Acham naidu
-
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
-
బాబుకు కోపమొచ్చింది.. అచ్చెన్న పదవి ఊస్టింగేనా?
టీడీపీ సీనియర్ నేతల తీరుపై చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలం అయినట్లు సమాచారం. 52 రోజుల పాటు తాను జైల్లో ఉంటే పార్టీ సీనియర్లంతా తమ ఇళ్లకే పరిమితమై పార్టీని వదిలేశారని చంద్రబాబు మండిపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యంతర బెయిల్పై విడుదల అయిన తర్వాత తనను స్వాగతించడానికి వచ్చిన సీనియర్లను చంద్రబాబు చూసీ చూడనట్లు వ్యవహరించారు. ఆ తర్వాత తనను కలిసి నేతలతో ఏంటి పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారా? నేను అరెస్ట్ అయినా మీలో స్పందన రాదా? అని గుడ్లురిమినట్లు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు ప్రతిపక్షంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారని ఆయన దుయ్యబట్టారట. ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని టీడీపీకి పేరు. కార్యకర్తలే పార్టీకి అసలు సిసలు బలమని అంటారు. అటువంటి పార్టీ అధినేత ఓ అవినీతికేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలూ పకడ్బందీగాచేపట్టకపోవడంపై రాజకీయ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పార్టీ పీకల్లోతు సంక్షోభంలో కూరకుపోయిన తరుణంలోనూ పార్టీలో సీనియర్లు జూనియర్లూ కూడా తమకేమీ పట్టనట్లు ఉండిపోవడంపైనా ఆసక్తికర చర్చ నడుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు లూటీ జరిగిన స్కిల్ స్కాం కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనపై మోపిన అభియోగాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించడం వల్లనే ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తనను అరెస్ట్ చేస్తేనే రెండు తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటాయనుకున్నారు చంద్రబాబు. తనను జైలుకు పంపితే ఇక ఆందోళనలు మిన్నంటుతాయనుకున్నారు.1984లో ఎన్టీయార్ ను తప్పించి నాదెండ్ల ముఖ్యమంత్రి అయినపుడు ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఉద్యమించినట్లు తన విడుదల కోసం ప్రజలు నినదిస్తారని అనుకున్నారు.అయితే వీటిలో ఏ ఒక్కటీ జరగలేదు. ప్రజల మాట దేవుడెరుగు తమ సొంత పార్టీ శ్రేణుల నుంచే స్పందన లేకపోవడం చంద్రబాబుకు మింగుడు పడలేదు. అప్పట్లో ములాఖత్ లో తనని కలవడానికి వచ్చిన యనమల , పయ్యావుల కేశవ్ వంటి సీనియర్లపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు నేను జైలు కెళ్లినా మీరంతా మీ ఇళ్లల్లో కూర్చుని కాలక్షేపం చేస్తే ఎలాగ? అని సీరియస్ అయ్యారు. కనీసం ఇప్పట్నుంచి అయినా ఆందోళనలపై దృష్టి సారించండి అని వారికి దిశానిర్దేశనం చేశారు. అయితే ఆ తర్వాత కూడా నేతల తీరులో ఎలాంటి మార్పు లేకపోవడం.. తన గురించి పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోకపోవడంతో చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత నుంచే ఆయన ఆరోగ్యం పై కుటుంబ సభ్యుల చేత రక రకాల ఫిర్యాదులు అసత్య ప్రచారం చేయించారు. అయినా సానుభూతీ రాలేదు..బెయిలూ రాలేదు. ఇక లాభం లేదని కంటి ఆపరేషన్ ను తెరపైకి తెచ్చారు చంద్రబాబు. ఆరోగ్య కారణాలు చూపించి బెయిల్ కోరడంతో రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఆధారంగా చంద్రబాబు నాయుడికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. నవంబరు 28న సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబు నాయుడు తన కంటికి ఆపరేషన్ చేయించుకుని తిరిగి జైలుకెళ్లి లొంగిపోవాలి. అయితే జైలు నుండి మధ్యంతర బెయిల్ పై విడుదల కాగానే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆయనకు ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిలే తప్ప పూర్తి బెయిల్ కాదని నిపుణులు అంటున్నారు. ఇక దీన్ని పక్కన పెడితే బెయిల్ పై జైలు నుండి విడుదల అయిన తర్వాత చంద్రబాబు ను కలసి శుభాకాంక్షలు చెప్పడానికి పార్టీనేతలు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడితో పాటు మరికొందరిపై చంద్రబాబు నిర్లిప్తంగా వ్యవహరించారని అంటున్నారు. తన సన్నిహిత వర్గాలతో మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నేతలంతా వేస్ట్ ఫెలోసే అని చంద్రబాబు కారాలు మిరియాలు నూరారట. 52రోజుల పాటు నేను జైల్లో ఉన్నా వీళ్లకి పట్టదా? ప్రభుత్వంలో ఉంటే పదవులు కావాలని వస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు మాత్రం నిర్వర్తించరు..పార్టీని పూర్తిగా గాలికి వదిలేసి ఎవరి ఇళ్లల్లో వాళ్లు రెండు నెలల పాటు కాలక్షేపం చేశారు అని చంద్రబాబు తీవ్ర ఆవేశంతో ఏకి పారేశారట. త్వరలోనే పార్టీని సమూలంగా కింది నుంచి పైకి ప్రక్షాళన చేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. నాలుగువారాల మధ్యంతర బెయిల్ ముగిసే లోపే పార్టీలో అసలైన విధేయులకు పదవులు బాధ్యతలు అప్పగించి.. విధేయంగా ఉన్నట్లు నటిస్తూ పదవుల్లో కూర్చున్నవారిని పక్కన పెట్టాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాను జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండిపోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్లు అంటున్నారు. మొత్తానికి జైలు కెళ్లడం కూడా ఒకందుకు తనకు మేలే చేసిందని.. తన వారెవరో నటించేదెవరో తేల్చుకోడానికి అది దోహద పడిందని చంద్రబాబు భావిస్తున్నారట. ఆ లెక్కన అచ్చెంనాయుడికి పదవీ గండం ఉండచ్చని ఎన్టీయార్ ట్రస్ట్ కోళ్లు అదే పనిగా కూస్తున్నాయి. - కుర్చీ కింద కృష్ణయ్య -
అచ్చెన్నాయుడి మెడపై ఉద్వాసన కత్తి
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి త్వరలోనే పెద్ద షాక్ తప్పదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్ష పీఠంపై నుంచి అచ్చెన్నాయుడ్ని తప్పించడానికి నిర్ణయం జరిగిపోయిందని అంటున్నారు. త్వరలోనే అచ్చెన్నాయుడి స్థానంలో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్షుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఈ మార్పుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపినా పార్టీ పరంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో హడావిడి చేయడంలో అచ్చెన్నాయుడు ఘోరంగా విఫలమయ్యారని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. పై పెచ్చు పార్టీ బలహీనంగా ఉందన్న సంకేతాలను అచ్చెన్నాయుడే లీక్ చేయిస్తున్నారని కూడా పార్టీ అధినేత అనుమానిస్తున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మార్పు జరగడం ఇంచుమించు ఖాయం అంటున్నారు టీడీపీ వర్గీయులు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెంన్నాయుడి వ్యవహార శైలిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోనూ అచ్చెన్నాయుడి వ్యతిరేక వర్గం ఆయన్ను తప్పించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆ వర్గానికి పార్టీలోని సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారని అంటున్నారు. 2020 అక్టోబరులో కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడికి పార్టీ పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. అయితే ఆ తర్వాత ఆయన ఇఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. ఆయనపై కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. అయినా చంద్రబాబు నాయుడి ఆశీస్సులు ఉండడంతో ఎవరూ అచ్చెన్నాయుడ్ని టచ్ చేయలేకపోయారని అంటారు. సెప్టెంబరు 9న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే జైలుకు వెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబును జైలుకు పంపినా ఏపీలో ప్రజల నుండి స్పందన రాలేదు. ఎవరూ ఆందోళనలు చేయలేదు. బాబుతో నేను పేరుతో ఆందోళనలకు పార్టీ శ్రేణులు తరలి రావాలని పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పిలుపునిచ్చినా పార్టీ నేతల నుంచే స్పందన లేదు. అయితే పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడంలో అచ్చెన్నాయుడు విఫలం కావడం వల్లనే బాబుతో నేను కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని పార్టీలో అచ్చెన్నాయుడి వైరి వర్గం ఆరోపిస్తోంది. అచ్చెన్నాయుడ్ని అధ్యక్ష పీఠం నుంచి తప్పిస్తే కానీ పార్టీకి మంచి రోజులు రావని కూడా ఆ వర్గం వాదిస్తోన్నట్లు చెబుతున్నారు. ఆ మధ్య ములాఖత్లో భాగంగా యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో భేటీ అయినపుడు పార్టీ భవిష్యత్ పైనే చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అచ్చెన్నాయుడు సరిగ్గా పట్టించుకోవడం లేదని యనమల కూడా చంద్రబాబుకు ఫిర్యాదుచేసినట్ల సమాచారం. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు అధ్యక్షుడయ్యాక పలు సందర్భాల్లో అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలు రాజకీయ ప్రత్యర్ధులకు లీక్ కావడంపై చర్చించినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అచ్చెన్నాయుడు ఓ కార్యకర్తతో పార్టీలేదు బొక్కా లేదు అన్న కామెంట్ను అచ్చెన్నాయుడికి తెలీకుండా ఎవరు లీక్ చేస్తారని? యనమల చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు చెబుతున్నారు. అదే విధంగా లోకేష్ యువగళం యాత్రకు జనాన్ని తరలించకపోవడంపై పార్టీ నేతతో అచ్చెన్నాయుడు మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడా లీక్ అయ్యింది. లోకేష్ యాత్రకి జనం రాకపోవడంతో పెద్దాయన బాధగా ఉన్నారంటూ అచ్చెంనాయుడు చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో పార్టీ బలహీనతలు వెలుగులోకి వచ్చినట్లయ్యింది. ఆ తర్వాత మాచర్లలోనూ టీడీపీ నేతలతో అచ్చెన్నాయుడి చిట్ చాట్ సంభాషణల ఆడియో క్లిపింగ్ కూడా లీక్ అయ్యింది. ప్రతీ సందర్భంలోనూ అచ్చెన్నాయుడు భాగస్వామిగా ఉన్న క్లిపింగ్సే లీక్ కావడం వెనుక కుట్ర ఉందని యనమల అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అనుమానాలనే చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు సమాచారం. అన్నింటినీ నిశితంగా పరిశీలించిన తర్వాత అచ్చెన్నాయుడు ఉద్దేశ పూర్వకంగానే పార్టీ పరువు బజారున పడేస్తున్నారని చంద్రబాబు కూడా భావిస్తోన్నట్లు చెబుతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన పార్టీ అధ్యక్షుడే అచేతనంగా వ్యవహరించడం వల్లనే పార్టీ ప్రతిష్ఠ రోజు రోజుకీ మసకబారిపోతోందని చంద్రబాబు ఆందోళన చెందుతోన్నట్లు చెబుతున్నారు. దీనిపై యనమలతో పాటు ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత అచ్చెన్నాయుణ్ని తప్పించడమే మేలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి అచ్చెంనాయుడ్ని తప్పిస్తే బీసీ వర్గానికి చెందిన నేతను అవమానించారన్న ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉండడంతో బీసీ వర్గానికే చెందిన యనమల రామకృష్ణుడికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని చంద్రబాబు భావిస్తోన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి యనమల రామకృష్ణుడు టీడీపీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆయనే సీనియర్ నాయకుడు పార్టీలో. అందుకు యనమలను అధ్యక్షుణ్ని చేస్తే అవసరమైన వ్యూహాలతో పార్టీని ముందుకు నడిపిస్తారని చంద్రబాబు భావిస్తోన్నట్లు అంటున్నారు. అయితే తనను తప్పించి యనమలకు పదవిని ఇస్తే.. అచ్చెన్నాయుడు ఊరికే ఉండరని.. యనమలకు నిద్ర లేకుండా చేయడానికి ఏం చేయాలో అంతా చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు. CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు -
నీకు ఒక ఊరు సరిపోదు నాయనా...!
-
అచ్చెన్న ఆరోపణ.. బుగ్గన ఖండన
సాక్షి, అమరావతి: ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారం కట్టిస్తుందని ఉన్నా ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. కడప ఉక్కు కర్మాగారానికి 2019 డిసెంబర్లో శంకుస్థాపన చేశారని, త్వరలో మూడేళ్లు పూర్తికావస్తోందని.. అయినా ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. భూమి ఇచ్చిన రైతులకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ తీరుతో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోతున్నాయన్నారు. అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. 480 ఎకరాల భూములిచ్చిన రైతులకు రూ.37.18 కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ కట్టిస్తుందని లేదన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నం చేయొచ్చని మాత్రమే ఉందని స్పష్టం చేశారు. -
విష నాలుకలు.. నీచ నాయకులు...
నవ్విపోదురు గాక.. అని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. ఎవరేమనుకోనీ గాక.. అని కూడా ముక్తాయిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు తమ అనుభవాన్ని, తాము అధిష్టించిన పదవుల గొప్పతనాన్ని గాలికొదిలేస్తున్నారు. వీళ్లకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిస్సిగ్గుగా నాయకత్వం వహిస్తున్నారు. వీళ్లంతా కలిసి నోటికొచ్చిన తీరులో మాటలు విసిరేస్తున్నారు. అవతలివారు ఎవరన్నది కూడా చూడకుండా.. తాము ఏమంటున్నదీ ఆలోచించకుండా బురద జల్లుతున్నారు. అయితే ఆ విధంగా వీరు ఉన్న కొద్దిపాటి పరువును తామే నడిబజారులో దిగజార్చుకుంటున్నారు. జనం ఛీత్కారాలను దండిగా పోగు చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై ట్విట్టర్ వేదికగా అనుచితమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీరుపై సర్వత్రా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి మరణంపై ఇంత దారుణమైన ట్వీట్ చేశారంటే అచ్చెన్న రాజకీయంగా ఎంత దిగజారిపోయారో, ఎంత సంస్కార హీనంగా మాట్లాడారో ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని జనం ఆక్షేపిస్తున్నారు. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంను ‘ఆమదాలవలస నడిరోడ్డుపై గుడ్డలూడదీస్తాను’ అంటూ.. పరిషత్ ఎన్నికల రోజున పెనుబుర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేసిన సందర్భంలో పోలీసు అధికారులను దుర్భాషలాడిన కేసులో గురువారం అరెస్టై బెయిల్పై వచ్చిన తర్వాత పరుషపదజాలంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ దూషించారు. ►ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అచ్చెన్న, రవికుమార్లను చూస్తుంటే రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా? అని ముక్కున వేలేసుకున్న పరిస్థితి ఏర్పడింది. నోరు పారేసుకోవడం, అరెస్టులవ్వడం, బెయిల్పై విడుదల కావడం, మళ్లీ నోటికొచ్చినట్టు దురుసుగా, అసభ్యకరంగా మాట్లాడం వీరిద్దరికి అలవాటైపోయింది. వీరా మన నాయకులు అంటూ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఇంత హీనంగా వ్యవహరిస్తున్న నాయకులు మన జిల్లాకు చెందిన వారు కావడం బాధాకరమని అసహ్యించుకుంటున్నారు. అచ్చెన్నకు, కూన రవికి ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో నోరు పారేసుకున్నారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిపై దాడి ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో ‘ఏయ్ ఎవర్నువ్. ఎలా అరెస్టు చేస్తావ్. ఏమనుకుంటున్నావ్. ఎవర్నీ వదల్ను. మళ్లీ అధికారంలోకి వచ్చాక నేనే హోం మంత్రినవుతా..సంగతి తేలుస్తా..’ అని పోలీసు అధికారులను అచ్చెన్నాయుడు బెదిరించారు. ►ఏయ్ ఎగ్స్ట్రాలు చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు? నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? యూజ్లెస్ ఫెలో..’అంటూ అమరామతిలో పోలీసు అధికారులపై తీవ్ర పదజాలంతో అచ్చెన్న దూషించారు. ►ఈఎస్ఐలో రూ.150 కోట్ల మేర కుంభకోణం చేసి విచారణలో బయటపడి అరెస్టయితే...ఇది కక్ష సాధింపు అంటూ పోలీసులపై నోరు పారేసుకున్నారు. ఇలా అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ పోటీ పడి నోటికొచ్చినట్టు మాట్లాడి సిక్కోలు జిల్లా గౌరవాన్ని మంట కలిపేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. జిల్లా వాసులు ఎక్కడున్నా మంచి ప్రవర్తన, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తారు. వినయంగా మాట్లాడతారు. కానీ జిల్లాకు మచ్చ తెచ్చేలా అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ మాట్లాడుతుండటంపై ప్రజలు ఛీకొడుతున్నారు. వీరికి మంచి బుద్ధి ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. తీరు మారని కూన.. అచ్చెన్నాయుడి కన్నా తానేమీ తక్కువ కాదన్నట్టుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ దురుసుగా మాట్లాడుతున్నారు. ‘ఏయ్ జాగ్రత్త.. శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. మీ స్థాయి ఎంత..మీరు ఎంత..’ అని నరసన్నపేట సీఐ, ఎస్లను ఉద్దేశించి రవికుమార్ గతంలో తీవ్ర పదజాలంతో మాట్లాడారు. ►పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు. ‘.. నువ్వు గనక బిల్డింగ్ దగ్గరకు వస్తే నీ సంగతి చూస్తా’ అని కూన బెదిరించారు. ►‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తాను..’ అంటూ పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చారు. ►‘నీకెంత ఒల్లు బలిసింది... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు ’ అంటూ మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న పొందూరు తహశీల్దార్ను పరుష పదజాలంతో బెదిరించారు. చదవండి: కూన తీరు మారదు.. పరుగు ఆగదు! ‘కూన’ గణం.. క్రూర గుణం -
టీడీపీపై కామెంట్లు.. అచ్చెన్నాయుడు వీడియో వైరల్
సాక్షి, అమరావతి : తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అచ్చెన్నాయుడు, మరో టీడీపీ నేతకు మధ్య జరిగిన సంభాషణ వీడియో అది. ఆ వీడియో టీడీపీ దుస్థితికి అద్దం పడుతోంది. పార్టీ క్యాడర్ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని సదరు టీడీపీ నేత.. అచ్చెన్నాయుడు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తండ్రీకొడుకుల తీరును ఎండగట్టాడు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. లోకేష్ను ఉద్దేశించి ‘ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు’ అని అన్నారు. అనంతరం ‘పార్టీ లేదు.. బొక్క లేదు’ అంటూ ఆ టీడీపీ నేతకు వత్తాసు పలికారు. -
వైరల్గా అచ్చెన్నాయుడు వీడియో
-
ఆటవికం.. అరాచకం: ఇదీ అచ్చెన్నాయం!
తమ మాట కాదంటే కక్ష.. ఎదురుతిరిగినందుకు ఆంక్ష.. కట్టుబాట్లను ధిక్కరించారంటూ వెలి పేరుతో శిక్ష. ఏనాడో పెత్తందారీ రాజ్యంలో కొనసాగిన అకృత్యాలకు సాక్ష్యాలివి. అరాచకాలకు అద్దం పట్టే దారుణాలివి. ఆనాటి దురాగతాలకు తెరపడిందని లోకం భావిస్తూ ఉంటే.. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ ఈ పోకడలు కొనసాగుతున్న ఉదంతాలున్నాయి. మన మధ్యే ఉన్న కొందరు తమకెదురు నిలిచిన వారిపై సామాజిక బహిష్కరణ కొరడా ఝుళిపిస్తున్న పరిణామాలు నివ్వెరపరుస్తున్నాయి. కింజరాపు కుటుంబీకుల పిడికిల్లో ఉన్న నిమ్మాడలో ఇటువంటి సంఘటనలు గతంలో సమాజం దృష్టికి వచ్చాయి. తాజాగా.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎదురుతిరిగిన అప్పన్నకు ఇదే అనుభవాన్ని పెత్తందార్లు రుచి చూపిస్తూ ఉన్నట్లు వస్తున్న వార్తలు అచ్చంగా.. అకృత్యాలకు సాక్ష్యమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు స్వగ్రామంలో ఆటవిక పాలన అమలవుతోంది. తన కబంధ హస్తాల నుంచి గ్రామాలు చేజారిపోకుండా ఉండేందుకు నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారు. గ్రామంలో వారికి వ్యతిరేకంగా నిలిస్తే చాలు.. కనిపించకుండా చేయడం లేదంటే సామాజిక బహిష్కరణ చేయడం అలవాటుగా మారిపోయింది. అచ్చెన్న కుటుంబీకులను వ్యతిరేకించిన, ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులెంతో మంది కనుమరుగయ్యారు. ఆకస్మికంగా మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో కుటుంబాలు సామాజిక బహిష్కరణకు గురయ్యాయి. రెండేళ్ల క్రితం వరకు గ్రామ బహిష్కరణల పర్వం నడిచిన నిమ్మాడలో తాజాగా సర్పంచ్ ఎన్నికల తర్వాత కూడా అదే సీన్ పునరావృతమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారికి పోటీగా నిలిచిన కింజరాపు అప్పన్న ను కూడా సామాజిక బహిష్కరణ చేశారు. అప్పన్నతో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదు. కుల వృత్తుల వారిని వెళ్లనివ్వడం లేదు. దిక్కు లేని హక్కులు.. హక్కులకు ఇక్కడ దిక్కు లేకుండా పోతోంది. అచ్చెన్న కుటుంబానికి ఎదురు తిరిగి బహిష్కరణకు గురైన వారి ఇళ్లల్లో చావు పుట్టుకలకు ఎవరూ వెళ్లకూడదు. రజకులు, నాయిబ్రాహ్మణులు వారి పనులు చేయకూడదు. చివరకు వారి పంట పొలాల్లో పనులకు సైతం కూలీలు వెళ్లకుండా చేస్తున్నారు. గ్రామంలో ఉన్న బీడు భూములే అందుకు నిదర్శనం. పంట భూములు ఉన్నప్పటికీ బాధితులు మూడు పూటలా తిండి కోసం విలవిలలాడాల్సిన పరిస్థితులు ఉన్నా యి. సంవత్సరాల తరబడి సుమారు 26 కుటుంబాలపై ఇదే రకంగా కక్ష సాధింపుగా వ్యవహరించారు. తమపై ఎదురు తిరిగితే వారికి ఇదే గతి పడుతుందంటూ చేసి చూపిస్తున్నారు. భార్య మేనమామతో మొదలై... అచ్చెన్నాయుడు భార్య మేనమామ కింజరాపు గణపతి తొలుత సామాజిక బహిష్కరణ ఎదుర్కొన్నా రు. మొదటి నుంచి కాంగ్రెస్ వాది అయిన గణపతి తమకు వ్యతిరేకంగా నిలిచారని సామాజిక బహిష్క రణ చేసిన అచ్చెన్న కుటుంబం ఆ తర్వాత వరుసగా 26 కుటుంబాలపై తమ దుశ్చర్యను ప్రదర్శించింది. తాజాగా ఆ జాబితాలో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో అచ్చెన్న కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసిన కింజరాపు అప్పన్న చేరారు. ఇప్పటికే మెండ రామ్మూర్తి అనే రైతు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన 18 ఎకరాల భూములను అచ్చెన్నాయుడు అండతో సోదరుడు కింజరాపు హరిప్రసాద్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. తాను చెప్పిన ధరలకు భూములు అమ్మకాలు చేయాలనే జారీ చేసిన హుకుంను తిరస్కరించాడనే కక్షతో సుమారు 12 ఏళ్లుగా రామ్మూర్తి కి చెందిన భూములను కొర్నుగా మార్చేశారు. రా మ్మూర్తి చిన్న కుమారుడు మెండ హరిని తన గుప్పె ట్లో పెట్టుకుని రామ్మూర్తిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. మరో కుమారుడు గ్రామాన్ని వదిలి పో యే విధంగా అతనిపై దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. తాజాగా కింజరాపు అప్పన్నకు అదే పరిస్థితిని తీసుకొచ్చారు. నాయీ బ్రాహ్మణులు, రజకులెవరూ వారికి ఇంటికి వెళ్లొద్దని, పొలం పనులు చేయవద్దని కూలీలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో రెండెకరాల మినప చేనును పొలంలో వదిలేసిన దుస్థితి చోటు చేసుకుంది. పొలంలోకి ట్రాక్టర్ను కూడా వెళ్లనివ్వకుండా తనకు ముందున్న పొలాల రైతులకు హకుం జారీ చేశారు. అప్పన్న పొలానికి ముందు కంచె వేసేయాలని రైతులను ఆదేశించారు. చదవండి: అచ్చెన్న ‘రాజ్యం’లో అరాచకం కుప్పం పర్యటన: చంద్రబాబుకు ఊహించని దెబ్బ.. -
అచ్చెన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో..
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని, ఇప్పటికే ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ కూడా రాశారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు, టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. పోస్కోతో కలిసినంత మాత్రాన లాలూచీ పడినట్లు కాదని, 2014 లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చర్చలు జరగలేదా..?. 2018లో పోస్కో ప్రతినిధులు చంద్రబాబును కలవలేదా అని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, సీఎం జగన్పై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని మంత్రి అవంతి హెచ్చరించారు. రెండు సార్లు జైలుకెళ్లొచ్చినా అచ్చెన్నాయుడికి ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. స్టీల్ప్లాంట్పై తమ పార్టీ విధానం స్పష్టంగా ఉందన్నారు. స్టీల్ప్లాంట్పై చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు ఆ బాధ్యత లేదా, ప్రధాని లేఖ రాసే ధైర్యం లేదా అని దుయ్యబట్టారు. దీక్షలు చేస్తున్న నేతలను ఎందుకు టీడీపీ నేతలు పరామర్శించలేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలని అవంతి హితవు పలికారు. ఈ నెల 20న స్టీల్ప్లాంట్ కోసం మహా పాదయాత్ర చేస్తున్నామని.. ఆ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. (చదవండి: కలెక్టర్ వినూత్న శైలి: ఆ నోటీస్లో ఏముందంటే..) తిత్లీ పాపం.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. -
‘ఎవరెన్ని డ్రామాలు చేసినా.. గెలుపు మాదే’
సాక్షి, నెల్లూరు: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీనే అడ్డదారులు తొక్కుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, స్వయానా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లే అరాచకాలు చేస్తూ నిందలు తమపై వేయడం సిగ్గుచేటన్నారు. (చదవండి: ప్రవీణ్ ప్రకాష్ బదిలీకి సర్కారు ‘నో’) మూన్నాళ్లు వుండే ఓ వ్యక్తి అండ చూసుకొని చంద్రబాబు రెచ్చిపోతున్నారని.. పల్లెలు ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం లేదని మంత్రి అనిల్ ఆరోపించారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా.. పంచాయితీ ఎన్నికల్లో 90 శాతం పైగా గెలుపు వైస్సార్సీపీదేనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.(చదవండి: కాపీల రాయుడు.. చంద్రబాబునాయుడు) -
‘అప్పుడు గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?’
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భయపడుతున్నారని వ్యాఖ్యానించడం అవివేకమన్నారు. ప్రజల ప్రాణ, రక్షణ దృష్ట్యా వేసవి కాలంలోనే ఎన్నికల నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. (చదవండి: ‘ఆయనొక గాలి నేతగా మిగిలిపోయారు’) టీడీపీ నేతలకు సవాల్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 90 శాతం పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. కార్మికుల సొమ్మును దోచుకుతినే అచ్చెన్నాయుడు, గాలి నాయుడు, ఫేక్ పార్టీ నాయకులు ఎవరైనా తన సవాల్ స్వీకరించాలని కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణలో మాదిరే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కనుమరుగు కాక తప్పదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి: 'కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారు') నిమ్మగడ్డకు ఆ హక్కు లేదు.. గవర్నర్కు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై కూడా మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. చంద్రబాబు బూట్లు నాకే నిమ్మగడ్డకు ఎన్నికలు నిర్వహించే హక్కు లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని, ప్రజలను, గవర్నర్ను లెక్కచేయని నిమ్మగడ్డ రమేష్ను ఎన్నికల కమిషనర్గా తాము గుర్తించమని పేర్కొన్నారు. 2018 జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించాల్సిన నిమ్మగడ్డ.. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాల పాటు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నాడా అంటూ ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు తానా అంటే తందానా అనే నిమ్మగడ్డ రమేష్ చెప్తే, మేము ఎన్నికలు నిర్వహించాలా చంద్రబాబు బినామీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని’’ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. -
అచ్చెన్నాయుడు డూడూ బసవన్నేనా?
తిరుపతి లోక్సభకు జరగనున్న ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీలకు చెందిన అచ్చెన్నాయుడిని చేశామని టీడీపీ గొప్పలు చెప్పుకొంటోంది. మరి, తిరుపతి లోక్సభకు ఉప ఎన్నికలో, పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థిని ప్రకటించడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పేరు, ప్రమేయం ఎక్కడా కనబడకపోవడం విచిత్రం. బీసీ తదితర పీడిత కులాలకు చెందిన వ్యక్తులు ఏ స్థానంలో ఉన్నా ఆధిపత్య కుల పార్టీల నాయకుల వ్యవహారశైలి ఎలా ఉంటుందో, బహుజన వర్గాల వ్యక్తుల పదవులు ఎంతటి డొల్ల పదవులో చంద్రబాబు తాజా ప్రకటన బహిర్గతం చేస్తోంది. ‘గులాంగిరీ’కి అలవాటు పడిపోయిన అచ్చెన్నాయుడు ఉలకడు, పలకడు. మరిప్పుడూ ‘డూడూ బసవన్న’లాగే తల ఊపుతాడా? అణచబడ్డ కులాల యెడల ఆధిపత్య కులాల పార్టీల నాయకులు ఒలకపోసే ప్రేమలూ, అభిమానాలూ, పొగడ్తలూ, లేదా, విదిలించే పదవులూ, రాయితీలూ–అన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో అంతర్భాగమే. కనుక బహుజనులు డొల్ల పదవులూ, తాత్కాలిక రాయి తీలతో సంతోషించకుండా, ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన దిశగా సాగిపోవాలి. వై. కె., సామాజిక న్యాయ కేంద్రం, రాష్ట్ర కన్వీనర్, సెంటర్ ఫర్ సోషల్ జస్టీస్ మొబైల్ : 98498 56568 -
టీడీపీ ఏపీ దాటి తెలంగాణ చేరింది..
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీది ముగిసిన అధ్యాయం అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ జాతీయ పార్టీయో... జాతి పార్టీయో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు. విష్ణువర్ధన్రెడ్డి గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘టీడీపీలో కొత్త ఉద్యోగంలో చేరిన అచ్చెన్నాయుడు మాకు సలహాలిస్తున్నారు. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్న రీతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. టీడీపీ ఏపీ దాటి తెలంగాణ చేరింది. బీజేపీకి ఉచిత సలహాలు, సూచనలు అవసరం లేదు. చంద్రబాబు హయాంలో 40 ఆలయాలు కూల్చేశారు. (‘అప్పుడు అంతు చూస్తా, తోక కోస్తా అన్నారు’) ఇక మా భుజాల మీద మిమ్మల్ని మోసే శక్తిలేదు. బీజేపీది రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర. పూటకోమాట మాట్లాడే తీరు టీడీపీ నాయకుది. మీ పార్టీ ఏపీ దాటిపోయి తెలంగాణ చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఉంటూ హైదరాబాద్ వరదలపై నోరు మెదపని నాయకుడు చంద్రబాబు. దోచేసి రెస్ట్ తీసుకుని బయటకు వచ్చిన నాయకుడు ఆయన. బీజేపీకి ఉచితం సలహాలు సూచనలు అవసరం లేదు. 50 వేల ఖరీదు చీర కట్టుకుని ఉద్యమాలు చేసే నాయకురాలు కూడా మమ్మలి విమర్శిస్తున్నారు. స్క్రోలింగ్ వీరుడు మరొకరు ఉదయం అరున్నరకే లేచి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తారు. మరొకరు తానే మేధావి అన్నట్లు మాట్లాడుతారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. (మొన్న గౌతు శిరీష.. నేడు ప్రతిభా భారతి) -
అచ్చెన్నాయుడి విషయంలో టీడీపీది దుష్ప్రచారం
-
జేసీ, అచ్చెన్నాయుడు నోరు విప్పితే..
సాక్షి, తిరుపతి: అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్రెడ్డి అవినీతి చేసి అడ్డంగా దొరికి పోయారని.. వీళ్లు నోరు విప్పితే చంద్రబాబు, లోకేశ్ల బండారం వెలుగు చూస్తుందని ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జేసీ, అచ్చెన్నాయుడు నోరు విప్పితే వారి బండారం అంతా బయట పడుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేశ్ భయపడుతున్నారన్నారు. అందుకే వారు కుడితిలో పడ్డ ఎలుకల్లా గిల గిల కొట్టు కుంటున్నారని.. విజయవాడ, అనంతపురానికి పరుగులు తీసున్నారని ఎద్దేవా చేశారు. ( అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం ) అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిని బుజ్జగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము నిప్పు అని చెప్పుకునే టీడీపీ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. కరోనా వైరస్తో జనం అల్లాడుతుంటే చంద్రబాబు ఒక్కరోజు కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ నుంచి రావడానికి తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పుకున్న ఆయన మరి ఇప్పుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా నిస్తుంటే నిబంధనలు పాటించలేదని వైఎస్సార్సీపీ నాయకులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఎలా వచ్చారని నిలదీశారు. ఇది చంద్రబాబు నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమని రోజా విమర్శించారు. (ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ) -
‘వచ్చే ఏడాది మహానాడు జైలులోనే’
సాక్షి, విశాఖపట్నం: పేదల సొమ్మును టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, కొందరు అధికారులు పందికొక్కుల్లా తిన్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ ధ్వజమెత్తాడు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాక ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి టైం దొరకని చంద్రబాబుకు, ఒక దొంగను అరెస్ట్ చేస్తే పరామర్శించడానికి టైం దొరికిందా అని ప్రశ్నించారు. అచ్చెంనాయుడు అరెస్ట్ను కిడ్నాప్గా అభివర్ణిస్తూ, రాజకీయం చేసి కులాలకు ఆపాదించారని, అవినీతికి కులం, మతం ఉండదని చంద్రబాబుకు తెలుసన్నారు. చంద్రబాబు హయంలో హెచ్పీసీఎల్, ఒఎన్జీసీ ఘటనలు జరిగిన బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. (ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ) తన సొంత ప్రయోజనాల కోసం, పబ్లిసిటీ కోసం గోదావరీ పుష్కరాల్లో 29 మందిని బలితీసుకున్నా టీడీపీ తరుపున ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్ బాధిత ప్రాంతంలో నివసిస్తున్న 20 వేల జనాభాను ఆదుకుందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఆరు లక్షల కోట్ల అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. తాను చేసిన అరాచకాలు, అన్యాయాలు మర్చిపోయి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజల మీద ఉన్నది సవతి ప్రేమ అని, ఆయన అక్రమాలను తెలుగు ప్రజలు మర్చిపోరు అని అన్నారు. మొన్న మహానాడునను జూమ్ యాప్లో చేసుకున్న చంద్రబాబు వచ్చే ఏడాది జైలులో చేసుకోవాల్సిందే అని అమర్నాధ్ ఎద్దేవా చేశారు. (అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం) -
‘ఎర్రన్నాయుడు బాబును ప్రాధేయపడ్డారు’
సాక్షి, అమరావతి : ‘కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత ఫీల్డ్ కొస్తా.. అంతు చూస్తా’. అని చిటికెలేసిన ఉత్తర కుమారుడు ముందే వచ్చాడు.. వెళ్లి పోయాడు. ఏదీ, ఏం జరగలేదే? కూసాలు కదులుతుంటే పొంతన లేకుండా మాట్లాడటం కామన్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. నారా లోకేష్ బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ అచ్చెన్న తమ గుట్లన్నీ బయటకు కక్కుతాడేమో అన్న భయంతో అబ్బా కొడుకులకు నిద్ర పట్టడం లేదంట. ( ‘ఆంధ్రజ్యోతి కిట్టు మారడు’) అచ్చెన్న అరెస్టును బీసీల అణచివేతగా రంగు పులుముతున్న చంద్రబాబు గారు ఆ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మర్చినట్టున్నారు. 2002లో బాలయోగి గారి దుర్మరణంతో, లోక్ సభ స్పీకర్ పదవికి తనను ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డాడు. ఎదిగి పోతాడన్న భయంతో ఏ పోస్టు దక్కకుండా చేశాడు ‘విజనరీ’’ అంటూ ఎద్దేవా చేశారు. -
అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిలకడగానే ఉంది
-
స్కాం చేయలేదని చట్టప్రకారం నిరూపించుకోవాలి
-
రూ 150 కోట్ల మేర అవినీతి జరిగింది
-
బాబుకు రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేదు
సాక్షి, పశ్చిమ గోదావరి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వక్రభాష్యంతో రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. 2014 నుండి 2018 వరకు ఈఎస్ఐలో జరిగిన అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలతో ఏసీబీ అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుందన్నారు. అచ్చెన్నాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేస్తే.. కిడ్నాప్ చేశారనటం దారుణమన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం బీసీ కార్డ్ను వాడుకుంటున్నారన్నారు. ఈఎస్ఐలో 150 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగిందని అన్నారు. గతంలో డిమ్స్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తిని, అతని కుమారున్ని, అచ్చెన్నాయుడిని ఉదయం అరెస్టు చేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చెయ్యదని, పక్కా ఆధారాలతో అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న దేవరపల్లి టు జీలుగుమిల్లు రహదారి మోక్షం కలిగిందన్నారు. హైవే నెంబర్ 516డి పునర్ నిర్మాణ పనులకు 160 కోట్లు రెండు విడతలుగా మంజూరు అయిందని తెలిపారు. మొదటి విడతగా 94 కోట్ల విలువ గల రోడ్ల నిర్మాణం పనులు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. -
బీసీల మీద బాబుది సవతి ప్రేమ
-
అవినీతి చేసి కులాలను పైకి తీసుకొస్తున్నారు
-
ఆ బురద మాకు కూడా అంటిస్తారా?
సాక్షి, విశాఖ : విజిలెన్స్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ మందుల కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..‘టెలీ మెడిసిన్ విషయంలో ప్రధానమంత్రి చెబితేనే చేశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదం. కేంద్రం అభివృద్ధి పనులపై రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది కానీ అవినీతి చేయమని చెప్పదు. టీడీపీ నేతలు తినడానికి అలవాటు పడ్డారు. మరో రాష్ట్రంలో తప్పు జరిగిందని అదే తప్పులు చేస్తాం అనడం సరికాదు. తినడానికి అలవాటు పడ్డారు అది మందులు కావచ్చు...మరేదైనా సరే అది దోచుకోవడమే. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!) చంద్రబాబు నాయుడుకి దగ్గర అవడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక వార్డులో బీజేపీ నుంచి 300మంది నాయకులు టీడీపీలో చేరిపోయారని గంటా ప్రచారం విడ్డూరంగా ఉంది. టీడీపీ దూరం పెట్టిందని గంటా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గంటా కారు నంబర్ 1..అలాగే తప్పుడు ప్రచారం చేయడంలో కూడా ఆయన నంబర్ వన్. ఇలాంటి నాయకులను నమ్మడం వల్లే చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు దక్కాయి. టీడీపీ చేరినవారంతా రూ.250 బ్యాచ్’ అని వ్యాఖ్యానించారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) చంద్రబాబు పాత్రపైనా విచారణ చేయాలి ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘అచ్చెన్నాయుడు అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టే మోదీ పేరు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అవినీతి బురద బీజేపీకి అంటించాలని చూస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలి. టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు...ఈఎస్ఐకి రాసిన లేఖకు పొంతన లేదు’ అని అన్నారు. ఈఎస్ఐ స్కాం: వారిని శిక్షించాలి.. విజయవాడ: మరోవైపు ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు చెందిన కోట్లది రూపాయల నిధులు దిగమింగిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలతో పాటు అధికారులను శిక్షించాలంటూ విజయవాడ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం శనివారం ఆందోళనకు దిగింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి ఈఎస్ఐ అభివృద్ధికి వెచ్చించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చందాదారులైన ఉద్యోగ,కార్మికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవినీతి నుంచి తప్పించుకునేందుకు కులం కార్డు వాడటం ఏంటని ప్రశ్నించారు. -
ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు
-
‘దాడులకు భయపడే బాబు తెలంగాణకు పారిపోయారు’
సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి సారేపల్లి సుధీర్ కుమార్ విమర్శించారు. చుట్టగుంటలో పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు తన పీఎస్గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్పై జరిగిన ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడిలో బయటపడ్డ అవినీతి సొమ్ము ఎక్కడిదో చెప్పాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారని మాట్లాడిన అచ్చెం నాయుడు ఐటీ దాడులు అనేవి కేంద్రం పరిధిలో ఉంటాయన్న సంగతి కూడా తెలియకుండా ఎలా ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ 8 నెలల పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఇమేజ్ రోజు రోజుకు డ్యామేజ్ అవుతుందని విమర్శించారు. ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయని భయపడి బాబు తెలంగాణకు పారిపోయారని విమర్శించారు. టీడీపీ బినామీలను అదుపులోకి తెస్తే 10 సంవత్సరాల రాష్ట్ర బడ్జేట్ సొమ్ము బయటకు వస్తుందన్నారు. కేంద్రం స్పందించి ప్రజాధనాన్ని వెలికితీయాలని కోరారు. టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసిన సీఎం జగన్కు ప్రజాభిమానం తగ్గదని ఆయన స్పష్టం చేశారు. అందుకే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లింది.. చంద్రబాబు, లోకేశ్ పలకరేం!? -
టీడీపీ ఒక అబద్దాల ఫ్యాక్టరీ
-
దిశా నిర్దేశం
-
సన్న బియ్యం అన్న మాటే లేదు
-
రోడ్డు ప్రమాదంలో అచ్చెన్నాయుడికి గాయాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్ర వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి, టీడీపి నేత కింజరాపు అచ్చె న్నాయుడు గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అచ్చెన్నాయుడికి స్వల్ప గాయాలయ్యాయి. అమరావతి నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా నక్కపల్లి జంక్షన్ వద్ద రాత్రి 10.15 గంటల సమయంలో అడ్డుగా వచ్చిన మోటారు సైకిల్ను తప్పించే ప్రయత్నంలో కారు డ్రైవర్ డివైడర్ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అచ్చెన్నాయుడిని పోలీసులు నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయన శ్రీకాకుళం బయల్దేరారు. -
అరుస్తున్న అచ్చెన్న..రెచ్చిపోతున్న ‘రవి’
‘చెప్పింది చెయ్యరా.. పనిచెయ్యడం ఇష్టం లేకపోతే సెలవులు పెట్టి వెళ్లిపోండి. నియోజకవర్గంలో నాకు తెలీకుండా ఏ పనీ జరగకూడదు. జాగ్రత్త. పద్ధతులు మార్చుకోండి’ – ఈ నెల 24న కోటబొమ్మాళి మండల ప్రత్యేకాధికారి కార్యాలయ గదులు మూసి వేసి మరీ టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎంపీడీఓ రాజేశ్వరమ్మకు ఇచ్చిన వార్నింగ్ ఇది. ‘నాకు రెస్పాండ్ అవ్వకపోతే రేపటి నుంచి మీ సీట్లో కూర్చుంటా. ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఆఫీస్లోనే తలుపులు వేసి మరీ బాదేస్తా.’ అం టూ సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరరావుపై. . ‘నువ్వు రాజకీయాలు చెయ్యకు. నీకు తెలిసింది రూల్ కాదు. నేను చెప్పిందే రూల్. నేను చెప్పింది చెయ్యకపోతే. వాట్ ఐ యామ్ అనేది చూపిస్తా’ అంటూ ఓ మహిళా పంచాయతీ కార్యదర్శిపై.. – ఈ నెల 26న ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ దాదాగిరీ చెలాయించిన తీరు ఇది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పై రెండు ఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది కదా టీడీపీ అగ్ర నేతల అసలు స్వరూపం. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై పరుషంగా మాట్లాడమే కాకుండా ఏకంగా ఈ ఇద్దరు టీడీపీ అగ్రనేతలు ప్రభుత్వ కార్యాలయాల తలుపులు వేసి మరీ ప్రత్యక్ష బెదిరింపులకు దిగడం చూస్తుంటే ఇంకా వీరి తీరు మారలేదని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. చింత చచ్చినా.. పులుపు చావలేదన్నట్లుగా వీరి వ్యవహారం తయారైంది. ఐదేళ్ల పాటు కీలక పదవుల్లో అధికారం చెలాయించిన వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులపై, మహిళలపై కూడా అప్పట్లో తమదైన శైలిలో రౌడీయిజాన్ని ప్రదర్శించిన సంగతి జిల్లా వాసులకు తెలిసిందే. అయితే ఇలాంటి దుర్మార్గ పాలన రాష్ట్రమంతా ఉండడంతో పాటు అక్రమాలు, అవినీతి పాలన అందించడంతో ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారు. అయినా వీరి తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఏకవచన ప్రయోగాలతో పాటు అవమానకర ప్రవర్తన చేస్తూనే మానసికంగా కుంగదీసేలా పరుష పదజాలంతో తిట్టడం వంటి ఘటనలతో ఉ ద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలతో పాటు జిల్లా వాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్న తనపై ప్రత్యక్షంగా బెదిరించడంపై బాధిత ఎంపీడీఓ దా మోదరరావు సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఇదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగడం మంచి విధానం కాదని, వెంటనే బాధిత ఉద్యోగులకు మాజీ విప్ రవికుమార్ క్షమాపణలు చెప్పాలంటూ ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహరంపై జిల్లా ఉన్నతాధికారుల సమాచారం మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా పరిగణించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అరుస్తున్న అచ్చెన్న.. టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో అధికారులపై తీవ్రంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. గత ఐదేళ్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఈయనకు మండల స్థాయి అధికారులతో ఎలా మాట్లాడోలా తెలీకపోవడం దారుణమని ఉద్యోగుల సంఘం విమర్శిస్తోంది. ఈనెల 24న కోట బొమ్మాళి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి కార్యాలయంలో తలుపులు వేయించి మరీ అచ్చెన్నాయుడు ఎంపీడీఓ రాజేశ్వరమ్మపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు తెలీకుండా వలంటీర్లను నియమించారని, సమాచారం ఇవ్వలేదని, అలాగే పింఛన్లు ఎలా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారిపైన, జలవనరుల శాఖ అధికా రులపైనా ఇలాగే విరుచుకు పడుతూ తన మాట వినకపోతే సెలవులు పెట్టి వెళ్లిపోండని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్యాలయ తలుపులు వేసి బెదిరింపులకు దిగారు. గతంలో కూడా మంత్రి హోదాలో జిల్లాలో చాలా మంది అధికారులపై, ఉన్నతాధికారులను సైతం ఏకవచన ప్రయోగం, పరుష పదజాలంతో మండిపడటం, బెదిరిం చడం తెలిసిందే. టెక్కలి డివిజన్కు చెందిన ఓ ఆర్అండ్బీ ఉద్యోగినిపై కూడా చెయ్యిచేసుకోవడం కూడా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అయితే నాటి తీరునే ఇప్పటికీ ప్రదర్శించడంపై ఉద్యోగుల సంఘ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోటబొమ్మాళి మండలంలోనే పలు బూత్లను రిగ్గింగ్ చేయించి మరీ ఎమ్మెల్యేగా గెలిచారనే ఆరోపణలు అచ్చెన్నపై ఉన్న సంగతి తెలిసిందే. రెచ్చిపోతున్న ‘రవి’ ప్రభుత్వ విప్గా గత ఐదేళ్లుగా ఓ రేంజ్లో ఇసుక, భూ అక్రమాలకు పాల్పడిన కూన రవి కుమార్ తాజా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఏమాత్రం తీరు మార్చుకోలేదు. ఇసుక రీచ్ల్లో అక్రమాలకు పాల్పడి వరదల పుణ్యమా అని అడ్డంగా బుక్కైన కూన రవి ఇప్పుడు కూడా అదే తీరులో దాదాగిరీ చేస్తున్నారు. అధికారులపై ఏకంగా తిట్ల దండకం పాడుతున్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తాజాగా ఈనెల 26న సరుబుజ్జిలి మండల పరిషత్ కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమంలో విధుల్లో ఉన్న ఎంపీడీఓ దామోదరరావును, అక్కడే ఉన్న ప్రత్యేకాధికారి, ప్రాజెక్టు అధికారిపైన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ‘తలుపులు వేసి బాదేస్తా.. చెట్టుకు కట్టి కాల్చేస్తా’ అంటూ రెచ్చిపోయారు. ‘వాట్ ఐ యామ్...అనేది తెలిసే మాట్లాడుతున్నావా’ అంటూ ఓ గ్రామ కార్యదర్శిని ఫోన్లో బెది రించడం కూడా తీవ్ర సంచలనంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఇంకా తానే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును అంతా ఖండిస్తున్నారు. ‘నీకు తెలిసింది రూల్ కాదు...నేను చెప్పిందే రూల్..’ అంటూ అధికారులపై జులుం చెలాయించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నారు. ఫలితంగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎందరో టీడీపీ నేతలు ఇలాగే అధికారులపైన, సమస్యల పరిష్కారం కోసం అడిగిన బాధితులపైన కూడా విరుచుకుపడటం తెలిసిందే. ఈ ప్రభావంతోనే ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైనా ఆ నేతల తీరు మారకపోవడం గమనార్హం. తీరు మార్చుకోకపోతే చట్టరీత్యా తీవ్ర పరిణామాలు ఎదురుకాక తప్పదు. -
సబ్ప్లాన్ పేరుతో ఓ బోగస్ బిల్లు..
సాక్షి, అమరావతి: కీలకమైన బీసీ సబ్ప్లాన్ బిల్లుపై కనీస కసరత్తు చేయకుండా టీడీపీ సర్కారు మొక్కుబడిగా గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. బీసీ సబ్ప్లాన్కు ఎంత కేటాయిస్తారు? ఏ ప్రాతిపదికన? జనాభానా? రిజర్వేషన్లా? అనే కనీస వివరాలు లేవు. అసలు బిల్లులో అంకెలే లేవు. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ సొంత పార్టీ సభ్యులే సభలో నిలదీయడంతో సర్కారు ఇరుకున పడింది. బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత పేరుతో ఓ బోగస్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సొంత ఎమ్మెల్యేలు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. బీసీ జనాభా ప్రాతిపదికన ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారా? లేక రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారా? అని టీడీపీ ఎమ్మెల్యేలే సభలో సూటిగా అడగడంతో జవాబు చెప్పలేక బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు డొంక తిరుగుడుగా మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బీసీ సబ్ప్లాన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వివరాలు లేకుండా దీన్ని సభ్యుల ముందు ఉంచడంపై స్వపక్షం నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సబ్ప్లాన్కు ఏ ప్రాతిపదికన నిధులు కేటాయిస్తారనే వివరాలు లేవు. ఎంత మొత్తం కేటాయిస్తారో వెల్లడించలేదు. అసలు బిల్లులో ఆ అంకెలు ఎక్కడా లేకపోవడం గమనార్హం. కాసేపు జనాభా దామాషా ప్రకారం అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. మరి చట్టంలో ఇదే అంశాన్ని ఎందుకు చేర్చడం లేదని సభ్యులు ప్రశ్నించారు. బడ్జెట్లో 50 శాతం నిధులు సబ్ప్లాన్కు కేటాయించాలని సొంత సభ్యులే పట్టుబట్టడంతో కంగుతిన్న మంత్రి అచ్చెన్న న్యాయ సలహా తీసుకున్న తరువాత బిల్లును ఆమోదిద్దామని పేర్కొనడంతో బీసీ సబ్ప్లాన్పై చర్చను స్పీకర్ అర్థంతరంగా ఆపేయడం గమనార్హం. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సర్కారు నిర్వాకాన్ని ఎండగట్టడంతో దిక్కుతోచక బడ్టెట్లో 1/3 శాతం కేటాయిస్తామంటూ ఓ కాగితం ముక్కపై రాసి సభలోకి హడావుడిగా పంపి సర్కారు ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు మంత్రి అచ్చెన్నాయుడు సభలో మాట్లాడుతూ బీసీల జనాభా 50 శాతం ఉందని, అందుకు తగ్గట్టుగా కేటాయింపులు చేస్తామని గంభీ రంగా ప్రకటించారు. బీసీలపై టీడీపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదనటానికి అంకెలు లేని ఈ బిల్లే ఉదాహరణ అని పరిశీలకులు పేర్కొంటున్నారు. క్లారిటీ లేకుండా బిల్లా? స్పష్టత లేకుండా సబ్ప్లాన్ బిల్లు ఉందని, అసలు అంకెలే లేవని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ.. కూన రవికుమార్ ప్రస్తావించిన అంశాలను బలపరిచారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తామని మంత్రి అచ్చెన్న చెప్పడంతో 50 శాతం నిధులు సబ్ప్లాన్కు కేటాయించాలి, అదే విషయం చట్టంలో చేర్చాలని రవికుమార్ మరోసారి పట్టుబట్టారు. ఈ సమయంలో ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ జోక్యం చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఇతరులు ఉన్నచోట ఖర్చుపెట్టే విషయంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయంటూ అసమగ్రంగా బిల్లుపెడితే ఎలా అని ప్రశ్నిస్తూ కూన రవికుమార్కు మద్దతు పలికారు. బిల్లుపై సరైన క్లారిటీ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మంత్రిని నిలదీశారు. ఇలా ఒకరి తరువాత ఒకరు మాట్లాడుతుండటంతో స్పీకర్ జోక్యం చేసుకుంటూ మీకే సమయం ఇస్తున్నానని తర్వాత చర్చిద్దామని సూచించారు. దీంతో న్యాయశాఖతో చర్చించిన తరువాత బిల్లు ఆమోదం పొందేలా చేద్దామని మంత్రి అచ్చెన్న అనటంతో బీసీ సబ్ప్లాన్పై చర్చను స్పీకర్ అర్ధంతరంగా ఆపేశారు. మౌనం దాల్చిన మంత్రులు.. సభలో ఒకదశలో అధికారపక్ష సభ్యులు ప్రస్తావించిన అభ్యంతరాలపై ఏం చెప్పాలో తెలియక మంత్రులెవరూ కాసేపు మాట్లాడకుండా మౌనం పాటించడం గమనార్హం. ఎటువంటి విలువ లేని, అసమగ్రమైన బీసీ సబ్ప్లాన్ను సభలో ప్రవేశపెట్టారనే విషయం ప్రజల్లోకి వెళ్తోందని గ్రహించిన స్పీకర్ చర్చను అర్థంతరంగా ఆపేశారు. ఆ తరువాత అరగంటపాటు కాపు రిజర్వేషన్, ఈబీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చిన రిజర్వేషన్లలో ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు కేటాయిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించారు. మిగిలిన ఐదు శాతం ఈబీసీలకు ఇస్తున్నట్లు మరో బిల్లును శాసనసభ ఆమోదించింది. రెండు వర్గాలుగా వర్గీకరిస్తూ బిల్లులు ఆమోదం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన కులాలకు (ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. అయితే దీన్ని రెండు వర్గాలుగా విభజిస్తూ కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లును గురువారం శాసన సభ ఆమోదించింది. అలాగే ఈబీసీల్లో మిగతా వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ మరో బిల్లును శాసన సభ ఆమోదించింది. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని చేసిన ఈ చట్టం ఎలా చెల్లుబాటు అవుతుందని అధికార వర్గాలే ప్రశ్నించడం గమనార్హం. జవాబు చెప్పలేక తడబడ్డ మంత్రి ఎన్నికల ముందు బీసీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న సర్కారు ఎటువంటి వివరాలు లేకుండా ప్రధానంగా బడ్జెట్లో ఎంత శాతం మేర సబ్ ప్లాన్కు కేటాయిస్తారనేది చెప్పకుండా బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించే బిల్లంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అబాసుపాలైంది. ఈ బిల్లుపై స్వపక్ష సభ్యులే పలు సందేహాలను వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక సబ్ప్లాన్పై చర్చను ముగించింది. వివరాలేమీ లేకుండా బీసీ సబ్ప్లాన్ బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసన సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టగానే ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చర్చలో పాల్గొంటూ బీసీ సబ్ప్లాన్ బిల్లులో ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టత లేదన్నారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 65 శాతం ఉన్నారని, రిజర్వేషన్ 27 శాతం ఉందని మరి సబ్ప్లాన్ నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నారా? లేక రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయిస్తున్నారా? అనే విషయంలో స్పష్టత లేదన్నారు. బడ్జెట్లో కేటాయింపు ఎంత? ఎలా కేటాయిస్తారు? అంటూ రవికుమార్ నిలదీయడంతో అచ్చెన్నాయుడు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తూ ‘మావాడికి తెలివితేటలు ఎక్కువయ్యాయి..’ అంటూ వ్యాఖ్యానించారు. కొసమెరుపు కాపులు, ఈబీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదిస్తున్నట్లు సభలో స్పీకర్ ప్రకటించిన సమయంలో అచ్చెన్నాయుడు చేతిలోకి ఓ కాగితం వచ్చింది. ఆ కాగితంలో ఉన్న వివరాలను చదువుతూ రాష్ట్ర బడ్జెట్లో1/3వ వంతు బీసీ సబ్ప్లాన్కు కేటాయిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీంతో బీసీ సబ్ప్లాన్ బిల్లును కూడా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడం కొసమెరుపు. -
ఫిబ్రవరి 6నుంచి ఏపీఎస్ ఆర్టీసీ సమ్మె !
-
ఫిబ్రవరి 6నుంచి ఏపీఎస్ ఆర్టీసీ సమ్మె !
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్మిక సంఘాల నేతలు ఆయనకు ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఐకాస సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సంస్థ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్మికులు సహకరించాలని కోరారు. గతంలో కార్మికులు అడిగినంత ఫిట్మెంట్ ఇచ్చామని చెప్పారు. ఆర్టీసీ ఇంకా నష్టాల్లోనే ఉందని ఆయన తెలిపారు. -
తాటి చెట్టంత మంత్రి ఈత కాయంత మేలు కూడా చేయలేదు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మంత్రి అచ్చెన్నాయుడు తాటి చెట్టంత ఎదిగినా, ప్రజలకు ఈత గింజంత మేలు కూడా చేయలేదని ప్రజలు చెబుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో ప్రతి పనికీ లంచం గుంజుతున్నారని ప్రజలు తనకు దారిపొడవునా చెబుతూ వచ్చారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 328వ రోజు శనివారం ఆయన టెక్కలి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘టెక్కలి గత చరిత్రను చూద్దాం. ఇదే నియోజకవర్గం నుంచి 1994లో ఎన్టీ రామారావును ఇక్కడి ప్రజలు గెలిపించారు. అదే సంవత్సరంలోనే జరిగిందేమిటో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు అయిపోగానే సొంత కూతురిని ఇచ్చిన మామను వెనుక నుంచి పొడిచిన వ్యక్తి ఇదే చంద్రబాబునాయుడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కూడా పొడుస్తూనే... ఉన్నాడు. అదే చంద్రబాబునాయుడి కొలువులో ఇక్కడి నుంచి ఎన్నుకోబడిన మంత్రి అవినీతి విశ్వస్వరూపం. ఆయనకు ఈపేరు కూడా ఇక్కడి నుంచే వచ్చిందని చెబుతుంటారు. మా మంత్రి తాటి చెట్టంత ఎత్తయితే ఎదిగాడు కానీ ప్రజలకు మాత్రం ఈత కాయంత మేలైనా చేయలేదన్నా అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ మంత్రి అచ్చెన్నాయుడు. ఈయన గురించి రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. ఆమదాలవలస, నరసన్నపేట, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో జరిగే ఇసుక దందాలన్నింటికీ మా మంత్రి అచ్చెన్నాయుడే బిగ్బాస్ అని అంటున్నారు. ఇక్కడి నుంచి లంచాలు చినబాబు, పెదబాబుకు చేరవేస్తుంటాడన్నా అని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టు పని జరిగినా ఆ చేసే వ్యక్తి సాక్షాత్తు అచ్చెన్నాయుడి తమ్ముడు హరిప్రసాద్ మాత్రమే కనిపిస్తాడని చెబుతున్నారు. నీరు–చెట్టు అవినీతి గురించి చెబుతూ సీతా సాగరం, దిమిలాడ చెరువులు దీనికి ఉదాహరణ అని చెబుతున్నారు. ఇక్కడే ఎకరా రూ.5 కోట్లు విలువ చేసే 3 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని ఏకంగా తన బినామీలకు మంత్రి తక్కువ ధరకు ఇప్పించారన్నా అంటున్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా వచ్చే డబ్బులకు కూడా కమీషన్ల కోసం కక్కుర్తి పడే మంత్రి ఎవరైనా ఉంటారా.. అంటే అది మా మంత్రే అని చెప్పుకొస్తున్నారు. చివరకు మరుగుదొడ్ల మంజూరుకు కూడా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు లంచాలు ఇచ్చుకోవలసిన అధ్వాన పరిస్థితి. అంగన్వాడీ సహా చిన్నా చితకా పోస్టులు అమ్ముకొనే దుర్గతి ఇక్కడే కనిపిస్తోందన్నా అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో కోటబొమ్మాళి మండలం ఎలమంచిలి సహా ఏకంగా 1,500 మంది పెన్షన్లు కట్చేస్తే వారు కోర్టులకు వెళ్లి న్యాయం పొందిన పరిస్థితి ఇక్కడే కనిపిస్తోంది. 26 మంది వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచుల చెక్పవర్ను అధికారంలోకి వచ్చిన వెంటనే అచ్చెన్న రద్దు చేశారు. ఈ పెద్దమనిషి మంత్రి అవుతూనే చాకిపల్లిలో దళిత మíహిళ చిన్న కిరాణాకొట్టు నడుపుకొంటూ బతుకుతుంటే ఆమెపై కూడా కక్ష కట్టి బుల్డోజరుతో కొట్టును తొలగించారన్నా అని చెబుతున్నారు. అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో ఏకంగా 20 కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు గురిచేశాడన్నా ఈ సిగ్గుమాలిన మంత్రి అని చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి గొడౌన్లు కట్టుకున్నారని, అందులో తరుగు పేరిట బస్తాకు రెండు కేజీలు చొప్పున ఏడాదికి రూ.3 కోట్ల విలువైన బియ్యం స్వాహా చేస్తున్నారని చెబుతున్నారు. పాలిషింగ్ యూనిట్లు మూత పడుతున్నాయి.. టెక్కలి నియోజకవర్గంలో 65 క్వారీలు, 75 పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. అచ్చెన్నాయుడు మంత్రి అయ్యాక కొత్త క్వారీయింగ్ లైసెన్స్ కావాలన్నా, ఎన్ఓసీ ఇవ్వాలంటే ఏకంగా రూ.25 లక్షలు లంచం ముట్టచెబితేనే కానీ పని జరగడం లేదంటున్నారు. మంత్రికి భవానీ గ్రానైట్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీకి రోజుకు 3 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాయి ప్రతి పాలిషింగ్ యూనిట్ నుంచి పంపించకపోతే ఈ పెద్దమనిషి ఊరుకోవడం లేదన్నా అని చెబుతున్నారు. గతంలో సీనరేజి ఫీజు క్యూబిక్ మీటర్కు రూ.1,200 ఉంటే సీఎంగా చంద్రబాబు వచ్చాక రూ.2,950కి పెంచాడని చెబుతున్నారు. ఈయన సీఎం అయ్యాక సింగపూర్, జపాన్ అంటూ ఆయా దేశాలకు వెళ్తాడు. ఉద్యోగాలు తీసుకువçస్తున్నానంటారు. ఇక్కడ ఉన్న పాలిషింగ్ యూనిట్లు మూతపడుతున్న పరిస్థితి. ఇదే పాలిషింగ్ యూనిట్లకు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరెంటు యూనిట్కు రూ.3.15 ఉంటే చంద్రబాబు రూ.8 చేశాడంటున్నారు. ఇలాంటి స్థితిలో పరిశ్రమలు మూతపడక మిగులుతాయా అని అంటున్నారు. ఇక్కడే మెట్కోర్ ఫెర్రో అల్లాయీస్ సంస్థ కార్మికులు ధర్నా చేస్తూ కనిపించారు. ఈ సంస్థ అచ్చెన్నాయుడు కార్మిక మంత్రి అయ్యాక 2017లో పూర్తిగా మూత పడింది. 2015 నుంచే ఈ ఫ్యాక్టరీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని మొర పెట్టుకుంటే, న్యాయం చేయాల్సిన ఈయన ఆ యాజమాన్యంతో కుమ్మక్కై ఏకంగా ఆఫ్యాక్టరీలోని మెటీరియల్ను పూర్తిగా అమ్ముకొనేలా చేశారని చెబుతున్నారు. టెక్కలి, నందిగామ, పలాస, మెళియాపుట్టి మండలాల్లో 108 గ్రామాల్లో 24,600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించడానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.127 కోట్లతో మహేంద్రతనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. ఆయన బతికుండగానే దాదాపుగా 30 నుంచి 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు లంచాలు ఎలా తినాలో వెతుక్కుంటూ ఆ ప్రాజెక్టులో మిగిలిన పనులకు ఏకంగా రూ.427 కోట్లకు అంచనాలు పెంచి దోచేశారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదల లేదంటున్నారు. 51 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తుçన్న కాకరాపల్లి పవర్ ప్లాంటును రద్దు చేస్తానని చెప్పిన బాబు ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. భావనపాడు పోర్టు ప్రాజెక్టు కోసం రైతుల అంగీకారం లేకున్నా చంద్రబాబు ఏకంగా 5 వేల ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విలువ ఉండగా రూ.12 లక్షలు ఇచ్చేలా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ధర్మమేనా?’ అని జగన్ అన్నారు. -
ఎమ్మెల్యే ప్రోగ్రస్ రిపోర్ట్ అచ్చెన్నాయుడు
-
కేసీఆర్ ‘థర్డ్ఫ్రంట్’ ప్రకటన వెనక మోదీ!
సాక్షి, అమరావతి : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వత్యిరేకంగా జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేసిన ప్రకటనపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, కేసీఆర్ థర్డ్ఫ్రంట్ ప్రకటనపై ఏపీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటన వెనుక ప్రధాని నరేంద్రమోదీ ఉండి ఉండవచ్చునేమోనని ఆయన సందేహం. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ ఆయన ఈ అనుమానం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ ప్రకటనల వెనుక మోదీ ఉన్నారేమో అనిపిస్తోంది. కేసీఆర్ మాటల అలానే ఉన్నాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం కోసమే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేశారని అచ్చెన్నాయుడు విశ్లేషించారు. త్వరలో జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుందన్నారు. కర్ణాటకలో 200 శాతం సిద్ధరామయ్య గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అందరి చూపు ప్రస్తుతం కేంద్రంపైన ఉందని, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. -
సాయం పొందిన బీసీలు అండగా ఉండాలి..
అమరావతి : రాష్ట్రంలో బలహీనవర్గాల వారికి ప్రభుత్వం తరపున సాయం చేస్తానని, వారంతా పార్టీకి బలంగా ఉండాలని హక్కుతో అడుగుతానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడిని మంగళవారం కలిసి సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తే స్వాగతించాలని మంత్రి వెల్లడించారు. గతేడాది బ్యాంకులు సహకరించకపోవడం వల్లే బీసీలకు తగినంతగా సబ్సీడీ రుణాలు అందించలేకపోయామన్నారు. ఈ ఏడాది ఆదరణ పథకం అమలులోకి తెచ్చి బీసీలకు అవసరమైన పరికరాలు అందిస్తామని చెప్పారు. కులవృత్తులు, చేతి వృత్తులకు ఉపకరించే అదునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు బీసీలకు ఇస్తామన్నారు. బీసీలకు 12 ఫెడరేషన్లు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా ఆయా కులాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వేసవి సెలవుల్లో బీసీ హాస్టళ్లు రిపేర్లు పూర్తి చేయిస్తామని, మెనూ చార్జీలు పెంచేందుకు సీఎం అంగీకరించారని మంత్రి చెప్పారు. -
దశ తిరిగేనా?
► న్యాయానికి దూరంగా బీసీలు ► మూడేళ్లుగా నీరసిస్తున్న సంక్షేమం ► సమన్యాయం, సరిపడా నిధుల శూన్యం ► బీసీ శాఖ మంత్రి అచ్చెన్న పైన జిల్లావాసుల ఆశలు వెనుకబడిన జిల్లాల జాబితాలో శ్రీకాకుళం పేరు ప్రథమంగా ఉంటుంది. సుమారు 80 శాతం ప్రజలు బీసీ కుటుంబాలకు చెందిన వారే. అయితే వారికి న్యాయం మాత్రం జరగడంలేదు. అన్ని జిల్లాలతో పాటే ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది తప్పా.. బీసీ జిల్లాగా, బీసీ జనాభా ప్రాతిపదికన మాత్రం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. గడచిన మూడేళ్లుగా బీసీ సంక్షేమం కుంటుపడింది. సంక్షేమ రుణాలు, వసతి గృహాలు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంటు, బీసీ సబ్ ప్లాన్ ఇతర నిధులు సరిపడినంతగా లేక జిల్లా వాసులు అవస్థలు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ మత్రివర్గ విస్తరణ, మార్పుల్లో భాగంగా జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడుకి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. ఈ నేపథ్యంలో జిల్లా వాసిగా బీసీ కుటుంబాలకు మేలు జరిగేలా నిధులు కురిపిస్తారా..లేదా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు మంత్రి అచ్చెన్నపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తమ ఆశలు నెరవేరుస్తారని కలలుగంటున్నారు. అయితే వీరి ఆశలు ఎంతవరకూ నెరవేరుతాయో అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వెనుకబడిన జిల్లాలో సమస్యలు అనేకం పేరుకుపోయి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ సందర్భంగా ప్రస్తావించుకుందాం. ► బీసీ స్టడీ సర్కిల్ వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు శాశ్వత భవనం లేదు. దీంతో అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నారు. వీటికి ప్రత్యేక స్థలం, భవనం కల్పించాల్సి ఉంది. ► జ్యోతిరావు పూలే పేరిట బీసీ సంక్షేమ ఆడిటోరియం నిర్మాణం చేయాల్సి ఉంది. స్థలంతో పాటు నిధులు కూడా కావాలి. వీటి కోసం జిల్లా బీసీ సంఘాలు పోరాటాలు చేస్తున్న ఇప్పటికీ చర్యలు లేవు. ► బీసీ సబ్ ప్లాన్ నిధులు జిల్లాకు అధికంగా కేటాయించలేదు. రాష్ట్రంలో 8,600 కోట్లు కేటాయించినా, బీసీ జనాభా ప్రాతిపదికన జిల్లాకు చేటాయించడం లేదు. అన్ని జిల్లాలకు ఒకే రీతిలో కేటాయింపులు చేయడంతో జిల్లాలో బీసీ అభివృద్ధి కుంటుపడుతుంది. ► బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో అధికార పార్టీ జోక్యం పెరగడంతో వాస్తవ లబ్ధిదారులు నష్టపోతున్నారు. వచ్చిన రుణ యునిట్లు జన్మభూమి కమిటీల పెత్తనంతో వారి అనుయాయులకు సిఫార్సు చేస్తుండడం, బ్యాంకర్లు కూడా సహకరించకపోడవంతో రుణ లక్ష్యాలు నెరవేరని పరిస్థితి. ► జిల్లాలో 78 శాతం బీసీలు న్నారు. వీరిలో 75 శాతం మంది కూలి పనులు, వలస కూలీలుగానే జీవనం సాగిస్తున్నారు. దేశంలో ఎక్కడ ప్రమాదం జరిగినా..అందులో జిల్లాకు చెందిన బీసీలు ఉంటారు. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. అటువంటి వారిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిఉంది. ► బీసీ సంక్షేమానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వసతి గృహాలను ఎత్తివేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 12 వసతి గృహాలను గడచిన రెండేళ్లలో ఎత్తివేశారు. వీటి స్థానంలో గురుకులాలు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చినా, ఇప్పటి వరకు చర్యల్లేవు. బీసీ జనాభా ప్రతిపదికన ప్రతి మండలంలోనూ రెండు గురుకులాలకు తక్కువ లేకుండా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ గురుకులాలు ఇంటరీ్మడియెట్ వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► జిల్లా కేంద్రంతో పాటు కళాశాల వసతి గృహాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరిన్ని వసతి గృహాలు పెంచాలి. వాటిలో అన్ని కార్పొరేట్ సదుపాయాలు కల్పించాలి. ► బీసీ కుల సంఘాలకు ఎటువంటి బ్యాంకు సెక్యూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయాలి. ప్రతి కులానికి కనీసం వందకు తక్కువ లేకుండా సంఘాలు ఉండాలి. దీనికి కావాలి్సన నిధులు జనాభా ప్రాతిపదికగా కేటాయించాల్సి ఉంది. ► బీసీ విద్యార్థులకు ప్రభుత్వ కార్పొరేట్ కళాశాలలో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న సీట్లను పెంచాలి. జనాభా ప్రతిపదికగా జిల్లాకు కనీసం వెయ్యి మందికి కార్పొరేట్ చదువుల అవకాశం ప్రతి సంవత్సరం కల్పించాలి. ► ఇలాంటి పరిస్థితిలో జిల్లాకు చెందిన శాసనసభ్యుడు బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టిన నేపథ్యంలో వెనుకబడిన సామాజిక వర్గం పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో చూడాలి. జనాభా ప్రతిపదికన నిధులు కేటాయించాలి జిల్లాలో బీసీ కులాలు ఎక్కువగా ఉన్నారు. అన్ని జిల్లాలతో కాకుండా వెనుబడిన జాతులు ఉన్న ఈ జిల్లాకు అదనంగా బీసీ సంక్షేమా నిధులు, రుణాలకు ఎక్కువ యూనిట్లు, సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలి, జిల్లాలో బీసీలు దారిద్య్రరేఖకు తక్కువగా సుమారుగా 70 శాతం వరకు ఉన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకొవాల్సి ఉంది. జిల్లాకు చెందిన వ్యక్తి ఈ శాఖకు మంత్రి అయినందున మరిన్ని నిధులు తెచ్చి బీసీలను ఆదుకోవాలి. –బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు–పి చంద్రపతిరావు వలసలు నివారించాలి మన జిల్లాకు చెందిన బీసీ కులాల వారు పోట్టకూటి కోసం వలసలు వెళ్తున్నారు. వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గడిచిన మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం బీసీ వలస కూలీల దుర్భర జీవితాలను పట్టించుకొలేదు. ఈసారి జిల్లాకు చెందిన మంత్రికి బీసీల సంక్షేమం చూసే అవకాశం వచ్చింది. బీసీ కులాల వారు పోట్టకూటి కోసం వలసలు వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పించి నివారణ చర్యలు చేపట్టాలి. –డీపీ దేవ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ముఖ్యకార్యదర్శి -
‘యువభేరి పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారు’
కర్నూలు : ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 22సార్లు ప్రయత్నం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రాజ్యసభలో ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీతో చంద్రబాబు ప్రయత్నలు చేశారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో అదేవిధంగా ఆర్థికసాయం చేస్తామంటేనే చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగడానికి ఇంకా అధికంగా నిధులు కావాలంటే ప్రతిపక్షం సూచనలు ఇవ్వాలి కానీ... యువభేరి పేరుతో యువతను వైఎస్ జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యువభేరికి వెళ్లకుండా అడ్డుకోవాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. -
మంత్రి ర్యాంకు మారింది కదా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా మంత్రి అచ్చెన్న పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో తాజాగా ర్యాంకులు ప్రకటించారు. ఎమ్మెల్యే హోదాలో ఆయనకు రాష్ర్టవ్యాప్తంగా 33వ ర్యాంకు వచ్చింది. మంత్రి స్థానంలో ఏడో ర్యాంకు, జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు తెచ్చుకున్నారని అధిష్టానమే ప్రకటించింది. అయితే జిల్లాలోని ఆయన అభిమానులు డే అండ్ నైట్ కూడలిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పనితీరులో నెం.1 మంత్రి వర్యులుగా గుర్తింపు పొందిన మన ప్రజానేత అంటూ ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించేలా పెట్టారు. అయితే మంత్రి ర్యాంకు మారింది. ఆయన ర్యాంకు నెంబర్ 1 నుంచి 7కు దిగిపోయింది. అయినా ఫ్లెక్సీని అలాగే వదిలేశారు. మరో విశేషమేమిటంటే తమ అధినేత ప్రకటించిన ర్యాంకులు ఆయా వ్యక్తుల పనితీరుకు కొలమానమేమీ కాదని సాక్ష్యాత్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావు మంగళవారం విశాఖలో సెలవిచ్చారు. సీఎం ఇచ్చిన ర్యాంకుల్ని పట్టించుకోనక్కర్లేదని పార్టీ నేతలే స్పష్టం చేస్తుంటే అలాంటప్పుడు తమ నేత నెంబర్-1 అంటూ తమ్ముళ్లు గొప్పలు చెప్పుకోవడం ఏంటంటూ దారంట పోయేవాళ్లు ఫ్లెక్సీని చూసి నవ్వుకొంటున్నారు. గతంలో పలు మీడియా సమావేశాల్లోనూ తెలుగు తమ్ముళ్లు స్థానిక నేతలకు వచ్చిన ర్యాంకుల్ని బయటపెడుతూ గొప్పలకు పోవడాన్ని అంతా గుర్తుచేసుకొంటున్నారు. -
ఎక్సైజ్ తీరు ‘మామూళ్లే’!
మద్యం వ్యాపారులు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. వారిని నియంత్రించాల్సిన అధికారులు ‘మామూళ్ల’ పేరిట ప్రోత్సహిస్తుండడంతో దుకాణాల వద్ద నిబంధనలకు తూట్లుపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం విక్రయించడం లేదు. పొరుగు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ తాను ఎమ్మార్పీకి మించి రూపాయి కూడా అదనంగా అమ్మేది లేదని ఖరాఖండిగా చెప్పేసినా అధికారులు అంగీకరించలేదు. ఎమ్మార్పీపై రూ. ఐదు నుంచి రూ. 10 వరకు విక్రయిస్తేనే దుకాణం ఉంటుందని.. లేకపోతే కేసులు తప్పవని బెదిరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. వ్యాపారులను తమ దారికి తెచ్చుకునేందుకు ఎక్సైజ్ అధికారులు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. దుకాణాలు, బెల్ట్ షాపులు, జాతీయ రహదారిపై ఉన్న దుకాణాలు, బార్ల నుంచి నెలవారీ వసూళ్లకు జిల్లా వ్యాప్తంగా ఒక సీఐని నియమించినట్టు సమాచారం. ఎక్సైజ్శాఖ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నా వారిలో మార్పు కనిపించడం లేదు. ఎవరు ఏమనుకుంటే తమకేమిటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు.దీంతో వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుకు ఎన్నికల సమయంలో నిధులు సమకూర్చిన ఓ మద్యం వ్యాపారి జిల్లాలో ఇప్పుడు హవా చలాయిస్తున్నారు. రాజకీయంగా మంత్రి సన్నిహితుడిగా పేరొందిన ఆ వ్యక్తి చక్రం తిప్పుతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని దుకాణాలను చేజిక్కించుకొని తాను చెప్పిందే వేదం అంటూ వ్యాపారుల్ని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి చెప్పారు అంటూ తనకు కావాల్సినట్టుగా పనులు చేయించుకున్నట్టు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 238 దుకాణాలతోపాటు 15 బార్లు, సుమారు ఐదు వేల బెల్ట్ దుకాణాలు, జాతీయ రహదారికి సమీపంలో ఉన్న 58 దుకాణాలను లెక్కించి పద్దులు రాసే పనిని ప్రారంభించారు. ఒక్కో దుకాణం నుంచి నెలకు అర్బన్ ప్రాంతాల్లో రూ. 57,500, రూరల్ ప్రాంతాల్లో రూ. 37,500 వసూలు చేసినట్టు తెలిసింది. ఈ మొత్తంలో జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతోపాటు జిల్లా మంత్రికి కూడా పంపకాలు చేయాలంటూ ఓ వ్యాపారి సమాచారం పంపిస్తున్నట్టు భోగట్టా. రానున్న జూలైలో మద్యం పాలసీ గడువు ముగుస్తుండడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వ్యాపారులు కూడా అధికారులు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా జిల్లా మంత్రి కూడా తాను మంత్రిగా ఉన్నంతకాలం ధీమాగా ఉండొచ్చని, ఎలాంటి ఇబ్బందులూ రావని చెబుతున్నట్టు తెలిసింది. ఎన్ఫోర్స్మెంట్ ఏదీ?జిల్లాలో అడపాదడపా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ సిబ్బంది దాడులు చేస్తున్నా బయటకు రావడం లేదు. కేసులు ఎక్కడా కనిపించడం లేదు. అధికారులంతా ఏపీ-ఒడిశా సరిహద్దులో నల్లబెల్లం, నాటుసారా తయారీపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల మద్యం దుకాణదారుల నుంచి మామూళ్ల పేరిట రూ. 85 వేలు వసూలు చేసి ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. దీంతో కొన్నాళ్లపాటు స్థబ్దుగా ఉండిపోవాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా రాష్ట్ర టాస్క్ఫోర్స్ సిబ్బంది అప్పుడప్పుడూ తనిఖీలకు వస్తున్నా ఫలితం లేకుండా పోయింది. స్థానిక సిబ్బంది ముందుగానే అధికారుల రాకను పసిగట్టి మద్యం వ్యాపారులకు సమాచారం ఇచ్చేస్తుండడంతో కేసుల నమోదుపై ప్రభావం పడింది. ఒకవేళ కేసు నమోదు చేసినా రూ. లక్ష అపరాధ రుసుము చెల్లించేస్తే వెంటనే మాఫీ అయిపోతుందన్న ధీమా వ్యాపారుల్లో ఉంది. దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ సిబ్బంది జాడ కనిపించకపోవడం, టాస్క్ఫోర్స్ సేవలు తగ్గిపోవడం జరుగుతోంది. దీనినే ఆసరాగా తీసుకున్న స్థానిక ఎక్సైజ్ సిబ్బంది మామూళ్లు పెంచేశారని తెలిసింది. వ్యాపారులు తమకు నచ్చినట్టుగా విక్రయాలు చేసుకోవచ్చని మౌకిక ఆదేశాలిచ్చినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. -
ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను శాసనసభాప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. 'టీడీపీ మంత్రి అదేపనిగా రెచ్చగొట్టడానికి సభా సమయం వృధా చేయటానికి తన నోట్లో నుంచి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సైకో పార్టీ అంటారు. ఇటువంటి రౌడీ చేష్టలను ప్రజలు సహించరు అని అంటే...అదేదో మేమే తప్పు చేస్తున్నట్లు మళ్లీ వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇదే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కళ్లు చేసుకుని, ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగానే... వేలు చూపిస్తూ రౌడీ మాదిరిగా బెదిరించినా కూడా అది కూడా మాదే తప్పు అన్నట్లు చెప్పటం దురదృష్టకరమన్నారు'. కాగా అంతకు ముందు అచ్చెన్నాయుడు...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా వైఎస్ జగన్ కౌంటర్పై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఖండించారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. -
ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా
-
వైఎస్ఆర్ సీపీపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును.. సైకో పార్టీ'గా పెట్టుకోవాలంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై సభలో గందరగోళం నెలకొంది. మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలో పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతకు ముందు వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతి నిరాకరించటంతో వైఎస్ఆర్ సీపీ నిరసన తెలపటంతో 15 నిమిషాల పాటు సమావేశాలు వాయిదా పడ్డాయి. -
మంత్రిగారి అవినీతి బాగోతం
-
మరోసారి నోరు పారేసుకున్న అచ్చెన్నాయుడు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమివ్వలేక తప్పించుకోవటానికి అధికార పక్షం వ్యక్తిగత విమర్శలకు దిగుతోంది. విపక్ష నేత ప్రసంగానికి అడ్డు తగలడం, సమయం సందర్భం లేకుండా కొందరు మంత్రులు.. వైఎస్ జగన్ను విమర్శించడం పనిగా పెట్టుకున్నారు . ఈ క్రమంలో అచ్చెన్నాయుడు మైక్ దొరికితే చాలు అన్నట్లు నరంలేని నాలుకకు పని చెబుతున్నారు. బుధవారం సభలో ఆయన మరోసారి నోరు పారేసుకున్నారు. వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిరసన తెలిపారు. కాగా అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని విమర్శించకుండా మౌనంగా వున్న మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఛాంబర్లోకి పిలిచి క్లాసులు తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో వైఎస్ జగన్ను విమర్శించి తమ పదవులను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రేసులో అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాత మంత్రి దేవినేని ఉమా, రావెల కిషోర్ బాబు... ఎమ్మెల్యేల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యరావు, కళా వెంకటరావు, దూళిపాళ నరేంద్ర తదితరులు పోటీపడుతున్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులను రగ్యులరైజ్ చేస్తాం
-
ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తాం
-
'అచ్చెంనాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ డ్వాక్రా మహిళలు'
-
''కేసీఆర్ ముందు నీ కొడుకు పేరు మార్చుకో''
-
మైన్స్ ఏడీపై మండిపడ్డ అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం : మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం మైన్స్ ఏడీ గొల్లపై మండిపడ్డారు. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇసుక మాఫియా తయారవుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఇసుక మాఫీయాను అరికట్టాల్సింది అధికారులేనని ఆయన అన్నారు. మైన్స్ ఏడీని సెలవుపై వెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఆయన ఈరోజు జిల్లాలో పర్యటిస్తున్నారు. -
19 మంది ఎక్కడెక్కడ చనిపోయారు?
-
19 మంది ఎక్కడెక్కడ చనిపోయారు?
హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 15నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ 19మంది వైఎస్ఆర్ సీపీ నేతలు ఎక్కడెక్కడ చనిపోయారని ప్రశ్నించారు. ఆ వివరాలు వైఎస్ఆర్ సీపీ నేతలు ఇవ్వగలరా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కాగా రైతులు, ప్రజల సమస్యలు వైఎస్ఆర్ సీపీకి పట్టడం లేదని మరోమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. సభా సమయాన్ని ఆ పార్టీ సభ్యులు వృధా చేస్తున్నారని ఆయన అన్నారు. -
ఇంటికో ఉద్యోగం ఎలా ఇవ్వాలి?
హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం, రైతుల, డ్వాక్రామహిళ రుణ బకాయిలు రద్దు చేస్తామని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్ధానాలు అనేకం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నది వాటిలో ఒక వాగ్ధానం. ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చింది. ఏ వాగ్ధానం నెరవేర్చలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కె.అచ్చెన్నాయుడు ఇంటికో ఉద్యోగం ఎలా ఇవ్వాలా? అన్న ఆలోచనలో పడ్డారు. ఇంటికో ఉద్యోగం ఎలా ఇవ్వాలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఐటీఐలను పరిశ్రమలకు అనుసంధానం చేస్తామని చెప్పారు.