రోడ్లపై గుంతలు పూడ్చకపోతే కిడ్నాప్ చేస్తా | Mumbai corporator Warning to Officer | Sakshi
Sakshi News home page

రోడ్లపై గుంతలు పూడ్చకపోతే కిడ్నాప్ చేస్తా

Published Thu, Jul 7 2016 3:40 AM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM

రోడ్లపై గుంతలు పూడ్చకపోతే కిడ్నాప్ చేస్తా - Sakshi

రోడ్లపై గుంతలు పూడ్చకపోతే కిడ్నాప్ చేస్తా

అధికారికి ముంబై కార్పొరేటర్ హెచ్చరిక
 
 ముంబై : ‘మా ప్రాంతంలో రోడ్లపై గుంతలు పూడ్చకపోతే నిన్ను కిడ్నాప్ చేస్తా’ అంటూ ముంబై కార్పొరేటర్ ఒకరు సంబంధిత అధికారిని బెదిరించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీకి చెందిన దాదర్ కార్పొరేటర్ సందీప్ దేశ్‌పాండే, ‘జీ-నార్త్’ వార్డ్ ఇన్‌చార్జికి గతవారం ఇలా బెదిరిస్తూ లేఖ రాశారు. 

సందీప్ స్పందిస్తూ తాను అధికారిని బెదిరిస్తూ ఉత్తరం రాశానని ఒప్పుకున్నారు. ప్రజలు తనను ఎన్నుకున్నది వారి సమస్యలను పరిష్కరించడానికనీ, అధికారితో పనిచేయించడానికి ఈ పని చేశానని అన్నారు. వార్డు ఇన్‌చార్జ్ మాట్లాడుతూ..దాదార్ ప్రాంతంలో రోడ్లపై గుంతలను పూడ్చడమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. ఇక్కడ రోడ్లన్నీ అందంగా, వాహనదారులకు సౌకర్యవంతంగా ఉన్నాయి కాబట్టి వ్యవహార ం కిడ్నాప్ వరకు వెళ్లదని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement