్టీ అధినేత్రి మాయావతి విమర్శించారు. యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. బదౌన్ గ్యాంగ్ రేప్ బాధితుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బదౌన్ ఘోరానికి పోలీసు అధికారులను బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం సరిపోదన్నారు. రాష్ట్రంలో ఘోరాలు ఆగాలంటే ముందుగా సమాజ్వాది పార్టీ నాయకులకు కళ్లెం వేయాలని సూచించారు. ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విఫలమైందని మాయావతి ధ్వజమెత్తారు. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కలిసి కోరతామన్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో కలగజేసుకోవాలని కోరారు. బదౌన్ జిల్లా కాత్రా సదత్గంజ్ గ్రామంలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. -
శాంతిభద్రతలకు పూర్తి భరోసా
‘టీయూడబ్ల్యూజే మీట్ ది ప్రెస్’లో కిషన్రెడ్డి మోడీ ప్రధాని అయితే హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ సీమాంధ్రులకు పూర్తి భద్రత టీడీపీ హాయాంలోనూ తెలంగాణకు అన్యాయం అభివృద్ధి కోసమే టీడీపీతో పొత్తు హైదరాబాద్: ‘మోడీ ప్రధాని అయితే మతవిద్వేషాలు పెరుగుతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడం లేదు. గుజరాత్లో ఎక్కువ మంది ముస్లింలు మోడీని ప్రధానిగా చూడాలని ఆశపడుతున్నారు. తెలంగాణలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. మోడీ ప్రధాని అయితే హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తి నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే వచ్చే పదేళ్లపాటు హైదరాబాద్ పోలీసు వ్యవస్థ మోడీ (ప్రధాని హోదాలో) చేతిలో ఉంటుంది. నగరంలో ఉంటున్న సీమాంధ్రులకూ పూర్తి రక్షణ ఉంటుంది’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. శనివారం ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్’ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో కిషన్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 2019లో సొంతకాళ్లపై... తెలంగాణలో పార్టీ బలం పెంచుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ఈసారి జాతీయనేతలు పొత్తులను ఖరారు చేశారని కిషన్రెడ్డి తెలిపారు. దేశ, తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నామన్నారు. 2019 ఎన్నికలను సొంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. దక్షిణ భారత దేశంలో కర్ణాటక తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే అనుకూల పరిస్థితి తెలంగాణలోనే ఉందన్నారు. మోడీ ప్రధాని అయితే, తెలంగాణ అభివృద్ధికి అవకాశం కలుగుతుందని, అభివృద్ధి చేసిన పార్టీగా బీజేపీకి గుర్తింపు వస్తుందని చెప్పారు. బీజేపీలో వ్యక్తికి ప్రాధాన్యం ఉండదని, అన్నీ సమష్టి నిర్ణయాలే ఉంటాయని, అగ్రనేతగా ఎల్.కె.అద్వానీ ఉన్నప్పటికీ నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడమే దీనికి నిదర్శనమన్నారు. టీడీపీ హయాంలో అన్యాయం జరగలేదనలేను.. తెలంగాణ వెనకబాటులో ప్రథమ ముద్దాయి కాంగ్రెసేనని కిషన్రెడ్డి ఆరోపించారు. అలా అని చంద్రబాబు హయాంలో అన్యాయం జరగలేదని చెప్పలేనన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో టీడీపీ స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసునని, అయితే ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర విభజన అంశం ఒకటే ఎజెండాగా ఉంటుందనుకోవడం లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధే ప్రధానాంశమని, ఇందుకోసమే తాము టీడీపీతో పెట్టుకున్న పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఎల్బీ స్టేడియుంలో సభకు అనువుతి నగరంలో సభ కోసం ప్రధాన మైదానాలన్నింటినీ నిబంధనల పేరుతో తిరస్కరించారని, ప్రధాని కాబోయో వ్యక్తి వస్తే మైదానం ఇవ్వమనడం సరికాదని గట్టిగా ఒత్తిడి చేస్తే శనివారం అర్ధరాత్రి దాటాక ఎల్బీ స్టేడియంలో అనుమతినిచ్చినట్టు చెప్పారు. -
శాంతిభద్రతలపై రాజీ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని గవర్నర్ సలహాదారు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎ.ఎన్.రాయ్ స్పష్టం చేశారు. సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన రాయ్ గురువారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో లోక్సభతోపాటు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున శాంతిభద్రతల అంశాన్ని సవాలుగా తీసుకుంటున్నామని చెప్పారు. పండుగలు, ఎన్నికలు నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటామని పేర్కొన్నారు. పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్షను ఎప్పుడు నిర్వహించేది ప్రభుత్వం నేడో రేపో వెల్లడిస్తుందని రాయ్ చెప్పారు. పీజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగినందునే రద్దుకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఒకవైపు రాష్ట్ర విభజన, మరోవైపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సమాంతరంగా జరుగుతున్నాయని, అన్నీ సజావుగా కొన సాగేలా అవసరమైన సలహాలు, సూచనలు చేస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో సాధారణ పరిపాలన ఎటువంటి అవాంతరాల్లేకుండా కొనసాగేలా చూస్తామన్నారు. అంతకుముందు రాయ్ సాధారణ పరిపాలనశాఖ అధికారుల నుంచి ఏ ప్రాంతంలో ఎన్నికలు ఏ తేదీన ఉన్నాయనే వివరాలను తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా రాయ్ను గురువారం ఉదయం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్శర్మ, ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీతో రాష్ట్ర శాంతిభద్రతలపై ఆరా... గవర్నర్ సలహాదారులు ఎ.ఎన్. రాయ్, సలావుద్దీన్ అహ్మద్లతో గురువారం సచివాలయంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం.మహేందర్రెడ్డి, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్కే కౌముదితోసహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్ సలహాదారులు ఆరా తీశారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ముగిశాయని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బందోబస్తుతోపాటు, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఆ బందోబస్తుకూ కసరత్తు పూర్తి చేశామని డీజీపీ వారికి వివరించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలీసుశాఖలో విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, కొన్ని అంశాలపై కసరత్తు సాగుతున్నదని కూడా అధికారులు తెలిపారు. 1975 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మహారాష్ట్ర మాజీ డీజీపీ అయిన రాయ్ ఈ సందర్భంగా రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నట్టు తెలిసింది. -
అదనపు బలగాలు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ఎలాంటి కీలక బందోబస్తు నిర్వహించాలన్నా అదనపు బలగాల మోహరింపు తప్పనిసరి. జంట కమిషనరేట్లలో నెలకొన్న సిబ్బంది కొరతతోపాటు లా అండ్ ఆర్డర్ కోసం ప్రత్యేక బెటాలియన్లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు రాష్ట్ర విభజన తరవాత ఈ కోణంలోనూ రెండు కమిషనరేట్లు ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. దీనికి పరిష్కారం ఎలా? అనే అంశంపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడతాయి. గరిష్టంగా పదేళ్లపాటు హైదరాబాద్ నగరం రెండింటికీ ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. ఈ బందోబస్తు, భద్రతలే తమకు భారంగా మారతాయని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క గణేష్ ఉత్సవాలతో పాటు కీలకమైన శాంతిభద్రతల సమస్యలు, ఎన్నికలు వంటివి జరిగే సందర్భాల్లో రెండు కమిషనరేట్లకు భారీగా అదనపు బలగాలు అవసరమవుతాయి. అవి పొరుగు రాష్ట్రంలోకి వెళ్తే... ఈ బందోబస్తుల కోసం హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న జిల్లాల ఆర్మ్డ్రిజర్వ్ విభాగాలతో పాటు సమీప సీమాంధ్ర జిల్లాలైన కర్నూలు, గుంటూరు, కృష్ణాల నుంచి ఏఆర్, ఇతర సిబ్బందిని ఇక్కడకు పిలిపిస్తున్నారు. ఇప్పటివరకు ఇవన్నీ ఒకే రాష్ట్రం కావడంతో నగర/ సైబరాబాద్ పోలీసు కమిషనర్ అభ్యర్థన మేరకు డీజీపీ తక్షణం ఆదేశాలు జారీ చేస్తూ సమీప సీమాంధ్ర జిల్లాల నుంచి గంటల్లో బలగాలను పంపిస్తున్నాయి. అయితే అపాయింటెడ్ డే తరవాత ఇవి వేర్వేరు రాష్ట్రాలుగా మారుతుండటంతో సీమాంధ్ర జిల్లాలు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లిపోతాయి. దీంతో బలగాల మోహరింపు ప్రక్రియలో అనేక చిక్కుముడులు వస్తాయి. అప్పుడు అదనపు బలగాల మోహరింపు, కేటాయింపు అభ్యర్థనలన్నీ నగర కమిషనర్ నుంచి డీజీపీకి, ఆయన నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి చేరాలి. ఇక్కడి సీఎస్ పొరుగు రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్) చెందిన సీఎస్ ద్వారా అక్కడి డీజీపీకి పంపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల జోక్యమూ ఉంటుంది. ఇది జాప్యానికి ఆస్కారమిస్తుంది. ప్రతి ఏడాదీ జరిగే బందోబస్తుల విషయంలో కాస్త ముందుగా అప్రమత్తమై ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే హఠాత్తుగా తలెత్తే ఉద్రిక్తతలు, శాంతిభద్రతల సమస్యల విషయంలో ఏమాత్రం జాప్యం జరిగినా పరిస్థితులు చేయిదాటి పోతాయి. ఈ అంశంపైనే జంట కమిషనరేట్ల ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సిటీపై పట్టున్న రాష్ట్ర క్యాడర్కు చెందిన అధికారులు విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ఎలాట్ అయితే... వారి విషయంలోనూ ఫార్మాలిటీస్ తప్పనిసరి. కేంద్ర బలగాలపైనే ఆశలు అపాయింటెడ్ డే నుంచి ఐదు నెలల్లోనే రెండు కీలక ఘట్టాల్ని జంట కమిషనరేట్లు చవిచూడాల్సి వస్తుంది. ఆగస్టులో గణేష్ ఉత్సవాలు, అక్టోబర్/నవంబర్ల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎదురు కానున్నాయి. ఏటా అట్టహాసంగా జరిగే గణేష్ ఉత్సవాలకు దాదాపు 20 వేల మంది అదనపు బలగాలు అవసరం. అలాగే 2009లో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికలకు 23 వేల మంది అదనపు బలగాలు అవసరమయ్యాయి. వీరిలో సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారూ అత్యధిక సంఖ్యలోనే ఉండేవారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి జంట కమిషనరేట్ల అధికారులు కేంద్ర బలగాల పైనే ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్నన్ని రోజులూ ఒకే గవర్నర్ ఉండటం, జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల అంశం ఆయన చేతిలోనే ఉండనుండటంతో కొంత ఊరట చెందుతున్నారు. ఆయన జోక్యంతో కేంద్ర బలగాలతో పాటు పొరుగు రాష్ట్రం నుంచీ సిబ్బందిని జాప్యం లేకుండా మోహరించేలా చేయవచ్చని భావిస్తున్నారు. త్వరలో జరుగనున్న ఉన్నతస్థాయి సమీక్షలో ఈ అంశాన్నీ ప్రస్తావించాలని నిర్ణయించారు. -
సాధారణ ఓటర్ల మాదిరే...
శాంతిభద్రతల విధుల్లోని భద్రతా సిబ్బంది ఓటుపైసుప్రీం న్యూఢిల్లీ: శాంతి భద్రతల పర్యవేక్షణ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది సాధారణ ఓటర్ల మాదిరిగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాని ప్రాంతాల్లో వీరు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శాంతిభద్రతల పర్యవేక్షణ విధుల్లోని సిబ్బంది మూడేళ్ల పాటు విధులు నిర్వర్తించడమే కాక.. కుటుంబంతోపాటు అక్కడే నివసిస్తేనే సంబంధిత ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్న కేంద్ర ఎన్నికల సంఘం వా దనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. 2014 జనవరి 1 నుంచి ఈ రోజు వరకూ పోస్టింగ్ పొంది విధులు నిర్వర్తిస్తున్న వారంతా సంబంధిత ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా భద్రతా సిబ్బంది వివరాలను రెండు రోజుల్లో ఈసీకి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో స్పందించిన ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్లో ఓటు హక్కు కోసం ఇప్పటి వరకూ డిక్లరేషన్ సమర్పించని వారు తాము పని చేస్తున్న నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన 225 లోక్సభ స్థానాల్లో మినహా మిగిలిన చోట్ల భద్రతా సిబ్బంది ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
గ్రామానికొక కానిస్టేబుల్
ఆత్మకూర్, న్యూస్లైన్: వచ్చే సార్వత్రికఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామాని కి ఒక కానిస్టేబుల్ చొప్పున కేటాయిస్తున్నామని, గ్రామాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడంతోపాటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ డి.నాగేంద్రకుమార్ వెల్లడించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నామని చెప్పారు. గురువారం ఆయన ఆత్మకూర్ పోలీస్స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..బూత్లెవల్లో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి కార్యాచరణతో ముందుకెళ్తున్నామని అన్నారు. జిల్లాలో ఏఎస్ఐ పోస్టులు ఖాళీ ఉన్నాయని, త్వరలోనే వాటిని భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని సర్కిల్ప్రాంతాల్లోని మండలాల్లో 30మంది చొప్పున 450 మంది కానిస్టేబుళ్లను నియమించినట్లు తెలిపారు. మరో 150 ఖాళీలను త్వరలోనే భర్తీచేస్తామన్నారు. రూ. 80లక్షలతో జిల్లాలోని ఆరుచోట్ల పోలీస్భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పం పించామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లాలోని ఉప్పనుంతల, ఈగలపెంట, పోలీస్స్టేషన్ భవనాలను గతంలో మావోయిస్టులు కూల్చివేశారని, దీంతోపాటు కేశంపేట, జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్, అయిజ, పోలీస్స్టేషన్ల భవనాలు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించామని వివరిం చారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజ లు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. సమావేశంలో గద్వాల డీఎస్పీ గోవింద్రెడ్డితోపాటు ఎస్ఐ షేక్గౌస్, సిబ్బంది పాల్గొన్నారు. -
మేరీమాత ఉత్సవాలకు సర్వం సిద్ధం
విజయవాడ, న్యూస్లైన్ : గుణదల పుణ్యక్షేత్రంలో మూడురోజుల పాటు జరిగే మేరీమాత ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు విజయవాడ కథోలిక పీఠం పాలనాధికారి బిషప్ గోవింద్ జోజి, పుణ్యక్షేత్ర గురువులు తొలి సమిష్టి దివ్య బలి పూజ చేయడంతో ఉత్సవాలు మొదలవుతాయి. తిరునాళ్లకు లక్షలాదిగా హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మేరీమాత ఆలయాన్ని రంగు రంగుల తోరణాలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ప్రధానంగా బిషప్గ్రాసి పాఠశాల ఆవరణలో జరిగే సమిష్టి దివ్యబలి పూజ కార్యక్రమాలకు హాజరవుతారు. ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుణ్యక్షేత్ర పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే నిమిత్తం కార్పొరేషన్ అధికారులు దాదాపు 150 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ఆలయ కమిటీ వారు మరో 150 మందిని ఏర్పాటు చేశారు. వీరంత వివిధ షిఫ్టుల్లో 24 గంటల పాటు తమ సేవలందిస్తారు. బిషప్ గ్రాసి ఆవరణ, ప్రధానాలయం వద్ద దాదాపు 6 ప్రదేశాలలో మంచి నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు.గుణదల వంతెన వద్ద గల బూస్టర్ నుంచి నీటి ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 80 మంది సిబ్బంది పనిచేస్తారు. శాంతి భద్రతలు పరిర క్షించేందుకు పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్ర పరిసరాలన్నిటితో పాటు కొండ శిఖరాగ్రం వరకు అన్ని ప్రదేశాలలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పోలీసు బలగాలను మోహరించారు. మూడు రోజులపాటు రాత్రి పగలు సేవలందించే దిశగా పోలీసులు మూడు షిఫ్టుల్లో డ్యూటీ చేయనున్నారు. ఏలూరు రోడ్డు పై భక్తులకు అసౌకర్యం ఏర్పడకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. దాదాపు 1200 మంది పోలీసు సిబ్బంది, అధికారులు విధులు నిర్వహించనున్నారు. పుణ్యక్షేత్రంలోని ప్రధానాలయం, బిషప్గ్రాసి ప్రాంగణాలలో ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. -
శాంతిభద్రతలను పరిరక్షిస్తాం
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ డాక్టర్ తరుణ్జోషి పేర్కొన్నారు. 2013లో నమోదైన కేసుల సంఖ్య 32.5 శాతం పెరిగిందని ఆయన ప్రకటించారు. నూతన సంవత్సరంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడతామన్నారు. ఇందుకు ప్రజల సహకరించాలని కోరారు. నేరా లు, కేసుల నమోదు, దర్యాప్తు తదితర 43 అంశాలతో కూడిన 2013-నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఇందులోని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. 2012 సంవత్సరంలో జిల్లాలో 6326 కేసులు నమోదు కాగా ఈ ఏడాది వీటి సంఖ్య 7349కి పెరిగిందన్నారు. 2013లో జిల్లా పోలీసులు మూడు దొంగల ముఠాలను అరెస్టు చేసి రూ. 21.17 లక్షల విలువ చేసే ఆస్తులను రికవరీ చేశామని చెప్పారు. రాష్ట్ర పోలీస్శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డయల్ 100కు మొత్తం 19,654 ఫోన్ కాల్స్ వచ్చాయని, ఇందులో 1,507 పేకాల్స్ ఉన్నాయని వివరించారు. వీధిబాలల పునరావాస చర్యల్లో భాగంగా 175 మంది చిన్నారులను గుర్తించామని, ఇందులో 107 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించగా, మిగిలిన 68 మందిని బాలల పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. కుటుంబ తగాదాల పరిష్కారం కోసం జిల్లా లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను నిర్వహించామని ఎస్పీ తెలిపారు. ఇందులో 859 ఫిర్యాదులు రాగా 704 ఫిర్యాదులు పరి ష్కారమయ్యాయని, మిగిలిన 116 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2013లో నమోదైన కేసుల కు సంబంధించి రూ. 4.00 కోట్లు విలువ చేసే సొత్తు అపహారణకు గురికాగా ఇప్పటి వరకు రూ. 1.95 కోట్ల సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ వివరించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఇందులో 382 మంది ఫోన్ ద్వారా ఫిర్యా దు చేయగా 364 మంది ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది 23 నిర్భయ కేసులు నమోదు చేశామన్నారు. మరో 12 మంది మైనర్ బాలికలపై లైంగికదాడి, లైంగికదాడి యత్నాలకు పలుపడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు సంఖ్య తగ్గిందని , 2012లో 95 ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 91 కేసులు నమోదయ్యాయన్నారు. ఈవ్టీజింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ విభాగం చేపడుతున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. గత ఏడాది 102 ఈవ్టీజింగ్ కేసులు నమోదు కాగా , 2013లో అవి 300లకు పెరిగాయని ఎస్పీ వివరించారు. -
శాంతిభద్రతలపై ప్రత్యేక చర్యలు
వేలూరు, న్యూస్లైన్:వేలూరు, తిరువ ణ్ణామలై జిల్లా లో శాంతిభద్రతలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీఐజీ తమిళ్చంద్రన్ తెలిపారు. వేలూరు డీఐజీగా తమిళ్చంద్రన్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేలూరు,తిరువణ్ణామలై జిల్లా లో మామూళ్లు వసూలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేలూరులో ట్రాఫిక్ సమస్య ను పోలీసు అధికారులతో చర్చించి వాటిని మార్పుచేసేందుకు కృషి చేస్తానన్నారు. రాత్రి వేళల్లో చోరీలు అధికంగా జరుగుతున్నట్లు, పట్టణంలో కార్పొరేట్, బంగారు దుకాణాల్లో చోరీలు జరిగినప్పటికీ ఇంతవరకు సంబంధించిన వారిని అరెస్ట్ చేయలేదని అటువంటి కేసులను పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాహన తనిఖీలు, రోడ్డు ప్రమాదాలపై సమీక్షించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వేలూ రు జిల్లా సరిహద్దు ప్రాంతాల ద్వారా ఎర్రచందనం, నాటు సారా ఇతర జిల్లాలకు తరలుతున్నట్లు విమర్శలున్నాయని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనవెంట ఎస్పీ విజయకుమార్, డీ ఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలు గవర్నర్ కు ఇస్తే సీఎంలు బంట్రోతులే
కారేపల్లి, న్యూస్లైన్: రాష్ట్ర విభజన అనంతరం శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలోకి వస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బంట్రోతులుగా మారే పరిస్థితి ఉందని టీఆర్ఎల్డీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కారేపల్లికి చెందిన టీఆర్ఎల్డీ జిల్లా నాయకుడు మండెపూడి రమణయ్యను ఆదివారం దిలీప్కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చకు రాకుండా కుట్ర జరుగుతోందని, చర్చ అంశాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వడానికి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు ఆయన తెలిపా రు. సీమాంధ్రలో ఏడాది కాలంలో హైకోర్టును, రెండేళ్లలో రాజధానిని పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించాలన్నారు. సీమాంధ్ర నేతలు సమన్యాయం కోరడంలో తప్పు లేదని, కానీ బిల్లు ను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను క్షోభపెట్టినట్లే అవుతుందన్నారు. ఆయన వెంట టీఆర్ఎల్డీ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి శేషగిరిరావు, జిల్లా అధ్యక్షుడు రజనీకుమార్రెడ్డి, మండల అధ్యక్షుడు కల్లూరి శ్రీని వాసచారి, జూపల్లి రాము, బట్టు కిరణ్ ఉన్నారు. -
స్నేహభావంతోనే శాంతిభద్రతలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజలతో స్నేహంగా మసలుకుంటూ శాంతిభద్రతలను కాపాడాలని పోలీసులను ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. చెన్నైలో శుక్రవారం నిర్వహించిన ఐపీఎస్ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనుమానంపై అరెస్టు చేసిన వారిలో కొందరు లాకప్డెత్కు గురవడం దురదృష్టకరమన్నారు. వివిధ కేసుల్లో లక్షలాది మందిని అరెస్ట్ చేస్తే వారిలో ఒక్కరు లాకప్డెత్కు గురైనా సీరియస్గా పరిగణించాలన్నారు. అనుమానితులను అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో వారు అనారోగ్యానికి గురికావడం, కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం వంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఒక మనిషి ప్రాణాల విలువ అతనిపై ఆధారపడి బతికే ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుందని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో లాకప్డెత్లు జరగరాదని హెచ్చరించారు. విచారణలో నిర్లక్ష్యం వద్దు నిందితులను పట్టుకుంటే సరిపోదని, వారిపై వచ్చిన ఆరోపణలను రుజువు చే సి శిక్ష పడేలా చూడడం ఎంతో అవసరమని జయలలిత చెప్పారు. ఎందరో నిందితు లు బెయిల్పై విడుదలై స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. అరెస్ట్, బెయిల్తోనే పోలీసులు సరిపెట్టుకోకుండా సకాలంలో చార్జిషీటు దాఖలు చేస్తే నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. పోలీసులపై పని భారం ఉందని, అలాగని సమాజ శ్రేయస్సు, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉదాసీనంగా వ్యవహించ రాదన్నారు. ప్రజలతో పోలీసులు స్నేహితుల్లా మెలగడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. తన ప్రభుత్వం పోలీసు శాఖకు అవసరమైన మేరకు స్వేచ్ఛను ప్రసాదించిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తీవ్రవాదులను తెగించి పట్టుకోవడం ద్వారా తమిళనాడు పోలీసులు వృత్తిపై అంకింతభావాన్ని చాటుకున్నారని తెలిపారు. అందుకే 260 మంది పోలీసులకు నగదు బహుమతులు అందజేసి, పదోన్నతులు కల్పించామని తెలిపారు. నేరాల అదుపు, ట్రాఫిక్ నియంత్రణ, వీవీఐపీలకు బందోబస్తు, ప్రముఖ ప్రదేశాల్లో భద్రత తదితర అన్ని అంశాల్లోనూ పోలీసులు తమ కర్తవ్యాన్ని విడనాడరాదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ తీవ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా తమిళనాడు పోలీస్ శాఖ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. నేరాల అదుపు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అన్ని బాధ్యతల్లో జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. -
విభజన చిచ్చుతో కేంద్రానికి సవాలక్ష చిక్కులు
రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపేసిన కేంద్ర ప్రభుత్వానికి అసలు చిక్కుముడులు ముందున్నాయి. హైదరాబాద్ నగరాన్ని పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించారు. అప్పటివరకు ఇక్కడి శాంతి భద్రతల బాధ్యత తెలంగాణ గవర్నర్ చూసుకుంటారని కూడా చెప్పారు. వాస్తవానికి హైదరాబాద్ నగరాన్ని కొంతకాలం పాటైనా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలన్న సీమాంధ్ర ప్రాంత నాయకుల ప్రతిపాదనలకు జీవోఎం నిర్ద్వంద్వంగా నో చెప్పడంతో కేంద్రానికి చిక్కులు మరింత ఎక్కువ కానున్నాయి. ఇప్పడు ఢిల్లీ తరహాలోనో లేదా అరుణాచల్ ప్రదేశ్ తరహాలోనో ఇక్కడి పాలన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. శాంతిభద్రతలను గవర్నర్ చేతుల్లో పెట్టాలంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కొన్ని మార్పుచేర్పులు చేయడం తప్పనిసరి అవుతుంది. మన రాష్ట్రానికి ఈ బిల్లు ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉందన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే, ఢిల్లీ అయితే జాతీయ రాజధాని ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చైనా లాంటి ప్రమాదకర దేశంతో సరిహద్దు ఉంది. అందువల్ల ఆ రెండింటికీ శాంతి భద్రతలను కేంద్రం చూసుకుంటుందంటే పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ మామూలుగా అయితే శాంతి భద్రతలు, పోలీసింగ్ అనేవి పూర్తిగా రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలు. కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పోలీసింగ్, శాంతిభద్రతలను వదులుకోడానికి ఎంతవరకు అంగీకరిస్తుందన్న విషయం అనుమానమే. తమ పరిపాలనలో ఉన్న రాష్ట్రంలో కొంత భాగంలో మాత్రం (జీహెచ్ఎంసీ పరిధి) శాంతి భద్రతలు, పోలీసింగును గవర్నర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారంటే పాలకులు ఎంతమాత్రం సహిస్తారన్నది అనుమానమే. పైపెచ్చు, రాబోయే ఎన్నికలలో దాదాపు రెండు రాష్ట్రాల ప్రజలు (అప్పటికి విభజన ప్రక్రియ ముగిస్తే) కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడం దాదాపు ఖాయం. అప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను అమలు చేయడం, చేయకపోవడం అనేది కూడా అనుమానమే. శాంతి భద్రతల విషయంలో ఉమ్మడి రాజధాని సరిహద్దులు ఎంత ఉండాలన్నది మరో అతిపెద్ద సమస్య. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధినే చూసుకుంటారా లేదా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిని కూడా చేరుస్తారా అన్నది స్పష్టం కావాలి. రెండు కమిషనరేట్లనూ ఉమ్మడి రాజధాని పరిధిలోకి తేవాలని, జీహెచ్ఎంసీ పరిధిని పాలనాపరమైన అంశాల కోసం ఉమ్మడిగా నిర్ణయించాలని జీవోఎం తలపెట్టింది. కానీ తెలంగాణవాదులు దీన్ని అంగీకరించడంలేదు. జీహెచ్ఎంసీ పరిధి 625 చదరపు కిలోమీటర్లు కాగా, జనాభా 67 లక్షలు. అదే జంట కమిషనరేట్ల పరిధి 3,818 చదరపు కిలోమీటర్లు అవుతుంది, జనాభా 1.12 కోట్లు అవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జీహెచ్ఎంసీ పరిధి వ్యాపించి ఉంది. జంట కమిషనరేట్లు మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. మరి రెండు అంశాలకు రెండు వేర్వేరు పరిధులను ఎలా నిర్ణయిస్తారో పెద్దలే తేల్చాలి. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ దేశంలోనే పురాతనమైనది. దీన్ని 1847లో నిజాం కాలంలో ఏర్పాటుచేశారు. తర్వాత దీన్ని 1938లో హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం కింద పునర్వ్యవస్థీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధి 217 చదరపు కిలోమీటర్లు, దాంట్లో జనాభా 42 లక్షలు. ఐదుజోన్లు, 23 డివిజన్లు, 89 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 13,113 మంది సిబ్బంది అవసరం కాగా ప్రస్తుతం కేవలం 8,541 మంది మాత్రమే ఉన్నారు. 2012లో నగరంలో 15,073 నేరాలు జరిగాయి. ఇక సైబరాబాద్ కమిషనరేట్li 2003 ఫిబ్రవరిలో 3,601 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. జనాభా 70 లక్షలుంది. ఇందులో ఐదు జోన్లు, 14 డివిజన్లు, 60 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 6,877 మంది సిబ్బంది అవసరం కాగా 5,088 మందే ఉన్నారు. ఇక్కడ 2012లో 16,864 నేరాలు జరిగాయి. ఉమ్మడి రాజధానిలో పోలీసు పరిధి జీహెచ్ఎంసీ పరిధి కంటే దాదాపు ఐదురెట్లు ఉంటుంది. దేశంలో మరెక్కడా ఇలా లేదు. శాంతిభద్రతలను కేంద్రం నియంత్రణలోకి తెస్తే, పోలీసు కమిషనర్లు ఇద్దరికీ గవర్నర్ సూపర్ బాస్ అవుతారు. అంతేకాదు వీరు ముగ్గురూ కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ అధికారాలు చలాయించగలరు. కమిషనర్లిద్దరూ కేవలం గవర్నర్ గారికి మాత్రమే బాధ్యులుగా ఉంటే ముఖ్యమంత్రి ఏం చేయాలన్నదీ ప్రశ్నార్థకమే అవుతుంది మరి!! -
రాష్ట్ర పరిణామాలపై డీజీపీ సమీక్ష
రాయల తెలంగాణ ప్రతిపాదన తెరపైకి రావడం, దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తుది నివేదిక ఇవ్వనుండటంతో రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డీజీపీ ప్రసాదరావు బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి తాజా పరిణామాలపై చర్చించారు. ఐజీలు, డీఐజీలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. జిల్లాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
రాజధాని ఉమ్మడైతే.. శాంతిభద్రతల మాటేంటి?
ఎంతమంది వద్దంటున్నా వినిపించుకోకుండా.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ, రాష్ట్రాన్ని విభజించేందుకు కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఓ తలనొప్పి ఎదురైంది. ఉమ్మడి రాజధాని నగరంలో శాంతి భద్రతలను ఎవరు పరిరక్షిస్తారన్న విషయం పెద్ద ప్రశ్నగా మారింది. హైదరాబాద్ నగరాన్ని కొంతకాలం పాటైనా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలన్న సీమాంధ్ర ప్రాంత నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. అలాగే జీవోఎం కూడా ఈ ప్రతిపాదలనను తిరస్కరించింది. దీంతో ఇప్పడు ఢిల్లీ తరహాలోనో లేదా అరుణాచల్ ప్రదేశ్ తరహాలోనో ఇక్కడి పాలన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఆ రెండు చోట్లా సాధారణ పాలనా వ్యవహారాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటుండగా శాంతిభద్రతలు, పోలీసింగును మాత్రం కేంద్ర ప్రభుత్వమే నియంత్రిస్తుంది. కానీ అలా శాంతిభద్రతలను గవర్నర్ చేతుల్లో పెట్టాలంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో కొన్ని మార్పుచేర్పులు చేయడం తప్పనిసరి అవుతుంది. అయితే, మన రాష్ట్రానికి ఈ బిల్లు ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉందన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే, ఢిల్లీ అయితే జాతీయ రాజధాని ప్రాంతం, అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చైనా లాంటి దేశంతో సరిహద్దు ఉంది. అందువల్ల ఆ రెండింటికీ శాంతి భద్రతలను కేంద్రం చూసుకుంటుందంటే పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ మామూలుగా అయితే శాంతి భద్రతలు, పోలీసింగ్ అనేవి పూర్తిగా రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలు. కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పోలీసింగ్, శాంతిభద్రతలను వదులుకోడానికి ఎంతవరకు అంగీకరిస్తుందన్న విషయం మాత్రం అనుమానమే. శాంతి భద్రతల విషయంలో ఉమ్మడి రాజధాని సరిహద్దులు కూడా సమస్యే. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధినే చూసుకుంటారా లేదా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిని కూడా చేరుస్తారా అన్నది స్పష్టం కావాలి. రెండు కమిషనరేట్లనూ ఉమ్మడి రాజధాని పరిధిలోకి తేవాలని, జీహెచ్ఎంసీ పరిధిని పాలనాపరమైన అంశాల కోసం ఉమ్మడిగా నిర్ణయించాలని జీవోఎం తలపెట్టింది. కానీ ఒకే ఉమ్మడి రాజధానికి రెండు పరిధులేంటని ఇప్పుడు కొత్త అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. -
జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు: డీజీపీ
-
జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు: డీజీపీ
హైదరాబాద్ : రాష్ట్ర పోలీసుల తరపున జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. హైదరాబాద్లోని జూబ్లీహాల్లో శాంతి భద్రతలపై డీజీపీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, అడిషనల్ డీజీ. ఐజీతో పాటు పోలీసు ఉన్నత అధికారులు హాజరు అయ్యారు. శాంతిభద్రతలపై ఇందులో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సమీక్ష సమావేశం అనంతరం డీజీపీ మాట్లాడుతూ జీవోఎంకు తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా రాష్ట్ర విభజన వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యలపై కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో?
-
సీమాంధ్రకు ప్యాకేజీపైనా జీవోఎం చర్చ
-
హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో?
జీవోఎంకు ఇచ్చిన నివేదికలో హోం శాఖ సూచన? విద్య, మున్సిపల్, భూ వ్యవహారాలు కూడా కొంతకాలం ఉమ్మడిగానే పోలీసు శాఖ 12,13 తేదీల్లో భేటీకి 8 పార్టీలకు జీవోఎం ఆహ్వానం.. 11న కేంద్ర శాఖల కార్యదర్శులతో.. 18న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో భేటీ నెలాఖరుకు పని పూర్తి చేస్తాం: షిండే హైదరాబాద్పై నిర్ణయానికీ బిల్లులో చోటు సీమాంధ్రకు ప్యాకేజీపైనా జీవోఎం చర్చ సాక్షి, న్యూఢిల్లీ: విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే సమయంలో హైదరాబాద్ శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతను గవర్నర్కు అప్పగించాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించిందా? అంతేగాక నగరానికి సంబంధించిన భూ వ్యవహారాలు, మున్సిపల్ పరిపాలన, ఉన్నత విద్య విభాగాలను కూడా ఆ పదేళ్ల పాటు గవర్నర్ చేతిలోనే ఉంచాలని సూచించిందా? విభజన విధి విధానాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించిన నివేదికలో హోం శాఖ ఈ మేరకు పేర్కొన్నట్టు హస్తిన రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే నేతృత్వంలో జీవోఎం గురువారం ఢిల్లీలో మూడోసారి సమావేశమైంది. శాంతిభద్రతలు, పోలీసు విభాగం విభజన తదితర అంశాలపై ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ ఇచ్చిన నివేదికతో పాటు పలు శాఖల నుంచి అందిన నివేదికలను జీవోఎం పరిశీలించినట్టు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ రూపొందించిన నివేదికను ప్రధానంగా సమీక్షించినట్టుచెబుతున్నారు. అధికార వర్గాల సమాచారం మేరకు.. టాస్క్ఫోర్స్ తన నివేదికలో పేర్కొన్న పలు సూచనలు, సిఫార్సులను హోం శాఖ యథాతథంగా తన నివేదికలో చేర్చింది. ప్రధానంగా హైదరాబాద్లో సీమాంధ్రుల భద్రత, వారి ప్రయోజనాల పరిరక్షణ మీదే శాఖ దృష్టి సారించిందని, అంతేగాక రాజధానిలోని సీమాంధ్ర పోలీస్ అధికారులను విభజన తర్వాత కూడా కొనసాగించాలని సూచించిందని అంటున్నారు. ‘‘పోలీసు, ఇంటలిజెన్స్ వ్యవస్థలను విభజన తర్వాత కూడా కొంతకాలం పాటు విభజించకుండా ఉమ్మడిగా వినియోగించుకోవాలి. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న సీమాంధ్ర ఉద్యోగుల లెక్కలు తీశామని, తర్వాత వారి సంగతి తేలుస్తామని ఒక ప్రాంతం నేతలు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు హైదరాబాద్లోని సీమాంధ్రుల్లో ఆందోళన రేకెత్తించాయి. బెదిరింపుల నేపథ్యంలో తక్కువ ధరలకే ఆస్తులమ్ముకుని వెళ్లిపోవాల్సి వస్తుందేమోనని వారిలో ఆందోళన నెలకొని ఉంది. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామనే భరోసా ఇవ్వాలి. హైదరాబాద్తో పాటు ఇతర తెలంగాణ జిల్లాల్లోని సీమాంధ్ర ఉద్యోగులు అక్కడే కొనసాగే అవకాశం కల్పించాలి. ప్రత్యేకించి సచివాలయం, తెలంగాణ జిల్లాల్లో వారిని సర్వీసు పూర్తయ్యేదాకా కొనసాగనివ్వాలి. సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగులకూ ఇదే మాదిరి అవకాశమివ్వాలి. తెలంగాణలోని ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న సీమాంధ్రులను బలవంతంగా పంపించే చర్యలను నిరోధించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రధానమైన విద్య, వైద్య సంస్థలన్నీ హైదరాబాద్లోనే ఉన్నందున పదేళ్ల దాకా వాటిలో సీమాంధ్ర విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలి. సినీ తదితర రంగాల ప్రముఖులు ఏ రాష్ట్రంలో ఉన్నా వారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కృష్ణా జలాలను రాయలసీమకు నిరాకరిస్తే అక్కడి ప్రాజెక్టులకు నీళ్లందే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతమున్న ఆయకట్టు పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరం’’ అని హోం శాఖ నివేదికలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. అయితే అధికార వర్గాలు మాత్రం వీటిని ధ్రువీకరించడం లేదు. కాకపోతే హైదరాబాద్పై తీసుకునే నిర్ణయాన్ని బిల్లులో పొందుపరుస్తామని జీవోఎం భేటీకి ముందు విలేకరులతో పిచ్చాపాటి సందర్భంగా షిండే వెల్లడించారు! నెలాఖరులోపు జీవోఎం పని పూర్తి చేస్తుందన్న ఆయన, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని జీవోఎంలో చర్చిస్తామని కూడా వివరించారు. బిల్లును సరైన సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి పంపేలా చూస్తామన్నారు. కాకపోతే హైదరాబాద్ శాంతిభద్రతలు తదితరాలను గవర్నర్ చేతిలో ఉంచడం వంటి కీలకాంశాలపై పై మాత్రం భేటీకి ముందు, అనంతరం మీడియాతో మాట్లాడిన రెండుసార్లూ షిండే ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇక వరుస భేటీలు... రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జీవోఎం నిర్ణయించింది. అందులో భాగంగా నవంబర్ 11న కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో, 18న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో సమావేశమవుతుంది. నవంబర్ 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన పార్టీలతో జీవోఎం విడి విడిగా భేటీ అవుతుంది. భేటీ అనంతరం మీడియాకు షిండే ఈ మేరకు వెల్లడించారు. ‘‘8 పార్టీలకు 12, 13 తేదీల్లో సమయమిచ్చాం. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నాయకులు రావచ్చు. ఒక్కరు వస్తే మంచిది. ఇద్దరికీ కలిపి 20 నిమిషాలు కేటాయించాం. 18న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో భేటీ అవుతాం’’ అని వివరించారు. జీవోఎంకు 18 వేల వినతులు, సూచనలు, సలహాలతో పాటు పలు శాఖల నుంచి నివేదికలు కూడా అందాయన్నారు. గంటంపావు పాటు జరిగిన జీవోఎం భేటీలో మంత్రులు చిదంబరం, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్, నారాయణసామి పాల్గొన్నారు. విదేశీ పర్యటన వల్ల గులాంనబీ ఆజాద్, అనారోగ్య కారణాలతో ఎ.కె.ఆంటోనీ రాలేకపోయారు. ఇప్పటికే అన్ని ప్రధాన శాఖలనుంచి గణాంకాలతో కూడిన నివేదికలు తెప్పించుకున్న జీవోఎం... అధికారులు, పార్టీలు, మంత్రులతో భేటీల అనంతరం మరో రెండుమార్లు సమావేశమై నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో పని ముగించే అవకాశం కనిపిస్తోంది. తమకందిన సూచనలను అంశాలు, శాఖలవారీగా విభజించి, క్రోడీకరించేలా మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు జీవోఎం అప్పగించింది. టాస్క్ఫోర్స్ కమిటీ రూపొందించిన 29 పేజీల నివేదికను జీవోఎం ముందు షిండే ఉంచారు. విభజనతో తలెత్తే సమస్యల పరిష్కారానికి మార్గాలు, ఆస్తులు-అప్పుల పంపకాలు, జల వనరులు, విద్యుత్ పంపిణీ లెక్కలు, ఉద్యోగుల సమస్యలు, 371-డి అధికరణం తదితరాలపై వివరణాత్మక నివేదికలు తీసుకోవడంతో పాటు తమకందిన వినతిపత్రాల్లో సంధించిన ప్రశ్నలు, వ్యక్తం చేసిన అనుమానాలకు సమాధానాలు రూపొందించాలని కేంద్ర శాఖల కార్యదర్శులకు సూచించాలని నిర్ణయించారు. అపవాదు భయంతోనే అన్ని పార్టీలకూ పిలుపు! విభజనను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీ, సీపీఎం పార్టీలు జీవోఎంను బహిష్కరించాలని నిర్ణయించడం, టీడీపీ గోడ మీద పిల్లి తరహాలో ఎటూ తేల్చకపోవడం, మిగతా 5 పార్టీలు తమ విధానానికి అనుగుణంగా స్పందించి జీవోఎంకు నివేదికలివ్వడం తెలిసిందే. దాంతో ఆ ఐదు పార్టీలతోనే భేటీ కావాలని జీవోఎం తొలుత భావించింది. అయితే విభజన ప్రక్రియలో కొన్ని పార్టీలను విస్మరించి ముందుకెళ్లారనే అపవాదు రాకుండా ఉండేందుకు అన్ని పార్టీలనూ పిలవాలని నిర్ణయించారు. -
అన్ని పోలీసు విభాగాల చీఫ్లతో విజయ్కుమార్ భేటీ
-
కేంద్రం అజమాయిషీలోనే శాంతిభద్రతలు!
* టాస్క్ఫోర్స్కు సూచించిన పలువురు ఐపీఎస్లు * ఆస్తులు, సిబ్బంది వివరాలపై డీజీపీ నివేదిక * అన్ని పోలీసు విభాగాల చీఫ్లతో విజయ్కుమార్ భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో శాంతిభద్రతలు పూర్తిగా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండటమే మంచిదని కొందరు ఐపీఎస్లు కె.విజయ్కుమార్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్కు ప్రతిపాదించినట్లు సమాచారం. హైదరాబాద్లో పోలీసులపై ఎవరి అజమాయిషీ ఉండాలనే అంశంపై కేంద్రం నియమిత స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) బృందం.. ఐపీఎస్ అధికారులు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారుల అభిప్రాయాలను కోరింది. విభజన నిర్ణయం నేపథ్యంలో పోలీసుశాఖ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బృందం రెండో భేటీ బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ ఐజీ కార్యాలయంలో జరిగింది. మీడియా హడావుడి ఎక్కువగా ఉండటంతో ఈ మేరకు మార్పు చేశారు. డీజీపీ బి.ప్రసాదరావు, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్కే కౌముది, ఆపరేషన్స్ విభాగం అదనపు డీజీ జేవీ రాముడు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్రెడ్డి, అదనపు డీజీ ఎస్.గోపాల్రెడ్డి, అప్పా డెరైక్టర్ ఎం.మాలకొండయ్య, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఆర్పీ ఠాకూర్, ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతమ్సావంగ్, ఏపీపీఎస్సీ కార్యదర్శి చారుసిన్హా, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్శర్మ, మాజీ డీజీపీలు పేర్వారం రాములు, కేఆర్ నందన్, రిటైర్డు ఐపీఎస్ అధికారి విజయరామారావు తదితరులు ఎస్టీఎఫ్ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్టీఎఫ్ బృందం కోరిన విధంగా రాష్ట్రంలో పోలీసుశాఖకు సంబంధించిన ఆస్తులు, సిబ్బంది వివరాలను డీజీపీ అందించినట్లు సమాచారం. వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు బృందాలుగా చర్చలు జరిపి ఎస్టీఎఫ్కు నివేదికలు సమర్పించారు. హైదరాబాద్లో సిబ్బంది నియామకాలకు అన్ని ప్రాంతాలవారినీ పరిగణనలోకి తీసుకోవాలా? ఆరవ జోన్కు మాత్రమే పరిమితం కావాలా? అనే అంశం ప్రభుత్వం తేల్చాల్సి ఉందని కమిషనర్ అనురాగ్శర్మ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ పోలీసు సిబ్బంది జీతభత్యాలు ఏ రాష్ట్రం విడుదల చేస్తుందో కూడా తేల్చాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ పరిధి, ఇక్కడ సీమాంధ్రుల భద్రత అంశాలపై అధికారులు గురువారం నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ సమావే శానికి సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ), హోంశాఖ ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించారు. కాగా 371 (డి)కి సంబంధించి న్యాయపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. -
ప్రమాదంలో ‘ రాష్ట్ర శాంతిభద్రతలు’
రాష్ట్రంలో మొత్తంగా శాంతిభద్రతల పరిస్థితి అత్యంత కలవరం కలిగించేదిగా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ స్వయంగా నివేదించారని తెలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అత్యంత కీలకమైన బిల్లు రూపకల్పన దశకు చేరిన నేపథ్యంలో పిలుపుపై ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారం ప్రణబ్తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర నేతలను కలిసి విభజన ఆంశంపై లోతుగా చర్చలు జరిపారు. ప్రణబ్తో భేటీలో శాంతిభద్రతల అంశంపైనే గవర్నర్ విసృ్తతంగా నివేదించినట్టు తెలిసింది. తక్షణం అవసరమైన చర్యలు, జాగ్రత్తలు చేపట్టి పరిస్థితులను అదుపు చేయకపోతే అవి ఎక్కడికైనా దారి తీయవచ్చంటూ ఆందోళన వెలిబుచ్చినట్టు సమాచారం. ‘‘విభజనపై కేంద్రం చురుగ్గా ముందుకెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి కలవరం కలిగించేలా మారుతోంది. అందుకే కేంద్రం ఏం చేయదలచుకున్నా చాలా వేగంగా వ్యవహరించాలి. అవసరమైతే ఏ ‘అసాధారణ ప్రక్రియ’కైనా, చర్యకైనా సిద్ధపడాలి. లేనిపక్షంలో రాష్ట్రంలో పరిస్థితి చేజారిపోవడం ఖాయం’’ అని రాష్ట్రపతికి వివరించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనకున్న సమాచారాన్ని ఉటంకిస్తూ విషయాన్ని అన్ని కోణాల నుంచీ వివరిస్తూ ప్రణబ్ ముందుంచినట్టు చెబుతున్నారు. శాంతిభద్రతలను అత్యంత ప్రాథమ్యాంశంగా పరిగణించాలని ప్రణబ్ను కోరినట్టు సమాచారం. సోనియా, కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండేలతో భేటీలో కూడా ఈ అంశాలన్నింటినీ గవర్నర్ వారి దృష్టికి తీసుకెళ్లారని, అంతేగాక వారికి పలు నివేదికలు కూడా సమర్పించారని తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రంలో పాలన, ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాగా లేవని స్పష్టం చేశారంటున్నారు. అంతేగాక విభజన ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలంటే సీమాంధ్ర ప్రాంత ప్రజల భయాందోళనల్ని తొలగించే ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సి ఉంటుందని వారితో అభిప్రాయపడినట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గత జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయించిన తర్వాత గవర్నర్ ఢిల్లీకి రావడం ఇదే మొదటిసారి.గవర్నర్ బుధవారం తొలుత కేంద్ర మంత్రుల బృందంలో కీలక సభ్యుడైన ఆర్థిక మంత్రి చిదంబరంతో దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిపారు. విభజనానంతరం తలెత్తే పలు సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గాలపై మల్లగుల్లాలు పడ్డట్టు సమాచారం. తర్వాత సోనియా నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకొని ఉన్న తాజా పరిస్థితిపై, విభజన ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమెకు వివరమైన నివేదికను సమర్పించారు. అయితే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే సమస్యే లేదని ఈ సందర్భంగా సోనియా స్పష్టం చేసినట్లు గవర్నర్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. సీమాంధ్ర నేతలు ఈ దిశగా గట్టిగా డిమాండ్ చేస్తుండటం, ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్ల పాటు హైదరాబాద్లో శాంతిభద్రతల యంత్రాంగాన్ని కేంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంచాలని హోంశాఖ ప్రతిపాదిస్తుండటం తెలిసిందే. అనంతరం మధ్యాహ్నం గవర్నర్ కేంద్ర హోం శాఖ కార్యాలయానికి వెళ్లి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, హోం శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర విభజన ప్రక్రియ అమలు గురించి చర్చించారు. తర్వాత షిండే, ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి నారాయణసామి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్లను కూడా కలిశారు. అయితే చర్చల వివరాలను మీడియాకు వెల్లడించడానికి నిరాకరించారు. చాలాకాలం తర్వాత రాజధానికి వచ్చినందున కేంద్ర నాయకులను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానన్నారు. తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చిందా? అని ప్రశ్నించగా, చాలా విషయాలు మాట్లాడుకున్నామంటూ ముక్తసరిగా బదులిచ్చారు. జీవోఎం సభ్యుడైన రక్షణ మంత్రి ఆంటోనీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీలను గవర్నర్ గురువారం కలుస్తారని సమాచారం. శుక్రవారం ప్రధాని మన్మోహన్సింగ్తో కూడా సమావేశమయ్యే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ బిల్లుకు శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ఆమోదాన్ని పొందాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం, అందుకోసం అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని కూడా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో గవర్నర్ను ఢిల్లీ పిలిపించడం ప్రాధాన్యతను సంతరించుకోవడం తెలిసిందే. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను, సీమాంధ్రలో ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ తీరుతెన్నులపై తన అంచనాలను, అభిప్రాయాలను పెద్దలకు గవర్నర్ వివరించారని ఆయన సన్నిహిత వర్గాలన్నాయి. -
శాంతిభద్రతలు కేంద్రం చేతికి!
-
ఉద్యమం తీవ్రంగా ఉంది.. చల్లారుస్తాం: డీజీపీ
సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతితో డీజీపీ బయ్యారపు ప్రసాదరావు శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లోను సమైక్య ఉద్యమం తీవ్రంగా ఉందని, ఆ తీవ్రతను తగ్గించడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన సీఎస్కు తెలిపారు. మరోవైపు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో గత రాత్రి నుంచి పరిస్థితులు అదుపు తప్పాయని అక్కడకు ప్రత్యేకాధికారిగా వెళ్లిన విజయనగరం ఎస్పీ కార్తికేయ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 144 సెక్షన్ విధించామని, అందువల్ల ఎవరూ గుంపుగా తిరగొద్దని చెప్పారు. అల్లర్లకు పాల్పడుతున్న అందిరనీ గుర్తిస్తున్నామని, వారిపై కేసులు పెడతామని ఆయన అన్నారు. -
సమీక్షణం: చట్టంతో చుట్టరికం
పేజీలు: 238 వెల: 100 ప్రతులకు: రచయిత, 305, అలేఖ్య రెసిడెన్సీ, వెజిటబుల్ మార్కెట్, నల్లకుంట, హైదరాబాద్-44. ఫో: 9989621103 పుస్తకం : లా లోచనం (వ్యాసాలు) రచన : వేదాంతం సీతారామావధాని విషయం : ‘వర్తమాన న్యాయ సమస్యలు- విశ్లేషణ’తో కూడిన 53 వ్యాసాల సంకలనం ఇది. ‘సమాజ నిర్మాణంలో విడదీయరాని చట్ట వ్యవస్థ’ గురించి బాగా అవగాహన ఉండే ఓ న్యాయమూర్తి వీటిని రాయడం, అదీ ఆయన స్వయంగా కవి కూడా కావడం పుస్తకానికి అదనపు ఆకర్షణ. అపార్టుమెంట్ల అగచాట్లు, సహజీవనం, ‘కుంతీపుత్రులు’, పితృత్వ పరీక్షలు, నల్లధనం అరికట్టడంలాంటి అంశాలు ఇందులో వస్తాయి. ప్రభుత్వోద్యోగులు సమ్మె చేయటం ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతీ, వివాహితతో లైంగిక సంబంధం నెరిపే వ్యక్తి శిక్షార్హుడన్న హెచ్చరికా, ఇప్పుడున్న కోర్టుల సామర్థ్యంతో పెండింగ్ కేసులకు మోక్షం కలిగించడానికి 320 ఏళ్లు పడుతుందన్న వాస్తవమూ తారసపడతాయి. ‘పాత గడియారాలకు వలె న్యాయ యంత్రాంగానికీ తరచూ తైల సంస్కరణ జరగాలి. అయితే దాని కాలపు విలువలను మార్చరా’దని లార్డ్ ఓల్ఫ్ అన్నట్టుగా, మూల విలువలకు భంగం కలగని సంస్కరణలు జరగాలన్న అభిలాష రచయితది. అవిశ్రాంత కథకుడి సంకలనం పేజీలు: 108 వెల: 72 ప్రతులకు: 3-169-16, రామారావు కాలనీ, మదనపల్లె. ఫో: 08571 221963 పుస్తకం : టి ఎస్ ఎ కథ-2012 జానర్ : ఫిక్షన్ రచన : టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి విషయం : అరవై నాలుగేళ్ల టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి నలభై రెండేళ్లుగా కథలు రాస్తున్నారు. ఆరు కథాసంపుటాలు, రెండు నవలలు ప్రచురించారు. ‘టిఎస్ఎ కథ- 2012’ ఆయన ఆరవ కథా సంపుటం. ఈ పుస్తకం కవర్ చూడగానే ఈయనో కాలక్షేపం కథకుడు అనిపించడం పాఠకుడి తప్పు కాదు; అలా అనిపించి కథల్లోకి అడుగుపెట్టకపోవడం మాత్రం పాఠకుడి తప్పే. ఇందులో ఈ సంవత్సరం వివిధ పత్రికల్లో అచ్చయిన ‘మనుషులు మరణిస్తారు’, ‘చద్దిపెట్టె’, ‘విలువ’, ‘ఆత్మబంధువు’, ‘గుండెమంట’ లాంటి పది కథలున్నాయి. నిరాడంబరమైన చదువ చక్కని వాక్యం; లేశమాత్రం సహనాన్ని పరీక్షించబూనని కథనం. ఎదుటివాడి కష్టం, అసహాయత, ఆవేదన, దుఃఖం తరపున నిలబడి రాయగలిగినతనమున్న కథకుడి కథలివి. కవిత్వపు పరామర్శ పేజీలు: 208; వెల: 200 ప్రతులకు: డా.ఎన్.గోపి, ఇం.నం.13-1/5బి, శ్రీనివాసపురం, రామంతపూర్, హైదరాబాద్-13. ఫోన్: 040-27037585 పుస్తకం : అరుణ కవిత్వం - అవలోకనం జానర్ : నాన్ఫిక్షన్/వ్యాసాలు సంపాదకురాలు : డా.నీరజ జవ్వాజి విషయం : సాధారణంగా కవిత్వం ఒక ఉద్రేకం, ఒక తక్షణ స్పందనం. ఎన్.అరుణ విషయంలో ఇది తారుమారు. ఆమె యాభై దాటిన తర్వాతే రాయడం మొదలుపెట్టారు. సంసార బాధ్యతల్ని ఒక ఒడ్డుకు చేర్చాక, ఒడిదుడుకుల చిలిపితనం, దుడుకుతనం చవిచూశాక కలాన్ని సిరాలో ముంచడం మొదలుపెట్టారు. ఆ లెక్కన ఆమెకు కవిత్వం అంటే సంయమనం, సమన్వయం. నీరజ అన్నట్టు, ‘ఆవేశం, ఆగ్రహానికి మధ్య గల సంయమనరేఖ మీద నిలబడి అన్ని రకాల వాదాలను, ధోరణులను సమన్వయం’ చేస్తారు. పదేళ్ల కాలంలో అరుణ ఏడు కవితా సంకలనాలు- ‘మౌనమూ మాట్లాడుతుంది’ ‘పాటల చెట్టు’ ‘గుప్పెడు గింజలు’(నానీలు), ‘అమ్మ ఒక మనిషి’, ‘హృదయమే వదనం’ ‘సూది నా జీవనసూత్రం’ ‘‘నిరీక్షణే ఒక గాయం’- వెలువరించారు. వాటన్నింటిమీదా వచ్చిన విమర్శల సంకలనం ఇది. ఆమెది ‘శాంతిని పంచే కవిత్వం’గా కందుకూరి రమేష్బాబు భావిస్తారు. ‘ఎన్నో ఏళ్లుగా సుప్తించిన చేతన భళ్లున మేల్కొన్న కవిత్వ జీవనది’గా పెన్నా శివరామకృష్ణ అభివర్ణిస్తారు. రచయిత్రి హృదయ సాంద్రతకు కొలమానంగా కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆమె ఈ కవితను ఉదాహరిస్తారు: ‘జీవితం ప్రసాదించిన/కన్నీటి చుక్కను/ పదిలంగా లోపల దాచుకున్నాను/ ఆ తడే లేకపోతే/ గుండె ఎప్పుడో బీటలు వారిపొయ్యేది.’ కొత్త పుస్తకాలు అమృతమూర్తి ముహమ్మదు (దివ్యచరితము- పద్యకావ్యము-ప్రథమ భాగము) రచన: ఎస్.ఎస్.పటేల్ పేజీలు: 144; వెల: 75 ప్రతులకు: రచయిత, 80/80ఎ, చౌడేశ్వరి నగర్, విక్టరీ ఫంక్షన్ హాల్ వెనుక, కర్నూలు-518002. ఫోన్: 9441376145 చింతల చెట్టు (కవిత్వం) రచన: సింహాద్రి పద్మ పేజీలు: 82; వెల: 50 ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌజ్ కాలం మరణించింది రచన: డి.రామచంద్రరాజు పేజీలు: 176; వెల: 150 ప్రతులకు: డి.సుజాత, డోర్ నం: 4/1979-2, బాలమురుగన్ వీధి, చిత్తూరు-517002. పుడమి తల్లి పులకించింది రచన: ఆచంట వీరవెంకట సత్యసాయి కుమార్ పేజీలు: 96; వెల: 50 ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు -
పోస్టింగ్ కోసం ఐపీఎస్ల పడిగాపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతలు కీలకమైనప్పటికీ ఐపీఎస్ల పోస్టింగ్లు, బదిలీల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోం ది. పోలీసుశాఖలో ఎస్పీ, డీఐజీ పోస్టుల భర్తీకి తాత్సారం చేయడం విమర్శలకు తావిస్తోంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు గతనెల మొదటి వారంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు చేపట్టారు. అప్పుడు పోస్టింగ్ ఇవ్వకుండా కొందరు ఎస్పీ, డీఐజీలను వెయిటింగ్లో ఉంచి నెలన్నర దాటింది. వారిని తాత్కాలికంగా ఏదో ఒక విభాగానికి అటాచ్ చేసి వదిలేశారు. గుంటూరు అర్బన్ నుంచి బదిలీ అయిన ఎస్పీ ఆకె రవికృష్ణ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసి వెయిటింగ్లో ఉన్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ చంద్రశేఖరరెడ్డిని బదిలీచేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన్ను తాత్కాలికంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు అటాచ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నార్త్జోన్ డీసీపీ శ్రీకాంత్ ఐక్యరాజ్యసమితి శాంతిదళానికి ఎంపికవడంతో ఆయన్ను బదిలీ చేశారు. కానీ ఐరాస నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. దీంతో ఆయన్ను నగర ట్రాఫిక్ విభాగం డీసీపీగా తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. ఆయన వెళ్లితే ట్రాఫిక్ విభాగం డీసీపీ పోస్టు ఖాళీకానుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 3 డీసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాదాపూర్, బాలానగర్, అల్వాల్ డీసీపీ పోస్టులకు ఎస్పీ స్థాయి అధికారుల్ని నియమించాల్సి ఉంది. మరో ఇద్దరు డీఐజీలు, ఒక ఐజీ కూడా పోస్టింగ్కోసం ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ డీఐజీగా నియమితులైన గంగాధర్ను సొంత జిల్లా కారణంగా ఈసీ ఆదేశాలతో బదిలీ చేశారు. ప్రస్తుతం వెయిటిం గ్లో ఉన్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ పోస్టు నుంచి బదిలీ అయిన సూర్యప్రకాశరావుపై ఆరోపణలొచ్చినందున భద్రాచలం ఓఎస్డీగా తాత్కాలికంగా పంపారు. నక్సల్ నిరోధక కార్యకలాపాలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఆ బాధ్యతలకు ఓఎస్డీగా అదనపు ఎస్పీ స్థాయి అధికారుల్ని నియమించే సంప్రదాయముంది. తదుపరి ఐపీఎస్ల బదిలీలప్పుడు సూర్యప్రకాశరావుకు డీఐజీ పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొందిన వీవీ శ్రీనివాసరావుకూ పోస్టింగివ్వడంలో ఆల స్యమైంది. పోలీసుశాఖలో కీలకమైన 2 అదనపు డీజీ స్థాయి పోస్టుల నియామకాల్లోనూ ప్రభుత్వం జాప్యంచేస్తోంది. ప్రిం టింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ ఆర్పీ మీనా గతనెల్లో పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు. తూనికలు, కొలతలశాఖ అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్గా బదిలీ అయ్యారు. తూనికలు కొలతల శాఖకు ఐజీ లేదా అదనపు డీజీని నియమించాల్సిఉంది. అదనపు డీజీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన జేవీ రాముడు ప్రస్తుతం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు సంయుక్తంగా ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. ఆయన్ను డీజీ స్థాయి పోస్టుకు బదిలీచేసే అవకాశముంది. ఆయనతోపాటు డీజీపీగా పదోన్నతి పొందిన ఏకేఖాన్ మాత్రం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగానే కొనసాగుతారని తెలిసింది. -
విభజనతో వెసులుబాటు!
విశ్లేషణ: ‘‘మన రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య పరిష్కారమైపోయిందనుకోవడం తప్పు. నక్సలైట్లవల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యను అదుపులోకి తేవడం మాత్రమే మా పని. శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సింది ప్రభుత్వమే. అందుకు బదులుగా ప్రభుత్వమే నక్సలై ట్లు తయారు కావడానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సృష్టిస్తే మేం చేయగలిగేది ఏమీ ఉండదు, మళ్లీ కథ మొదటికే వస్తుంది’’ అంటూ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వెలిబుచ్చారు. మూడేళ్ల క్రితం నేటి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు హైదరాబాద్కు ముఖం చాటేస్తున్న సంగతి తెలిసిందే. నేటి రాష్ట్ర విభజన ప్రతిపాదన ఆ అనిశ్చితిని తొలగించకపోగా పొడిగిస్తుంది. దీనికి తోడు నక్సలైట్ల కారణంగా 1988-1992 మధ్య రాజధానిలో నెలకొన్న పారిశ్రామిక అశాంతి తిరిగి నెలకొంటే పెట్టుబడులు రెండు రాష్ట్రాలకు దూరంగా జరిగే ప్రమాదం ఉంది. కాంగ్రెస్పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల సమ స్య తిరిగి చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య తిరిగి మొదటికి వస్తుందని పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి భయా లు నిరాధారమైనవని తెలంగాణవాదులు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండానే అందరూ అంగీకరించే వాస్తవం ఒకటుంది. దేశవ్యాప్తంగా అసంతృప్తి, ఆందోళనల వ్యాప్తికి అనువైన పరిస్థితులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆ కారణంగానే మావోయిస్టులు కేరళ నుంచి ఈశాన్యం, జమ్మూ-కాశ్మీర్ వరకు విస్తరించగలిగారు. 21 రాష్ట్రాల్లో 18 రాష్ట్ర కమిటీలతో ఆ పార్టీ పనిచేస్తోంది. దండకారణ్యంగా పిలిచే మధ్య భారతంలో కేంద్ర బలగాలు చేపట్టిన ‘గ్రీన్హంట్’ ఆశించిన ఫలితాలిస్తున్న దాఖలాలులేవు. పైగా ఆర్థికవ్యవస్థ ఇప్పట్లో మాంద్య పరి స్థితుల నుంచి బయటపడే సూచనలు లేవు. గ్రామీణ, పట్టణ నిరుద్యోగం వేగంగా పెరుగుతోంది. పెరిగే ధరలకు తోడు, సంక్షేమ వ్యయాల, సబ్సిడీల కోతలు సామాన్యులలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్లో వైఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధం గా అమలైన సంక్షేమ పథకాలను అటకెక్కించారు. దీంతో మన రాష్ట్ర ప్రజానీకంలో అసంతృప్తి ప్రబలుతున్నది. ఈ పరిస్థితుల నేపథ్యం నుంచి చూస్తే రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లోనూ మావోయిస్టు ఉద్యమం పుంజుకునే అవకాశాలే హెచ్చుగా ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేతల ప్రతిష్టకు సవాలు పార్టీ యూనిటీ, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన నక్సలైట్ పార్టీలు విలీనమైనా నేటికీ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ నేతలదే. మల్లోజుల కోటేశ్వరరావు, చెరుకూరి రాజ్కుమార్లు మరణించినా అత్యున్నతస్థాయి పొలిట్బ్యూరోలోని ఏడుగురిలో ఐదుగురు ఏపీకి చెందినవారే. వారిలో నలుగురు తెలంగాణకు చెందినవారు. స్వరాష్ట్రంలో ఉద్యమం దెబ్బ తినడంతో ఏపీ అగ్రనాయకత్వం ఇతర రాష్ట్రాల్లో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సివస్తోంది. ఒడిశా మాజీ మావోయిస్టు నేత సవ్యసాచి పాండా ‘తెలుగువారి ఆధిపత్యమే’ తన తిరుగుబాటుకు కారణమని చెప్పడం గమనార్హం. ‘ఉద్యమ ప్రాంతాలకు నాయకత్వం’ అన్నది ఏపీ నేతలే తెచ్చిన నిర్మాణ సూత్రం. ఏపీ నేతల ప్రతిష్ట మసకబారడానికి అదే కారణమవుతోంది. కాబట్టి ఏపీలో ఉద్యమ పునర్నిర్మాణం వారికి తక్షణావసరం. ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులను పరిగణనలోకి తీసుకోక మావోయిస్టులు గుడ్డిగా పాత పంథానే కొనసాగిస్తుం డటంవల్లనే ఉద్యమ పునర్నిర్మాణం కావడం లేదనేది వాస్తవం కాదు. 2001 నాటికే ఉత్తర తెలంగాణలో 1980 నుంచి 1990ల చివరి వరకు జరిగిన మార్పులపై ఆ పార్టీ లోతైన అధ్యయనాన్ని నిర్వహించింది. ఆ పార్టీ తొమ్మిదవ (యూనిటీ) కాంగ్రెస్ (2004) ఆమోదించిన ‘వ్యూహం-ఎత్తుగడలు’, దానిపై ఆధారపడి రూపొందిన ‘పట్టణ ప్రాంతాలలోని పని’ (అర్బన్ పర్స్పెక్టివ్ 2007) అనే డాక్యుమెంట్లలో ఆ నూతన అవగాహన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేశ ‘ఆర్థిక కేంద్రం గ్రామీణ ప్రాంతాల నుం చి పట్టణ ప్రాంతాలకు మారింద’ని అవి పేర్కొనడం విశేషం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మారిన పరిస్థితులకు తగిన ఎత్తుగడలను, పని పద్ధతులను ఆ డాక్యుమెం ట్లు సూచించాయి. రాష్ట్రంలో తిరిగి పాగా వేయడానికి అవసరమైన సైద్ధాంతిక కసరత్తును పూర్తి చేసిన మావోయిస్టులు రాష్ట్ర విభజనవల్ల ఏర్పడే ‘తాత్కాలిక వెసులుబాటు’ను ఉపయోగించుకోడానికి సకల శక్తులను ఒడ్డుతారనడంలో సందేహం లేదు. తెలంగాణలో పాగా ఖాయం దక్షిణాదిలో ఉద్యమ పునరుద్ధరణకు ఆ పార్టీ పకడ్బందీగా అమలుచేస్తున్న పథకం వివరాలు 2011, డిసెంబర్ 8న నాటి హోంశాఖ స్టేట్ మంత్రి జితేందర్సింగ్ లోక్సభలో చేసిన ప్రకటనలో ఉన్నాయి. కేరళ వైనాడ్ జిల్లా నుంచి కర్ణాటకలోని మైసూర్ జిల్లాల వరకు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు విస్తరించారు. సాయుధ గె రిల్లా దళాలు ఆ అడవుల్లో పనిచేస్తున్నాయి. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని నీలంబూర్-గిడలూల్ అటవీ ప్రాంతంలో కూడా దళాలు పనిచేస్తున్నాయి. మరోవంక తెలంగాణకు, ఛత్తీస్గఢ్కు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్, వార్ధా, భండారా, యవత్మాల్ జిల్లాలకు వారి ఉద్యమం విస్తరి స్తోంది. ఒకప్పుడు రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల్లో ఉద్యమ వ్యాప్తికి తోడ్పడితే, నేడు మావోయిస్టులు పొరుగు రాష్ట్రాలను చుట్టుముట్టి రాష్ట్రంలో ఉద్యమాన్ని పునర్నిర్మించే వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. కొత్త రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు, యంత్రాంగాల ఏర్పాటుకు, అవి నిలదొక్కుకొని స్థిరపడటానికి కనీసం రెండు మూడేళ్లయినా పడుతుంది. మావోయిస్టులు (ఒకప్పటి కొండపల్లి వర్గం నక్సలైట్లు) 1969 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా పునాదిని సమకూర్చే సాధనంగా చూస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా నక్సలైట్ల ప్రాబల్యం పైకి కనబడిన దానికంటే ఎక్కువే. రాష్ట్ర విభజన తదుపరి ఏర్పడే రెండు ప్రభుత్వాలకు వెంటనే నక్సలైట్లపై దృష్టిని కేంద్రీకరించడం సాధ్యం కాదు. మావోయిస్టు శాంతి భద్రతల సమస్యను, హింసాత్మక ఘటనలను అవి కోరుకోవు. కాబట్టి నక్సలైట్ల విషయంలో అవి తాత్కాలికంగానే అయినా ఉదారవైఖరిని చూపకతప్పదు. మావోయిస్టులు ఆ అపూర్వ అవకాశం వదులుకోకపో వచ్చు. గోదావరికి ఆవలి దండకారణ్యాన్ని (ఛత్తీస్గఢ్) కేంద్రంగా చేసుకొని జినుగు నర్సింహారెడ్డి, పుల్లెల ప్రసాదరావు వంటి అగ్రనేతల నేతృత్వంలో వివిధ జిల్లా కమిటీలు తెలంగాణతో సజీవ సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి, మంగి ఏరియా కమిటీలు, ఖమ్మం జిల్లాలో వెంకటాపూర్, శబరి ఏరియా కమిటీలు గుట్టుగా పనిచేస్తున్నాయి. విభజన వల్ల కలిగే ‘తాత్కాలిక వెసులుబాటు’ మూలంగా మావోయిస్టులకు ఒకప్పడు పెట్టని కోటలైన ఖమ్మం, వరంగ ల్, కరీంనగర్ జిల్లాల్లో వారు తిరిగి పాగా వేయడం తథ్యమని సీని యర్ పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సరిహద్దులలో మావోయిస్టుల దాడుగుమూతలు కేంద్ర హోంశాఖ నేతృత్వంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా కేంద్ర బలగాల ‘గ్రీన్హంట్’ సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ప్రధాన కారణంగా 50 వేలకుపైగా కేంద్ర బలగాలు రంగంలో ఉన్నా, మావోయిస్టులపై పైచేయి సాధించలేకపోతున్నాయి. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించి, భిన్న నాయకత్వ కేంద్రాలుగా మారినస్థితే ఇందుకు కారణం. ఏపీలో నక్సలైట్ల ఆటకట్టిం చడంలో కీలకపాత్ర వహించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ఇన్ఫార్మర్ల నెట్వర్క్ను నిర్మించడంలో రాష్ట్రాల నుంచి సహకారం అందడంలేదని కేంద్ర హోంశాఖ ఆరోపిస్తోం ది. కేంద్ర కమాండ్, స్థానిక బలగాలను చిన్నచూపు చూస్తోందని రాష్ట్రాలు వాపోతున్నాయి. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీకి చెందినవి కాకపోవడం కూడా సమస్యగా మారుతోంది. ఛత్తీస్గఢ్, జార్ఖం డ్, ఒడిశాలలో పలు సందర్భాలలో అధికార పార్టీలు స్వీయప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ పరిస్థితులను అందిపుచ్చుకుని మావోయిస్టులు కేంద్ర బలగాలపై భారీ దాడులను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల మధ్యా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ల మధ్యా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ల మధ్యా మావోయిస్టులు భద్రతాబలగాలతో దాగుడుమూతలు ఆడుతున్నారు. అటు సన్నాహాలు జరిపి, ఇటు దాడులు చేస్తున్నారు. ఇటు దాడి చేసి, అటు రక్షణ పొందుతున్నారు. ఒడిశా పోలీసులతో సమన్వయ లోపం కారణంగానే 33 మంది ఏపీ గ్రేహౌండ్స్ పోలీసులు 2008లో బలిమెల వద్ద బలైపోయారు. ఖమ్మం జిల్లా పూవర్తి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతి చెందిన ఎస్ఐ ప్రసాద్బాబు మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి తరలించడానికి మూడు రోజులు పట్టింది. అదికూడా హక్కులనేతల సహాయంతో. కేంద్ర హోంశాఖ ఈ మూడు మావోయిస్టు తిరుగుబాటు సరిహద్దు ప్రాంతాలను ‘త్రికోణం’గా అభివర్ణించింది. రాష్ట్ర విభజన ఆ త్రికోణానికి నాలుగో కోణాన్ని చేర్చి చతురస్రంగా మారుస్తుంది. నల్లమల ఉద్యమ పునరుజ్జీవం... ‘నాలుగో కోణం’ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 7 జిల్లాలకు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలతో సరి హద్దు ఉంది. మెదక్తో కలిపి ఆ నాలుగు జిల్లాలు దక్షిణ తెలంగాణ ప్రాంతీయకమిటీ కింద బలమైన ఉద్యమ కేంద్రాలు. అప్పట్లో కృష్ణానది మీదుగా మావోయిస్టులు మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోకి యథేచ్ఛగా రాకపోకలు సాగించేవారు. ఆ నాలుగు జిల్లాల్లో విస్తరించిన నల్లమల మావోయిస్టులకు పెట్టనికోట. కొల్లాపూర్, పెద కొత్తపల్లి, లింగాల, అమ్రాబాద్ మండలాలు నక్సలైట్లకు అప్పట్లో మంచి పట్టున్న ప్రాంతాలు. కొల్లాపూర్ మండలం సోమశిల, అమరగిరి, మొలచింతపల్లి, ఎర్రగట్టు బొల్లారం ప్రాంతాల్లో కృష్ణ దాటితే కర్నూలు జిల్లా కొత్తపల్లి మం డలం సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, కపిలేశ్వరం, బలపాలదిబ్బ అటవీ ప్రాంతాలకు చేరుకోవచ్చు. కొల్లాపుర్-సోమశిల మధ్యనే ఐపీఎస్ అధికారి పరదేశీనాయుడును మావోయిస్టులు హతమార్చారు. మాజీ ఎమ్మెల్యే రంగదాస్ను కాల్చిచంపారు. లింగాల, అప్పాయిపల్లి, అప్పాపూర్ పెంట, చెన్నంపల్లి గ్రామాలను ఆధారం చేసుకొని పుట్టీలలో నదిని దాటి కర్నూలు జిల్లా శ్రీశైలం, ఆత్మకూరు మండలాల్లో దాడులు చేసి తిరిగి రావచ్చు. అమ్రాబాద్ నదీ పరివాహక ప్రాంతం నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల అటవీ ప్రాంతాలలోకి చొరబడటం అతి సులువు. అమ్రాబాద్లో గతంలో మావోయిస్టులు చాలా దాడులు చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్ను కాల్చిచంపారు. అప్పట్లో కృష్ణపట్టీ దళం ఇటు నల్లగొండ, అటు గుంటూరు జిల్లాల్లో చెలరేగిపోయింది. చందంపేట, పెద అడిచర్లపల్లి మండలాల నుంచి సులువుగా నది దాటి గుంటూరు జిల్లా దాచేపల్లి, మాచవరం, వెల్దుర్తి, మాచర్ల అటవీ ప్రాంతాలకు చేరవచ్చు. ఒకప్పుడు మేళ్లచెరువు, చందంపేట మండలాల్లో మావోయిస్టులు చురుగ్గా పనిచేశారు. ఆ మండలాల నుంచి దాచేపల్లి, మాచవరం చేరుకోవచ్చు. ఇక నాగార్జున సాగర్ జలాశయం మార్గంగా రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించవచ్చు. మావోయిస్టులు పలుమార్లు గ్రేహౌండ్స్ కూంబింగ్ల నుంచి పర్యాటకుల మరబోట్లలో నదిని దాటి తప్పించుకున్నారు. 2005లో నక్సలైట్లు నల్లగొండ జిల్లా నుంచి వెళ్లి గుం టూరు జిల్లా చిలకలూరిపేట పోలీసు స్టేషన్పై దాడి చేశారు. ఏపీ రాష్ట్ర కమిటీ కీలక నేతలేగాక, పత్రిక, ప్రెస్, తదిరత యంత్రాంగం నల్లమల నుంచే పనిచేసేవి. కృష్ణానది, నల్లమల ఆధారంగా మావోయిస్టులు కీలకమైన తెలంగాణ, సీమాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మధ్య స్వేచ్ఛగా సంచరించగలుగుతారు. కాబట్టి రా్రష్ట విభజనతో మావోయిస్టులు తెలంగాణతోపాటూ సీమాం ధ్రలో కూడా విస్తరించే అవకాశాలు బలంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు అధికారంలో ఉంటే పరి స్థితి మరింత జటిలం అవుతుంది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ఒడిశా అటవీ ప్రాంతాలకు కలిపి ఏర్పడ్డ ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ (ఏవోబీ) ఏపీ పోలీసులకు కొరకరాని కొయ్యగా మిగిలింది. ఏ మాత్రం వెసులుబాటు కలిగినా ఏవోబీ నాయకత్వం ఉద్యమాన్ని విశాఖ మైదానాలకు, నగరానికి కూడా విస్తరింపజేస్తుంది. కోస్తా జిల్లాల్లోని మెట్టప్రాంతాల పరిస్థితి, సాగునీటి సదుపాయాలు లేని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల కంటే ఏమంత మెరుగు కాదు. కాబట్టి నక్సలైటు ఉద్యమవ్యాప్తికి ఇవన్నీ అనువైన ప్రాంతాలే. ముసుగు సంస్థలు- పట్టణ ఉద్యమం 1990లలోనే నక్సలైట్లు ముసుగు సంస్థలను (కవర్ సం ఘాలు) నిర్మించడం ప్రారంభించారు. ఆర్ఎస్యూ, ఆర్వైఎల్, సికాస వంటి బహిరంగ ప్రజాసంఘాలకు భిన్నం గా ఎలాంటి సంబంధం లేనట్టు కనిపించే కవర్ ప్రజా సంఘాలను నిర్మించడంపై దృష్టిని కేంద్రీకరించాలని యూనిటీ కాంగ్రెస్ స్పష్టం చేసింది. మావోయిస్టులు ఇప్పుడు తమ ఉనికి బయటపడకుండానే ఉద్యమాలను నిర్మిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చూస్తే కేవలం రెండు మూడేళ్ల వెసులుబాటైనా మావోయిస్టులకు చాలు. పైగా మావోయిస్టులు పట్టణాలలో ఉద్యమ నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ‘ప్రజాయుద్ధానికి, విముక్తి ప్రాంతాల ఏర్పాటుకు అవసరమయ్యే వివిధ రకాల శక్తిసామర్థ్యాలను కలిగిన క్యాడర్లను, నాయకులను అందించే ప్రధాన వనరు పట్టణ ప్రాంతాలే’. (అర్బన్ పర్స్పెక్టివ్). పట్టణ ప్రాంతాలకు తగిన నాయకత్వాన్ని, క్యాడర్లను పంపి, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యక్రమంతో పనిచేయాలని 2004 రాజకీయ నిర్మాణ నివేదిక నిర్దేశిం చింది. ముంబై, పూణె, ఢిల్లీలలో మావోయిస్టుల ప్రాబ ల్యం విస్తరిస్తోందని జాతీయ మీడియా చెబుతోంది. గత ఏడాది మారుతీ సుజుకీ మానేసర్ కర్మాగారం కార్మిక సమ్మె, సీనియర్ ఎగ్జిక్యూటివ్ హత్యల వెనుక వారి హస్తం ఉన్నదని భావించారు. 1990ల మొదట్లో హైదరాబాద్లోని శివారు కార్మిక వాడలన్నిటిలోనూ నక్సలైట్లు మంచి పట్టు సాధించారు. నాటి పారిశ్రామిక అశాంతి మూలంగా పలు పారిశ్రామిక సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. నేడు మావోయిస్టులు ‘గోల్డెన్ కారిడార్’లపై దృష్టిని కేంద్రీకరించారు. పూణె నుంచి ముంబై, సూరత్, వడోదరాలకు అటు నుంచి అహ్మదాబాద్కు విస్తరించిన పారిశ్రామిక కారి డార్లో ఉన్న ‘ఖాళీలను’ భర్తీ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో విస్తరించిన మరో పారిశ్రామిక కారిడార్పైన కూడా కేంద్రీకరించారు. చెన్నై, హైదరాబాద్, విశాఖ పారిశ్రామిక కేంద్రాలతో మరో విప్లవ పారిశ్రామిక కారిడార్ కోసం ప్రత్యేక నాయకత్వాన్ని కేటాయించారు. స్వల్పకాలిక ఫలి తాలను ఆశించకుండా నిర్మితమవుతున్న ఈ పట్టణ ఉద్యమ బలాన్ని అంచనా వేయడం కష్టమని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్’ నిపుణులు అంటున్నారు. మూడేళ్ల క్రితం నేటి తెలంగాణ ఉద్య మం ప్రారంభమైనప్పటి నుంచి నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు హైదరాబాద్కు ముఖం చాటేస్తున్న సంగతి తెలిసిందే. నేటి రాష్ట్ర విభజన ప్రతిపాదన ఆ అనిశ్చితిని తొలగించకపోగా పొడిగిస్తుంది. దీనికి తోడు నక్సలైట్ల కారణంగా 1988-1992 మధ్య రాజధానిలో నెలకొన్న పారిశ్రామిక అశాంతి తిరిగి నెలకొంటే పెట్టుబ డులు రెండు రాష్ట్రాలకు దూరంగా జరిగే ప్రమాదం ఉం ది. రాష్ట్ర విభజన మావోయిస్టులు ఎదురుచూస్తున్న అనుకూల పరిస్థితులకు దారితీయడం అనివార్యం కావచ్చు. పైగా నక్సలైటు ఉద్యమం గత పదేళ్లలో గుణాత్మకంగా భిన్నమైన సాయుధశక్తిగా ఎదిగింది. పట్టణాలలో సుశిక్షితమైన సాయుధ ఆత్మరక్షణ దళాలను, యాక్షన్ టీంలను నిర్మించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో తిరిగి నక్సలైటు ఉద్యమం పుంజుకుంటే ఏపీ పోలీసులు కొత్త తరం మావోయిస్టులతో పోరాడవలసి ఉంటుంది. ‘‘మన రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య పరిష్కారమైపోయిందనుకోవడం తప్పు. మేం ఆ పని ఎప్పటికీ చేయలేం. అసలా పని మాదికాదు. నక్సలైట్లవల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యను అదుపులోకి తేవడం మాత్రమే మా పని. శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సింది ప్రభుత్వమే. అందుకు బదులుగా ప్రభుత్వమే నక్సలై ట్లు తయారు కావడానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సృష్టిస్తే మేం చేయగలిగేది ఏమీ ఉండదు, మళ్లీ కథ మొదటికే వస్తుంది’’ అంటూ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వెలిబుచ్చారు. - చెవుల కృష్ణాంజనేయులు