హార్బర్ సమీపంలో తూర్పు నావికా దళానికి చెందిన వెస్సెల్ నీట మునిగింది.
విశాఖపట్నం: హార్బర్ సమీపంలో తూర్పు నావికా దళానికి చెందిన వెస్సెల్ నీట మునిగింది. దానిని టీఆర్వీడి 72 టార్పిడో రికవరీ వెస్సెల్గా గుర్తించారు. చిన్నగా ఉండే ఈ నౌకలో 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో చిక్కుకున్న 23 మందిని తూర్పు నావికా దళం రక్షించింది. నలుగురు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందారు. గల్లంతయినవారి కోసం సిబ్బంది గాలిస్తున్నారు.
**