అభద్రతలో ముస్లింలు: అన్సారీ | Muslims in insecurity: Ansari | Sakshi

అభద్రతలో ముస్లింలు: అన్సారీ

Aug 10 2017 1:38 AM | Updated on Sep 17 2017 5:21 PM

అభద్రతలో ముస్లింలు: అన్సారీ

అభద్రతలో ముస్లింలు: అన్సారీ

దేశంలోని ముస్లింలలో అభద్రత నెలకొందని, సామరస్య భావనకు ముప్పు ఏర్పడిందని ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఆందోళన వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలలో అభద్రత నెలకొందని, సామరస్య భావనకు ముప్పు ఏర్పడిందని ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ప్రధాని మోదీతో, ఆయన కేబినెట్‌ సహచరులతో చర్చించానని బుధవారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పా రు. ప్రభుత్వం ఎలా స్పందించిందని అడగ్గా.. వివరణలు, కారణాలు ఎప్పుడూ ఉంటాయని, వాటిని అంగీకరించాలా, నిరాకరించాలా అన్నది మనం నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు.

ఉప రాష్ట్రపతిగా రెండో పర్యాయ పదవీకాలాన్ని గురువారంతో ముగించుకోనున్న అన్సారీ.. ఘర్‌ వాసపీ, గోరక్షకుల దాడులు, మైనారిటీలపై బీజేపీ నేతల వ్యాఖ్యలు తదితరాలపై స్పందించారు. ‘ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయి. దేశపౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయం. జాతీయవాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు.. నేను భారతీయుడిని.. అంతే’ అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement