
19 మంది ఎక్కడెక్కడ చనిపోయారు?
హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 15నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ 19మంది వైఎస్ఆర్ సీపీ నేతలు ఎక్కడెక్కడ చనిపోయారని ప్రశ్నించారు. ఆ వివరాలు వైఎస్ఆర్ సీపీ నేతలు ఇవ్వగలరా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కాగా రైతులు, ప్రజల సమస్యలు వైఎస్ఆర్ సీపీకి పట్టడం లేదని మరోమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. సభా సమయాన్ని ఆ పార్టీ సభ్యులు వృధా చేస్తున్నారని ఆయన అన్నారు.