
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనం వద్ద గుర్తుతెలియని వ్యక్త తీవ్ర అలజడి సృష్టించాడు. ఓ అగంతకుడు కత్తిపట్టుకుని పార్లమెంట్ భవనం లోపలకి చొరబడేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది.. అడ్డుకుని అదుపులోకి తీసుకుంది. పార్లమెంట్ ద్వారమైన విజయ్ చౌక్ గేట్ నుంచి అతను లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దుండుగుడిని స్థానిక పోలీసులు స్టేషన్కు తరలించి.. విచారిస్తున్నారు. తాజా ఘటనతో పార్లమెంట్ భవనం సమీపంలో భద్రతాసిబ్బంది అలర్టయింది.