
దేశంలోనే అతిపిన్న వయసు స్పీకర్గా రికార్డు..
ప్రమోద్ సావంత్ అతి చిన్న వయస్సులోనే స్పీకర్గా ఎంపికయ్యారని తెలిపింది. ఈయన ఇప్పటి వరకు రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రమోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే స్పీకర్గా ఎంపికైనందుకు తనకు చాలా గర్వంగా ఉందని మీడియాకు తెలిపారు. శాసనసభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడేందుకు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన కైలాష్ మేఘ్వాల్(83) వృద్ధుడైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.